virginity auction
-
తల్లి చికిత్స కోసం కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన బాలిక.. చివర్లో
ముంబై: తన తల్లి చికిత్స కోసం ఓ మైనర్ బాలిక తన కన్యత్వాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడింది. కానీ చివర్లో పోలీసుల ఎంట్రీతో ఆమె క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక తల్లి క్యాన్సర్తో బాధపడుతున్నందున చికిత్స కోసం డబ్బు అవసరమైంది. అయితే మైనర్ బాలిక తల్లితో నిందితురాలుకు ఇంతకు ముందే పరిచయం ఉండడంతో, బాలికకు డబ్బు అవసరం ఉందనే విషయం తెలుసుకుంది. ఈ క్రమంలో బాలికతో నిందితురాలు తాము చెప్పినట్లు చేస్తే ఆమె తల్లి చికిత్సకు అవసరమయ్యే మొత్తం సమకూరుతుందని ఆమె నమ్మ పలికింది. తన కన్యత్వాన్ని అమ్మకానికి పెడితే కనీసం రూ.5000 ఇప్పిస్తామని నిందితురాలు తెలపడంతో వేరేదారి లేక ఆ బాలిక అందుకు అంగీకరించింది. కాగా, ఆ నిందితురాలు ఓ వ్యక్తితో రూ. 40 వేలకు బాలికను బేరం పెడుతుంది. ఈ క్రమంలో బాలిక తల్లిని కూడా ఒప్పించి ఆమెను కరోడిలోని ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లింది. అయితే బేరం కుదుర్చుకున్న వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ కావడంతో నిందితురాలు పన్నిన పన్నాగం బయటపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ అపార్ట్మెంట్పై దాడి చేసి సదరు నిందితురాలిని అరెస్ట్ చేయగా, ఆ బాలికను కాపాడారు. చదవండి: ఇన్స్టాలో పరిచయం: బాలిక ‘ప్రేమ చదివింపులు’.. చివరకు.. -
శీలానికి వెల.. పంచుకున్న పెద్దలు!
వరంగల్ , రాయపర్తి : అమ్మాయి శీలానికి వెల కట్టిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని ఓ తండాకు చెందిన అబ్బాయి ఓ గ్రామానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలో అబ్బాయికి రూ. 2లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని పెద్దమనుషులే తలాకొంత పంచుకున్నట్లు తెలిసింది. అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఒక్కరూపాయి ఇవ్వకపోవడంతో గ్రామస్తులు పెద్దమనుషులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(ఈ అమ్మాయి కన్యత్వం పది కోట్లకు..) -
పోటాపోటీగా ‘కన్యత్వ’ అమ్మకాలు
సాక్షి వెబ్డెస్క్ : చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మ వైద్యం కోసమో, కేన్సర్తో బాధపడుతున్న నాన్న వైద్యం కోసమో రష్యా, చైనా, థాయ్లాండ్ యువతులు తమ కన్యత్వాన్ని బహిరంగ వేలం ద్వారా అమ్ముకునేవారు. జర్మనీ, నెదర్లాండ్కు చెందిన యువతులు ప్రపంచ పర్యటనకు అవసరమైన డబ్బుల కోసమో, ప్రపంచాన్ని తిప్పి చూపించే ధనికుడికో తమ కన్యత్వాన్ని అమ్ముకునేవారు. ఇప్పుడు రష్యాకు చెందిన యువతులు అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి, ఒకేసారి ధనవంతులు అయిపోవడానికి తమ కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు. ఇదివరకు ఇలా కన్యత్వాన్ని వేలం వేసుకునే కన్యలు ఒకరో, ఇద్దరో ఉండగా ఇప్పుడు వేల మంది యువతులు పోటీపడి మరీ ముందుకు వస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇటు కన్యలను, అటు ధనవంతులను కలిపి కాస్త సొమ్ము సంపాదించేందుకు దళారులు కూడా బయల్దేరారు. దళారుల ఫీజులు కూడా లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో కొందరు యువతులు ‘రైట్ టు ది ఫస్ట్ నైట్’ అనే వేదికలకు, డేటింగ్ వెబ్సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటు చేస్తూ ఆ క్లబ్బుల పేరిట వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ‘బ్యాడ్ గర్ల్స్ క్లబ్’ ఏర్పాటయింది. రష్యాలోని ఏ నగరానికి చెందిన వారైనా సరే, 19 ఏళ్లలోపుండి, అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. ఏ నగరానికి చెందిన వారైనా సరే యువతి ఫొటోలు నచ్చితే మాస్కో వరకు వచ్చి పోయేందుకు టిక్కెట్లు కూడా ఉచితంగానే పంపిస్తామని దళారులు చెబుతున్నారు. దాంతో మిలానా మెర్సర్ లాంటి వారు పడకపై అర్థ నగ్నంగా దిగిన ఫొటోలను దళారీలకు పంపిస్తున్నారు. ఇలంటిదే మరో క్లబ్ ‘డెస్పరేట్ వర్జిన్స్ క్లబ్’ పేరిట ఏర్పాటయింది. ‘నాకు 19 ఏళ్లు. ఎత్తు 175 సెంటీమీటర్లు, బరువు 65 కిలోలు. కన్యత్వం అమ్మడానికి సిద్ధం. వ్యక్తిగత సందేశం పంపించండి’ అంటూ ఒకరు. ‘వయస్సు 17, కన్యత్వం అమ్మకానికి సిద్ధం. వ్యక్తిగత సందేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తాను’ అంటూ మరొకరు డెస్పరేట్ వర్జిన్స్ క్టబ్’కు పోస్టింగ్లు చేస్తున్నారు. అనంతరం బ్రోకర్లు ‘ఫలానా మరినా 18,90,000 రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్ముకొని ఎంచెక్కా ఓ ఫ్లాట్ కొనుక్కొంది....ఫలానా అమ్మాయి పది లక్షల రూపాయలకు కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టగా...పాపం, ఫలానా అమ్మాయి కేన్సర్తో బాధ పడుతున్న తన తల్లికి చికిత్స చేయించేందుకు కేవలం మూడు లక్షల రూపాయలకే కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది’ అన్న ప్రకటనలు క్లబ్ల పేరిట వెలిసిన వైబ్సైట్లలో తెగ కనిపిస్తున్నాయి. ‘నేను వళ్లు అమ్ముకునే పడుపు వత్తి చేయాలనుకోవడం లేదు. ఒక్క పైసా ఇవ్వక పోయినా సరే, బాగా డబ్బున్న యువకుడితో అనుభవాన్ని కోరుకుంటున్నాను’ లాంటి ప్రకటనలు కూడా కొంత మంది యువతులు చేస్తున్నారు. ‘నేను 500 డాలర్లు చెల్లించి అనేక మంది కన్నె పిల్లల పొందును కొనుక్కున్నాను’ అని ఓ మెడికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న అన్న అనే బైసెక్సువల్ తెలిపారు. డేటింగ్ క్లబ్బులు వల్గర్గా ఉంటున్నందున తాను కూడా ‘క్లబ్’ సైట్లను ఆశ్రయిస్తున్నానని తెలిపారు. ఫలానా మెలీనా అనే 18 ఏళ్ల అమ్మాయి తన కన్యత్వాన్ని 20 లక్షల రూపాయలకు ఫలానా హోటల్లోని, ఫలానా గదిలో అమ్ముకుందంటూ కూడా బ్రోకర్లు పబ్లిసిటీ ఇస్తున్నారు. కన్యత్వానికి సిద్ధమైన వారితో టీవీ ఛానళ్లు టాక్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఎందుకు కన్యత్వాన్ని అమ్ముకుంటున్నారో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియో సాక్షిగా తెలియజేస్తున్నారు. -
రూ. 17 కోట్లకు కన్యత్వ వేలం
డబ్బు అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. కాలేజి ఫీజు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెడుతున్నానని రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్ గత ఏడాది తొలిసారి ప్రకటించినప్పుడు ప్రపంచమంతా షాకైంది. సోషల్ మీడియాలో పలువురు ఆమె నిర్ణయం పట్ల దుమ్మెత్తి పోశారు. కానీ, ఇప్పుడు ఆమె తన కన్యత్వ వేలం ద్వారా దాదాపు రూ. 