supermoon
-
ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం
నేడు(ఆగస్టు 30) ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేయనుంది. రోజులా కాకుండా ఇవాళ చంద్రుడు పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇవ్వబోతున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఈ అద్భుతం జరగనుంది. నేడు చంద్రుడు భూమికి 3,57,244 కిలోమీటర్ల దూరంలో కనిపించనున్నాడు. కాగా బ్లూమూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్లో కాకుండా నారింజ రంగులో దర్శనమివ్వనున్నాడు. అయితే ఇది ఈ నెలలో కనిపించే రెండో ఫుల్ మూన్. ఆగస్టు 1న తొలి పౌర్ణమి నాడు బ్లూ మూన్ కనిపించింది. కాబట్టి నేడు కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూ మూన్గా పిలుస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్ ఆవిష్కృతం కానుంది. సాధారణంగా ఏడాదిలో రెండు లేదామూడు సూపర్ మూన్లు ఏర్పడుతూవుంటాయి. స్పేస్.కామ్ ప్రకారం.. ఈ సూపర్ బ్లూ మూన్ బుధవారం రాత్రి 7.10 గంటలకు కనిపించనుంది. నాసా తెలిపిన దాని మేరకు రెండు గంటల తర్వాత ఇది అత్యంత ప్రకాశవంతంగా పెద్దదిగా కనిపించనుంది. గురువారం ఉదయం 6.46 గంటలకు అస్తమించనుంది. అయితే బయట వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో ఈ మూన్ అందంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలోని ప్రజలు తెల్లవారుజామున దీనిని చూడటం మంచిదని అంటున్నారు. చదవండి: ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం బ్లూ మూన్ అంటే..? బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూలో కనిపించడం కాదు. ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మాన్గా పిలుస్తుంటారు. ఒకే నెలలో బ్లూ మూన్, సూపర్ మూన్లు దర్వనమివ్వడం అరుదనే చెప్పాలి. ఇప్పుడు కనిపించే సూపర్ బ్లూ మూన్ నాలుగు పౌర్ణమిలతో కూడిన సీజన్లో అదనపు చంద్రుడు. బుధవారం ఏర్పడబోయే బ్లూ మూన్ ప్రత్యేకమైనది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు. అరుదుగా బ్లూ మూన్ బ్లూ సూపర్ మూన్ చాలా అరుదుగా వస్తుంది. ఖగోళ పరిస్థితుల కారణంగా ప్రతి పది సంవత్సరాలకు మాత్రం ఇలాంటిది వస్తుందని నాసా తెలపింది.. ఒక్కోసారి బ్లూ సూపర్ మూన్ రావడానికి ఇరవై సంవత్సరాలు కూడా పట్టొచ్చని పేర్కొంది. చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్లో ఏర్పడింది. మళ్లీ 2037 జనవరిలో బ్లూ మూన్ కనపించనుందట.. మరొకటి మార్చిలో దర్శనమివ్వనుంది. అంటే మళ్లీ 14 సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
ఆకాశంలో అద్భుతం.. మళ్లీ 'సూపర్ మూన్'.. ఎప్పుడంటే?
వాషింగ్టన్: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఆషాడ పౌర్ణిమ రోజున చంద్రుడు.. భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. ఈ జులై 13న 'సూపర్మూన్' కనువిందు చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ అద్భుతాన్ని దర్శించుకోనున్నాయి. నిండు చంద్రుడిని బక్ సూపర్ మూన్, థండర్ మూన్, హేమూన్, మెడ్ మూన్ అని కూడా పిలుస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం.. జులై 13న ఈ సూపర్ మూన్ కనిపించనుంది. మధ్యాహ్నం 2.38 గంటలకు ఆ అద్భుతం కనిపించనుందని నాసా తెలిపింది. అయితే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జులై 14న కనిపించనుంది. ఇలా భూమికి అత్యంత సమీపంలోకి వచ్చిన నిండైన చంద్రుడిని మూడు రోజుల పాటు చూడొచ్చు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం తెల్లవారు వరకు కనువిందు చేయనుంది జాబిల్లి. సూపర్ మూన్ అంటే ఏమిటి? తన కక్షలో తిరుగుతున్న చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు నిండుగా, అతిపెద్దగా కనిపిస్తుంది. దానినే సూపర్మూన్గా పిలుస్తారు. ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నొల్లే 1979లో ఈ సూపర్ మూన్ అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించారు. ఒక ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇలా సూపర్మూన్ ఏర్పడుతుంది. దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ భూమిని 27 రోజుల్లో చూట్టివస్తాడు చంద్రుడు. అలా అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు ఆ స్థానాన్ని పేరీజీ అంటారు. భూమి నుంచి 3,63,300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అత్యంత దూరంలోని స్థానాన్నిఅపోజీగా పిలుస్తారు. అది 4,05,500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు సాధారణం కంటే 17శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్రుడు. ఇలా సూపర్మూన్ ఏర్పడిన సమయంలో సముద్రం ఎక్కువగా ఆటుపోట్లకు గురవుతుంటుంది. గత నెల జూన్లో సంభవించిన సూపర్మూన్ను స్ట్రాబెరీ మూన్గా వ్యవహరించారు. ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
కనువిందు చేసిన జాబిల్లి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్మూన్ బుధవారం కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. ఇటు భారత్లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించేందుకు వివిధ నగరాల్లోని నక్షత్రశాలలకు క్యూ కట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద వేలాది మంది విద్యార్థులు ఖగోళ వింతను చూసేందుకు గుమిగూడారు. దక్షిణ భారతంలోని పలు నగరాల్లోనూ ప్రజలు ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్మూన్ అంటారు. బుధవారం ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి. హాంకాంగ్లో సాయంత్రంవేళ టెలిస్కోప్తో సూపర్మూన్ను వీక్షిస్తున్న దృశ్యం -
రేపు ఖగోళ వింత!
