stored
-
బియ్యంతో నిండిపోయిన గోదాములు
నల్లగొండ జిల్లాలో గోదాముల్లో 4,81,838 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అందులో ఎఫ్సీఐ గోదాములు బియ్యంతో ఇప్పటికే నిండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 8.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా మిల్లుల్లో పెట్టింది. గోదాములు ఖాళీ లేక బియ్యం సేకరణలో ఎఫ్సీఐ జాప్యం చేస్తోంది. రోజుకు ఒక వ్యాగన్ ద్వారా 3800 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అవసరమైన చోటికి పంపాల్సి ఉండగా, 4 రోజులకు ఒక వ్యాగన్ ద్వారానే బియ్యం సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్లోనూ ఎఫ్సీఐతోపాటు చిన్నాచితక గోదాముల్లో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అక్కడ 12 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి మిల్లులకు అప్పగించింది. అక్కడున్న గోదాములు 90 శాతం బియ్యంతో నిండి ఉన్నాయి. అక్కడినుంచి రోజుకు రెండు వ్యాగన్లలో బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు లేదా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తేనే సేకరించిన ధాన్యాన్ని మిల్లులు బియ్యంగా మార్చి ఎఫ్సీఐకి అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు నాలుగు రోజులకు ఒకసారి ఒక వ్యాగన్ ద్వారా మాత్రమే బియ్యాన్ని ఎక్స్పోర్టు చేస్తుండటంతో మిల్లింగ్ కుంటుపడుతోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి. ఇతర రాష్ట్రాలకు బియ్యం సరఫరా తగ్గడంతో గోదాముల్లో ఖాళీలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మిల్లుల నుంచి బియ్యం సేకరణలో ఎఫ్సీఐ జాప్యం చేస్తోంది. దీనికితోడు తాజాగా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రం నుంచి బియ్యం తీసుకోబోమని పేర్కొనడంతో సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ఎఫ్సీఐ ఇచ్చే ప్రక్రియ స్తంభించిపోయింది. దీంతో మిల్లుల్లో పేరుకుపోయిన ధాన్యం వర్షాలకు తడిచి నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. కేంద్రం వద్దన్నా ముందుకొచ్చిన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నూతన చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయొద్దని ఆ చట్టంలో పేర్కొంది. అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. జిల్లాల్లో గోదాముల సామర్థ్యం తక్కువగా ఉన్నా అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ మార్కెట్యార్డులు, ఫంక్షన్ హాళ్లను తీసుకొని మిల్లర్లకు ఇచ్చి అక్కడ ధాన్యం నిల్వ చేయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఎఫ్సీఐ గోదాముల్లోని బియ్యం అంతర్రాష్ట్ర సరఫరా మందగించింది. ఒక్కో జిల్లా నుంచి రోజుకు నాలుగైదు వ్యాగన్ల ద్వారా బియ్యం పంపించాల్సి ఉండగా, ప్రస్తుతం ఒకే వ్యాగన్ ద్వారా బియ్యం ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. నల్లగొండ మండలంలోని ఓ రైస్మిల్ ఆవరణలో నిల్వ ఉంచిన ధాన్యం ప్రైవేటు గోదాములు ఉన్నా వాడుకోలేని పరిస్థితి.. ఎఫ్సీఐ గోదాములు నిండిపోయిన నేపథ్యంలో ప్రైవేటు గోదాములు ఉన్నా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు గోదాములను టెండర్ ద్వారానే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఆన్లైన్ టెండర్ జారీ చేసి, 15 రోజులు సమయం ఇవ్వాలని, తర్వాతే గోదాములను తీసుకోవాలని పేర్కొంది. ఇందుకు నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే వద్దంటున్న కేంద్రం 2019–20 రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని సీఎంఆర్గా మార్చి ఎఫ్సీఐ ఇస్తూ వచ్చారు. చివరలో దాదాపు 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి చేరలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఇక ఈ సీజన్లో బియ్యం ఎఫ్సీఐకి ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని రాష్ట్రం... కేంద్రాన్ని కోరింది. అందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒప్పుకోలేదు. బియ్యం తీసుకోబోమని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గడిచిన సీజన్లలో మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేదని, అందుకే ఈ సారి ఇప్పటికే గడువు దాటినందున బియ్యం తీసుకోబోమని పేర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఎఫ్సీఐ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వం సేకరించిన ధాన్యం పరిస్థితి ఏంటన్నది గందరగోళంగా మారింది. -
ఈ ధాన్యం ఎవరిది?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వనపర్తి తహసీల్దార్ రాజేందర్గౌడ్, పౌరసరఫరాల శాఖ డీఎం అశ్విన్కుమార్ గురువారం వనపర్తి పట్టణంలోని కేదార్నాథ్ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. వీరి పరిశీలనలో పెద్ద మొత్తంలో వరి ధాన్యం బస్తాల నిల్వలు గుర్తించారు. అలాగే 200 క్వింటాళ్లకు పైగా బియ్యం అక్రమంగా ఉన్నట్టు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని మిల్లుకు సీల్ వేశారు. ఆరా తీస్తున్న అధికారులు ఈ మిల్లుకు గత ఖరీఫ్ సీజన్లో 21వేల బస్తాల వరి ధాన్యం అప్పగించారు. కాగా ఈ మిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 300 బస్తాల (150 క్వింటాళ్ల) బియ్యం మాత్రమే అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లులో భారీగా నిల్వ ఉన్న వరి ధాన్యం, 150 క్వింటాళ్ల బియ్యం ఎక్కడిదని అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో అక్రమ దందాకు పాల్పడిన వారే ఇక్కడ నిల్వ చేశారా.. లేదా మిల్లు యాజమాన్యమే నిల్వ చేసిందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. లెక్కల్లో చూపని దాదాపు లక్ష వరి బస్తాల ధాన్యం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై డీఎస్ఓ రేవతిని వివరణ కోరగా కేదార్నాథ్ మిల్లు 150 క్వింటాళ్ల బియ్యం అప్పగించాల్సి ఉందన్నారు. అయితే ఇంత భారీగా ఉన్న వరి ధాన్యం నిల్వలు ఎవరివో విచారణ చేస్తున్నామన్నారు. అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నిల్వవుంటే దిగులే..
