Vanamali
-
వెండి వెన్నెల జాబిలి!
చిత్రం: సిరిసంపదలు రచన: ఆత్రేయ సంగీతం: మాస్టర్ వేణు గానం: ఘంటసాల, ఎస్. జానకి కొన్ని పాటలు బాగుంటాయి. కొన్ని పాటలు ఆనందింప చేస్తాయి. కొన్ని పాటలు కలకాలం మనసులో పదిలంగా దాగుంటాయి. అదిగో... అలా మనసులో దాగిందే... ఈ ‘వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’ పాట.ఇవాళ చాలా మంది (నాతో సహా) కవులు మామూలు సంభాషణల్లా రాస్తున్న పాటల శైలి పాత సినిమాల్లో కవులు వాడిందే! అందులో దిట్ట పింగళి. అదే శైలిని అందుకున్న మరో కలం ఆత్రేయది. ఆ పెన్నులోంచి ఒలికిందే ఈ ‘వెండి వెన్నెల’. ఈ పాటలో గమ్మత్తయిన సంగతి.. పల్లవిలా మొదలైన పాదాల కన్నా అనుపల్లవి పాపులర్ అవడం! పాట ఎక్కడో మధ్యలో ఎత్తుకున్నట్టుగా మొదలవుతుంది. తర్వాత బాణీని అనుసంధానించిన తీరు మాత్రం సంగీత దర్శకుని ప్రతిభకు కట్టిన పట్టం!‘ఈ పగలు రేయిగా.. పండు వెన్నెలగ మారినదేమి చెలీ? ఆ కారణమేమి చెలీ..?’ అని ప్రశ్నిస్తూ మళ్ళీ తనే దానికి జవాబుగా .. ‘వింత కాదు నా చెంతనున్నది... వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి..’ అని అసలైన కారణంతో పల్లవి తొడగడం కవి చమత్కారం! ప్రసాద్ (ఏఎన్నార్) ఎంత సరసుడో .. పద్మ (సావిత్రి) అంత గడుసరి. చూపు విసిరినా కనులు కలపదు. కలసి నడిచినా చేయి కలపదు. ఇచ్చినట్టే ఇచ్చి మనసు దాచుకొంటుంది. ఆ పెదాలు కూడా మునిపంట బిగించే ఉంచింది మరి. నవ్వితే మగాడు చొరవ తీసుకోడూ? ‘మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు? పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు...’ అని అతనూ పసిగట్టాడు. ఏఎన్నార్, సావిత్రి హావభావాల గురించి ప్రత్యేకంగా పట్టం కట్టాల్సిన అవసరం లేదు. ‘సిరి సంపదలు’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించిన ఈ పాట తెలియని వారుండరు. డాబా మీద ఎన్ని రేడియోలు రాత్రి పూట ఈ పాట వింటూ ఆ వెన్నెలలో తడిసి వుండవు? అమ్మాయిలకు ఇష్టమైనా ఆ విషయం చెప్పకుండా అబ్బాయిలతో పోయే నయగారాలు ఈ పాటలో కుర్రాడు ఎంతో అందంగా చెప్పాడు. అందుకు తగ్గ సావిత్రి సొగసు పాటని ఆహ్లాద పరిచింది. కన్నుల అల్లరి.. సిగ్గులతో మెరిసే బుగ్గల ఎరుపు.. ఆ మనసుని అలా పట్టిచ్చేస్తాయి.. ‘కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్చి యేమార్చేవు? చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు..’ అని గుట్టు విప్పుతున్నాడు. ఒక్కటేమిటి.. ఆమె ప్రతి కదలికలోని తడబాటుకు పసందైన మాటలు విసురుతూ కట్టి పడేస్తున్నాడు. ఈ పాటలో అన్నిటికీ మించి ఒక అద్భుతమైన కవి భావం అందలం ఎక్కించదగింది. ప్రియురాలి జడలో తెల్లగా మెరిసిపోయే మల్లెలను అద్దంగా పోలుస్తూ అవి ఆమె నవ్వుని అందులో చూపిస్తున్నాయని చెప్పడం నిరుపమానం! అపురూపం!! మరువలేని భావం! ‘నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను..’ అన్న భావ వ్యక్తీకరణ ఆత్రేయ రాసిన ఈ మొత్తం పాటలో శిరోధార్యం అనదగిన వాక్యం! ఆ అమ్మాయితో ‘అలుక చూపి అటు వైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వకు.. నీ నవ్వుని జడలో మల్లెలే అద్దంగా చూపుతున్నాయి..’ అనడం మరువలేని భావం!ఈ చిత్రంలోని ఈ పాట ఎంతో మందిని అలరించింది.. నన్ను కూడా..! – డా. వైజయంతి - డా. వనమాలి గీత రచయిత -
విషాదామృతం..!