న్యూఢిల్లీ: ఆకాశంలో రేపు అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ నెల 31న సూపర్మూన్గా మారే చంద్రుడు బ్లూమూన్, బ్లడ్మూన్గానూ దర్శనమివ్వనున్నాడు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరగనుందనీ, మరో పదేళ్ల తర్వాత కానీ ఇలాంటి అవకాశం రాదని శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ ఖగోళ వింతను కెమెరాల్లో బంధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కన్పిస్తాడు. దీన్నే సూపర్మూన్గా వ్యవహరిస్తారు. ఓ నెలలో రెండో పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే దాన్ని బ్లూమూన్గా పిలుస్తారు. ఇక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి చేరినప్పుడు.. భూమి వాతావరణంలోకి వచ్చిన సూర్యకాంతి పరావర్తనం చెంది చంద్రుడిపైకి ప్రసరిస్తుంది. ఎక్కువ తరంగదైర్ఘ్యమున్న ఎరుపు రంగు కిరణాలు చంద్రుడ్ని చేరడంతో చందమామ రుధిర వర్ణంలో ప్రకాశిస్తాడు. దీన్నే బ్లడ్మూన్గా వ్యవహరిస్తారు. 1866 తర్వాత ఈ మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి సంభవించడం ఇదే తొలిసారి. భారత్లో బుధవారం సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా చంద్ర గ్రహణం మొదలు కానుంది. సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల వరకూ బ్లూ, బ్లడ్మూన్ చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం 76 నిమిషాల పాటు కొనసాగనుంది. -
సూపర్ మామా!
-
ఈరోజు రాత్రికి ఆకాశంలో 68ఏళ్ల ఆద్భుతం
-
సూపర్మూన్ ఇలా కనిపించాడు
-
'బ్లడ్మూన్'.. ఓ అద్భుత ఆవిష్కారం
సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏళ్లలో ఇలాంటి ఘటన సంభవించడం ఇదే మొదటిసారి కాగా, మరో 18 ఏళ్ల దాకా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. అదే సూపర్ మూన్. చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి సాక్షాత్కరిస్తాయి. ఈ అరుదైన బ్లడ్ మూన్ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూమికి చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం.. బాగా తగ్గడమే సూపర్ మూన్. అంటే రోజూ మనకు కనిపించే చందమామ ఈ 27 రాత్రి మరింత పెద్దగా, ఎర్రగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తున్నామంటున్నారు. స్కై అండ్ టెలిస్కోప్ పత్రిక కథనం ప్రకారం వాతావరణం అనుకూలిస్తే ఉత్తర అమెరికాలోని తూర్పుప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా అన్ని దశలను చూడగలుగుతారు. ఈ సమయంలో చంద్రుడు మామూలు సమయంలో ఉండే సైజు కన్నా 14 శాతం పెద్దగా ఉంటాడని, అందుకే దీన్ని 'సూపర్ మూన్'గా పిలుస్తారని ఆ పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1982లో సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి ఏర్పడ్డాయి. తర్వాత మళ్లీ 2015 సెప్టెంబర్ 27న ఇలా కనిపిస్తుంది. 2033 లో అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఖగోళంలో సంభవించే అరుదైన చంద్రగ్రహణాల్లో ఒకటి. చంద్రుడికి, సూర్యుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు ఏర్పడేదే చంద్రగ్రహణం అని మనందరికీ తెలుసు. కానీ ఈ ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. అయినా కొంత సూర్యకాంతి చంద్రుడిపై పడుతూ ఉండడంతో అప్పుడు జాబిల్లి నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కనిపించనుంది. అందుకే శాస్త్రజ్ఞులు బ్లడ్ మూన్ అంటున్నారు. కాగా, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.40 గంటలకు ప్రారంభమై సుమారు 72 నిమిషాల పాటు (గంటా 12 నిమిషాల పాటు) కొనసాగనుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు, పశ్చిమాసియా, తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చెబుతోంది. అంటే భారత ఉపఖండం సహా మిగతా ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఇది కనిపించదట. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ గ్రహణం సంభవిస్తుంది, చంద్రుడు కూడా పెద్దగా కనిపిస్తాడు. అయితే అప్పటికి భారతదేశంలో సూర్యోదయం అయిపోతుంది కాబట్టి, చంద్రుడు కనిపించడు. ఈస్ట్రన్ డేలైట్ టైమ్ (ఈడీటీ) ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయం కాబట్టి, అప్పుడు పాశ్చాత్య దేశాల్లో చంద్రుడు కనిపిస్తాడు. మరోవైపు ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని గ్రహశాస్త్రపండితులు తెలిపారు. 72 నిముషాల సుదీర్ఘకాలం పాటు కొనసాగే సంపూర్ణ గ్రహణం భారతదేశంలో కనపడకపోయినా ద్వాదశ రాశులపై దాని ప్రభావం ఉంటూనే ఉంటుందంటున్నారు.