Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Govt Neglected People in Ration distribution1
ఆగిన రేషన్ బండి.. నడిరోడ్డుపైకి బతుకు బండి

ప్రాణం తీసిన రేషన్‌రేషన్‌ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ మొదలైన తొలిరోజే గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక అనంతపురంలో ఆదివారం లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ప్రాణాలు విడిచింది. కొద్ది రోజులు మాత్రమే బియ్యం ఇస్తారనే ఆందోళనతో ఉదయమే దుకాణం వద్దకు చేరుకున్న బాధితురాలు ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలింది. సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు కక్షపూరిత విధానాలు, అనాలోచిత∙నిర్ణ­యాలు లక్షలాది మంది పేదలను మళ్లీ రోడ్డుకీ­డ్చాయి! ప్రజలను తీవ్ర ఇక్క­ట్లకు గురి చేస్తూ తీసుకున్న రేషన్‌ వాహనాల రద్దు నిర్ణ­యం సర్కారు అమానవీయ చర్యలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలు­స్తోంది. గత ప్రభుత్వంలో పేదలు ఇంటివద్దే ఆత్మగౌరవంతో అందుకున్న రేషన్‌ సరుకులను డీలర్ల చేతికి అప్పగించి పంపిణీ వ్యవస్థను చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తంగా మార్చేసింది. పుట్టెడు తిండి గింజల కోసం రోజంతా రోడ్లపై నిరీక్షించాల్సిన దుస్థితి కల్పించింది. తమ నోటికాడ ముద్దను లాక్కోవడం మతిలేని నిర్ణయమని బియ్యం కార్డుదారులు మండిప­డుతున్నారు. తిరోగమన విధానాలతో కూటమి సర్కారు అమా­నుషంగా వ్యవహరిస్తోందని ఆక్రోశిస్తున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు అందిస్తూ పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను నీరుగార్చి చంద్రబాబు సర్కారు తమను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చమటలు కక్కుతూ గంటల తరబడి క్యూలలో నిలబడ్డ రేషన్‌ కార్డుదారులు..! ఎండకు సొమ్మసిల్లి కుప్పకూలుతున్న వృద్ధులు..! చిన్న పిల్లలను ఎత్తుకుని వచ్చి రేషన్‌ దుకాణాల ఎదుట బారులు తీరుతున్న మహిళలు..! కిలోమీటర్ల తరబడి రేషన్‌ సరుకులను మోసుకుంటూ గూడేలకు వెళుతున్న గిరిజనులు..! నెత్తిపై బియ్యం మూటలతో వృద్ధుల అవస్థలు...! పనులు మా­ను­కుని వచ్చినా సర్వర్లు పనిచే­యక, సరుకుల అందక ఉసూరు­మంటూ వెనుతిరుగు­తున్న లబ్ధిదా­రులు..! మొదటి రోజే మూతపడ్డ రేషన్‌ షాపులు..! నానా తిప్పలు పడి దుకాణాల వద్దకు చేరుకున్న వారితో వేలి ముద్ర వేయించుకుని ఇచ్చినంత డబ్బు తీసుకుని వెళ్లిపో­వాలని గదమా­యిస్తున్న డీలర్లు..! ఇదీ తొలిరోజు ఆదివారం రాష్ట్ర­వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల వద్ద కనిపించిన దుస్థితి! తూకం యంత్రాలతో పనిలేదు. విజయనగరం జిల్లా రామభద్రపురంలో రేషన్‌ కోసం మండుటెండలో క్యూ కట్టిన వృద్ధులు ఈ–పోస్‌ మిషన్ల అను­సంధానం అసలే లేదు. ఏ రేషన్‌ షాపును పరిశీలించినా ఇదే దందా కనిపించింది. గత ఐదేళ్లూ పారదర్శకంగా ఇంటివద్దే అందిన సరుకుల పంపిణీని కూటమి సర్కారు రేషన్‌ మాఫియా చేతుల్లో పెట్టేసింది. రాజకీయ కక్షతో పేదల పొట్టగొట్టి నడిరోడ్డుకీడ్చేసింది. ఇంటివద్దే కచ్చితమైన తూకంతో రేషన్‌ సరుకులను అందిస్తూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌ డెలివరీ వాహనాల వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తే.. దీన్ని కాదని పచ్చ నేతల జేబులు నింపేందుకు మళ్లీ రేషన్‌ షాపుల ద్వారా సరఫరాను తెరపైకి తెచ్చింది. ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థ తిరోగమనంలోకి జారి­పోయింది. తొలిరోజే కూటమి సర్కారు అసమర్థత, దోపిడీ విధానం బహిర్గతమయ్యాయి. పేదలకు బియ్యం అందించటానికి బదులు ‘డీబీటీ ’(డీలర్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్ని అమలు చేస్తూ ప్రజాధనాన్ని కాజేసే పనిలో నిమగ్నమైనట్లు స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరులో బియ్యం బస్తాలు మోసుకుని వెళ్తున్న మహిళలు పొద్దున్నే పడిగాపులు..రేషన్‌ బియ్యం కోసం లబ్ధిదారులు ఉదయాన్నే దుకాణాల వద్ద క్యూ కట్టడంతో పలుచోట్ల కిక్కిరిసిపోయాయి. ఎండలో రోడ్లపై, అరుగులపై గంటల కొద్దీ నిలబడి బియ్యం కోసం అగచాట్లు పడ్డారు. ఇరుకు గదుల్లోని రేషన్‌ దుకాణాల వద్ద చమటలు కక్కుతూ నిరీక్షించారు. బియ్యం మూటలను నెత్తిపై మోసుకుంటూ వృద్ధులు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం తిరిగి పనులకు వెళ్లాల్సి ఉన్నందున కార్మికులు భారీగా రేషన్‌ షాపుల దగ్గరకు చేరుకున్నారు. వయసు మళ్లిన వారు బియ్యాన్ని మోసుకెళ్లే శక్తి లేక, సాయం అందించే వారు కానరాక డీలర్‌ ఇచ్చినంత తీసుకుని ఉసూరుమంటూ వెనుదిరిగారు.తూకానికి తూట్లు..కేంద్ర ప్రభుత్వం కార్డుదారుల్లో ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కచ్చితత్వంతో కూడిన తూకం, నాణ్యమైన సరఫరా విధానం కోసం తూకం యంత్రాలు, ఈ–పోస్‌ మిషన్లను అనుసంధానం చేసి పంపిణీ చేపట్టాలని సూచించింది. గత ప్రభుత్వంలో ఎండీయూల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ సమయంలో ఇదే విధానాన్ని పాటిస్తూ కచ్చితమైన తూకంతో బియ్యాన్ని అందించారు. ఈ–పోస్‌ మిషన్‌లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయగానే పంపిణీ చేయాల్సిన బియ్యం పరిమాణం కనిపించేది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం వెంకటాపురం గ్రామంలో రేషన్‌ షాపు వద్ద గంటల తరబడి లబ్ధిదారుల నిరీక్షణ తూకం మిషన్‌లో సరైన పరిమాణంలో బియ్యాన్ని తూచినప్పుడే ఈ–పోస్‌ మిషన్‌ నుంచి బిల్లు జారీ అయ్యేది. తూకం మిషన్‌పై తక్కువ/ఎక్కువ పరిమాణం వేస్తే ట్రాన్సాక్షన్‌ నిలిచిపోయేలా చర్యలు తీసుకున్నారు. రేషన్‌ వాహనాల ద్వారా ఇంత పారదర్శకంగా జరిగిన సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన తొలిరోజే తూకం యంత్రాలతో పని లేకుండా మాన్యు­వల్‌గా ఈ–పోస్‌ మిషన్లలో పరిమా­ణాన్ని నమోదు చేయడం ద్వారా అక్రమాలకు పచ్చజెండా ఊపింది. డీలర్‌ ఇచ్చిన బియ్యాన్ని లబ్ధిదా­రులు నోరెత్తకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది.పది రోజుల్లో ఫినిష్‌..!కూటమి ప్రభుత్వ కక్షపూరిత విధానాలు ప్రజలకు శాపాలుగా మారాయి. రేషన్‌ కోసం రోడ్లపైకి రావడం పెద్ద ప్రహసనం కాగా, అది కూడా కొద్ది గంటలకే పరిమితం చేశారు. ప్రతి నెలా 10వ తేదీలోపు వస్తేనే బియ్యం దక్కే పరిస్థితి నెలకొంది. నిల్వలు అయిపోతే ఇక ఆ నెల ఖాళీ సంచితో వెనుదిరగాల్సిందే. ఇవన్నీ తొలిరోజు రేషన్‌ షాపులకు వెళ్లిన లబ్ధిదారులకు డీలర్లు చెప్పిన మాటలే! అంటే ప్రభుత్వం ఆయా డీలర్ల పరిధిలోని కార్డులకు తగినంత నిల్వలు సరఫరా చేయదా? లేదంటే ఐదు రోజుల ముందుగానే పంపిణీని ముగించి గుట్టు చప్పుడు కాకుండా బియ్యాన్ని తరలించుకునే ఎత్తుగడ వేస్తున్నారా?.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ హయాంలో అనుభవాలను పరిశీలిస్తే వీటికి బలం చేకూరుతోంది. 2019కి ముందు రేషన్‌ షాపుల్లో 10వ తేదీకే బియ్యం పంపిణీ ముగిసేది. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా ఆలకించే నాథుడు ఉండేవారు కాదు. ఇప్పుడు మళ్లీ అలాంటి అరాచక పరిస్థితి పునరావృతమవుతోంది.‘‘శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండల పరిధిలోని ఓ రేషన్‌ దుకాణంలో లబ్ధిదారులను వరుసగా కూర్చోబెట్టి వేలిముద్రలు తీసుకుని బియ్యానికి బదులు నగదు ఇచ్చి పంపించేశారు. వీరిలో అధిక శాతం వృద్ధులే. మరికొందరు మోసుకెళ్లే ఓపిక లేక డీలర్‌ దగ్గరే వదిలేసి ఇచ్చినంత తీసుకుని ఇంటి ముఖం పట్టారు’’ బడుగు, బలహీన వర్గాల ఉపాధికి గండి..కూటమి సర్కారు వివక్షతో రేషన్‌ వాహనాలను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాల జీవనోపాధిని దెబ్బ తీసింది. 9,260 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు ప్రభుత్వ సేవల్లో భాగస్వామ్యం కల్పిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వారిని సొంతూరిలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా తోడ్పాటు అందించింది. వీటిపై ఆధారపడి మరో 10 వేల మంది వరకు హెల్పర్లు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నఫళంగా రేషన్‌ వాహనాలను రద్దు చేసి వారి జీవనోపాధికి గండి కొట్టింది.రేషన్‌ క్యూలో వృద్ధురాలి మృతి‘అనంత’లో విషాదం..అనంతపురం: ఇంటికే రేషన్‌ రద్దు నిర్ణయం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది! అనంతపురంలో రేషన్‌ దుకాణం వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడటంతో నీరసించిపోయిన మందల లక్ష్మీదేవి (70) అనే వృద్ధురాలు కుప్పకూలి చనిపోయింది. ఆదివారం అనంతపురం హెచ్చెల్సీ కాలువ సమీపంలోని నిర్మలానంద నగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. లక్ష్మీదేవి రేషన్‌ బియ్యం కోసం ఉదయం ఎనిమిది గంటలకు రేషన్‌ షాపు వద్దకు చేరుకుంది. కుమార్తె ఈశ్వరమ్మతో కలసి క్యూలైన్‌లో నిల్చుంది. ఎనిమిది గంటలకు ఇవ్వాల్సిన రేషన్‌ పంపిణీ ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో క్యూలో ఉన్న లక్ష్మీదేవి నీరసించి ఉదయం 9:45 గంటలకు కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో పరీక్షించి చూడగా చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఇద్దరు కుమారులు గతంలో కాలువలో పడి చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటోంది. రెండు రోజులు మాత్రమే రేషన్‌ ఇస్తారనే ఆందోళనతో క్యూలో నిలబడ్డారని, మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటలకొద్దీ నిలబడటంతో కుప్పకూలి చనిపోయారని స్థానికులు తెలిపారు.జగన్‌ హయాంలో నిశ్చింతగా..2014-19 మధ్య టీడీపీ హయాంలో పేదలకు ఇచ్చే బియ్యం తినడానికి ఏమాత్రం పనికొచ్చేవి కాదు. పురుగులు పట్టి, ముక్కిపోయి, రంగు మారి, చెత్త, రాళ్లతో అధ్వాన్నంగా ఉన్న బియ్యాన్ని పేదలు వండుకోలేక, బయట మార్కెట్‌లో కొనలేక నరకం అనుభవించారు. ఈ దుస్థితిని తప్పిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని ప్రవేశపెట్టింది. అది కూడా రేషన్‌ వాహనాల్లో ఇంటి వద్దకే చేరవేయడంతో పేదల కష్టాలు తీరిపోయి నిశ్చింతగా వండుకున్నారు. ఫలితంగా 90 శాతానికిపైగా పంపిణీ పెరిగింది. ఇలా కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.41 చొప్పున వెచ్చించింది. అలాంటిది ఇప్పుడు డీలర్లు రూ.10 లబ్ధిదారుల చేతుల్లో పెడుతూ అక్రమ దందాకు పాల్పడుతున్నా కూటమి సర్కారు కళ్లు మూసుకుని కూర్చుంది.

