swachh
-
Namami Gange గంగానదిపై మహిళా జవాన్లు
శుభ్రత ఎక్కడుంటే మహిళలు అక్కడుంటారు. లేదా, మహిళలు ఎక్కడుంటే శుభ్రత అక్కడ ఉంటుంది. శుభ్రంగా ఉంచటం అన్నది మహిళల సహజ నైజం. మహిళలే కాదు, దైవత్వం కూడా శుభ్రత ఉన్న చోట కొలువై ఉంటుంది. ‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్›్ట టు గాడ్లీనెస్’ అనే మాట వినే ఉంటారు.ఇంటిని, సమాజాన్ని శుభ్రంగా ఉంచటంలో కీలక బాధ్యతను వహిస్తున్న మహిళలే ఇప్పుడు తాజాగా దైవకార్యం వంటి ‘స్వచ్ఛ గంగా’ ఉద్యమ ప్రచారాన్ని చేపట్టారు. గంగానదిని ప్రక్షాళన చేయవలసిన అవసరం గురించి, గంగా ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించటం గురించి ప్రజల్లో అవగాహన కలిగించటం కోసం మొత్తం 20 మంది మహిళలు గంగానదిపై నవంబర్ 4న రెండు తెప్పల్లో ర్యాలీగా బయల్దేరారు! ఉత్తరాఖండ్, తెహ్రీ ఘరేవాల్ జిల్లాలోని దేవప్రయాగ పట్టణం నుంచి మొదలైన ఈ ‘ఆల్ ఉమెన్ రివర్ ర్యాఫ్టింగ్’... మొత్తం 2,500 కి.మీ. దూరాన్ని 53 రోజుల పాటు ప్రయాణించి డిసెంబర్ 26న పశ్చిమబెంగాల్లోని గంగా సాగర్ వద్ద ముగుస్తుంది. అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక సుదీర్ఘమైన రివర్ ర్యాఫ్టింగ్ దేశంలో జరగడం ఇదే మొదటిసారి. మరొక విశేషం కూడా ఉంది. వీళ్లంతా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బి.ఎస్.ఎఫ్) దళానికి చెందిన మహిళలు. బి.ఎస్.ఎఫ్. మహిళా విభాగం, ‘నమామి గంగే’ ప్రాజెక్టు కలిసి ఉమ్మడిగా ఈ రివర్ ర్యాఫ్టింగ్ను నిర్వహిస్తున్నాయి. ర్యాఫ్టింగ్ ప్రారంభానికి ముందు మహిళా శక్తికి, సాధికారతకు సంకేతంగా 11 మంది బాలికల పాదాలకు నమస్కరించి పూజలు జరిపారు. ఆ తర్వాత ‘తెప్పలు’ కదిలాయి. ఈ ప్రచారానికి బి.ఎస్.ఎఫ్. సబ్ ఇన్స్పెక్టర్ ప్రియా మీనా నాయకత్వం వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా జవాన్లలో 20 మందిని కఠిన ర్యాఫ్టింగ్ శిక్షణ తర్వాత ఇందుకోసం ఎంపిక చేశామని మీనా అన్నారు. ‘‘రెండు తెప్పలుగా సాగే ఈ బోటింగ్ యాత్రలో భాగంగా గంగా తీరం వెంబడి 43 పట్టణాలలో ఈ తరం యువతీ యువకులకు ‘పరిశుభ్రతకు, నిరంతరాయ ప్రవాహానికి’ అనువుగా గంగానదిని ప్రక్షాళన చేయాలన్న సందేశాన్ని అందిస్తాం’’ అని ఆమె తెలి΄ారు. మరొక విశేషం.. వీరితో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ’ చేతులు కలపటం. శుభ్రత దైవంతో సమానం అన్నప్పుడు, దైవ సమానంగా భారతీయులు కొలిచే గంగానదిని శుభ్రంగా ఉంచాలన్న సందేశంతో ప్రచారోద్యమం చేపట్టిన మహిళాశక్తి కూడా కొలవదగినదే. స్తుతించతగినదే. వారి మాట ఆలకించతగినదే. -
తెలంగాణకు 5 స్వచ్ఛ్ మహోత్సవ్ పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణను వివిధ విభాగాల్లో 5 స్వచ్ఛ్ మహోత్సవ్ పురస్కారాలు వరించాయి. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంలో అవార్డులు ప్రకటించింది. జిల్లాల స్థాయిలో పెద్దపల్లి, వరంగల్, ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమకు అవార్డులు దక్కాయి. ఇక రాష్ట్రాల స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణకు అవార్డు దక్కింది. సోమవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేతుల మీదుగా పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన అవార్డులు అందుకున్నారు. -
స్వచ్ఛభారత్ లక్ష్యంగా ‘మల్లిగాడి మరుగుదొడ్డి’
–పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టిన సర్వశిక్షాభియాన్ -జిల్లాలో 46,516 మంది ఆరో తరగతి విద్యార్థులకు అందజేత భానుగుడి(కాకినాడ) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాని పాఠశాలల్లో ఆరోతరగతి విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్షాభియాన్ ద్వారా కార్టూన్ పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టింది. పరిసరాల పరిశుభ్రతను పాటించాల్సిన ఆవశ్యకతను కార్టూన్లద్వారా తెలియపరుస్తూ 50 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఎంత అవసరమో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. దైనందిన కార్యక్రమాలలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకుంటే వచ్చే అనర్థాలను స్పష్టంగా వివరించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలని ఆరోతరగతి చదువుతున్న మల్లిగాడి పాత్ర ద్వారా తెలియజెప్పారు. ‘స్వచ్ఛభారత్’లో భాగంగా ప్రచురణ అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 46,516 మంది ఆరోతరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. జిల్లాలో ఈ పుస్తకంపై ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. మరో రెండు రోజుల్లో పుస్తకాలన్నీ పాఠశాలలకు చేరతాయి. స్వచ్ఛభారత్లో భాగంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. -మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీఓ విద్యార్థుల ద్వారా అవగాహనే లక్ష్యం మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన పెంచితే సమాజంలోకి సులువుగా విషయం చేరుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పుస్తకాన్ని చదవడానికి వీలుగా, చిన్నచిన్న కొటేషన్ల ద్వారా రూపొందించారు. ప్రతి పాఠశాలకూ పుస్తకాలు చేరేలా చర్యలు తీసుకున్నాం. -చామంతి నాగేశ్వరరావు, ఏఎంఓ, సర్వశిక్షాభియాన్ -
స్వచ్ఛ యాదగిరిగుట్ట పోస్టర్ ఆవిష్కరణ
యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో స్వచ్ఛ యాదగిరి గుట్ట పోస్టర్ను ఎమ్మెల్యే సునీత ఆవిష్కరించారు. స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆమె విజప్తి చేశారు.