wapcos
-
‘బనకచర్ల’పై మన అభ్యంతరాలు బేఖాతరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోకుండా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రాజెక్టు డీపీఆర్ను ఇప్పటికే సిద్ధం చేయగా, పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టు అలైన్మెంట్ ఖరారు చేసేందుకు వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్(లైడార్) సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తోంది. మూడు విభాగాలు(సెగ్మెంట్స్)గా ప్రాజెక్టును విభజించి నిర్మించనుండగా, రెండు విభాగాలకు సంబంధించిన లైడార్ సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. మూడో సెగ్మెంట్కు సంబంధించిన లైడార్ సర్వే మరో ఒకటిరెండు రోజుల్లో పూర్తి కానుంది. లైడార్ సర్వే ద్వారా తీసిన త్రీడీ, పోటోగ్రఫిక్ చిత్రాల ఆధారంగా కాల్వలు/సొరంగాల అలైన్మెంట్తోపాటు లెవల్ను ఖరారు చేస్తారు. సర్వే పూర్తయితే ప్రాజెక్టు పనులను ఏపీ ప్రారంభిస్తుంది. రెండు సెగ్మెంట్ల సర్వే పూర్తితొలి సెగ్మెంట్లో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధానకాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 క్యూసెక్కుల నుంచి 10,000 క్యూసెక్కులను పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ ప్రతిపాదించింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణానది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో గుంటూరు జిల్లాలో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. ఈ సెగ్మెంట్లో భాగంగానే నాగార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తామని మరో లింక్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించిన లైడార్ సర్వే ఇప్పటికే పూర్తయ్యిందని అధికారవర్గాలు తెలిపాయి.మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో నీటిని లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ క్రమంలో నల్లమల అటవీప్రాంతంలోని కొండల్లో 26.8 కి.మీల సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఈ పనులకు సంబంధించిన లైడార్ సర్వే చివరి దశలో ఉంది.‘సాగర్’లింక్పై సైతంనాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తామని ఈ ప్రాజెక్టు కింద ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది. ఈ పనులకు సంబంధించిన సర్వే పనులను ఏపీ పూర్తి చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. రూ.80వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీలు చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి తరలిస్తామని ఏపీ పేర్కొంటోంది. -
వ్యాప్కోస్కు కొత్త ప్రాజెక్టుల సర్వే బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల గరిష్ట వినియోగం లక్ష్యంగా చేపట్టనున్న కొత్త ప్రాజెక్టుల సర్వే పనులను జాతీయ సర్వే సంస్థ అయిన వ్యాప్కోస్తో చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. కొత్త ప్రాజెక్టుల అంశం అంతర్రాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యాప్కోస్ గతంలో కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, డిండి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు లైడార్ సర్వే చేయడంతో పాటు డీపీఆర్లు తయారు చేసింది. వ్యాప్కోస్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మళ్లీ అదే రీతిన జూరాల దిగువన 35 నుంచి 40 టీఎంసీల సామర్థ్యంలో చేపట్టనున్న జోగుళాంబ బ్యారేజీ సహా భీమా వరద కాలువ, పులిచింతల ఫోర్షోర్లో చేపట్టే ఎత్తిపోతల, నాగార్జునసాగర్ టెయిల్పాండ్లో చేపట్టే ఎత్తిపోతల పథకాల సర్వే పనులను వ్యాప్కోస్కు అప్పగించే అంశంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, వ్యాప్కోస్ సైతం ఈ సర్వే పనులను తమకు నామినేషన్ విధానం ద్వారా అప్పగించాలని ఇరిగేషన్ శాఖకు శుక్రవారం లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూరాలకు భారీ వరద 42,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో ధరూరు: జూరాల ప్రాజెక్టులో భారీగా వరద వస్తోంది. గంటగంటకూ ఇన్ఫ్లో పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు 42,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి, ఎత్తిపోతలతో 22,165 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 34,685 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 28,783 క్యూసెక్కులు వదులుతున్నా రు. ఆ ప్రాజెక్టు పూర్తిమట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 92.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 24.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
కేశవాపూర్ కుదింపు!
