Top Stories
ప్రధాన వార్తలు

కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్చాట్లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్ఎస్లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్ఎస్ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్కి వెళ్ళిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్ఎస్.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్లైన్ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

'గద్దర్ అవార్డ్స్' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్'
తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్ నటి జయసుధ (Jayasudha), ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను అవార్డ్స్ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్ టీమ్, ఫీచర్ ఫిల్మ్, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం : పోటేల్ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్ మై ఫ్రెండ్స్ఉత్తమ వినోదాత్మక చిత్రం : ఆయ్హిస్టరీ ఫీచర్ విభాగంలో ఉత్తమ హెరిటేజ్ చిత్రం- రజాకార్ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్ (రజాకార్)ఉత్తమ సహాయ నటుడు : ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్రశేఖర్ (గ్యాంగ్స్టర్ )ఉత్తమ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్: సత్య, వెన్నెల కిశోర్ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్ (రాజూ యాదవ్)ఉత్తమ సినిమాటోగ్రాఫర్- విశ్వనాథ్రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)ఉత్తమ కాస్టూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విజేతలు దుల్కర్ సల్మాన్: లక్కీ భాస్కర్అనన్య నాగళ్ల: పొట్టేల్దర్శకులు సూజిత్, సందీప్ (క) నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ (రాజూ యాదవ్)స్పెషల్ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!
ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్ సిక్స్ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.అలాగే కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే ఎందుకు ఎన్టీఆర్ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు విరాళాలు ఇస్తుంటే మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు'
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అయితే ఈ జట్టులో అద్బుతమైన ఫామ్లో ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్కు సెలక్టర్లు చోటిచ్చారు. తాజాగా సెలక్టర్ల నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదర్శన్ బదులుగా అనుభవం ఉన్న అయ్యర్కు ఛాన్స్ ఇవ్వాల్సందని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సాయి సుదర్శన్ ఒక అద్బుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజన్లో బాగా రాణించడంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్గా అతడు విజయవంతమయ్యాడు. సుదర్శన్ను వైట్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకున్నప్పుడు, మరి అయ్యర్ విషయంలో ఏమైందని" సెలక్టర్లపై కైఫ్ మండిపడ్డాడు.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

ముష్కరులకు దీటుగా బదులిచ్చాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడి, భారతీయులను విభజించాలని కోరుకున్న ముష్కరులకు భారత్ తగిన సమాధానం ఇచ్చిందని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత భారతీయులు మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను వ్యక్తం చేశారని అన్నారు. పహల్గామ్లో ఉగ్రవాదులు చేసింది కేవలం భారతీయులపై దాడి మాత్రమే కాదు. ఇది మానవత్వంపై జరిగిన దాడి. మన సోదర స్ఫూర్తిపై దాడి. అయితే ఆపరేషన్ సిందూర్ ద్వారా మనం వారికి బలమైన ప్రతిస్పందన చూపామని ప్రధాని మోదీ బాగ్డోగ్రాలో వర్చువల్గా జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.నేడు (గురువారం) జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సిక్కిం పర్యటన ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. సిక్కిం రాష్ట్ర అవతరణ 50వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని హాజరుకావలసి ఉంది. దీనిలో భాగంగా ఆయన గ్యాంగ్టక్ చేరుకుని, రూ. 750 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలు వాతావరణం అనుకూలించని కారణంగా రద్దయ్యాయి. దీంతో ప్రధాని మోదీ బాగ్డోగ్రా(పశ్చిమ బెంగాల్) నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సిక్కిం ప్రజాస్వామ్య ప్రయాణంలో స్వర్ణోత్సవం అని అన్నారు. తాను రాష్ట్ర ప్రజల సమక్షంలో ఉంటూ, 50 వసంతాల విజయవంతమైన ప్రయాణాన్ని చూడాలనుకున్నానని, అయితే ఢిల్లీ నుండి బాగ్డోగ్రా చేరుకోగానే, అక్కడి వాతావరణం తనను మరింత ముందుకు వెళ్లకుండా ఆపివేసిందని, ఫలితంగా సిక్కిం ప్రజలను వ్యక్తిగతంగా కలిసే అవకాశం దక్కలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.సిక్కిం 50వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మలచేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృష్టిచేశారని ప్రధాని అన్నారు. సిక్కిం 50వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల క్రితం సిక్కిం తనకు తానుగా ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించుకుందని, నాడు సిక్కిం(Sikkim) ప్రజలు భారతదేశంతో కనెక్ట్ కావాలని కోరుకున్నారన్నారు. ఈ రోజు సిక్కింలోని ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. 50 ఏళ్లలో సిక్కిం 100శాతం సేంద్రీయ రాష్ట్రంగా మారిందని, సంస్కృతి, వారసత్వ సంపదకు చిహ్నంగా ఉద్భవించిందని ప్రధాని అన్నారు.2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెప్పామని, ఈ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చిందని మోదీ పేర్కొన్నారు. నేడు సిక్కిం అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని, ఇది నవ భారత అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయంగా మారనున్నదని ప్రధాని మోదీ అన్నారు.ఇది కూడా చదవండి: నేటి నుంచి ఆ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

మహానాడులో పోలీసులకూ తప్పని కష్టాలు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇంకోవైపు.. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్ స్పీచ్.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

మైక్రోసాఫ్ట్, యోటా జట్టు.. ఏఐ వినియోగానికి మరింత జోరు
న్యూఢిల్లీ: భారత్లో కృత్రిమ మేథని (ఏఐ) మరింతగా వినియోగంలోకి తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్, యోటా డేటా సర్వీసెస్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ప్రకారం యోటా ఏఐ క్లౌడ్ ప్లాట్ఫాం అయిన శక్తి క్లౌడ్లో మైక్రోసాఫ్ట్ తమ అజూర్ ఏఐ సర్వీసులను అందుబాటులోకి తెస్తుంది.దీంతో డెవలపర్లు, స్టార్టప్లు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇండియాఏఐ మిషన్లో భాగమైన సంస్థలకు అధునాతన సేవలు అందుబాటులోకి వస్తాయి. దేశీయంగా కృత్రిమ మేథ సామర్థ్యాలను పెంపొందించడం, నవకల్పనలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను పటిష్టపర్చడం ద్వారా ఇండియాఏఐ మిషన్ లక్ష్యాల సాధనకు కూడా మైక్రోసాఫ్ట్–యోటా భాగస్వామ్యం తోడ్పడనుంది.👉ఇదీ చదవండి: టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు..ఇండియాఏఐ మిషన్ అనేది దేశంలోని కృత్రిమ మేధ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ చొరవ. ఏఐ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, పటిష్టమైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను సృష్టించడం ఈ మిషన్ లక్ష్యం. దేశీ ఏఐ మోడల్స్ను రూపొందించడానికి సంబంధించి 2025 మే నాటికి ఇండియాఏఐ మిషన్కు 500 పైగా ప్రతిపాదనలు వచ్చాయి.