పాటతత్వం - జూన్ 2 మణిరత్నం పుట్టినరోజు మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో పని చేయడమంటే మన జర్నీ మళ్లీ మొదలుపెట్టినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్లకున్న అనుభవం అపారం. అలాంటి దర్శకులతో పనిచేయడమంటే మనల్ని మనం మళ్లీ అన్వేషించుకున్నట్లే. మణిరత్నం గారి ‘రావణ్’ సినిమా వరకూ వే టూరిగారే పాటలు రాశారు. కానీ, ఆ తర్వాత ఆయన మరణించడంతో, ‘కడలి’ సినిమా తెలుగు వెర్షన్లో అన్ని పాటలూ రాసే అవకాశం నాకు దక్కింది. స్ట్రెయిట్ చిత్రాల్లోని పాటలకున్న వెసులుబాటు డబ్బింగ్ పాటలకు ఉండదు. నా దృష్టిలో డబ్బింగ్ పాటంటే చెక్కిన శిల్పానికి రంగులు అద్దడం అని నా ఫీలింగ్. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో నా దగ్గర వేటూరిగారు ప్రస్తావిస్తూ- ‘‘డబ్బింగ్ పాట అనేది వేరే రచయిత మథనం నుంచి పుట్టింది. అతని భావాన్ని మార్చి, కొత్తగా రాయకూడదు’’ అని చెప్పారు. రాజశ్రీ గారి తర్వాత డబ్బింగ్ పాటలను కూడా అచ్చ తెలుగు పాటల్లా పొదగడంలో వేటూరి గారిని మించిన వాళ్లు లేరు. మణిరత్నం-వేటూరిగార్లది అద్భుతమైన కాంబినేషన్. ‘బొంబాయి’ లోని ‘ఉరికే చిలుకా...’, సఖి చిత్రంలోని ‘స్నేహితుడా...’, ‘పచ్చందనమే...’లాంటి పాటలు వేటూరి గారు రాసిన అనేక మైన ఆణిముత్యాల్లాంటి పాటలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మణిరత్నం దర్శకత్వంలో ‘కన్నత్తిళ్ ముత్తమిట్టాళ్’ అనే తమిళ చిత్రానికి అనువాద రూపంగా తెలుగులో విడుదలైన చిత్రం ‘అమృత’. తల్లిని వెతుక్కోవడానికి శ్రీలంక వెళ్లిన అమృత అనే చిన్నారి అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కొంటుంది. మరోవైపు తల్లిలాంటి దేశాన్ని వదలి వెళ్లిపోయే తమిళ లంకేయుల మానసిక సంఘర్షణ... ఈ నేపథ్యంలో వచ్చే పాటని హృదయం ద్రవించేలా తెరపై ఆవిష్కరించారు మణిరత్నం. తమిళంలో ‘విడై కొడు ఎంగళ్ నాడే...’ అంటూ తమిళ రచయిత వైరముత్తు గారు రాస్తే... తెలుగులో వేటూరి గారు ‘కడసారిది వీడ్కోలు...’ అంటూ ఈ పాటను ఇంకా అందంగా రాశారు. ‘‘కడసారిది వీడ్కోలు... కన్నీటితో మా చేవ్రాలు’’ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో పుట్టిన ఊరిని, మట్టిని బలవంతంగా వె ళ్లాల్సి వస్తే అంతకు మించిన నరకం ఉండదు. దానికి తగ్గట్టుగా కడసారిది వీడ్కోలు... కన్నీళ్లతో చేస్తున్నాం మా సంతకాలు అంటూ ఆ బాధితుల మనోవేదన ను వర్ణించారు. తమిళ రచయిత వైరముత్తుగారు ‘‘ఉదట్టిల్ పున్నగై పుదైత్తోం... వుయిరై వుడంబుక్కుళ్ పుదైత్తోం’’ అని రాశారు. ‘‘ మా చిరునవ్వుల్ని పెదవుల్లో సమాధి చేశాం... మా ప్రాణాల్ని మా దేహంలో సమాధి చేశాం’’ అన్నది అర్థం. దీనిని యథాతథంగా కాకుండా ‘‘ఆశలు సమాధి చేస్తూ బంధాలు బలి చేస్తూ ప్రాణాలనే విడిచి సాగే పయనమిది’’ అంటూ వేటూరిగారు ఇంకా సులువైన పదాలతో తెలుగులో రాశారు. ‘‘తల్లి నేలనూ పల్లె సీమనీ విడతరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా’’ ఎన్ని కోట్లు సంపాదించినా సొంత ఊరిలో ఉన్నప్పుడు ఉండే సంతోషమే వేరు. తరతరాల నుంచి సొంత ఊరినే ప్రపంచమనుకున్న ఆ ప్రజలకు నీడ కరువైతే పరిస్థితి మరీ దారుణం. ‘‘జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం....’’ జన్మనిచ్చిన ఊరికి దూరంగా వేరే ప్రాంతానికి వె ళ్లిపోతూ తాము కన్ను మూసే దేశం ఏది అనే ప్రశ్న సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది. ‘‘పాడే జోలలు ఏడ్పుల పాలైపోతే ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే’’ సంగీతమనే జీవన రాగం పిల్లల ఏడుపుల్లో తప్పిపోయింది. ఉదయించే సూర్యుడే హింసకు సాక్ష్యంగా నిలిచిన పొగ చాటున కనుమరుగయ్యాడు. ‘‘పూలలోనా నిన్నటి నిదురా ముళ్లు కదా ఇప్పటి నడకా’’ నిన్న రాత్రి వరకూ పూల మీద నడిచాం. కానీ బతుకు బండి తలకిందులైంది. మరి రేపు రాత్రి ఏ ముళ్ల మీద నడవాలి? అంటూ రాశారు. ‘‘ఉసురే మిగిలుంటే మరలా దరిచేరమా మనసే మిగిలుంటే ఒడిలో తలదాచమా’’ ఓ అడవుల్లారా పువ్వుల్లారా... ప్రాణం మిగిలి ఉంటే మళ్లీ వస్తాం. సొంతూరితో మమేకమవుతామనేది ఆ వలస ప్రజల ఆకాంక్ష. ‘‘తలపే అల్పం... తపనే అధికం బరువెక్కిన హృదయంతో మోసుకెళ్లిపోతున్నాం’’ సముద్రం మీద వలస పక్షులు తీరం చేరే దాకా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఆలోచన లు తక్కువే కావచ్చు. కానీ తపన మాత్రం అధికంగా ఉంటుంది. ఎన్నో ఆశలతో ప్రయాణిస్తాం. తలపై మోసే సామాన్ల బరువు కన్నా మనసులో ఇంకా భారాన్ని మోస్తూ వెళిపోతున్నాం. ఒక్కో భాషకు, ఒక్కో అందం ఉంటుంది. కొన్ని భావాలను ఈజీగా మాతృకలో ఒక పదంలో చెబితే.. మనం కొన్నిసార్లు అనువాద భాషా రచయితలుగా ఎక్కువ లైన్లలో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు లోతైన భావాలున్న పదాలు ఆ పాటలో పడకపోవచ్చు. అప్పుడే అనువాద రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మణిరత్నం- ఏఆర్ రె హమాన్ కాంబినేషన్లో పనిచేయడం ఓ అదృష్టం. ఎందుకంటే రచయితకు స్వేచ్ఛనిస్తారు. అందుకే వేటూరిగారు అంత అద్భుతంగా మాతృకకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ పాటను రాశారు. అందుకే ఈ పాట ఎప్పటికీ అలా సంగీత ప్రియుల గుండెల్లో నిలిచిపోతుంది. సేకరణ: శశాంక్.బి - వనమాలి -
స్కార్పియో ఢీ: ఆరేళ్ల బాలిక మృతి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద శుక్రవారం స్కార్పియో వాహనం వనమాలి (6) బాలికను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వనమాలి అక్కడికక్కడే మృతి చెందింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వనమాలి ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా రహదారిపైకి రావడంతో వాహన డ్రైవర్ ఆ విషయాన్ని గమనించ లేదు. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
పాట వెనుక కథ 25th Oct 2014
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : అతడు: పద పదమన్నది నా అడుగే నీవైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మది కూడ ఎపుడో జారిందే అది ప్రేమో ఏమో తెలిసేలోపు నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా నిలువెల్లా నీతోనే ముడిపడిపోయా నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా ॥పదమన్నది॥ చరణం : అ: నా గతము చెరిపి నిజము తెలిపి పోల్చనంతగా నన్నే అణువణువు మార్చెను నీ ప్రణయం ఈ కరుకు మనసు కరిగి కరిగి రేయి పగలు నా కలలను నీ తలపులతో ముంచినది సమయం నీ ప్రేమే... నీ ప్రేమే.... ఓ వరమల్లే గుండెల్లోన కొలువు తీరదా నా ప్రేమే... నా ప్రేమే... నను గెలిపించి నిను నాతో నడిపిస్తుందా అ: పద పదమన్నది నా అడుగే నీవైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మదికూడ ఎపుడో జారిందే అది ప్రేమో ఏమో తెలిసేలోపు ఆమె: నే పడిపోయా పడిపోయా పడిపోయా పడిపోయా నీతోనే ఈ నిమిషం ముడిపడిపోయా నే చెడిపోయా చెడిపోయా చెడిపోయా చెడిపోయా ప్రేమించే నీ కొరకే మతి చెడిపోయా చిత్రం : DK బోస్ (2014) రచన : వనమాలి సంగీతం : అచ్చు గానం : హరిచరణ్, సుచిత్ర