torture video
-
కుమార్తెలపై తండ్రి కర్కశత్వం
నరసాపురం: గల్ఫ్లో ఉన్న భార్య తన జల్సాలకు డబ్బులు పంపించడంలేదని ఆగ్రహించి, తన ఇద్దరు కుమార్తెలను బెల్టుతో ఇష్టానుసారం కొడుతూ వీడియోలు తీసి భార్యకు పంపించి బ్లాక్ మెయిల్ చేశాడో కర్కోటకుడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతణ్ని కటకటాల వెనక్కి పంపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదసారవ గ్రామానికి చెందిన ఉల్లంపర్తి ఏలీజా పెయింటింగ్ పని చేస్తుండేవాడు. భార్య మహాలక్ష్మి ఏడాది క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కీర్తి (9) నాలుగో తరగతి చదువుతుండగా, మరియమ్మ (6) ఒకటో తరగతి విద్యార్థిని. మహాలక్ష్మి ప్రతీనెలా తన సంపాదనను భర్తకు పంపేది. ఆ సొమ్ముతో ఏలీషా 24 గంటలూ తాగుతూ జల్సాలు చేసేవాడు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్తకు డబ్బులు పంపడం మానేసింది. ఆగ్రహించిన ఏలీజా కుమార్తెలిద్దరిని స్కూల్కు పంపడం ఆపేశాడు. బెల్టు, సెల్ ఛార్జర్ వైరుతో ఇస్టానుసారం కొట్టేవాడు. పిల్లలను కొడుతున్న దృశ్యాలను వీడియోతీసి, భార్యకు పంపించి, డబ్బులు పంపకపోతే వారు శవాలుగా మారతారని బెదిరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, ఏలీషాను అదుపులోకి తీసుకున్నారు. ఏలీషా సోదరి లక్ష్మి కూడా సహకరించి, వీడియో తీసినట్టుగా పిల్లలు చెప్పడంతో ఆమెపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఘటనపై స్పందించి నరసాపురం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని పిల్లలతో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. -
టార్చర్ చేసి.. ఆపై వీడియో తీస్తూ..!
హాంకాంగ్: ఇద్దరు మహిళలను దారుణంగా హతమార్చిన కేసులో బ్రిటన్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ రురిక్ జట్టింగ్ పైశాచికత్వం బయటపడింది. తాజాగా ఇండోనేషియా మహిళ హత్య విషయంలో అతడు ప్రవర్తించిన తీరు వెల్లడి కావడంతో విచారణ జరపుతున్న జడ్జీలు ఆశ్చర్యానికి లోనయ్యారు. అధికారుల కథనం ప్రకారం.. రురిక్ జట్టింగ్ ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. అనంతరం బ్యాంకింగ్, వ్యాపారరంగాల్లోకి ప్రవేశించాడు. ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ రురిక్ మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో సైకోగా మారిపోయి మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడిపై నమోదైన కేసుల విచారణలో భాగంగా రురిక్ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేస్తున్నట్లు తెలిపాడు. సుమర్తి నింగ్సి అనే మహిళతో సహా ఇండోనేషియాకు చెందిన మరో మహిళ సెనెంగ్ మజియాషిని హత్య చేసినట్లు అంగీకరించాడు. నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులతో కూడిన జ్యూరీ బృందానికి పోలీసులు నిందితుడు రురిక్ తీసిన వీడియోను అందించారు. అది చూసిన న్యాయమూర్తుల బృందం షాక్ కు గురయ్యారు. రెండేళ్ల కిందట తన అపార్ట్ మెంట్లో సుమర్తి నింగ్సి అనే మహిళను ఎంత దారణంగా వేధించి హత్యచేశాడో స్వయంగా వీడియో తీశాడు. నిందితుడు రురిక్ ఓ మహిళ మెడను తన వద్ద ఉన్న కత్తితో కోశాడు. అప్పటికే నగ్నంగా ఉన్న ఆమె ఆ సైకో వేదింపులు భరించలేక హత్యకు కొంత సమయం ముందు మూత్రవిసర్జన చేసినట్లు ఆ వీడియోలో ఉంది. నింగ్సిని తాను ఓ మహిళగా చూడలేదని, కేవలం శృంగార వస్తువుగా చూశానని తన ఆకృత్యాలను నిందితుడు రురిక్ కోర్టులో వెల్లడించాడు. ఇలాంటి దారుణాలకు పాల్పడే నిందితులను ఎప్పుడూ స్వేచ్ఛగా తిరగనివ్వరాదని, కఠినచర్యలు తీసుకుంటామని హైకోర్టు డిప్యూటీ జడ్జి మైఖెల్ స్టూవర్ట్ మూర్ అన్నారు.