చంద్రబాబును గెలిపించడమే మా తప్పు.. కుప్పంలో రైతుల ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.కాగా, కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది.

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి:

ట్రంప్కు టారిఫ్లు విధించే అధికారాల్లేవ్.. కోర్టు సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్కు యూఎస్ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘లిబరేషన్ డే’ సందర్భంగా పలు దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసర పరిస్థితిలో మాత్రమే అధ్యక్షుడికి ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని మాన్హట్టన్ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు (Trump Tariffs) అమలుకాకుండా యూఎస్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేసింది. ఈ క్రమంలో మాన్హట్టన్ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల బృందం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే అధికారం కేవలం కాంగ్రెస్కే ఉంది. విశేష అధికారాలతో టారిఫ్లు విధించడం సరికాదు. ఇది రాజ్యాంగ వ్యవస్థలను బలహీన పరచడమే అవుతుంది అని చెప్పుకొచ్చింది.అయితే, ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద తీసుకున్నట్టు అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని కోర్టు తేల్చింది. ఇదే సమయంలో ‘భారత్-పాక్ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.🇺🇸 JUST IN: US federal court blocks Trump's "Liberation Day" tariffs from taking effect.It rules that the president overstepped his constitutional authority by unilaterally imposing import duties on countries with trade surpluses against the United States. pic.twitter.com/WmJlyoEz9H— Cointelegraph (@Cointelegraph) May 29, 2025అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్-పాక్ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.ఇక, ఈ టారిఫ్లపై అమెరికాలోని ఐదు చిన్న దిగుమతి వ్యాపార సంస్థలు, ఒరెగాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ నాయకత్వంలో ఉన్న 13 రాష్ట్రాల కూటమి వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ టారిఫ్లు చట్టవిరుద్ధం, నిర్లక్ష్యంగా తీసుకున్నవని, ఆర్థికంగా నష్టం కలిగించేవి అంటూ వారు పేర్కొన్నారు. 🚨 BIG BREAKING 🚨🇺🇸 US Federal Court blocks President Trump's Liberation Day tariffs from taking effect.Donald Trump files appeal after Federal Court blocks tariffs.White House: It's "not for unelected judges to decide how to properly address a national emergency." pic.twitter.com/yCotgRaQq6— Crypto Aman (@cryptoamanclub) May 29, 2025
అదేదో ఎన్నికలప్పుడు పార్టీ వాణీ కూడా వినిపిస్తే గెలిచేవాళ్లం కదా!?
ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కడ ఎక్కువంటే..
'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్.. తెలుగు హీరో కోసమేనా?
కాంగ్రెస్ నేతల విమర్శలకు శశి థరూర్ కౌంటర్
Podcast: యూట్యూబ్లో కోట్లలో వ్యూస్ - ట్రెండింగ్ పాడ్కాస్టింగ్!
ఈ గోపాలుడి లీలలు వేరయా..
వరల్డ్ బౌలింగ్ లీగ్లో కోహ్లి పెట్టుబడి..
గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?
Bakrid 2025: జిల్ హజ్ మొదటి పది రోజుల ప్రాముఖ్యం
ఇక్కత్ వస్త్రాలు మా మనసు దోచాయి..
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళి (చిత్రాలు)
ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ
ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ
అదేదో ఎన్నికలప్పుడు పార్టీ వాణీ కూడా వినిపిస్తే గెలిచేవాళ్లం కదా!?
ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కడ ఎక్కువంటే..
'సూర్య'ను కాదనుకున్న కీర్తి సురేశ్.. తెలుగు హీరో కోసమేనా?
కాంగ్రెస్ నేతల విమర్శలకు శశి థరూర్ కౌంటర్
Podcast: యూట్యూబ్లో కోట్లలో వ్యూస్ - ట్రెండింగ్ పాడ్కాస్టింగ్!
ఈ గోపాలుడి లీలలు వేరయా..
వరల్డ్ బౌలింగ్ లీగ్లో కోహ్లి పెట్టుబడి..
గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?
Bakrid 2025: జిల్ హజ్ మొదటి పది రోజుల ప్రాముఖ్యం
ఇక్కత్ వస్త్రాలు మా మనసు దోచాయి..
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ
ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ
భారత్తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
సినిమా

మలయాళంలో హిట్.. తెలుగులోనూ విడుదల (నరివెట్ట ట్రైలర్)
మలయాళ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన 'నరివెట్ట' (Narivetta) తెలుగు ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఐడెంటిటీ' చిత్రంతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న ఆయన నరివెట్ట సినిమాతో మరో హిట్ అందుకున్నారు. మలయాళం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో తెలుగులో కూడా మే 30న విడుదల చేయనున్నారు. 2003 ముతంగ సంఘటన ఆధారంగా అబిన్ జోసెఫ్ కథ రాశారు. ఈ చిత్రంలో టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చేరన్ నటించారు.

నా చిత్రాల్లో నటించాకే వారందరూ రాజకీయాల్లోకి ఎంట్రీ: ఏఎం.రత్నం
నా చిత్రాల్లో నటించిన తరువాత కథానాయకులు రాజకీయాల్లోకి వెళ్లారని నిర్మాత ఏఎం.రత్నం అన్నారు. ఇంతకుముందు కోలీవుడ్లో ఆయన ఇండియన్ (భారతీయుడు), ఆరంభం, ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని), వేదాళం వంటి పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఈయన తాజాగా నిర్మించిన చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఇందులో నిధిఅగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునిల్, కింగ్స్లీ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణం అందించారు. రవికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో జూన్ 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆ చిత్రంలోని తార తార అనే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు కేఎస్.రవికుమార్, కేఆర్ పాల్గొని చిత్రం మంచి విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. ఏఎం రత్నం మాట్లాడుతూ చిత్రం బాగా వచ్చిందని, హరిహర వీరమల్లు చిత్రానికి రెండవ భాగం చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి తన కొడుకు రవికృష్ణ దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. కాగా తన చిత్రాల్లో నటించిన తరువాత ఆయా చిత్రాల కథానాయకులు రాజాకీయాల్లోకి ప్రవేశించారని చెప్పారు. నటుడు శరత్కుమార్, విజయ్కాంత్, విజయ్, విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లారని, పవన్కల్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారని ఇది యాదృఛ్చకంగా జరిగిందో ఏమో తెలియదని ఆయన పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు రవికృష్ణ మాట్లాడుతూ తాను ఏడెనిమిది ఏళ్ల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం హరిహరవీరమల్లు అని పేర్కొన్నారు. అదేవిధంగా పవన్కల్యాణ్ పిలిచి తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తాను మాత్రం మీ తండ్రికి అభిమానినని, ఆయన బాగుండాలని, ఆయన లెగసీని నువ్వు కొనసాగించాలని చెప్పారని రవికృష్ణ పేర్కొన్నారు.