Man Throws Fire Bomb Shouts Free Palestine in US2
అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్‌’.. బాంబు దాడి కలకలం

వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో(Colorado)లో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్‌లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.ఎప్‌బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్‌’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్‌బీఐ గుర్తించింది.ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్(Israel) మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు. 🚨Disturbing scenes of panic and chaos! Stay away & Safe.⚠️Developing: Police are asking the public to avoid Pearl and 13th in Boulder after a reported attack as it's show here! pic.twitter.com/8ZBYzYKdgZ— Mohanad Shaabani (@MohanadShaabani) June 1, 2025బౌల్డర్‌లో జరిగిన ఘటనను చూసిన కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల బ్రూక్ కాఫ్‌మన్ మాట్లాడుతూ, దాడి జరిగిన సమయంలో నలుగురు మహిళలు కాలిన గాయాలతో బాధపడుతుండటాన్ని చూశానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రాంగణంలో చొక్కా లేకుండా నిలుచుని, ఏదో ద్రవం ఉన్న గాజు సీసాలను పట్టుకుని అరిచాడని ఆమె వివరించారు. కాగా ప్రముఖ యూదు డెమొక్రాట్, సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: బీహార్‌ ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ పోటీ

 Hardik Pandya says I take the blame after Mumbai Indians crash out of IPL 20253
అతడొక అత్యుద్భుతం.. మేము అనుకున్న‌ది జ‌ర‌గలేదు: హార్దిక్‌

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ పోరాటం ముగిసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో 5 వికెట్ల తేడాతో ఓట‌మిపాలైన ముంబై ఇండియ‌న్స్‌.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం ప‌ట్టింది. తొలుత బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన ముంబై, బౌలింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఆఖ‌రికి ఆ జ‌ట్టు ప్ర‌ధాన బౌల‌ర్ బుమ్రా సైతం తేలిపోయాడు. 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవ‌ర్ల‌లో చేధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయ్య‌ర్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో 87 ప‌రుగులు చేసి త‌న జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చాడు. అత‌డితో పాటు జోష్ ఇంగ్లిష్‌(38), వ‌ధేరా(48) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వినీ కుమార్ రెండు, బౌల్ట్‌, హార్దిక్ పాండ్యా త‌లా వికెట్ సాధించారు. బుమ్రా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో వికెట్ ఏమీ తీయ‌కుండా ఏకంగా 40 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్‌లో రాణించినా, బౌలింగ్‌లో విఫ‌ల‌మ‌య్యామ‌ని హార్దిక్ అన్నాడు."శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అత‌డు ఆడిన షాట్లు అత్యద్భుతం. అయ్య‌ర్‌తో పాటు మిగిలిన బ్యాట‌ర్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ త‌ర్వాత ఈ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవ‌చ్చు అని భావించామ‌. కానీ ఇటువంటి కీల‌క మ్యాచ్‌ల‌లో బౌలింగ్ యూనిట్ కూడా సమిష్టిగా రాణించ‌డం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మా బౌల‌ర్లు త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేక‌పోయారు. పంజాబ్ బ్యాట‌ర్లు చాలా ప్ర‌శాంతంగా కన్పించారు. వారు త‌మ అద్బుత బ్యాటింగ్‌తో మ‌మ్మ‌ల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌కు సెకెండ్ ఇన్నింగ్స్‌కు పిచ్‌లో పెద్ద‌గా మార్పులేదు. కొంచెం మంచు ప్ర‌భావం ఉన్న‌ప్ప‌ట‌కి దానిని మా ఓట‌మికి సాకుగా చెప్పాల‌నుకోవ‌డం లేదు. కెప్టెన్‌గా నేను కూడా అంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాను.సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్‌ను ఉపయోగించడం వంటివి చేసుంటే ఫలితం భిన్నంగా ఉండేది. బుమ్రాను స‌రైన స‌మ‌యంలో బౌలింగ్ చేయించాని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 17వ ఓవర్ వేయించి ఉంటే మరి తొందరయ్యేది.ఆ స‌మ‌యంలో 4 ఓవ‌ర్ల‌లో పంజాబ్ విజ‌యానికి 41 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో బుమ్రాతో ఓవ‌ర్ వేయించాల‌ని మేము ప్లాన్ చేశాము. 18 బంతులు మిగిలిఉన్నప్ప‌టికి బుమ్రా త‌న అనుభ‌వంతో ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు అని భావించాము. కానీ దురదృష్టవశాత్తు మేము అనుకున్న‌ది ఈ రోజు జ‌ర‌గ‌లేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో పాండ్యా పేర్కొన్నాడు. ఇక మంగ‌ళ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Delhi Dust Storm Forces Indigo Pilot to Abort Landing4
దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు

