Yadadri Brahmotsava
-
మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ విమానగోపుర మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఈనెల 19 నుంచి 23 వరకు జరిగే మహాక్రతువుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండురోజుల్లో ఆలయ విమాన గోపుర స్వర్ణతాపడం పనులు పూర్తికానున్నాయి. 108 మంది రుత్విక్కులతో పూజలు నిర్వహిస్తారు. దేశంలోని పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెస్తున్నారు. ఇందుకోసం కొండపైన హోమగుండాలు కూడా సిద్ధమవుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణకు ఈనెల 23న జరిగే మహా కుంభాభిషేకం జరుగుతుంది. ఉదయం 11.34 గంటలకు నిర్ణయించిన ముహూర్తంలో ఈకార్యక్రమం జరుగుతుంది. పీఠాధిపతి వానమామలై రామానుజ జియర్స్వామి పర్యవేక్షణలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. కొండపైన ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. 19 నుంచి 22 వరకు 108 మంది రుత్విక్కులతో సుదర్శన హోమం, నారసింహ హోమం నిర్వహిస్తారు. రామాయణ, భారత, భాగవత కథలను పారాయణం చేస్తారు.ప్రత్యేక వసతులు, ఏర్పాట్లు... మహాకుంభ సంప్రోక్షణకు దేశం నలుమూలల నుంచి లక్షకు పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేసి ఇందుకోసం ప్రత్యేక వసతులు, ఏర్పాటు చేస్తున్నారు. 23న సుమారు లక్షమంది భక్తులకు పులిహోర ప్రసాదం ఉచితంగా అందించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మహాకుంభ సంప్రోక్షణతోపాటు మార్చి1 నుంచిప్రారంభమయ్యే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార కార్యకమంలో భాగంగా దేవస్థానం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, భువనగిరి, శంషాబాద్, మహరాష్ట్రలోని షోలాపూర్లో స్వాగత తోరణాలు ఏర్పాటు ఏర్పాటు చేస్తోంది. శ్రీస్వామివారి విమాన గోపురం బంగారు తాపడం పనులకు దేవస్థానం 68కిలోల బంగారం వాడుతుంది. ç50.5 ఫీట్ల పంచతల రాజగోపురానికి చుట్టుమొత్తం10,759 చదరపు అడుగల మేర స్వర్ణతాపడం పనులు చేపట్టారు. దేవాలయం పునర్నిర్మాణంప్రారంభించినపుడే విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ముందుగా11వేల కిలోల రాగితో రేకులను తయారు చేశారు. ఒక చదరపు అడుగు రేకుకు 6 గ్రాముల బంగారం ఖర్చు చేస్తున్నారు. ఐదు యజ్ఞకుండాలు: కొండపైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదు హోమ కుండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దకుండానికి అనుబంధంగా మరో నాలుగు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ, శ్రీ లక్ష్మి హవన హోమాలు చేస్తారు. చివరి రోజైన ఈనెల 23న విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం, మూలమూర్తి హవనం చేస్తారు. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి విమాన గోపురానికిప్రాణం ΄ోస్తారు. ఇందులో 108 మంది పారాయణదార్లు పాల్గొంటారు. వివి«ద్ర పాంతాలనుంచి రుత్వికులు వస్తారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.మహాకుంభాభిషేక, సంప్రోక్షణ వివరాలు19వ తేదీ బుధవారం: ఉదయం గం. 7.45కు భగవద్ అనుజ్ఞ స్వస్తి వాచన, శ్రీ విశ్వక్సేనారాధాన, పుణ్యాఃవాచన, రక్షాబంధన, బుత్విగ్వరణం, మృత్సంగ్రహణ, పర్యగ్నీకరణ, తిరువీధి సేవ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధనతో ఆరంభం అవుతాయి. సాయంత్రం 6:00 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు వారణానువాక హోమం, జలాధివాసం, నిత్యపూర్ణాహుతి, నివేదన, తీర్ధప్రసాద గోష్ఠి, తిరువీధి సేవ, ఆలయంలోకి వేంచేపు జరుగుతాయి. గురు, శుక్ర వారాలలో వివిధ కార్యక్రమాల అనంతరం 22 వ తేదీ శనివారం తిరువీధిసేవ,చతుస్థానార్చన, విమాన అధిష్టాన పరివార విశేష హోమం, ఏకాశీతి కలశ స్నపనం, మూల మంత్రమూర్తి మంత్ర హావనం, నిత్యపూర్ణాహుతి నివేదన, నీరాజన మంత్ర పుష్పం, శాత్తుమరై, సాయంత్రం 6:00 గంటలకు నిత్య పూర్ణాహుతి నివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి తిరువీధి సేవ ఆలయంలోకి వేంచేపుతో ముగుస్తాయి. ఈనెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయాగం జరిపి దివ్యవిమాన గోపురాన్ని శ్రీ స్వామివారికి అంకితం చేస్తారు. 23వ తేది ఉదయం 11.54 గంటలకు స్వర్ణవిమానగోపురానికి కుంభాభిషేకం చేస్తారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యవిమానం బంగారు తాపడంలో 40 రకాల విగ్రహాలు బంగారు పూతతో చెక్కారు. విమాన గోపురంపై బంగారు రేకులపై పంచనారసింహ క్షేత్రంలో స్వామివారి వివిధ రూపాలను చెక్కారు. శ్రీవిష్ణుమూర్తి దశావతారాలు, నర్సింహస్వామి వారి వివిధ రూపాలను వివిధ ఎత్తులతో చెక్కారు. అలాగే స్వామివారి గరుడ విగ్రహాలు నాలుగు, సింహాలు 8 ఇలా మొత్తం స్వర్ణతాపడంపై ΄÷ందుపరిచారు. కాగా దేశంలోనే అతి పెద్ద స్వర్ణ విమాన గోపురంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారి విమానగోపురంతోపాటు ఆలయంపై ఉన్న 39 కలశాలకు కూడా బంగారు తాపడం చేశారు. ఈ సందర్భంగా రోజూ 2000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు.ఏర్పాట్లు పూర్తిశ్రీ లక్ష్మి నర్సింహస్వామి దేవాలయం విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనులు పూర్తి అయ్యాయి. దేవస్థానం పీఠాధిపతి పర్యవేక్షణలో మహాకుంభాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 108 మంది రుత్విక్కులు ప్రత్యేక పూజలు చేస్తారు. హోమగుండాలు ఏర్పాటు చేశాం. రామాయణ, మహాభారత, భాగవత ప్రబంధాల ప్రవచనాలు పారాయణ చేస్తారు. భక్తుల వసతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – ఏ. భాస్కర్రావు,దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి, యాదగిరిగుట్ట– యంబ నర్సింహులు,సాక్షి ప్రతినిధి, యాదాద్రి. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
సాక్షి, యాదాద్రి: వచ్చే ఏడాది మార్చిలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించింది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో దేశ విదేశాలతో పాటు స్థానిక భక్తులను మమేకం చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు తలమానికంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్వస్తివచనంతో ప్రారంభం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్సోత్సవాలు మార్చి 1న స్వస్తి వచనంతో ప్రారంభమై.. డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా సాహితీ, సాంస్కృతిక, ధార్మిక సభా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 7న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9న దివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపు ఉత్సవం, 11న శతఘటాభిõÙకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. గ్రామోత్సవం పేరుతో రథోత్సవం యాదగిరిగుట్ట, పరిసర ప్రాంత భక్తుల కోసం గ్రామోత్సవం పేరుతో కొండ కింద ప్రత్యేక రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన జరిగే రథోత్సవం అనంతరం కొండ కింద భక్తుల కోసం ప్రత్యేక రథోత్సవం నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను అలరించేలా సాంస్కృతిక, సాహితీ, సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో దేవస్థానం ఈవో ఎ.భాస్కర్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు మహాసహస్ర అవధాని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచనాలు వినిపించనున్నారు. మార్చి 6న సంగీత దర్శకుడు మాధవపెద్డి సురేశ్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించే ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్తో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అంజన్న చరిత్ర గాయని, కరీంనగర్కు చెందిన తేలు విజయతో ఒకరోజు, లిటిల్ మ్యూజీషియన్ నిర్వాహకుడు రామాచారితో ప్రత్యేక విభావరి కార్యక్రమాలు ఉంటాయి. వేగంగా స్వర్ణ కవచం పనులు ఆలయ విమాన గోపురం స్వర్ణకవచం పనులు వేగం పుంజుకున్నాయి. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో దేవస్థానం ఉంది. ఈ మేరకు 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం వద్ద ఉన్న బంగారం, వెండితో స్వర్ణతాపడం పనులు కొనసాగుతున్నాయి. 10,500 చదరపు అడుగుల మేరకు చేయాల్సిన స్వర్ణ తాపడం పనులు సగం వరకు పూర్తి కావొచ్చాయి.కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలుకనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా లబ్ధప్రతిష్టులైన కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అలంకారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే గరికపాటి, మాధవపెద్ది సురేశ్ తదితర ప్రముఖుల సహాయాన్ని తీసుకున్నాం. మరికొందరు ప్రముఖులతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. – ఎ.భాస్కర్రావు, ఈవో యాదగిరిగుట్ట దేవస్థానం -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
వైభవంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
-
వచ్చే నెలలో యాదాద్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి బ్రహ్మోత్సవాలు మార్చి 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. యాదాద్రి అభివృద్ధి పనులను బ్రహ్మోత్సవాల తర్వాత ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనులపై ఆలయాభివృద్ధి బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్శర్మ గురువారం సచివాలయంలో చర్చించారు. ఆలయ అభివృద్ధితో పాటు అథారిటీ పరిధిలోకి వచ్చే పట్టణాభివృద్ధి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. హైదరాబాద్- వరంగల్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికే 80 శాతం వరకు పూర్తయిందని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పారు. దానికి అనుసంధానంగా ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లను రెండు వరుసలుగా అభివృద్ధి చేయాలని సీఎస్ ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. అందుకు ఎక్కువ భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత భూమి అవసరమవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆ మేరకు భూసేకరణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూల్చివేతలు, కొత్త పనులు నిర్వహించడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటుందనే చర్చ జరిగింది. అందుకే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 23 నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొమ్మిది నెలల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలంటూ సీఎస్ అన్ని శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏడాదిన్నర వ్యవధిలో పట్టణాభివృద్ధి పనులను సైతం పూర్తి చేయాలని ఆదేశించారు.