జైలర్తో విద్య?
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ ’(2023) చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండియన్గా రజనీకాంత్ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందుతోంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఇదిలా ఉంటే.. ‘జైలర్ 2’లో విద్యా బాలన్ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ టాక్. ఇటీవల విద్యా బాలన్ని కలిసి, ‘జైలర్ 2’ కథ చె΄్పారట నెల్సన్. చిత్రకథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ‘జైలర్ 2’లోనూ ఆమె అదే పాత్రలో కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో విద్యా బాలన్ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ‘జైలర్ 2’లో హీరో బాలకృష్ణ నటించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించారు. మరి... ‘జైలర్ 2’లో కూడా నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

కొలంబోలో అనసూయ చిల్.. ఎల్లో శారీలో రష్మిక హోయలు!
బ్లాక్ అవుట్ఫిట్లో బాలీవుడ్ భామ మలైకా అరోరా..కొలంబోలో అనసూయ చిల్..సెల్ఫీ ఫోజులో మహేశ్ బాబు కూతురు సితార..ఎల్లో శారీలో రష్మిక మందన్నా హోయలు..కాన్స్ ఫెస్టివల్ మూడ్లోనే ప్రణీత సుభాశ్.. View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Karishma Patidar (@stylebykarishmaa) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta)
న్యూస్ పాడ్కాస్ట్

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?
క్రీడలు

నేను సెలక్టర్ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు: గంభీర్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్గా శుబ్మన్ గిల్, అతడి డిప్యూటీగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా కరుణ్ నాయర్, శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆటగాళ్లకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అయితే ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా చక్కటి రికార్డు ఉన్న అయ్యర్ పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం ఆశ్చర్యపర్చింది.క్రికెటేతర కారణాలతో అతడిని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘నేను సెలక్టర్ను కాదు’ అంటూ ఒక్క ముక్కలో గంభీర్ స్పందించాడు.కానీ ఐపీఎల్ ఫైనల్కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్ ప్రశంసించాడు. అది నమ్మశక్యం కాని నిర్ణయమని అన్నాడు. దేశం మొత్తం మన సాయుధ దళాలకు సెల్యూట్ చేయాలని గంభీర్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్2025-27లో భాగంగా జరగనుంది.చదవండి: IPL 2025: రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

ఆసియాలో ఆరు పతకాల జోరు
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు... రెండో రోజు పోటీల్లో ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలు కైవసం చేసుకున్నారు. 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే టీమ్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పసిడి పతకం నిలబెట్టుకోగా... డెకాథ్లాన్లో తేజస్విన్ శంకర్, పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌదరి, మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ కూడా రజత పతకాలు సాధించగా... పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ షా కాంస్యం గెలుచుకున్నాడు.దీంతో భారత ఖాతాలో మొత్తంగా 8 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) చేరాయి. 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన 4్ఠ400 మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రూపాల్ చౌదరి, సంతోష్ కుమార్, విశాల్, సుభ వెంకటేశన్తో కూడిన భారత బృందం 3 నిమిషాల 18.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచింది. 2023లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన సుభ ఈసారి కూడా సత్తా చాటింది. చైనా (3 నిమిషాల 20.52 సెకన్లు), శ్రీలంక (3 నిమిషాల, 21.95 సెకన్లు) బృందాలు వరసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచినా... అనర్హత వేటుకు గురయ్యాయి. దీంతో ఆ తర్వాత నిలిచిన కజకిస్తాన్ (3 నిమిషాల 22.70 సెకన్లు), కొరియా (3 నిమిషాల 22.87 సెకన్లు) జట్లకు రజత, కాంస్యాలు దక్కాయి. పోటీల తొలి రోజు పురుషుల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ గుల్విర్ సింగ్ స్వర్ణం గెలుచుకోగా.. 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సెబాస్టియన్ కాంస్యం గెలుచుకున్నాడు. రూపాల్ డబుల్ ధమాకా... మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన రూపాల్ మహిళల 400 మీటర్ల ఈవెంట్లో రజతం కూడా గెలుచుకొని డబుల్ ధమాకా మోగించింది. మహిళల ఈవెంట్లో రూపాల్ 52.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన విద్య రామ్రాజ్ 53.00 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ననాకో మసుమొటో (52.17 సెకన్లు; జపాన్)కు స్వర్ణం, జానిబిబి హుకుమోవా (52.79 సెకన్లు; ఉజ్బెకిస్తాన్)కు కాంస్యం గెలుచుకుంది.2022 ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రెండు పతకాలు (4్ఠ400 మీటర్ల రిలే, 400 మీటర్ల పరుగు) సాధించిన రూపాల్ ఈ టోర్నీలోనూ రెండు పతకాలు నెగ్గడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన రూపాల్... గాయాల బారిన పడకుండా మెరుగైన ఫలితాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉన్నా... ఫలితాలతో సంతృప్తిగా లేను. మరింత మెరుగైన టైమింగ్ సాధించాలనుకున్నా. దాని కోసం కఠోర సాధన చేస్తున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న’ అని 20 ఏళ్ల రూపాల్ పేర్కొంది.యూనుస్కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ 3 నిమిషాల 43.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కజుటో లిజావా (3 నిమిషాల 42.56 సెకన్లు; జపాన్) వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి గెలుచుకోగా... జియాంగ్ లీ (3 నిమిషాల 42.79 సెకన్లు; దక్షిణ కొరియా) కాంస్యం దక్కించుకున్నాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో విశాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ (45.57 సెకన్లు)తో రేసును ముగించినా... నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో పసిడి గెలిచిన భారత జట్టులో సభ్యుడైన విశాల... వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శనే చేసినా పతకం మాత్రం సాధించలేకపోయాడు. పూజకు రజతంమహిళల 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూజ 4 నిమిషాల 10.83 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం నెగ్గింది. భారత్ కే చెందిన లిలి దాస్ (4 నిమిషాల 13.81 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. లి చున్హి (4 నిమిషాల 10.58 సెకనర్లు; చైనా)కి పసిడి, టొమాకా కైమురా (4 నిమిషాల 11.56 సెకన్లు; జపాన్)కు కాంస్య పతకాలు దక్కాయి.» ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. మహిళల హర్డిల్స్లో జ్యోతి 13.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ముందంజ వేసింది. » మహిళల లాంగ్జంప్లో శైలీ సింగ్, ఆన్సీ సోజన్ ఫైనల్కు అర్హత సాధించారు. బుధవారం క్వాలిఫయింగ్ ఈవెంట్లో శైలీ సింగ్ 6.17 మీటర్లు దూకగా... ఆన్సీ 6.14 మీటర్ల దూరం లంఘించింది. ప్రవీణ్ మూడో ప్రయత్నంలో...పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకంతో మెరిశాడు. బుధవారం పోటీల్లో ప్రవీణ్ 16.90 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ‘పరిస్థితులు అనుకూలించాయి. తొలి రెండు ప్రయత్నాల్లో టాప్–8లో ఉంటే చాలు అనుకున్నా. మూడో ప్రయత్నంలో శక్తినంతా కూడదీసుకొని లంఘించా. ఆ తర్వాత వర్షం కారణంగా అంతరాయం కలగింది. దీంతో కాస్త ఇబ్బందిపడ్డా. పతకం సాధించడం సంతోషంగా ఉంది’ అని ప్రవీణ్ పేర్కొన్నాడు. తొలి ప్రయత్నంలో 16.60 మీటర్లు దూకిన ప్రవీణ్, రెండో ప్రయత్నంలో 16.67 మీటర్లు లంఘించాడు. తేజస్విన్కు సిల్వర్భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్లో రజతం గెలుచుకున్నాడు. 10 ఈవెంట్ల (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు) సమాహారమైన ఈ పోటీలో తేజస్విన్ 7618 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫై జియాంగ్ (7634; చైనా)కు స్వర్ణం, కిసుకే ఒకుడా (7602; జపాన్)కు కాంస్య పతకం లభించింది.

