కళ్లలో యాసిడ్ పోసి.. వేళ్లు నరికి...
పాట్నా: చిన్న వివాదంతో బీహార్లో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ గొడవను అడ్డుపెట్టుకుని వికాస్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిపై ఆరుగురు దుండగులు సమస్టిపుర జిల్లాలో గురువారం దాడికి పాల్పడ్డారు. కళ్లలోకి యాసిడ్ చిమ్మడంతోపాటు చేతి వేళ్లను నరికేశారు. గ్రామంలో జరిగిన ఘర్షణలే దీనికి కారణమై ఉంటాయని పోలీసులు వెల్లడించారు.