న్యూఢిల్లీ: గాలిలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. విపరీతమైన దుమ్ము తుఫాను(Dust storm) కారణంగా రాయ్‌పూర్ - ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం మెరుగుపడే వరకు ఇండిగో విమానం 6ఈ 6313 కొంతసేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ​​ప్రయాణికుడు వీడియోలో రికార్డు చేశారు.ఆదివారం సాయంత్రం ఢిల్లీలో నెలకొన్న తీవ్రమైన దుమ్ము తుఫాను కారణంగా రాయ్‌పూర్-ఢిల్లీ ఇండిగో విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయవలసి వచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)లో చోటు చేసుకున్న ఈదురుగాలులు, దుమ్ము తుఫాను మధ్య పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేసి పరిస్థితులు మెరుగుపడే వరకు గాలిలో విమానాన్ని వృత్తాకారంలో తప్పుతూ వచ్చారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం గాలిలో చక్కర్లు కొడుతున్నప్పుడు చుట్టూ అల్లకల్లోలంగా ఉన్న దృశ్యం వీడియోలో కనిపించింది. #WATCH | An IndiGo flight number 6E 6313 from Raipur to Delhi experienced turbulence due to a duststorm, prompting the pilot to climb up again when the aircraft was about to touch down at Delhi airport. The aircraft landed safely at Delhi airport after making many circuits in the… pic.twitter.com/TtDUwIH79b— ANI (@ANI) June 1, 2025ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ల్యాండ్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. పైలట్ తెలిపిన వివరాల ప్రకారం ఆ సమయంలో గాలి వేగం గంటకు 80 కి.మీ మేరకు ఉంది. కాగా(సోమవారం)తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా బలమైన గాలులు వీచాయి. కాగా మే చివరి మూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇది కూడా చదవండి: అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్‌’.. బాంబు దాడి కలకలం

Shehbaz Sharif Says Pakistan Now In Begging Stage5
అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్‌: పాక్‌ ప్రధాని ఆవేదన

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ దేశ నోట ఆర్థిక దుస్థితికి అద్దం పట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిత్యం చిప్ప పట్టుకుని దేహీ అంటూ అర్థించడాన్ని మిత్రదేశాలు కూడా హర్షించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తమ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆదివారం క్వెట్టాలో ఆయన సైనికాధికారులను ఉద్దేశించి పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా షెహబాజ్‌ షరీఫ్‌.. ‘చైనా, సౌదీ అరేబియా, తుర్కియే వంటివి పాక్‌కు విశ్వసనీయమైన మిత్రులు. కానీ చీటికీమాటికీ అప్పులివ్వాలని కోరుతుంటే అవి కూడా చిరాకు పడుతున్నాయి. విద్యా, వర్తకం, ఆరోగ్యం, పరిశోధనల వంటి రంగాల్లో మనం కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాయి. ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌తోపాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 🚨Utterly Humilating!!Pakistan PM Shehbaz Sharif's another SHOCKING admission after admitting BrahMos strikes:“Even trusted allies like China, Saudi Arabia, Turkey, Qatar & UAE don’t want Pakistan constantly begging with a bowl in hand.” pic.twitter.com/pyrYwRXhmD— Megh Updates 🚨™ (@MeghUpdates) May 31, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాయం కోసం ప్రపంచదేశాలను అభ్యర్థిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బిలియన్‌ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం అనేక షరతులను విధించిన ఐఎంఎఫ్‌.. భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్‌కే ఎక్కువ సమస్యలు వస్తాయని, దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని చురకలు అంటించింది. ఈ క్రమంలో కొన్ని షరతులను సైతం విధించింది.