యువ భారత్ ‘హ్యాట్రిక్’
రొసారియో (అర్జెంటీనా): నాలుగు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన యువ భారత్... ఆతిథ్య అర్జెంటీనాతో జరిగిన హోరాహోరీ పోరులో షూటౌట్లో విజయం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1–1 గోల్స్తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 2–0తో గెలుపొందింది. మ్యాచ్లో భారత్ తరఫున కనిక (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... అర్జెంటీనా తరఫున మిలాగ్రోస్ డెల్ వాలె (10వ నిమిషంలో) ఒక గోల్ చేసింది. అర్జెంటీనా జట్టు తొలి క్వార్టర్లోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... మూడో క్వార్టర్లో కనిక గోల్తో భారత్ స్కోర్లు సమం చేయగలిగింది. షూటౌట్లో భారత్ తరఫున లాల్రిన్పుయి, లాల్థన్ట్లుంగి విజయవంతం అయ్యారు. యువ భారత జట్టు కెప్టెన్ నిధి గోల్కీపర్గా అర్జెంటీనా ప్లేయర్ల దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంతో భారర్లీ టోర్నమెంట్లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం చిలీతో భారత్ తలపడుతుంది.

సాత్విక్–చిరాగ్ జోడీ బోణీ
సింగపూర్: మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ కొట్టింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బుధవారం సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–13 చూంగ్ హోన్ జియాన్–మొహమ్మద్ హైకాల్ (మలేసియా) జంటపై గెలుపొందింది. 37 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రపంచ మాజీ నంబర్వన్ ద్వయం వరుస గేమ్ల్లో విజయం సాధించింది. చిరాగ్ గాయం కారణంగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నుంచి తప్పుకున్న ఈ జంట... పూర్తి ఫిట్నెస్తో కోర్టులో సత్తా చాటింది. ప్రస్తుతం ప్రపంచ 27వ ర్యాంక్లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీకి... 41వ ర్యాంకర్ మలేసియా జోడీపై ఇది రెండో విజయం. ఈ సీజన్లో మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్లో సెమీస్కు చేరిన ఈ జంట... ఆ తర్వాత గాయాల కారణంగా ప్రధాన టోర్నీలకు దూరమైంది. ప్రిక్వార్టర్స్లో గాయత్రి జోడీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జోడీ రెండో రౌండ్కు చేరుకుంది. బుధవారం తొలి రౌండ్లో గాయత్రి–ట్రెసా జంట 21–14, 19–21, 21–17తో చాంగ్ చింగ్ హూయి–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలచి ప్రిక్వార్టర్స్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్–గద్దె రుత్విక శివాని జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. రోహన్–శివాని జంట 21–16, 21–19 చెన్ జీ యీ–ఫ్రాన్సెస్కా కార్బెట్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్, ఉన్నతి హూడా పోరాడి ఓడారు. ఆకర్షి కశ్యప్ 21–17, 13–21, 7–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ హాన్ యీ చేతిలో ఉన్నతి 21–13, 9–21, 15–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జీ యీ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ రెండు మ్యాచ్ల్లో తొలి గేమ్లో విజయం సాధించిన అనంతరం భారత షట్లర్లు పట్టు సడలించి టోర్నీ నుంచి నిష్క్రమించారు. అనుపమా ఉపాధ్యాయ 12–21, 16–21తో సంగ్ షో యున్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడగా... మహిళల డబుల్స్లో వైష్ణవి–అలీషా జంట పరాజయం పాలైంది. లక్ష్యసేన్కు గాయం పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ లక్ష్యసేన్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. లిన్ చున్ యూ (చైనీస్ తైపీ)తో తొలి రౌండ్ మ్యాచ్ 21–15, 17–21, 5–13తో ఉన్న సమయంలో గాయం కారణంగా లక్ష్యసేన్ వైదొలిగాడు. ‘వెన్ను నొప్పితో లక్ష్యసేన్ తొలి రౌండ్ నుంచి వైదొలిగాడు. టోర్నీ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ నుంచే లక్ష్య ఈ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నొప్పి మరింత ఎక్కువ కావడంతో మూడో గేమ్ మధ్యలో ఆట నుంచి తప్పుకున్నాడు. లక్ష్యసేన్ వీలైనంత త్వరగా కోలుకునే విధంగా వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఇండోనేసియా ఓపెన్ వరకు అతడు తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకముంది’ అని అతడి తండ్రి, కోచ్ డీకే సేన్ పేర్కొన్నాడు.
బిజినెస్

