Waste of time
-
యాడ్తో టైమ్ వేస్ట్ చేశారు
బెంగళూరు: పీవీఆర్ ఐనాక్స్, బుక్మై షోలపై ఓ యువకుడు కోర్టుకెక్కాడు. సుదీర్ఘమైన వాణి జ్య ప్రకటనలతో తన సమయాన్ని వృథా చేశారని, మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపిస్తూ కేసు వేశాడు. అతనికి రూ.65 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది! ఈ ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన అభిషేక్ ‘సామ్ బహదూర్’సినిమా కోసం బుక్మై షోలో మూడు టికెట్లు కొన్నాడు. సాయంత్రం 4.05కు మొదలవాల్సిన సినిమా కాస్తా ఏకంగా 30 నిమిషాలు సినిమా ప్రకటనలు, ట్రైలర్ల ప్రసారంతో 4.30కు మొదలైంది. దాంతో సకాలంలో ఆఫీసుకు వెళ్లలేకపోయానని అభిషేక్ ఆరోపించాడు. ‘‘నా విలువైన సమయం వృథా అయింది. ప్రకటనలు ద్వారా ప్రయోజనం పొందడానికి థియేటర్ వారు షో టైమింగ్స్ను తప్పుగా పేర్కొన్నారు. ఇది అన్యాయం’’అంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. సమయాన్ని డబ్బుగా పరిగణిస్తామని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుకు జరిగిన నష్టాన్ని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ పూడ్చాలని పేర్కొంది. అనైతిక వ్యాపార చర్యలకు పాల్పడ్డందుకు, సమయాన్ని వృథా చేసినందుకు రూ.50 వేలు, మానసిక వేదనకు రూ.5 వేలు, ఫిర్యాదు, ఇతర ఉపశమనాలకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సంస్థలకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. బుక్మైషో కేవలం టికెట్ బుకింగ్ వేదిక కాబట్టి ఎలాంటి పరిహారమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రకటనల స్ట్రీమింగ్ సమయంపై నియంత్రణ లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. -
ట్విటర్-మస్క్ వార్: మనీ, టైం, ఎనర్జీ అన్నీ పాయే!
సాక్షి, ముంబై: అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ డీల్ వార్పై పారిశ్రామిక వేత్త ఆనంద్స్పం మహీంద్ర స్పందించారు. ట్విటర్ కొనుగోలు డీల్ నిలిచిపోవడంతో రెండు దిగ్గజాల మధ్య పోరు గ్లోబల్గా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మహీంద్రా గ్రూప్ బాస్ ఆనంద్ మహీంద్రా ట్విటర్లో స్పందించారు. ఎంత వేస్ట్ ఆఫ్ టైం మనీ, అండ్ మనీ అంటూ కామెంట్ చేశారు. అసాధారణమైన వార్తలకు, అనుసంధానానికి మూలం ట్విటర్. అలాంటి ముఖ్య సంస్థను ఒక పాక్షిక సామాజికసంస్థలా, లిస్టెడ్ కంపెనీలా, లాభాల కోసం.. ఏదైనాగానీ, ట్రస్టీల్లాగా బాధ్యతాయుతంగా ప్రవర్తించే డైరెక్టర్ల బోర్డుతో నిర్వహించుకోవచ్చుగా అంటూ ట్వీట్ చేశారు. What a waste of time, energy & money. Twitter is an indispensable source of news & connectedness. Can it be run like a quasi social enterprise—listed, for profit—but with a strong charter & managed by a board with directors who act responsibly like trustees? https://t.co/jXqyz9ABPu — anand mahindra (@anandmahindra) July 14, 2022 కాగా 44 బిలియన్ల డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తొలుత టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆ తరువాత ట్విటర్లో నకిలీ ఖాతాలపై సరియైన సమాచారం ఇవ్వడం లేదంటూ డీల్కు తాత్కాలిక బ్రేక్లేశారు. చివరికి ట్విటర్ వైఫల్యం కారణంగానే డీల్ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్ నిర్ణయంపై ట్విటర్ న్యాయపోరాటానికి దిగింది. డెలావేర్ కాంట్రాక్ట్ చట్టానికి లోబడి విలీనాన్ని పూర్తి చేయాలని మస్క్ను ఆదేశించాలని కోరుతూ ట్విటర్ డెలావేర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
కలెక్టర్ తీరుతో సమయం వృథా
ఆర్డీకి ఫిర్యాదుచేసిన మునిసిపల్ కమిషనర్లు మచిలీపట్నం : కలెక్టర్ బాబు.ఎ వ్యవహార తీరుతో తమ సమయం వృథా అవుతోందని మునిసిపల్ రీజినల్ డెరైక్టర్ వి.రాజేంద్రప్రసాద్కు జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు బుధవారం ఫిర్యాదు చేశారు. వారంలో మూడు రోజులు సమీక్షలతోనే సమయం గడుస్తోందని, ఫలితంగా పురపాలక సంఘాల్లో పాలన కుంటుపడి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తోందని వివరించారు. బందరు మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్లతో ఆర్డీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్లు మాట్లాడుతూ కలెక్టర్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సోమవారం ‘మీ కోసం’, వీడియో కాన్ఫరెన్స్, గురువారం ‘స్మార్ట్ వార్డు’, మరో రోజు విజయవాడలో కలెక్టర్ సమావేశం నిర్వహించే సమావేశాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పాల్గొనడం వల్ల తమ మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను, తాగునీటి పన్ను వసూలుపై దృష్టి సారించలేకపోతున్నామని వివరించారు. సాధారణ, అత్యవసర ఫైళ్లతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు పెట్టేందుకు సమయం చాలని పరిస్థితి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పురపాలకశాఖ పరంగా రాష్ట్రస్థాయి అధికారులు చెప్పే పనులను పక్కన పెట్టి కలెక్టర్ నిర్వహించే సమావేశాలకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తమకు పనులు ఉన్నాయని కలెక్టర్కు స్పష్టం చేయాలని ఆదేశించారు.