సాక్షి, హైదరాబాద్:మేడ్చల్ జిల్లా శామీర్పేట్ సమీపంలో చేపట్టదలిచిన కేశవాపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అంశంలో చిక్కు ముళ్లు కొలిక్కి వచ్చే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో దీని సామర్థ్యాన్ని సగానికి తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం 10 టీఎంసీల సామర్థ్యంతో దీనికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా 5.04 టీఎంసీలకే దీన్ని పరిమితం చేసేలా వ్యాప్కోస్ సంస్థతో సర్వే చేయించింది. 5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేపడితే దాని నిర్మాణానికి రూ.3,363 కోట్ల మేర వ్యయం అవుతుందని వ్యాప్కోస్ నీటిపారుదల శాఖకు, మున్సిపల్ శాఖకు నివేదించింది. భూసేకరణ జాప్యంతోనే.. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను చేపట్టేలా కేశవాపూర్ రిజర్వాయర్ను 10 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని నిర్ణయిం చారు. రిజర్వాయర్ నిర్మాణానికి 13 కి.మీ. కట్ట నిర్మాణం చేయాల్సి ఉంటుందని తేల్చగా, కొండపోచమ్మ సాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్కు మూడు 3,600 ఎంఎం డయా గ్రావిటీ పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్ను ఘణపూర్లో నీటి శుద్ధి కేంద్రంలో (డబ్ల్యూటీపీ) శుద్ధి చేసి శామీర్పేట్, సైనిక్పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్ లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 3,822 ఎకరాల భూమి అవసరం ఉండగా, మొత్తంగా రూ.4,777.59 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇవి పోనూ రిజర్వాయర్ పనులకు రూ.3,918 కోట్లతో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తికాగా, పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ పనులు చేపట్టేందుకు బొంరాస్పేట, పొన్నాల గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇక్కడి రైతులు భూసేకరణకు సహకరించడం లేదు. భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించినా ముంపు గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం 5 టీఎంసీలు కుదించి, దానికనుగుణంగా ప్రాజెక్టు నివేదికతతయారు చేసి ఇవ్వాలని వ్యాప్కోస్ను ఆదేశించింది. దీనిపై కసరత్తు చేసి న వ్యాప్కోస్ ప్రభుత్వ భూమి 918.84 ఎకరాల మేర అటవీ భూమి ప్రాం తంలోనే నిర్మాణం చేసేలా 5.04 టీఎంసీలతో కేశవాపూర్ను నిర్మించే అవకాశం ఉందని తేల్చింది. రూ.3,363 కోట్లు అవసరం.. రా వాటర్ తరలించేందుకు ఏర్పాటు చేయనున్న రెండు వరుసల ప్రధాన పైప్ లైన్ పొడవు గతంలో 18.2 కి.మీ. ఉండగా, ప్రస్తుతం దాన్ని ఒకటే వరుసలో 34.85 కి.మీ.లకు ప్రతిపాదించింది. దీనికి మొత్తంగా రూ.3,363 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.75 కోట్లు అవసరం ఉంటుందని తేల్చింది. దీంతో పాటే కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు డబ్ల్యూటీపీ నిర్మాణం చేయాల్సి ఉండగా, దానికి రూ.1,006 కోట్లు అంచనా కట్టింది. ఇందులో పైప్ లైన్ నిర్మాణానికే రూ.385 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది. -
దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం
సందర్భం ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నీటి సరఫరా పనుల్లో ఏ ప్రమాణాలనూ వాప్కోస్ పాటించలేదు. అలాంటి వాప్కోస్ను తెలంగాణకు శాశ్వతంగా సాగు, తాగునీటిని అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్యవేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? వాటర్ అండ్ పవర్ కన్సె ల్టెన్సీ (వాప్కోస్) తెలంగాణలో అత్యంత వివాదాస్పద మైన సంస్థగా ప్రజలముందు నిలుస్తోంది. కార్పొరేట్ దోపిడీ లీలలు ప్రజలు పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో వెలుగు చూడటమే కలవరపెడుతోం ది. వైఎస్ హయాంలో వాప్ కోస్ డీపీఆర్ ఆధారంగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టును చేపట్టగా 9 వేల కోట్ల పనులయ్యాయి. తెలంగా ణకు ఎనలేని మేలు చేసే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణా నికి తుమ్మిడి హెట్టి అన్ని విధాల అనువైనదని ఆనాడు వాప్కోస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వాప్కోస్ గత డిజైన్లోనే 1,500 కోట్ల పనులు చేసిందనేది గమనిం చాలి. ప్రాణహితపై వాప్కోస్ ఇచ్చిన నివేదికను ఆ సంస్థే తలకిందులు చేసి, కాళేశ్వరం-మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చి వేల కోట్ల దుర్వినియోగం చేసి, నిర్మించిన భారీ కాలువలు నిరుపయోగమయ్యాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, విశ్రాంత ఇంజనీర్లు, వారి సంఘాలు, మేధావులు, ప్రజలందరు ఈ రీడిజైన్ను వ్యతిరేకించి ఉద్యమిస్తూనే ఉన్నాయి. వ్యాప్కోస్ మేడిగడ్డ సర్వేకు అనేక కోట్ల ఫీజు తీసుకొని, లైడార్ లేజర్ సర్వే చేసి, కాళేశ్వరం నుండి ఎల్లంపెల్లికి కాల్వ, సొరంగానికి 150 క్రాసింగ్లు, అడ్డంకులున్నాయని, అసాధ్యమని తేల్చి, ప్రతిపాదించిన ప్రభుత్వమే ఈ రీడిజైనింగును రద్దు చేసింది. ఎల్లంపెల్లి నుండి దారిలో ఉన్న జిల్లాలు, హైద రాబాద్కు నీరందించే పథకంలో వాప్కోస్ చేస్తున్న ఘోరమైన తప్పులపై మెట్రో వాటర్ వర్క్స్ దుమ్మెత్తి పోసింది. వాప్కోస్ ఏ ఒక్క తప్పును సరిదిద్దుకోకపోగా, జవాబిచ్చే బాధ్యతనూ విస్మరించింది. 'మౌలానా అబ్దుల్ కలాం హైదరాబాద్ సుజల స్రవంతి' గోదావరి తాగునీటి పథకం దశ-1తో ఎల్లంపెల్లి నుండి హైదరాబాద్కు నీళ్లు తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పథకంపై సర్వేకు వాప్కోస్ను నియ మించారు. ఈ పథకం అకౌంట్స్ జనరల్ 17.11.2012న వాప్కోస్ తప్పులపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. వాప్ కోస్ అర్హత, అనుభవం లేని ఇంజనీర్లను వినియోగిస్తుం దని. ఒక ప్యాకేజీలో ఉన్న అదే పేర్లు గల ఇంజనీర్లనే మరో ప్యాకేజీలో వినియోగిస్తుందని నిర్దిష్టంగా వాప్ కోస్ను ఆ లేఖలో తీవ్రంగా మందలించింది. మెట్రో వాటర్వర్క్స్ డీజీఎం వాప్కోస్ ప్రాజెక్టు డెరైక్టర్కు రాసిన మరో లేఖలో వాప్కోస్ తప్పులను తూర్పారబట్టారు. అర్హత, ఏ మాత్రం అనుభవం లేని యువ ఇంజనీర్లను నియమిస్తున్నారు. 14 మంది సీని యర్ ఇంజనీర్లు ఉండవలసిన చోట, కేవలం ఎలాంటి అర్హత, అనుభవం లేని అప్పుడే చదువులు పూర్తి చేసు కున్న ఆరుగురు జూనియర్ ఇంజనీర్లను, సర్టిఫికెట్లు కూడా రాని ఇంజనీర్లను వాప్కోస్ కారు చౌక జీతాలు చెల్లించి కుదుర్చుకుంది. అనుభవలేమితో ప్రాజెక్టుల భవిష్యత్తునే వాప్కోస్ ప్రశ్నార్థకం చేస్తోంది. కేంద్ర నీటిశాఖ నిబంధనల ప్రకారం వ్యాప్కోస్ పనిచేస్తున్న రాష్ట్రాలలో అత్యున్నత సాంకేతిక సౌకర్యా లతో సెంట్రల్ లాబొరేటరీ ఉండాలి. అన్ని సాంకేతిక వసతులున్న మొబైల్ లాబొరేటరీ ఉండాలి. కానీ వాప్ కోస్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిది పక్కకు పెడితే ఏ స్థాయి పరిశోధనా సంస్థాలేదు. ప్రమాణాలను పాతరేసిన వీరి తప్పుడు నివేదికల ఆధారంగా వేల కోట్లతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తే ఎన్నిచోట్ల పేలుతున్నాయో చూస్తూనే ఉన్నాం. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీమ్ ప్రాజెక్టు ఫేస్-1, ప్యాకేజీ-2లో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న పీఎస్ కాశీనాథ్ (రిటైర్డ్ సీఈ) వాప్కోస్కు, హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బీకి తేది 3.8.2013న లేఖ రాశారు. ప్రతి ప్యాకేజీలో 14 మంది 15 సంవత్సరాలు ఆపై అర్హత, అనుభవంగల ఇంజనీర్లుండాలని, సెంట్రల్ ట్యాబ్, మొబైల్ ట్యాబ్ ఉండాలనీ, అయితే అమలు చేయవల సిన వాప్కోస్ పీడీ దీనికి విరుద్ధంగా ప్యాకేజ్-1ను ఏ మాత్రం అనుభవం లేని ఉప కాంట్రాక్టర్లకిచ్చారు. ఉప కాంట్రాక్టర్లకు ఇవ్వడం అగ్రిమెంట్ నిబంధనలకు విరు ద్ధం. జీతాలివ్వని వారిని, జీతాల గురించి దీనంగా అడ గడానికి వెళ్లిన పేద ఇంజనీర్లను, వాప్కోస్ పీడీ, నాకు మీ జీతాలతో ఎలాంటి సంబంధం లేదని బుకా యించారు. సర్వే పనులు సాగుతున్న చాలా పని స్థలాల వద్ద వాప్కోస్కు ఎక్కడా ఒక కార్యాలయం, ప్రాజెక్టు మేనే జర్ లేరు. 3, 4 గురు అనుభవంలేని ఇంజనీర్లతో కాలం వెళ్లబుచ్చుతోంది. అదే సమయంలో ప్రభుత్వాల నుండి 14 మంది సీనియర్ ఇంజనీర్ల పేర కోట్లు కాజేస్తోంది. వాప్కోస్ దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలోనూ మారక పోగా మరింత పెరిగింది. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ల గురించి వాప్కోస్ లక్ష్యాలుగా చెప్పుకొంటుంది. కానీ ఈ ఏ అర్హతలు వాప్ కోస్కు లేవు. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు జరి గిన నీటి సరఫరా పనులలో పై ఏ నియమాలను, ప్రమా ణాలను వాప్కోస్ పాటించలేదు. పైగా తుంగలో తొక్కింది. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నిర్మిం చిన పైపులతో నీళ్లందించినప్పుడు పాటించిన ప్రమా ణాలెంతటివనేది తేలుతుంది. అలాంటి వాప్కోస్ను తెలంగాణ జనావళికి శాశ్వతంగా ఉపయోగపడే సాగు, తాగునీరును అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్య వేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? ప్రమా ణాలు పాటించని, పైసలే ప్రమాణాలైన వాప్కోస్కు ఎలాంటి టెండర్లు లేకుండా తెలంగాణ వాటర్ గ్రిడ్ కన్సెల్టెన్సీగా నెలకో కోటితో ప్రభుత్వం కట్టబెట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేమిటో తెలంగాణ ప్రభు త్వమే వెల్లడించాలి. వ్యాసకర్త: తెలంగాణ జలసాధన సమితి కార్యదర్శి, నైనాల గోవర్ధన్. మొబైల్:9701381799