టీసీఎస్లో భారీగా ఏఐ ఏజెంట్లు.. ఉద్యోగులతో కలిసే..
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ఏదో ఆషామాషీ టెక్నాలజీ కాదని, మానవ జాతి పురోగమనాన్ని మలుపు తిప్పే ఒక శక్తివంతమైన సాధనమని ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అన్ని పరిశ్రమలకూ ఇది ప్రయోజనకరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లను భారీ స్థాయిలో రూపొందిస్తామని చంద్రశేఖరన్ చెప్పారు.భవిష్యత్తులో ‘హ్యూమన్ ప్లస్ ఏఐ‘ మోడల్ కింద సర్వీసులు అందిస్తామని షేర్హోల్డర్లకు టీసీఎస్ మాతృ సంస్థ టాటా సన్స్కి కూడా చైర్మన్ అయిన చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే, ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.హార్డ్వేర్ ప్రొవైడర్లు, సొల్యూషన్స్ ఆవిష్కర్తలు, స్టార్టప్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని వివరించారు. ఏఐ సాంకేతిక వినియోగంలో టీసీఎస్ ముందు వరుసలో ఉంటోందని, పలు సొల్యూషన్స్లో దీన్ని ఉపయోగిస్తోందని చంద్రశేఖరన్ తెలిపారు. ‘టీసీఎస్ విజ్డంనెక్ట్స్’ పేరిట కంపెనీల కోసం జెన్ ఏఐ ప్లాట్ఫాంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.👉 ఇది చదివారా? జాబ్ చేంజ్ అంటే ఇదీ.. రూ.5.5 లక్షల నుంచి రూ.45 లక్షల జీతానికి..

అమెరికా వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విజయవంతమైతే ప్రస్తుత అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని, ఎగుమతులు ఇతోధికం అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. భారత్పై విధించిన 26 శాతం అదనపు టారిఫ్లను 90 రోజుల పాటు (జూలై 8 వరకు) అమెరికా నిలిపివేయడం తెలిసిందే. దీంతో ఆలోపే అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు భారత్ విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తోంది. తద్వారా భారత ఎగుమతులపై టారిఫ్ల పూర్తి మినహాయింపు ప్రయోజనం పొందొచ్చని భావిస్తోంది.అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడులకు భారత్ ఎంతో విశ్వసనీయ, ఆశావహ కేంద్రంగా కొనసాగుతుందని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. మధ్యకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వస్తాయని అంచనా వేసింది. నైపుణ్యాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న విధానపరమైన చర్యలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ సంస్థల నివేదికలను ప్రస్తావించింది.ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ సహా పలు సంస్థలు 2025–26లో భారత వృద్ధి రేటు 6.2–6.7 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. బలమైన దేశీ ఆర్థిక మూలాలు, మెరుగైన స్థూల ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీంతో వెలుపలి షాక్లను ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలదని పేర్కొంది. వినియోగం దన్ను.. వినియోగం బలంగా ఉండడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడం, సేవల ఎగుమతులు పటిష్టంగా ఉండడం దేశీ వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతలను సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నట్టు వివరించింది. రూపాయి స్థిరంగా ఉండడంతోపాటు బలమైన విదేశీ మారకం నిల్వలు వెలుపలి షాక్లకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా గత బడ్జెట్లో ఆదాయపన్ను భారాన్ని తగ్గించడం, ద్రవ్య నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు, ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయని అంచనా వేసింది. దీంతో ఆర్థిక వృద్ధి మరింత పుంజుకుని 6.3–6.8 శాతం అంచనాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని తెలిపింది.ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు ఒక్కటే పుంజుకోవాల్సి ఉన్నట్టు తెలిపింది. ఆహార ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది. రబీ సాగు సానుకూలంగా ఉండడం, వేసవిలో పంటల సాగుతో రానున్న రోజుల్లో ఆహార వస్తువుల పరంగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండొచ్చని వివరించింది. ఇక నైరుతిలో సాధరణం కంటే అధిక వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతోపాటు, చమురు ధరలు కనిష్టాల్లో ఉండడం ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తాయని అభిప్రాయపడింది.

గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ

సెబీ మాజీ చీఫ్ మాధవికి క్లీన్ చిట్
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బచ్కు లోక్పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్సెల్లర్ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.వాటిపై సెబీ చైర్మన్ హోదాలో బచ్ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్షోర్ ఫండ్స్లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్పాల్ తాజాగా కొట్టివేసింది.
ఫ్యామిలీ

‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
నమస్తే డాక్టరు గారు. నాకు సంవత్సరం క్రితం పెళ్ళయింది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోం చేస్తారు. చాలామంచి వ్యక్తి. మా అత్తయ్య వాళ్లకి ఒక్కడే కొడుకు, పెళ్ళికి ముందు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఎంతో ఇష్టపడి నన్ను పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒకటే సమస్య మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. అప్పటి నుండి ఆత్మన్యూనతా∙ భావంతో ఉంటున్నారు. నాతో ఫ్రీగా ఉండరు. సరదాగా మాట్లాడరు. నేను ప్రేమగా దగ్గరికి వెళ్తే ముడుచుకుపోతారు. తాను సంసారానికి పనికిరానని, నన్ను వేరే పెళ్ళి చేసుకోమని అంటున్నారు. మా అత్త మామలకు చేప్తే హైదరాబాద్ వెళ్ళి యూరాలజిస్ట్కి చూపించారు. ఆయన అన్ని పరీక్షలు చేసి అంతా బాగానే ఉంది. మందులు కూడా అవసరం లేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తారు. భార్యాభర్తల మధ్య మామూలుగా జరగాల్సిన సంసారానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? కౌన్సిలింగ్తో ఇలాంటి సమస్యలు తగ్గించవచ్చా? అసలు మా వారికి ఎలాంటి సమస్య ఉందంటారు? ఆయనంటే నాకు చాలా ఇష్టం. తనని నేను వదులుకోలేను. నన్నేం చేయమంటారో చెప్పండి. – ఓ సోదరి, గుడివాడమీ ఉత్తరాన్ని చదివాక మీ భర్త ఎంతో మంచి వ్యక్తి, కానీ ఒక సున్నితమైన సమస్యను ఎదుర్కొంటున్నారు అని అర్థమైంది. ఇది చాలామంది పురుషుల్లో కనిపించే ఒక సాధారణ సమస్య. దీన్ని ‘సైకోజెనిక్ ఎరెక్టయిల్ డిస్ఫంక్షన్‘ అంటారు. మనస్సులో ఉండే ఒత్తిడి, భయం, ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల సమస్య కలగొచ్చు. ఒకటి రెండుసార్లు ఫెయిల్యూర్ జరిగిన తర్వాత, భయంతో... బిడియంతో దూరంగా ఉండటం మొదలవుతుంది. తర్వాత డిప్రెషన్కి గురి అవుతారు. తాము ఇక సంసార జీవితానికి పనికిరామని అనుకుంటారు. యురాలజిస్ట్ చెప్పినట్లు ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలవండి. అతని ఒత్తిడికి కారణం కనుక్కుంటారు. ముందు తనలో ఆత్మ విశ్వాసం పెరిగేలా కౌన్సెలింగ్ చేస్తారు. ఆ తర్వాత ‘డ్యూయల్ సెక్స్ థెరపీ’ అనే ఒక మానసిక చికిత్స ద్వారా మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక ఆకర్షణ పెరిగేలా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చికిత్స చేస్తారు. దీంట్లో అనుభవం ఉన్న మానసిక వైద్యుడు లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారా మాత్రమే ఈ థెరపీ చేయించండి. ఈ చికిత్స కోసం భార్య భర్తలిద్దరూ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ చికిత్స ఆయనలోని ఒత్తిడిని తగ్గించేందుకు క్రమంగా మానసికంగా దగ్గర అవుతూ, తర్వాత శారీరకంగా దగ్గర అవడానికి సహాయపడుతుంది. అవసరమైతే కోరిక, పటిష్టత పెరిగేందుకు కొన్ని మంచి మందులు కూడా సైకియాట్రిస్టులు మీ వారికి ఇస్తారు. ప్రతిరోజు కొద్దిసేపు వాకింగ్, వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు, యోగా కూడా చేస్తే మానసిక ఒత్తిడి త్వరగా తగ్గుతుంది. మీరు ప్రేమగా ఓపికగా వేచి ఉండండి. అదే ఆయనకి పెద్ద ఔషధంలా పని చేసి ఆయనకి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com

ఫుల్స్టాప్ ఉండకూడదు
72వ మిస్ వరల్డ్ కాంటెస్ట్కు హాజరైన మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిస్కోవా బుధవారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో బ్యూటీ విత్ ఎ పర్పస్ చారిటీ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టినా యువతకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.కిందటేడాది మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా బ్యూటీ విత్ ఎ పర్పస్ అంబాసిడర్గా ప్రపంచమంతా పర్యటించింది. క్రిస్టినా పిస్కోవా ఫౌండేషన్ స్థాపించి దానిద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు చదువు దూరం కాకూడదన్న సంకల్పంతో టాంజానియాలో స్కూల్ను ప్రారంభించింది. సోంటా ఫౌండేషన్ ద్వారా చెక్ రిపబ్లిక్లోని వికలాంగులకు మద్దతు ఇస్తుంది. చెక్ రిపబ్లిక్ దేశంలోని ట్రినెక్ నగరంలో పుట్టింది క్రిస్టినా. ఆ తర్వాత వారి కుటుంబం దేశ రాజధాని ప్రాగ్లో స్థిరపడింది. న్యాయశాస్త్రంలో, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసిన క్రిస్టినా మోడలింగ్పై ఆసక్తి ఉండటంతో అటుగా అడుగులు వేసింది. స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్, పోలిష్, స్లోవాక్, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. లండన్లోని ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్లో చేరి, అందాల పోటీలో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంది. మిస్ చెక్ రిపబ్లిక్ పోటీల్లో పాల్గొని, తొలిప్రయత్నంలోనే కిరీటం దక్కించుకుంది.సాధించగలం అనే నమ్మకంమ్యూజిక్, ఫ్యాషన్, ఆర్ట్ అంటే ఇష్టపడే క్రిస్టినా తన సక్సెస్ గురించి వివరిస్తూ –‘‘జీవితంలో పుల్స్టాప్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. అన్నీ కామాలే ఉంచాలి. నేను మ్యూజిక్ నేర్చుకున్నా, ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్నా, మోడలింగ్ చేసినా... ఏ లక్ష్యం కోసం పనిచేసినా దానికి సంబంధించి సమస్యలు, ఒత్తిళ్లు వస్తూనే ఉండేవి. ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొన్నాను. నేను ఈ స్టేజీకి రావడం వెనకాల పెద్ద పోరాటమే చేశాను. కానీ, కలలను సాధించే క్రమంలో చేసే ప్రయత్నాలు, ఆ తర్వాత పొందిన ఫలితాలతో చాలా ఆనందాన్ని పొందాను. మార్పు అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఏడాది పొడవునా శ్రమిస్తూనే ఉండాలి. ఏ లక్ష్యం కోసం పాటుపడుతున్నామో దానిని వదిలిపెట్టకూడదు. ఇతర భాషౖలపెనా పట్టు సాధించాలి.మంచి మార్పుకు ఉదాహరణగా! అందాల పోటీ అత్యుత్తమమైనది. ప్రపంచవ్యాప్తం గా అవసరంలో ఉన్న పిల్లలకు ఆశను, ఆనందాన్ని కలిగించే శక్తిని ఇస్తుంది. ఇది ఎంత ఛాలెంజింగో అంత పెద్ద బాధ్యత కూడా. మంచి మార్పుకు ఉదాహరణగా, ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, ముఖ్యమైన అంశాలపై అవగాహన తీసుకువచ్చేలా ఉండాలి. ఏదైనా సాధించాలంటే ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి.మరచిపోలేని అద్భుతంతెలంగాణలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు ఉత్సాహభరితమైన సంస్కృతి ఎంతో ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట టెంపుల్ ఆర్కిటెక్చర్, రాజరికపు వారసత్వానికి ఆభరణంగా నిలిచిన చౌమహల్లా ΄్యాలెస్, తెలంగాణ వంటకాలు, ఇక్కడి సంప్రదాయం.. ఇదంతా ఒక అద్భుత ప్రయాణంగా మారిపోయింది. విక్టోరియా మెమోరియల్ హోమ్ను సందర్శించి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. ముఖ్యంగా పిల్లలతో సమయం గడపడం, వారి కథలు వినడంతో వారితో కలిసి ఆనంద క్షణాలను పంచుకున్నాం’’ అని తెలిపారు క్రిస్టినా. – నిర్మలారెడ్డి ఫొటోల: ఎస్. ఎస్. ఠాకూర్