Canada Man Gives Girlfriend To 30 Crore Lottery Runs Away6
లవర్‌ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్‌

మాంట్రియల్‌: మాజీ ప్రియుడికి వచ్చిన రూ.30 కోట్ల లాటరీ సొమ్ము తీసుకోని ఓ యువతి తన కొత్త ప్రియుడితో పారిపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమన్న ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు కోర్టుకెక్కాడు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే.. విన్నీపెగ్‌ పట్టణానికి చెందిన లారెన్స్‌ క్యాంప్‌బెల్, క్రిస్టల్‌ యాన్‌ మెక్‌కే ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరపాటు కలిసి ఓ హోటల్‌ గదిలో జీవించారు. క్యాంప్‌బెల్‌ 2024లో ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు. ఆ టికెట్‌కు ఇటీవలే జాక్‌పాట్‌ తగిలింది. క్యాంప్‌బెల్‌ 5 మిలియన్‌ డాలర్ల (రూ.30 కోట్లు) సొమ్ము గెలుచుకున్నాడు. కానీ, ఈ డబ్బు తీసుకోవాలంటే అతడి వద్ద సరైన గుర్తింపు కార్డు లేదు. బ్యాంకు ఖాతా కూడా లేదు. వెస్ట్రన్‌ కెనడా లాటరీ కార్పొరేషన్‌ నుంచి లాటరీ సొమ్ము తీసుకోవడానికి తన ప్రియురాలి సాయం కోరాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు.ఈ క్రమంలో ఆమె తన ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడంతో ఎట్టకేలకు లాటరీ సొమ్ము ఆ ఖాతాలోకి చేరింది. ఆ సయయంలో లారెన్స్‌ క్యాంప్‌బెల్, క్రిస్టల్‌ యాన్‌ మెక్‌కే నమూనా చెక్కును చేతపట్టుకొని ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇది తనకు క్యాంప్‌బెల్‌ ఇస్తున్న పుట్టినరోజు కానుక అంటూ ఆమె మురిసిపోయింది. నిజానికి ఆ యువతి అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. పాత ప్రియుడికి చెందిన రూ.30 కోట్లలో అతడికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొత్త ప్రియుడితో పరారయ్యింది. అతడితో సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్‌లో కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టగలిగాడు. మరో వ్యక్తితో పడకపై ఆమెను చూశాడు. తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన క్యాంప్‌బెల్‌ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు.

Covid cases are increasing day by day in the state7
కరోనా తీవ్రం.. సర్కారు చోద్యం

