![హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/61383636194_625x300_2.jpg.webp?itok=GPgDPgix)
Breadcrumb
హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ
Published Fri, Apr 25 2014 7:23 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
![హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/2/61383636194_625x300_2.jpg.webp?itok=GPgDPgix)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టైటానియం కేసులో ఇంటర్ పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైం బ్యూర్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటిస్ అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు.
రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తన అరెస్ట్ను ఆపాలంటూ కేవీపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. కేవీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులకు సీబీఐ లేఖ పంపినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Related news by tags
-
విమానంలో మహిళ పట్ల జిందాల్ స్టీల్ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ
జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎక్స్లో శుక్రవారం ఒక పోస్ట్ పెట్టింది. దీంతో జిందాల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు. నిందితుడైన ఉద్యోగిపై "కఠినమైన చర్యలు" తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు బాధితురాలు వెల్లడించింది. ఆమె అందించిన వివరాల ప్రకారం కోల్కతా నుంచి బోస్టన్కు అబుదాబీకి ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ట్రాన్సిట్ విమానంలో బయలుదేరింది. విమానంలో ఆమె పక్కన కూర్చున్న 65 ఏళ్ల వ్యక్తి తాను జిందాల్ స్టీల్ సీఈఓ దినేష్ కుమార్ సరయోగిని తాను పరిచయం చేసుకున్నాడు. కుటుంబం, నేపథ్యంలో అంటూ మెల్లిగా మాటలు కలిపాడు. తాను ఒమన్లో నివసిస్తున్నానని, కానీ తరచూ ప్రయాణిస్తుంటా అని చెప్పాడు. తన కొడుకులు పెళ్లిళ్లు అయ్యి, అమెరికాలో స్థిరపడ్డారు అంటూ కబుర్లు చెప్పాడు. ఇక ఆ తరువాత అతగాడి అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను అసభ్య చిత్రాలు చూడమని బలవంతం చేశాడు ఈ షాక్ నుంచి తేరుకునే లోపలే శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో అక్కడినుంచి తప్పించుకుని వాష్రూమ్కి పారిపోయి విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే తనకు బోస్టన్కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందనే భయంతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. మరోవైపు నిందితుడిపై అబుదాబి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.అయితే తనలాంటి పరిస్థితి మరి ఏ మహిళకు రాకూడదనే ఉద్దేశంతో సోషల్మీడియా వేదికగా బహిరంగంగా వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై స్పందించిన జిందాల్ గ్రూప్ చైర్మన్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వాటిని కంపెనీ అస్సలు సహించదని స్పష్టం చేశారు. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
సాక్షి, తాడేపల్లి: ‘‘నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు.. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి’’ అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్(ట్విటర్) వేదికగా మంత్రి నారా లోకేష్పై మండిపడ్డారు.‘‘మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.Sri @naralokesh, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను, నా మాటలను తప్పుదారి పట్టించవద్దు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను.…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024 ‘‘అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది?’’ అంటూ మంత్రి నారా లోకేష్కు ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ‘‘మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ.. కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన?’’ అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.Sri @naralokesh, అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు, సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తూ దాని…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 17, 2024 -
‘ఎక్స్’లో మోదీ ఫాలోయర్లు 10 కోట్లు..!
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమ వేదికలపై ఎల్లప్పుడూ చురుగ్గా ఉండే ప్రధాని మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ‘ఎక్స్’హ్యాండిల్లో ప్రధాని మోదీ ఫాలోయర్ల సంఖ్య ఆదివారం రికార్డు స్థాయిలో 10 కోట్లను దాటిపోయింది. గత మూడేళ్లలో అదనంగా 3 కోట్ల మంది ఫాలోయర్లు నమోదవడంతో మోదీ ఈ ఘనత సాధించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచ నేతల్లో ఒకరిగా ఆయనకు ఇప్పటికే పేరుంది. దేశంలో ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్కు 2.75 కోట్ల మంది, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి 2.64 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ప్రపంచ నేతల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్కు 3.81 కోట్ల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్కు 2.15 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. క్రీడాకారుల్లో క్రికెటర్ విరాట్ కోహ్లీకి 6.41 కోట్ల మంది, ఫుట్బాల్ క్రీడాకారుడు నెయ్మార్కు 6.36 కోట్లు, అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్కు 5.29 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారని ‘ఎక్స్’అధికారి ఒకరు వివరించారు. అమెరికాకు చెందిన సెలెబ్రిటీ టేలర్ స్విఫ్ట్కు 9.53 కోట్లు, లేడీ గాగాకు 8.31 కోట్లు, కిమ్ కర్దాషియన్కు 7.52 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నట్లు తెలిపారు. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Related News by category
-
జియో సరికొత్త రికార్డ్.. అదేంటో తెలుసా?
