TTD Board
-
టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా
సాక్షి, అమరావతి: టీటీడీ గోశాలలో ఒకేసారి వందల గోవులు చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని, దీనివెనుక కుట్ర ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి, విరాట్ హిందూస్థాన్ సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్స్వామి అభిప్రాయపడ్డారు. కొన్ని గోవులే చనిపోయాయని తేలిగ్గా వదిలేసే విషయం కాదని, ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. తిరుపతి నుంచి అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరుమల వెళ్లి పూజల్లో పాల్గొన్న అనంతరం గోవుల మరణంపై అదనపు సమాచారం సేకరించి, జూలై మొదటి వారంలోగా కోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు. సమర్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని, ఇదొక సర్వ సాధారణంగా మారిందని సుబ్రమణియన్స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లమంది ఆరాధ్య దైవంగా భావించే గోవుల రక్షణకు రాజ్యాంగ పరంగా ప్రాధాన్యం ఉందని.. కానీ, టీటీడీ పెద్దలు, ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని సుబ్రమణియన్స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం చంద్రబాబే తప్పించాలని డిమాండ్ చేశారు. సుబ్రమణియన్స్వామి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ గోవుల మృతి నాకు చాలా బాధ కలిగించింది. ఎన్ని చనిపోయాయన్నది కాదు. రాజ్యాంగంలో గో సంరక్షణ గురించి స్పష్టంగా ఉంది. ప్రతి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉండాలి. వయసు మళ్లిన మనుషుల్లాగే గోవులు కూడా చనిపోతున్నాయంటూ టీడీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్లిందని వదిలేస్తారా? ఎవరినైనా వృద్ధులని చంపేస్తుంటే అది సాధారణమే అనుకోవచ్చా? ఇవి పరిణతి లేని వ్యాఖ్యలు.చంద్రబాబు ప్రభుత్వానిది వ్యాపార ధోరణిగోవుల జీవనశైలి భిన్నమైనది. చాలా ఊళ్లలో ఎవరి అజమాయిషీ లేకుండా ఆరోగ్యంగా జీవిస్తుంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోయే పరిస్థితి సాధారణంగా ఉండదు. టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వ వ్యాపార ధోరణి కారణంగా ఇలా జరుగుతుండొచ్చు. గోవులకు సరైన వైద్యం అందించకుండా వదిలేస్తున్నందుకే ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేం. గోవుల కళేబరాలను ఏం చేశారన్నది తేలాల్సి ఉంది. మాంసాన్ని రెస్టారెంట్లకు పంపుతున్నారా? గోవు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. టీటీడీ చైర్మన్ దానిగురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు ఎవరూ అలా మాట్లాడరు. ఒకేసారి పెద్ద సంఖ్యలో గోవుల మృతి వెనుక టీటీడీ నిర్లక్ష్యం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి.టీటీడీలో పాలనా వైఫల్యంవరుస ఘటనలు టీటీడీ పాలనా వైఫల్యాలే. టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది. సీఎం వెంటనే చైర్మన్ను బర్తరఫ్ చేయాలి. గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ చేపట్టినవారు ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారు. చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు. ఎవరు ఏమడిగినా సమాధానం ఇచ్చేవారు. -
రూ.5,258.68 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు అంగీకరించినట్లు చెప్పారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల సంరక్షణ, సది్వనియోగం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడతామన్నారు. స్వామివారి ఆస్తులపై కోర్టు కేసుల్లో విచారణ వేగంగా పూర్తయి సద్వినియోగంలోకి తెచ్చేందుకు చూస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, భూ కేటాయింపులను అనుసరించి కార్యాచరణ వేగిరం చేస్తామని వివరించారు.సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఈవో జె.శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 2024–25లో 5,179.85 కోట్ల బడ్జెట్ అంచనా కాగా.. ఈసారి రూ.78.83 కోట్లు పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు, బంగారం ద్వారా రూ.1,253 కోట్ల వడ్డీ వస్తున్నట్లు అంచనా వేసిన టీటీడీ.. వచ్చే ఏడాది మరో రూ.57 కోట్లు పెరిగి రూ.1,310 కోట్లు వస్తాయని పేర్కొంది.