సాక్షి, అమరావతి : కోవిడ్‌ మహమ్మారి రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంతో పాటు, రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ కోవిడ్‌ డ్యాష్‌ బోర్డు ప్రకారం గతనెల 26న రాష్ట్రంలో కేవలం నాలుగు యాక్టివ్‌ కేసులు ఉండేవి. కానీ, ఇప్పుడు విశాఖపట్నం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఆదివారం నాటికి ఆ సంఖ్య 23కు చేరింది. తాజా గణాంకాల ప్రకారం.. పాజిటివ్‌ కేసుల్లో ఏపీ దేశంలో 12వ స్థానంలో ఉంది. అయితే, రాష్ట్రంలోనూ వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటోంది. పైగా.. నివారణ చర్యలను పూర్తిగా గాలికొదిలేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌ మరణాలూ నమోదవుతున్నా సర్కారులో ఎక్కడా చలనంలేదు. రాష్ట్రంలోనూ కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, ఇతర హైరిస్క్‌ వర్గాలపై వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నా బాబు సర్కారు ఏమీ పట్టనట్లు ఉంటోంది. వైరస్‌ను నిర్ధారించే ఆర్టిపీసీఆర్‌ కిట్లూ ఎక్కడా అందుబాటులో లేవు. ర్యాపిడ్‌ టెస్టులకు దిక్కులేదు.. ప్రాథమిక దశలోనే వైరస్‌ నిర్ధారణ అన్నది అత్యంత కీలకమైంది. ఇందులో భాగంగా.. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల స్థాయిలోనే వైరస్‌ లక్షణాలున్న హైరిస్క్‌ వర్గాల వారికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ఇవి నిర్వహించడంలేదు. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే విజయవాడలో దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలున్న హైరిస్క్‌ వ్యక్తులు యూపీహెచ్‌సీలను సంప్రదిస్తునా. ఒక్కరికి కూడా కోవిడ్‌ పరీక్షలు చేయడంలేదు. బాధితులే కరోనా టెస్ట్‌ చేయమని అడిగితే టెస్టింగ్‌ కిట్లు లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తప్పనిసరి అయితేశ్యాంపిల్స్‌ తీసి సిద్ధార్థ వైద్య కళాశాలలోని ల్యాబ్‌కు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో సైతం ఇదే దుస్థితి. మరోవైపు.. శ్యాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపితే ఫలితాలు రావడానికి కనీసం 48 గంటలు పడుతోంది. అంచనా వేసే ఆలోచనేది.. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అక్కడి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరీక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రాయలసీమ జిల్లాల ప్రజలు ఆ రెండు రాష్ట్రాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖ, విజయవాడ విమానాల్లో వివిధ రాష్ట్రాల ప్రయాణికులు ఇక్కడకు వస్తుంటారు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అంచ­నా వేయడం కోసమైనా.. హైరిస్క్‌ వర్గాల వారికి ప్రభుత్వం ర్యాండమ్‌గా పరీక్షలు చేయాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచనా చేయడంలేదు. అలాగే, వైరస్‌ వ్యాప్తి మొదలైన నేపథ్యంలో.. రాష్ట్రంలో వైద్యశాఖ సన్నద్ధత, వనరులపై సీఎం చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. యో­గా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలోనే వైద్యశాఖ నిమగ్నమైంది. నాటి ముందుచూపు ఇప్పుడు ఏదీ? నిజానికి.. 2020 నుంచి దేశంలో కరోనా వ్యాప్తి మొదలైంది. నాటినుంచి వివిధ రూపాల్లో వ్యాప్తి కొనసాగుతునే ఉంది. అయితే, 2019 వరకు చంద్రబాబు పాలనలో ధ్వంసమైన ఆరోగ్య రంగాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఓ పక్క గాడిలో పెడుతూనే మరోపక్క కోవిడ్‌ వైరస్‌ నియంత్రణకు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంది. అత్యధిక స్థాయిలో కోవిడ్‌ పరీక్షల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కోవిడ్‌ కేసులు వస్తే విలేజ్‌ క్లినిక్స్, సచివాలయాల ద్వారా గ్రామస్థాయిలోనే వైద్యసేవలు అందించేలా వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. ఎప్పుడు వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనా వెంటనే ఫీవర్‌ సర్వే చేపట్టి అనుమానితులను గుర్తించి లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించి, ఐసోలేషన్‌ చేయడం ద్వారా ప్రాథమిక దశలోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టారు. బాధితులు తీవ్ర అనారోగ్యం పాలుకాకుండా కాపాడారు. 365 రోజులూ సచివాలయాల్లో హోం ఐసోలేషన్‌ కిట్లు, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉంచి వైరస్‌ వ్యాప్తి మొదలైతే వెంటనే చర్యలు తీసుకునేలా ముందుచూపుతో వ్యవహరించారు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్టడంలేదు. ఇందుకు నిదర్శనమే కోవిడ్‌ నివారణకు ఉద్దేశించిన నిబంధనలు ఉపసంహరించడమని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిబంధనావళి మహానాడుకు ఇబ్బందిగా మారుతుందని రోజుల వ్యవధిలోనే దానిని ఉపసంహరించడం ప్రజారోగ్యంపట్ల సర్కారు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. పరీక్షల కోసం ఎక్కడికెళ్లాలో తెలీని దుస్థితి.. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనుమానిత లక్షణాలున్న వృద్ధులు, వివిధ వ్యాధుల బాధితులు వైద్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామాల్లోని విలేజ్‌ క్లినిక్‌లు, పీహెచ్‌సీల్లో సైతం వైరస్‌ ప్రాథమిక నిర్థారణ ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక కిట్ల పంపిణీ చేపట్టనే లేదు. మెజారిటీ శాతం క్లినిక్‌లు, పీహెచ్‌సీల్లో కిట్లు లేవు. ముప్పు ఎక్కువగా (హైరిస్క్) ఉండే వర్గాల వారిలో కోవిడ్‌ లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయకుండా మాత్రలు ఇచ్చి ఇళ్లకు పంపుతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనుమానిత లక్షణాలున్న వారు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పరుగులు పెడుతున్నారు.