డేటా వినియోగం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్గా రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. చైనా కంపెనీలను సైతం జియో వెనక్కు నెట్టి మొదటి స్థానం ఆక్రమించుకుంది.జియో వెల్లడించిన జూన్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. మొత్తం డేటా వినియోగం ఏకంగా 4400 కోట్ల జీబీ దాటినట్లు తెలిసింది. ఇది గతేడాదికంటే కూడా 33 శాతం ఎక్కువని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం యూజర్లు ప్రతిరోజూ 1 జీబీ కంటే కూడా ఎక్కువ డేటాను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.5జీ డేటా ఉపయోగించే కస్టమర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లకు చేరింది. అర్హత కలిగిన కస్టమర్లు 4జీ ప్లాన్ రీఛార్జ్ మీద 5జీ డేటాను ఉపయోగించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 5జీ డేటా ఉపయోగించేవారు సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం జియోకు 49 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.జియో డేటా ఉపయోగించే మొబైల్ యూజర్ల సంఖ్య మాత్రమే కాకుండా.. ఫిక్స్డ్ వైర్లెస్ ఇంటర్నెట్ ఉపయోగించేవారు సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గణాంకాల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువమంది ఎయిర్ఫైబర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. -
ఎల్లుండి నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ 2024 సమావేశాలు ఎల్లుండి (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2024-2025కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను జూలై 23న ఉదయం 11:00 గంటలకు పార్లమెంట్లో సమర్పించనున్నారు. అంతకంటే ముందు జూలై 22న ఎకనమిక్ సర్వే విడుదల చేస్తారు.ఇప్పటికే 2024-25 బడ్జెట్ రూపకల్పన తుదిదశకు చేరుకుంది. దీనికి గుర్తుగానే ఇటీవల 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని జరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.లోక్సభలో ఆర్థికమంత్రి ఈ నెల 23వ తేదీన మోదీ 3.0 ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వీటిపై కొన్ని ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. ముడి పదార్థాలపై సుంకాలను తగ్గించడం వంటివి కూడా ఉండవచ్చు. లిస్టెడ్ ఈక్విటీ షేర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల ట్యాక్స్ కనీస హోల్డింగ్ వ్యవధిని ప్రస్తుత ఏడాది నుంచి 2 లేదా 3 సంవత్సరాలకు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర హరిత సాంకేతికతలలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు ట్యాక్స్ బెనిఫీట్ కల్పించే అవకాశం ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులలో గణనీయమైన పెట్టుబడులకు అవకాశం ఉంది. భారతదేశంలో కాలుష్య తీవ్రతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద వికసిత భారత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. -
ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే!
పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్లోని జామ్నగర్లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది. -
కాఫీ బ్యాడ్జింగ్ ఎఫెక్ట్.. కొత్త రూల్స్ పెట్టిన కంపెనీ
కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత.. ఇతర కంపెనీల మాదిరిగానే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఉద్యోగులను ఆఫీసుకు రప్పించాలనే ఉద్దేశ్యంతో రిటర్న్ టు ఆఫీస్ విధానం ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఆఫీసుకు రావడానికి ఉద్యోగులు సుముఖత చూపలేదు.అమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ నిబంధనలను.. సుమారు 30000 మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తూ అంతర్గత పిటిషన్ పై సంతకం చేశారు. దీన్ని అమెజాన్ ఏ మాత్రం పట్టించుకోకుండా ఆఫీసుకు రావాల్సిందే అంటూ పట్టుబట్టింది. ఆఫీసుకు రాణి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు.అనుకున్న విధంగానే అమెజాన్ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించింది. అయితే ఉద్యోగులు ఆఫీసులో సమయాన్ని వృధా చేయడానికి ఆఫీసుకు వచ్చి, కొంతసేపు సమయాన్ని గడిపి, కాఫీ తాగి వెళ్ళిపోయేవారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అని పిలిచేవారు. ఈ విషయాన్ని కంపెనీ కొంత ఆలస్యంగా గుర్తించింది.ఉద్యోగులు ఉండాల్సిన సమయం ఆఫీసులో వుండకపోవడమే కాకుండా, సమయాన్ని వృధా చేస్తున్నారని కంపెనీ గుర్తించిన వెంటనే నిబంధనల్లో మార్పులు చేసింది. తరచుగా కాఫీ బ్యాడ్జింగ్కు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ టీమ్ ఉద్యోగులు ఆఫీసులో కనీసం రెండు గంటలు, ఇతర ప్రాజెక్టులలోని ఉద్యోగులు ఆరు గంటలు ఉండాలని వెల్లడించింది. -
డ్రైవర్ అవసరం లేని ట్రక్.. దుబాయ్లో టెస్ట్
టెక్నాలజీ పెరుగుతుంటే.. వినియోగించే వాహనాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే డ్రైవర్లెస్ వెహికల్స్ పుట్టుకొచ్చాయి. ఈ రంగం మరో అడుగు ముందుకు వేసి వాణిజ్య విభాగంలోకి ప్రవేశించి డ్రైవర్లెస్ ట్రక్కును తీసుకువచ్చింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి డ్రైవర్లెస్ ట్రక్కును దుబాయ్ కంపెనీ విజయవంతంగా టెస్ట్ చేసింది. డిసెంబర్ 2022లో ఏవియేషన్ హబ్ దుబాయ్ సౌత్.. ఎవోకార్గో భాగస్వామ్యంతో డ్రైవర్లెస్ ట్రక్కులకు సంబంధించిన ఓ ఒప్పందం ఏర్పడింది.ఈ డ్రైవర్లెస్ ట్రక్కు ఆటోమాటిక్గా ముందుకు కదులుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరాలు చుట్టూ ఉన్న పరిసరాలను చూపిస్తాయి. ఇవి అల్ట్రాసోనిక్ సెన్సార్లుగా పనిచేస్తాయి. ఈ ట్రక్కును ఆబ్జెక్ట్ డిటెక్షన్, యాక్సిడెంట్ ప్రివెన్షన్, ఎమర్జెన్సీ స్టాప్లు, రివర్స్ ఆపరేషన్లు వంటి కీలక అంశాలలో టెస్ట్ చేశారు. ఈ అన్ని పరీక్షల్లోనూ ఈ ట్రక్కు విజయం సాధించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో దాదాపు అన్ని వాహన విభాగాల్లో ఆటోమాటిక్ రవాణాను పెంపొందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2030 నాటికి 25 శాతం ఆటోమాటిక్ వాహనాలు రోడ్డు మీదికి రానున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నాయి.