ఖమ్మం వ్యవసాయం: నాణ్యతా ప్రమాణాల పేరుతో జిల్లాలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో సరుకు ధర తగ్గించే దిశగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అడుగులు వేస్తోంది. పత్తి పంట చివరి దశలో ఉంది. ప్రస్తుతం వస్తున్న పంటలో పింజ పొడవు తక్కువగా ఉంటుందని సీసీఐ భావిస్తోంది. మధ్య రకం ధరతో కొనుగోలు చేయాలని యోచిస్తోంది. జిల్లాలో ఖమ్మం, ఏన్కూరు, కొత్తగూడెం, భద్రాచలం, చండ్రుగొండ, నేలకొండపల్లి, బూర్గంపాడు, మధిర వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు నాలుగు జిన్నింగ్మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 15.50 లక్షల క్వింటాళ్ల సరుకు కొనుగోలు చేశారు. 2014-15 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పింజ పొడవు ఆధారంగా ధరలు నిర్ణయించింది. దీనిలో తేమ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. పొడవు పింజ రకానికి (29.5 మి.మీ- 30.5 మి.మీ) క్వింటాలుకు గరిష్టంగా రూ.4,050 వరకు, మధ్య రకం పింజ పొడవు (27.5 మి.మీ-29,0 మి.మీ) క్వింటాలుకు గరిష్టంగా రూ.3,750 వరకు ధర నిర్ణయించారు. ఇప్పటి వరకు పొడవు పింజ రకానికి నిర్ణయించిన ధరతో పంట ఉత్పత్తిని కొనుగోలు చేశారు. ఈ రకం సరకును తేమ శాతాన్ని కూడా పరిశీలించి కొనుగోలు చేశారు. చివరి దశ పత్తి అమ్మకానికి వస్తుందని, ఆ పత్తి నాణ్యతగా లేదని, పింజ పొడవు తక్కువగా ఉందని జిల్లాలోని పలు సీసీఐ కేంద్రాల నిర్వహకులు ఆ సంస్థ ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ కారణంతో ఇప్పటికే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిర్వహిస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. నేలకొండపల్లి కొనుగోలు కేంద్రంలో కూడా పత్తి కొనుగోళ్లను ఆపే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మిగిలిన కేంద్రాల్లో కూడా రెండు, మూడు రోజుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపి వేసి, పింజ రకానికి ఇచ్చే ధరతో తిరిగి కొనుగోళ్లు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే వారం నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల్లో ఆందోళన పింజ పొడవు ఆధారంగా సీసీఐ పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేస్తుండటంతో గ్రామాల్లో పత్తి నిల్వ చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రైతుల వద్ద సరుకు అమ్మకాలు పూర్తయిన దశలో ఆ పంట ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది. ఈ ఉద్దేశ్యంతో కొందరు రైతులు తాము పండించిన పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ పరిస్థితులు రాలేదు. సీసీఐ నిర్ణయించిన ధర కన్నా పత్తి ధర ఏమాత్రం పెరగ లేదు. సీసీఐ ధర కన్నా ప్రైవేటు మార్కెట్ ధర రూ.400 వరకు తక్కువగా ఉంది. ఖమ్మం మార్కెట్లో సీసీఐ కేంద్రం తాత్కాలికంగా నిలిపి వేయటంతో ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు కూడా ధర మరికొంత తగ్గించారు. పింజ పొడవు ఆధారంగా సీసీఐ కూడా ధర తగ్గిస్తుందని తెలిసి వ్యాపారులు ధరను మరింత తగ్గించాలని భావిస్తున్నారు. సీసీఐ మధ్య రకం పింజ ధర నిర్ణయిస్తే సరుకు నిల్వ చేసుకున్న రైతులు భారీగా ధర నష్టపోయే ప్రమాదం ఉంది. పొడవు పింజ రకం ధరతోనే పత్తిని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే బంధువుల ఇళ్లలో మద్యం నిల్వలు!