CM Revanth Reddy wishes people on Telangana State Formation Day8
సీఎం రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కూడా వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Aamir Khan recently spoke about his relationship with Gauri Spratt9
లేటు వయసులో డేటింగ్‌.. పొరపాటున జరిగిపోయింది: అమిర్ ఖాన్‌

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమాల కంటే వ్యక్తిగతంగానే వార్తల్లో నిలుస్తున్నారు. ఆరు పదుల వయస్సులో ప్రేమ అంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌ ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన బర్త్‌ డే వేడుకల సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూలో గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు. ఈ వయలులో మళ్లీ ప్రేమలో పడాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. ఇప్పటికే తన వయసు అయిపోయిందని.. తనకు భాగస్వామి దొరకడం సాధ్యం కాదని భావించేవాడినని ఆమిర్ పేర్కొన్నారు. తనకు వృద్ధాప్యఛాయలు వచ్చినట్లు అనిపించిందని.. గౌరీని కలవడానికి ముందు థెరపీ చేయించుకున్నానని తెలిపారు. నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నామని అమిర్‌ ఖాన్ వెల్లడించారు.గౌరీతో పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ.. 'నేను, గౌరీ పొరపాటున కలుసుకున్నాం. ఆ తర్వాత మేము స్నేహితులమయ్యాం.. మా మధ్య ప్రేమ పుట్టింది. నాకు నా తల్లి, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. నాకు ఇప్పటికే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నాకు భాగస్వామి అవసరం లేదు. కిరణ్, రీనా నేను ఇప్పటికీ పానీ ఫౌండేషన్ కోసం కలిసి పని చేస్తున్నాం. మేము ప్రతిరోజూ కూర్చుని మాట్లాడుకుంటాం. ఒక కుటుంబంగా మా మధ్య నిజమైన ప్రేమ ఉంటుంది మేము ఎల్లప్పుడూ కుటుంబంగానే ఉంటాం. మేము భార్యాభర్తలం కాకపోవచ్చు.. కానీ మేము ఎల్లప్పుడూ ఓకే ఫ్యామిలీగానే ఉంటాం. వారు ఎప్పటికీ నా జీవితంలో ఒక శాశ్వత భాగం.' అని వెల్లడించారు. కాగా..అమిర్ ఖాన్‌, గౌరీ ఏప్రిల్ 12న చైనాలో జరిగిన మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌లో జంటగా మొదటిసారి కనిపించారు. ప్రస్తుతం అమిర్‌ ఖాన్‌ 'సితారే జమీన్ పర్', లోకేష్ కనగరాజ్ 'కూలీ'చిత్రంలో కనిపించనున్నారు.

Rasi Phalalu: Daily Horoscope On 02-06-2025 In Telugu10
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తి వివాదాల పరిష్కారం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.సప్తమి రా.12.06 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మఖ రా.2.31 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.2.06 నుండి 3.45 వరకు, దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.18 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.55 వరకు, అమృతఘడియలు: రా.12.07 నుండి 1.46 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.27. మేషం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.వృషభం.... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.మిథునం..... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.కర్కాటకం.... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.సింహం.. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.కన్య....... వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.తుల..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.వృశ్చికం.. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.ధనుస్సు.. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మకరం.... కుటుంబసమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కుంభం.. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.మీనం.... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement