Advertisement
Titanium Case
-
కేవీపీపై రెడ్ కార్నర్ నోటిస్ అందింది: డీజీపీ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై రెడ్కార్నర్ నోటీసు అందిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. తమకు అందిన రెడ్ కార్నర్ నోటిస్ పై సీబీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రసాదరావు అన్నారు. కేవీపీ ఎంపీ కనుక ప్రత్యేక పర్యవేక్షణ అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం తెలిపారు. టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్పోల్ కేవీపీకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కేవీపీపై ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందిన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని కోరిన ప్రొవిజినల్ అరెస్టుపై సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని, సీబీఐ జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. -
హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టైటానియం కేసులో ఇంటర్ పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైం బ్యూర్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటిస్ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తన అరెస్ట్ను ఆపాలంటూ కేవీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. కేవీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులకు సీబీఐ లేఖ పంపినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.