శ్రీవారి హుండీ ద్వారా రూ.1,729 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.1,671 కోట్లుగా ఉంది. ఇందులో ఉద్యోగులు, పొరుగు ఉద్యోగులు, ఒప్పంద సేవ సిబ్బంది జీతాలకు రూ.1,773.75 కోట్లు వెచ్చిచనున్నారు. పరికరాల కొనుగోలుకు రూ.768 కోట్లు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.350 కోట్లుగా అంచనా వేశారు. కార్పస్, ఇతర పెట్టుబడులకు రూ.800 కోట్లు వ్యయం చేయనున్నారు. ముఖ్యాంశాలు ఇలా.. ⇒ హిందూ ధర్మప్రచారానికి రూ.121.50 కోట్లు. ⇒ తెల్లవారుజామున 5.30కు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం మార్పునకు పరిశీలన. ⇒ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్కు భూ కేటాయింపుల రద్దు. కొత్త ఆగమ సలహామండలి ఏర్పాటుకు ఆమోదం.⇒ సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలిపింది.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం
-
చంద్రబాబు సీఎంగా ఉంటే అంతే.. టీటీడీ బోర్డు రద్దుకు మార్గాని భరత్ డిమాండ్
తూర్పు గోదావరి, సాక్షి: తిరుపతి తొక్కసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అలాకాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘తిరుపతి ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దారుణం..అత్యంత బాధాకరమైన విషయం. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. జంతువులను పట్టుకుని బోనుల్లో వేసిన మాదిరిగా టోకెన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కనీస వసతులు కూడా అందించకుండా అలా ఎందుకు బంధించినట్లు?. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయారు?. ఇక్కడ టీటీడీ ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. టీటీడీ దేవస్థానమో(TTD Board) లేదంటే రాజకీయ పార్టీ కార్యాలయమో అర్థం కావడం లేదు.చంద్రబాబు(Chandrababu)కు సంబంధించిన అనే కార్యక్రమాల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల రాజమండ్రి పుష్కరాలు 29 మంది ప్రాణాలు కోల్పోయారు . క్రౌడ్ మేనేజ్మెంట్ చంద్రబాబు జమానాలో సాధ్యం కాదా?. అదే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు.తిరుపతి(Tirupati) మరణాలకు బాధ్యత ఎవరిది?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ బాధ్యత టీటీడీకి వదిలేశారు. అయితే క్షమాపణ చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయా? అని టీటీడీ చైర్మన్ వ్యాఖ్యానించటం దారుణం. అసలు 1,20,000 టోకెన్లు జారీ చేయాలని భావిస్తే ఆన్లైన్లో ఎందుకు చేయలేదు. చిన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదు ఇది మొత్తం వ్యవహారానికి టిటిడి బోర్డు బాధ్యత తీసుకొని పదవులకు రాజీనామా చేయాలి. లేదంటే ప్రభుత్వం బోర్డును రద్దు చేయాలి. ఇది హిట్లర్ నియంత పాలన కాదు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. తిరుపతి ఘటనను చీకటి రోజుగా కింద భావించాలి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ఘటనను సుమోటోగా తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలి.ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరపాలి అని మార్గాని భరత్ అన్నారు. -
టీటీడీ బోర్డుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
-
ఓపక్క తీవ్ర అభ్యంతరాలు.. TTD పాలకమండలిలో మరొకరికి చోటు
అమరావతి, సాక్షి: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈలోపే పాలకమండలి బోర్డులో మరొకరికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. బీజేపీ నుంచి భాను ప్రకాష్ రెడ్డి 25వ సభ్యుడిగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.టీటీడీ కొత్త బోర్డుపై మునుపెన్నడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు, ఆరోపణలు, వివాదాల్లో నిలిచినవాళ్లకే బోర్డులో చోటు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ కోసం సభ్యులను 24 నుంచి 25కి పెంచారు. ఈ మేరకు బీఆర్ నాయుడు చైర్మన్గా.. టీటీడీ పాలకమండలి ఏర్పాటుపై శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.అసలే టీటీడీ బోర్డులో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదన్న బలమైన విమర్శ వినిపిస్తోంది. ఇది చాలదన్నట్లు నేర చరితులను టీటీడీ సభ్యులుగా నియమించింది బాబు సర్కారు. అత్యధికంగా కేసులు ఉన్న టీడీపీ నేతలు మల్లెల రాజశేఖర్, ఎం ఎస్ రాజు, జ్యోతుల నెహ్రూలకు సభ్యులుగా నియమించడంపైనా దుమారం చెలరేగింది. మల్లెల రాజశేఖర్పై రౌడీషీట్తో పాటు కల్తీ మద్యం కేసు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఇక.. ఎంఎస్ రాజుపై ఏకంగా 23 క్రిమినల్ కేసులు ఉండటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.ఇదీ చదవండి: శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తా: బీఆర్ నాయుడు