17 కోట్లు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని కెఫ్రెన్ తాజాగా ప్రకటించింది. జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్ సంస్థ ద్వారా ఆమె వేలం పూర్తయింది. ముందుగా ఆమె ఒక మిలియన్ యూరోలతో వేలం ప్రారంభించగా, చివరకు హాంగ్ కాంగ్కు చెందిన ఒక వ్యాపారవేత్త 2.5 మిలియన్ యూరోలకు ఆమెను పాడుకున్నాడు. సిండ్రెల్లా ఎస్కార్ట్ సంస్థ ద్వారా అతడు సంప్రదించాడు. భవిష్యత్తులో ఎవరైనా స్నేహితుడికైనా తాను తన కన్యత్వాన్ని సమర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉండకుండా వదిలి వెళ్లిపోతాడని, అలాంటప్పుడు తన కాలేజి ఫీజు అవసరాలు తీర్చుకోడానికి ఇలా కన్యత్వాన్ని వేలం వేస్తే తప్పేముందని కెఫ్రెన్ వాదించింది. తాను ఇలా చేయడం పట్ల చాలామందికి భిన్నాభిప్రాయాలున్నాయని, కానీ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకునే ఈ పని చేస్తున్నానని స్పష్టం చేసింది. అయితే, కాలేజి ఫీజు కోసం ఇలా వేలం వేసినట్లు ఆమె చెబుతున్నా, ఆమె తల్లిదండ్రులు బాగానే డబ్బున్నవాళ్లని తెలుస్తోంది. 20 శాతం కమీషన్.. ఈ వేలం విషయంలో ఆమెకు సహకరించినందుకు సిండ్రిల్లా ఎస్కార్ట్ సంస్థ 20 శాతం మొత్తాన్ని కమీషన్గా తీసుకుని, మిగిలినదాన్ని మాత్రమే ఆమెకు ఇవ్వనుంది. ఈ విషయం కూడా ముందుగానే ఒప్పందంలో ఉంది. -
కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ
-
కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ
నెవెడా: తన కుటుంబం కోసం ఓ అమెరికా యువతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తనవాళ్లను కాపాడుకునేందుకు కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. 21 ఏళ్ల కేథరిన్ స్టోన్ అనే యువతి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నెవెడాలో చట్టబద్దంగా పనిచేస్తున్న వేశ్యాగృహం 'కిట్ కాట్ రాంచ్'లో ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ఆమె నిర్ణయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అత్యధికంగా 4 లక్షల డాలర్లు(సుమారు రూ. 2.6 కోట్లు) బిడ్ వచ్చింది. లాయర్ కావాలనున్న కేథరిన్ స్టోన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కన్నీటి గాథ ఉంది. సీటెల్ లో సంతోషంగా జీవిస్తున్న ఆమె కుటుంబాన్ని అగ్నిప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. 2014, డిసెంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ అగ్నిప్రమాదం ఆమె కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తమ ఇంటికి బీమా లేకపోవడంతో వారికి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. దీంతో కేథరిన్ కుటుంబం 8 నెలల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఎలాగైనా తన కుటుంబానికి ఆసరాగా నిలబడాలనుకున్న ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాలేజీ ఫీజు కోసం ఓ యువతి 2008లో తన కన్యత్వాన్ని వేలం పెట్టిందన్న విషయం తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేసింది. కేథరీన్ కన్నీటి గాథను 'దిజ్ ఈజ్ ద లైఫ్' పేరిట సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. నెవెడాలో వ్యభిచారం చట్టబద్దమని తెలుసుకుని కిట్ కాట్ రాంచ్ యజమాని డెన్నిస్ హొఫ్ ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించినట్టు కేథరీన్ తెలిపింది. తన కుటుంబ పరిస్థితి గురించి వివరించడంతో తనకు సాయం చేసేందుకు డెన్నిస్ ఒప్పుకున్నారని వెల్లడించింది. తర్వాత తన తల్లితో పాటు వెళ్లి డెన్నిస్ ను కలిసింది. మే నెలలో నెవెడాకు కేథరీన్ వచ్చింది. సర్వం కోల్పోయి రోడ్డున పడిన తన వాళ్లకు ఊతం ఇవ్వడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని కేథరీన్ స్పష్టం చేసింది. వేలానికి మరన్ని బిడ్స్ వస్తాయన్న ఆశాభావంతో ఉంది. కాగా, చాలా మంది కేథరీన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను పరుష పదజాలంతో తిట్టిపోశారు. సానుభూతిపరులు మాత్రం ఆమె అడ్డుకోవద్దని అంటున్నారు.