సాగర ధీరలకు స్వాగతం
ఎనిమిది నెలలు ఒక సెయిలింగ్ వెసెల్. ఇద్దరే నావికులు... మూడు మహా సముద్రాలను నాలుగు ఖండాలను 50,000 కిలోమీటర్ల దూరాన్ని భీకర వాతావరణాన్నిదాటి విజేతలుగా నేడు (మే 29)న గోవాకు చేరుకోనున్నారు. వీరికి ఘన స్వాగతం చెప్పడానికి కేంద్రమంత్రి రాజ్నాథ్ రానున్నారు. ఇండియన్ నేవీ ఆఫీసర్లు దిల్నా, రూపాలకు హర్షధ్వానాలతో స్వాగతం చెప్పాల్సిన సమయం ఇది.భారత నౌకాయాన చరిత్రలో గతంలో స్త్రీల సాహసం ఎటువంటిదో నమోదు చేసే వివరాలు అంతగా తెలియదు. కాని వర్తమానంలో మన నారీశక్తి ఎంత గొప్పదో నిరూపించే ఘనయాత్రలను నావికా దళ మహిళా ఆఫీసర్లు పదే పదే నిరూపిస్తున్నారు. నావికాదళంలోని మహిళా నావికులు తమకు తాముగా సముద్రం మీద ప్రపంచ యాత్ర చేయగలరు అని చాటడానికి 2017–18లో ఆరుగురు మహిళా సిబ్బందితో ‘నావికా సాగర్ పరిక్రమ – 1’ జరిగింది. 40 వేల కి లోమీటర్లు ఐ.ఎన్.ఎస్.వి. తారిణిపై చుట్టివచ్చారు. ఆరుగురు సిబ్బంది అంటే ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ఉండే వెసులుబాటు ఎక్కువ. అయితే మనవాళ్లు అక్కడే ఆగిపోలేదు. కేవలం ఇద్దరు మహిళా ఆఫీసర్లతో ‘నావికా సాగర్ పరిక్రమ–2’ చేయ సంకల్పించారు. ఇందుకు తగిన ఆఫీసర్ల ఎంపికకే సంవత్సర కాలం పట్టింది. అనేక వడపోతల తర్వాత ఇద్దరు ఆఫీసర్లు ఈ సాహసయాత్రకు యోగ్యత పొందారు. వారే లెఫ్టినెంట్ రూపా, లెఫ్టినెంట్ దిల్నా. కేవలం ఇద్దరు ఆఫీసర్లు అనంత జలరాశిపై సెయిలింగ్ బోట్ మీద 50 వేల కిలోమీటర్లు చుట్టి రావాలంటే ఎంత ధైర్యం... సాహసం ఉండాలి? ఎన్ని సవాళ్లను ఎదుర్కోవాలి? అసలు తిరిగి వస్తారో రారో అనే భయం అయినవాళ్లను పీడించకుండా ఉంటుందా? అయినప్పటికీ అవన్నీ దాటి ఆ ఇద్దరు ధీరవనితలు తమ సాగర పరిక్రమను దిగ్విజయంగా ముగించారు. ఎనిమిది సుదీర్ఘ నెలలు సముద్రంతో చెలిమి, చెలగాటం చేసి తిరిగి మన జలాలలోకి చేరుకున్నారు. నేడు వారికి ఘనస్వాగతం గోవాలో లభించనుంది.అక్టోబర్ 2, 2024నప్రారంభంనావికా సాగర్ పరిక్రమ–2 అక్టోబర్ 2, 2024న గోవాలో మొదలైంది. ఇద్దరు నావికా ఆఫీసర్లు దిల్నా, రూపాలు అంతకుముందే ఐ.ఎన్.ఎస్.వి.తారణిలో చిన్న చిన్న దూరాలున్న సముద్ర యాత్రలు చేసి ఆ రిహార్సల్స్తో సర్వసన్నద్ధం అయ్యారు. వీరు ఎనిమిది నెలల పాటు తారణిలో ఉండాలి. 50 వేల కిలోమీటర్లు పడవ నడపాలి. మూడు మహా సముద్రాలు– ఇండియన్, పసిఫిక్, అట్లాంటిక్ గుండా ప్రయాణించాలి. నాలుగు ఖండాలు ఆసియా, ఆస్ట్రేలియా, సౌత్ అమెరికా, ఆఫ్రికాలను చుట్టాలి. కేవలం నాలుగు చోట్ల వీరు బ్రేక్ తీసుకునే ఏర్పాటు చేశారు. అవి– ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాక్ల్యాండ్, కేప్టౌన్. తారిణిలో అత్యాధునిక సిగ్నెలింగ్ వ్యవస్థ ఉంటుంది. తీరం నుంచి నావికాదళం వీరితో అనుసంధానమై ఉండి వీరి యాత్రను గమనిస్తూ ఉంటుంది. అయినా సరే నడిసముద్రంలో నావ ఉన్నప్పుడు వీరు ఇరువురు మాత్రమే ఉంటారు. వీరితోపాటు నావ. ఎదురుగా అనంత జలరాశి.గాలే కీలకంలెఫ్టినెంట్ దిల్నా, రూపా ప్రయాణిస్తున్న తారిణి ఒక సెయిలింగ్ వెస్సెల్. అంటే గాలివాటుతో ప్రయాణించాల్సిన తెరచాప పడవ. దీనికి 25 మీటర్ల ఎత్తు తెరచాపలు ఉన్నాయి. గాలి అదుపులో ఉంటే పడవ దూసుకెళుతుంది. ‘ఒక్కోసారి సముద్రం మీద రోజుల తరబడి గాలి ఉండదు. నావ కదలదు. మన సహనం పరీక్షకు గురవుతుంది’ అన్నారు దిల్నా, రూపా. అదే సమయంలో కేప్ హార్న్స్, కేప్ టౌన్, డ్రీక్ పాసేజ్ వంటి చోట ఇదే గాలి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తే పడవను అదుపు చేయడంప్రాణాంతకం అవుతుంది. గ్రీక్ పాసేజ్ దగ్గర అలలు ఐదు మీటర్ల ఎత్తుకు ఎగిరిపడుతూ పడవను ముంచెత్తుతాయి. కాగితం పడవను ఊపినట్టు ఊపేస్తాయి. అంతేకాదు కొన్నిచోట్ల అతి శీతల గాలులు... వణికించే చలి... గడ్డకట్టినంత చల్లగా ఉండే సముద్రనీరు ఉంటాయి... వీటన్నింటిని తట్టుకోవడం వల్లే దిల్నా, రూపాలను ధీరలని, సాహస నావికులని అనాలి. ముఖ్యంగా ‘కేప్ హార్న్’ను జయించే అదృష్టం అందరికీ దక్కదు. అది దాటిన వారికి ‘కేప్ హార్నర్స్’ అనే బిరుదును ఇస్తారు. ఇప్పుడు దిల్నా, రూపాలకు కూడా ఆ బిరుదు దక్కింది.నీమొ పాయింట్సముద్ర ధ్రువంగా భావించే నీమొ పాయింట్ను లెఫ్టినెంట్ దిల్నా, లెఫ్టినెంట్ రూపాలు ఈ సాగర పరిక్రమలో టచ్ చేయడం పెద్ద విశేషంగా చెప్పాలి. దాదాపుగా ఈ పాయింట్ దగ్గరకు నావికులు వెళ్లరు. దీనికి దగ్గరి భూభాగమే 2,688 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే ఆలోచించుకోవచ్చు. ఈ పాయింట్కు భూమిపై ఉండే మనుషుల కంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే మనుషులే దగ్గర. ఆ పాయింట్ను దాటిన క్షణం చారిత్రాత్మకంగా దిల్నా, రూపా భావిస్తున్నారు. ఆ పాయింట్ దగ్గర ఇద్దరూ సంబరం జరుపుకున్నారు.ఆకాశమూ, అగాథాలూగడప లోపలే ఉండిపోయినా స్త్రీ ఆకాశాలనూ అగాధాలనూ అందుకుంటూ ప్రయాణం సాగిస్తున్నది. సునీతా విలియమ్స్ ఆకాశానికి ఉన్న హద్దును చెరిపేస్తే దిల్నా, రూపాలు అగాథాల పట్ల ఉన్న భయాలను తొలగించారు.సాహస వనితలు, చరిత్రలో నిలిచిపోయిన మహిళా నావికులు దిల్నా, రూపాలు గోవాకు నేడు చేరుకుంటున్న సందర్భంగా అందరూ ఉత్సవాలు జరపాలి. వీరి గాథను పాఠాలుగా చెప్పాలి.

