U19 Womens World Cup
-
గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా
భారత యువ క్రికెటర్ గొంగడి త్రిష(Gongadi Trisha)కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్-19 టీ20 ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ఈ ఆల్రౌండర్కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.వారికి పది లక్షల చొప్పునత్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు భారత జట్టు సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా.. జట్టు హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్, ట్రైనర్ షాలినికి 10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు.కాగా ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల అండర్–19 వరల్డ్ కప్(ICC U19 Women's World Cup)లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. తన ఆల్రౌండ్ ప్రతిభతో భారత్ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది ఈ యువ తార. ఈ మెగా ఈవెంట్లో ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగిన త్రిష.. టోర్నమెంట్ చరిత్రలోనే తొలి శతకంతో సత్తా చాటి ప్రపంచ రికార్డుతో మెరిసింది.లీగ్ దశలో భాగంగా స్కాట్లాండ్తో మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. త్రిష ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన త్రిష మొత్తంగా 309 పరుగులు చేసింది. అంతేకాదు.. ఈ లెగ్స్పిన్నర్ ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సౌతాఫ్రికాతో ఫైనల్లో 33 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచిన గొంగడి త్రిష.. మూడు వికెట్లతో మెరిసి భారత్ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవడంలో కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా త్రిష సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో నూ ఈ తెలుగుతేజానికి చోటు దక్కడం మరో విశేషం. భద్రాద్రి అమ్మాయికాగా తెలంగాణలోని భద్రాద్రికి చెందిన త్రిషకు చిన్ననాటి నుంచే క్రికెట్ మీద మక్కువ. త్రిష ఈ స్థాయికి చేరడంలో ఆమె తండ్రి రామిరెడ్డిది ప్రధాన పాత్ర. కుమార్తె కోసం ఆయన ఎన్నో కష్టనష్టాలకోర్చి.. తన గారాలపట్టిని క్రికెటర్గా తీర్చిదిద్దారు. అందుకే తాను సాధించిన ప్రతి గొప్ప విజయానికి తండ్రికే అంకితం చేస్తుంది ఈ బంగారుతల్లి.ఘన స్వాగతంమలేషియాలో ఐసీసీ టోర్నీ గించుకున్న త్రిష మంగళవారమే హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అరశనపల్లి జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. త్రిషతో పాటు భారత జట్టులో సభ్యురాలైన కేసరి ధృతి, టీమ్ హెడ్ కోచ్ నూషీన్ అల్ ఖదీర్, ట్రెయినర్ షాలిని కూడా నగరానికి చేరుకున్నారు. ఈ నలుగురినీ జగన్మోహన్ రావు సన్మానించారు. 19 ఏళ్ల త్రిష తన అద్భుత ఆటతీరుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిందని ఆయన ప్రశంసించారు. త్రిష, ధృతిలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు అంతర్జాతీయస్థాయికి ఎదగాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి వీరికి నగదు బహుమతిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. హెడ్ కోచ్గా నూషీన్ అల్ ఖదీర్కు, ప్లేయర్గా త్రిషకు ఇది వరుసగా రెండో వరల్డ్కప్ టైటిల్ కావడం విశేషం. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్–19 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత మాజీ స్పిన్నర్ నూషీన్ హెడ్ కోచ్గా వ్యవహరించగా... త్రిష సభ్యురాలిగా ఉంది. 2025లోనూ నూషీన్ హెడ్ కోచ్గా కొనసాగగా... నిలకడగా రాణించిన త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును సాధించింది. కేసరి ధృతి కూడా విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్నా ఆమెకు ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష గారికి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి @revanth_anumula గారు కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన… pic.twitter.com/0lXZyJpMMg— Telangana CMO (@TelanganaCMO) February 5, 2025 -
T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశ, సూపర్ సిక్స్ దశల్లో సత్తా చాటుతూ జైత్రయాత్రను కొనసాగించిన మన అమ్మాయిలు.. సెమీ ఫైనల్లోనూ అదరగొట్టారు. ఫలితంగా వరుసగా రెండోసారి భారత్ ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది.కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) మధ్య వరల్డ్కప్-2025 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ అండర్-19 మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఓపెనర్ డెవీనా పెరిన్ 45 పరుగులతో సత్తా చాటగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ జెమీమా స్పెన్స్ మాత్రం తొమ్మిది పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్ అబీ నొర్గ్రోవ్ 30 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో అమూ సురేన్కుమార్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. పరుణిక, వైష్ణవి తీన్మార్మిగతా వాళ్లలో ట్రూడీ జాన్సన్ డకౌట్ కాగా.. చార్లెట్ స్టబ్స్ (4), కేటీ జోన్స్ (0), ప్రిషా తానావాలా(2), చార్లెట్ లాంబర్ట్(0) కూడా పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆయుశీ శుక్లా రెండు వికెట్లు పడగొట్టింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక్క వికెట్ నష్టపోయి పనిపూర్తి చేసింది.కమలిని హాఫ్ సెంచరీ.. త్రిష ధనాధన్ఓపెనర్ జి. కమలిని(G Kamalini) అర్ధ శతకం(50 బంతుల్లో 56 రన్స్, నాటౌట్)తో మెరవగా.. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతున్న గొంగడి త్రిష 29 బంతుల్లో 35 పరుగులతో రాణించింది. ఇక తెలుగమ్మాయి త్రిషను ఇంగ్లండ్ బౌలర్ ఫోబే బ్రెట్ అవుట్ చేయగా.. కమలినికి తోడుగా వన్డౌన్లో ఆడిన సనికా చాల్కె 11 పరుగులతో అజేయంగా నిలిచింది. 15వ ఓవర్లో కమలిని ఫోర్ బాదడంతో భారత్ విజయం ఖరారైంది. పరుణికకుప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తొలి సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా.. ఆసీస్ను చిత్తు చేసి తొలి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆదివారం భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్ జరుగుతుంది.ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025- రెండో సెమీ ఫైనల్భారత్ వర్సెస్ ఇంగ్లండ్- స్కోర్లుఇంగ్లండ్- 113/8 (20)భారత్- 117/1 (15)ఫలితం- ఇంగ్లండ్పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్.చదవండి: టీ20 ప్రపంచకప్-2025: ఆసీస్ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా -
త్రిష వరల్డ్ రికార్డు.. అభినందనల వెల్లువ.. భద్రాద్రిలో సంబరాలు
భారత మహిళల క్రికెట్కు భవిష్యత్ తార దొరికింది. అటు బ్యాట్తో అదరగొడుతూ... ఇటు బంతితో మెరిపిస్తూ... తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష(Gongadi Trisha) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మహిళల అండర్–19 ప్రపంచకప్ టోర్నీ(U19 Womens T20 World Cup) చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్గా 19 ఏళ్ల త్రిష గుర్తింపు పొందింది.వరల్డ్ రికార్డు.. భద్రాద్రిలో సంబరాలుకాగా 2023లో తొలిసారి జరిగిన అండర్–19 ప్రపంచ కప్లో భారత జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన త్రిష 2025 ఈవెంట్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఈ నేపథ్యంలో గొంగడి త్రిషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచకప్ టోర్నీలో శతకంతో బాది వరల్డ్ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆమె స్వస్థలం భద్రాచలంలో సంబరాలు జరిగాయి. క్రికెట్లో అసాధారణ ప్రతిభతో సెంచరీ చేయడంతో భద్రాద్రి(Bhadradri) పేరు ఒక్కసారిగా ప్రపంచస్థాయిలో మార్మోగిపోయిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెహ్రూ కప్ క్రికెట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిపి త్రిషకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, సీనియర్ క్రికెటర్ బుడగం శ్రీనివాస్, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపకులు ముర్ల రమేశ్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ఎస్కే సలీం, సదానందం, పూనెం ప్రదీప్కుమార్, రేపాక రామారావు, నరేశ్, కోటేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, బలుసు సతీశ్, రమేశ్, ఆనంద్ పాల్, ప్రవీణ్, ప్రసాద్, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు.150 పరుగుల తేడాతో ఘనవిజయంఇదిలా ఉంటే.. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత మహిళల జట్టు తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా... స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లోనూ చెలరేగిపోయింది. స్కాట్లాండ్తో మంగళవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ గ్రూప్–1 మ్యాచ్లో నికీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు 150 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది.‘టీనేజ్ స్టార్’ గొంగడి త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. స్కాట్లాండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ గొంగడి త్రిష స్కాట్లాండ్ బౌలర్ల భరతం పట్టింది. ఈ క్రమంలో ఈ టోర్నీ చరిత్రలోనే తొలి శతకం నమోదు చేసిన ప్లేయర్గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.త్రిష ఆల్రౌండ్ ప్రదర్శనతెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష 53 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో సెంచరీ మైలురాయిని అందుకుంది. మరో ఓపెనర్ కమలిని (42 బంతుల్లో 51; 9 ఫోర్లు) తో కలిసి త్రిష తొలి వికెట్కు 13.3 ఓవర్లలో 147 పరుగులు జోడించింది. కమలిని అవుటయ్యాక సనిక చాల్కె (20 బంతుల్లో 29 నాటౌట్; 5 ఫోర్లు)తో కలిసి త్రిష రెండో వికెట్కు అజేయంగా 61 పరుగులు జత చేసింది. 209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. 14 ఓవర్లు ఆడి కేవలం 58 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌటైంది. 10 వికెట్లను భారత స్పిన్నర్లే తీయడం విశేషం.ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆయుషి శుక్లా 8 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... మరో ఎడంచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మ 5 పరుగులిచ్చి 3 వికెట్లు... లెగ్ స్పిన్నర్ గొంగడి త్రిష 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ఈనెల 31న జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. అదే రోజున జరిగే మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆ్రస్టేలియా ఆడుతుంది. ఫిబ్రవరి 2న ఫైనల్ జరుగుతుంది. చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా? -
ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన.. తెలంగాణ అమ్మాయికి ఛాన్స్
దక్షిణాఫ్రికా వేదికగా జరగున్న తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు భారత సీనియర్ జట్టు విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ నాయకత్వం వహించనుంది. కాగా షఫాలీ వర్మ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటకీ.. ఇంకా 19 ఏళ్లు పూర్తి కాకపోవడంతో అండర్-19 జట్టుకు ఎంపికైంది. అదే విధంగా భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఈ జట్టులో భాగమైంది. ఇక షాఫాలీ డిప్యూటీగా శ్వేతా షెరావత్ వ్యవహరించనుంది. శ్వేతా షెరావత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ఇటీవల ముగిసిన అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగుల సాధించిన బ్యాటర్గా షెరావత్ నిలిచింది. అదే విధంగా ప్రపంచకప్ జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది. అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టు: షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీప్), జి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు , ఫలక్ నాజ్, షబ్నమ్ చదవండి: IND vs BAN: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం..