Wood sandalwood smuggler
-
చీకటి దందా..?
వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుంచి రాత్రిపూట కలప అక్రమంగా రవాణా అవుతోంది. కొంతమంది గుట్టలున్న గ్రామాల నుంచి విలువైన కలపను రాత్రిపూట సైకిళ్లపై అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా పలువురు కలప దొంగలు శుక్రవారం రాత్రి వేములవాడ మండలం వట్టెంల గ్రామస్తులకు పట్టుపడ్డారు. ఈ ఒక్క గ్రామమే కాదు.. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాత్రిపూట కలప దొంగలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందిస్తే.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఘాటుగా వినిపిస్తున్నాయి. వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలతో పాటు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుంచి రాత్రిపూట కలప అక్రమంగా రవాణా అవుతోంది. కొంతమంది గుట్టలున్న గ్రామాల నుంచి విలువైన కలపను రాత్రిపూట సైకిళ్లపై అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా పలువురు కలప దొంగలు శుక్రవారం రాత్రి వేములవాడ మండలం వట్టెంల గ్రామస్తులకు పట్టుపడ్డారు. ఈ ఒక్క గ్రామమే కాదు.. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాత్రిపూట కలప దొంగలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం అందిస్తే.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఘాటుగా వినిపిస్తున్నాయి. గుట్ట ప్రాంతాల నుంచి రవాణా... వేములవాడ మండలం నూకలమర్రి, ఫాజుల్నగర్లో ఫారెస్టు గుట్టలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి స్మగ్లర్లు అక్రమంగా చెట్లను నరికివేస్తూ.. కలపను రవాణా చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బొల్లం చెరువు నుంచి ఫాజుల్నగర్ బీట్ మీదుగా వట్టెంల చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు చందుర్తి, కోనరావుపేట, జోగాపూర్ ప్రాంతాల నుంచి కూడా పెద్దఎత్తున కలపను ప్రతిరోజు రాత్రిపూట కొంతమంది ద్విచక్రవాహనాలు, సైకిళ్లపై తరలిస్తున్నట్లు వట్టెంల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, నూకలమర్రి, ఫాజుల్నగర్ ప్రధాన కూడళ్ల వద్ద స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కార్పెంటర్లే సూత్రధారులా..? గుట్టల ప్రాంతం నుంచి విలువైన టేకుకలపను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలిసింది. టేకు కలపకు ధర ఎక్కువగా పలుకుతుండడంతో అక్రమంగా సంపాదించేందుకు ఈ దారి ఎంచుకున్నట్లు తెలిసింది. కలప దొంగలు టేకు చెట్లు ఉన్న గుట్టప్రాంతాలకు వెళ్లి చెట్లను నరికివేసి, అక్కడే దాచి ఉంచుతారు. సెలవు దినాలు, పండుగ రోజుల్లో ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై కట్టె మిషన్లకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ కలపను శుద్ధి చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం వట్టెంలలో సైకిళ్లపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు కలపను తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న కార్పెంటర్లు అక్కడి వెళ్లి కలప తరలిస్తున్న విషయం బయటకు రాకుండా ఉండాలని చెప్పినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్నాం... వేములవాడ మండలంలోని వట్టెంల గ్రామ శివారులో సైకిళ్లపై కలపను తరలిస్తుండగా గ్రామస్తులు బెదిరించడంతో స్మగ్లర్లు పారిపోయారు. సమాచారం రావడంతో శుక్రవారం ఉదయం వెళ్లి తొమ్మిది దుంగలను స్వాధీనం చేసుకున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుంచి ఈ కలపను తరలించినట్లుగా తెలిసింది. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – సౌమ్య, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, వేములవాడ. -
భారీగా కలప పట్టివేత
కోటపల్లి(సిర్పూర్): ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలాన్ని అనుకొని ఉన్న ప్రాణహిత నది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కలప తరలిస్తుండగా ఆదివారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 106 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు దుండగులు ప్రాణహిత నదిలో తెప్పలపై కలప తీసుకొస్తున్నారని అందిన సమాచారం మేరకు చెన్నూర్ ఎఫ్డీవో రాజారావు, ఎఫ్ఆర్వో రవి, సిబ్బంది ప్రాణహిత నది తీరం వెంట గస్తీ కాశారు. కోటపల్లి మండలంలోని పుల్లగామ ప్రాణహిత రేవు వద్ద రాత్రి సమయంలో తెప్పలుగా వస్తున్న కలపను గమనించిన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కలప స్మగ్లర్లు పరారు అయ్యారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రాణహిత నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పట్టుకున్న 106 టేకు దుంగలను తీసుకరావడం అధికారులకు తలనొప్పిగా మారింది. సిబ్బంది ప్రాణహిత సరిహద్దు తీరం వెంట ఉన్న అర్జునగుట్ట పుష్కరఘాట్ వద్దకు కలపను పడవలపై తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేర్చిన కలపను భీమారం రేంజ్కు తరలించారు. కలప విలువ సుమారు 2లక్షల వరకు ఉంటుందని ఆధికారులు తెలిపారు. దాడిలో ఫారెస్ట్ సెక్షన్ అధికారులు శ్రీనివాస్, రాములు, రాందాస్, బీట్ అధికారులు సంతోష్, కోటపల్లి, నీల్వాయి బేస్ క్యాంప్ సిబ్బంది, స్రైకింగ్ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. -
శేషాచలం అడవుల్లో తమిళ తంబీలు
సాక్షి, తిరుపతి: ఒకప్పుడు దట్టమైన సత్యమంగళం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్, అతని ముఠా రోజుల తరబడి అడవుల్లోనే తిష్టవేసి గంధపు చెక్కలు నరికి స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అదే సీన్ తిరుపతి శేషాచల అడవుల్లో తర చూ కనబడుతోంది. అటవీశాఖ, పోలీసులు, సంయుక్త టా స్క్ఫోర్స్ బృందాలు దాడులు చేస్తున్నా ఎర్రచందనం దొంగ లు అడవుల్లోకి యథేచ్ఛగా వెళున్నారు. రోజుల తరబడి అక్క డే ఉంటున్నారు. సరుకులు తీసుకెళ్లి అక్కడే వంట చేసుకుని తిని ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నారు. ఇటీవల అటవీ శాఖ, పోలీసులు నిర్వహించిన కూంబింగ్లో ఈ విషయాలు వెలుగు చూశాయి. సిబ్బంది కొరత కారణంగా అటవీ శాఖ అధికారులు వారిని ఏమీ చేయలేకపోతున్నారు. అటవీ శాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్లు, స్ట్రయికింగ్ ఫోర్స్లు దాడులకు వెళ్లినా ఆ సమాచారం ముందుగానే స్థానిక నెట్వర్కు ద్వారా స్మగ్లర్లకు తెలిసిపోతోంది. స్థానికుల సహకారంతో తమిళ కూలీలు, స్మగ్లర్ల క్యాంపులు కొనసాగుతూనే ఉన్నాయి. వీరప్పన్ను తలపిస్తున్న తమిళ తంబీలు శేషాచలం కొండల్లోని 2వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎ ర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లా, అర్బ న్ పోలీసు జిల్లాల పరిధిలో చామల, తిరుపతి, మామండూ రు ఫారెస్టు రేంజ్ల్లోనూ, రాజంపేట డివిజన్ శెట్టిపల్లె, బా లయపల్లె ప్రాంతాల్లోనూ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అం తర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం టన్ను రూ.20 లక్షల వరకు మొదటి గ్రేడ్ పలుకుతుండడంతో తమిళనాడు, కర్ణాటకకు చెందిన స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో రెచ్చిపోతున్నారు. పాపవినాశనం దాటి లోతైన లోయల్లోనూ, చామల రేంజ్లో తలకోన దాటి ఎత్తు అయిన కొండలపైన వారం, పది రోజులు ఉండే విధంగా వంట సరుకులు, బియ్యం, మంచినీళ్లు తీసుకుని వెళుతున్నారు. అక్కడే తిష్టవేసి రాత్రిపూట యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లు నేలకూల్చుతున్నారు. అక్కడి నుంచి కాలిదారిలో అటవీ సమీప గ్రామాలకు తెచ్చి లారీలు, వ్యాన్లలో లోడ్ చేసి తరలిస్తున్నారు. కూంబింగ్లతో వెలుగులోకి అటవీ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ వచ్చాక రెండున్నర నెలలుగా దట్టమైన అడవిలోకి డీఎఫ్వో శ్రీనివాసులు, టాస్క్ఫోర్స్ చీఫ్ ఉదయ్కుమార్ నేతృత్వంలో చామల, మామండూరు, తిరుపతి రేం జ్ల్లో ఎస్వీ నేషనల్ పార్కు పరిధిలో కూంబింగ్లు చేపట్టా రు. అదే సమయంలో పులిబోనుకు పైన ఉన్న అటవీ ప్రాం తంలో ఆర్ముడు రిజర్వు స్పెషల్ పోలీసు పార్టీ నిరంతరాయంగా కూంబింగ్ కొనసాగిస్తోంది. చామల రేంజ్లో కడప జిల్లా సరిహద్దులోని కొండ ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు తెస్తుండగా 30 మందిని టాస్క్ఫోర్స్ పట్టుకుంది. రెండు రోజుల క్రితం మామండూరు నుంచి లోపల దట్టమైన అటవీ ప్రాంతంలో కలివిలేటి కోన వద్ద మరో 30 మంది ఎర్రచందనం నరుకుతూ కనిపించినా ఏడుగురిని మాత్రమే అటవీ శాఖ అధికారులు పట్టుకోగలిగారు. 23 మంది తప్పించుకున్నారు. సరైన వ్యూహంతో వెళ్లకపోవడం కారణంగానే విఫలమవుతున్నారన్న ఆరోపణలున్నాయి.