vehicle checking
-
వాహన తనిఖీలు.. 700 కేసుల నమోదు..!
చార్మినార్: వాహనాల స్పెషల్ డ్రైవ్లో ఇప్పటి వరకు 700 వందలకు పైగా కేసులు నమోదు చేసినట్లు దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం చార్మినార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి ఆయన పాతబస్తీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనీఖీలలో పట్టుబడిన కార్లకు ఉన్న బ్లాక్ కవర్లను తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... దక్షిణ మండలంలోని పాతబస్తీలో ఇప్పటి వరకు నెంబర్ ప్లెట్లు సక్రమంగా లేని 190 వాహనాలపై, పోలీసు, అడ్వకేట్, ఎమ్మెల్యే, ఎంపీ, డాక్టర్ స్టిక్కర్లతో వచ్చిన 46 వాహనాలతో పాటు బ్లాక్ ఫిల్మ్లతో కూడిన 500 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. (చదవండి: Ram Charan: రామ్ చరణ్ బర్త్డే.. అదిరిపోయిన అభిమాని గిఫ్ట్) -
ఇద్దరు ఎర్ర కూలీల అరెస్ట్
జమ్మలమడుగురూరల్: ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు ఎర్ర కూలీలను అదుపులోకి తీసుకొని వారివద్దనుంచి 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన స్థానిక అర్బన్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఉదయం ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం వచ్చి స్కార్పియో వాహనాన్ని ఆపాలని కోరగా డ్రైవర్ ఆపకుండా వాహనాన్ని తీసుకెళ్లాడు. దీంతో అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నామన్నారు. ఆ వాహనంలో 5 ఎర్రచందనం దుంగలు, 8 మంది వ్యక్తులు ఉన్నారన్నారు. అయితే వారిలో ఆరుగురు పారిపోగా నారాయణ, వీరభద్రయ్య అనే వ్యక్తులు మాత్రమే దొరినట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా రెండు వాహనాలు వీరభద్రయ్యకు చెందినవిగా తెలిసిందన్నారు. ఈ దుంగల విలువ రూ.ఐదు లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజు, ఏఎస్ఐ మురళీ, హెడ్కానిస్టేబుల్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.