వేడుకగా బ్యూటీ విత్ చారిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి అంటే అత్యంత అందమైన అమ్మాయనే కాదు.. అంతకు మించిన మానవీయ విలువలున్న హృదయం, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అని మిస్ వరల్డ్ వేదిక నినదిస్తోంది. బుధవారం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్ వేదికగా నిర్వహించిన ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’చారిటీ ఈవెంట్ అలాంటి వ్యక్తిత్వాలను, మనస్సులను ప్రతిబింబించింది. మిస్ వరల్డ్ పోటీదారులతో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం ద్వారా.. ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్ సంస్థల సహకారంతో ప్రభుత్వ బాలసదన్లకు చెందిన 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో చిన్నారికి పాఠ్య పుస్తకాలు, పోషకాహారం, ప్రోటీన్ పౌడర్, సప్లిమెంట్లు, నెలవారీ రేషన్ సరఫరా, దుస్తులు, స్వెటర్లు, రెయిన్ కోట్లు, డ్రెస్సులు, స్కూల్ కిట్లు (స్కూల్ బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్లు), టాయిలెట్రీలు, డిజిటల్ వాచ్లు, విద్యా సంబంధిత ఆట బొమ్మలు, వ్యక్తిగత వస్తువుల కోసం ట్రాలీ బ్యాగ్లతో కూడిన ఒక్కొక్కటి దాదాపు రూ.25 వేల విలువైన 200 కిట్లను చిన్నారులకు అందించి సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది. ఐసీడీఎస్ బాలసదన్ల చిన్నారులకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కిట్లు అందించడంతో పాటు ఆ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆ పసి హృదయాల సంతోషాన్ని, బాధను పంచుకున్నారు. కష్టాలను అధిగమించి తమలాగే ప్రపంచ వేదికలపై ప్రత్యేకతను చాటుకునేలా ఎదగాలంటే చదువొక్కటే మార్గమని, ఆ దారిలో విశ్వాన్ని చదివేయొచ్చనే సందేశాన్ని తెలియజేశారు.పిల్లలు అడిగిన పలు ప్రశ్నలకు ‘థింక్ బిగ్, థింక్ డిఫరెంట్.. అచీవ్ గోల్స్’అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. కాగా 200 మంది విద్యార్థులకు కిట్లతో పాటు ఏడాది పాటు అన్ని విధాలా సహకరించేందుకువ వీలుగా రూ.2 కోట్ల చెక్కును మిస్ వరల్డ్ క్రిస్టీనా చేతుల మీదుగా దాతలు అందజేశారు. విక్టోరియా మెమోరియల్ పాఠశాల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కూడా దాతలు ముందుకు వచ్చారు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడీఎస్ బాలసదన్లలోని అనాథ చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కలిసే అవకాశం చిన్నారులకు కల్పించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’పేరిట ఈ చారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. కాగా మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల్లో చాలవరకు సామాజిక సేవలో ఉన్నవారు కాబట్టి ఈ పసి హృదయాలతో ఆత్మీయంగా ముచ్చటించారు. లైవ్ బ్యాండ్ అందించింన సంగీతానికి, తెలుగు పాటలకు వారు చిన్నారులతో కలిసి నృత్యం చేయడం హైలెట్గా నిలిచింది. కొందరైతే చిన్నారుల దగ్గర స్టెప్స్ నేర్చుకుని మరీ నర్తించారు. నేటి చారిటీ కార్యక్రమం బ్యూటీ విత్ పర్పస్ సారాన్ని ప్రతిబింబించింది. మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో మమేకమైన తీరు వారి సేవా నిబద్ధతను చాటింది. ఈ పోటీల్లో భాగంగా ఇంతటి ప్రభావవంతమైన సేవా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. – జూలియా మోర్లే, మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈఓ.మిస్ వరల్డ్ సంస్థతో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. రూ.2 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలకు మేం కట్టుబడి ఉన్నాం. దశల వారీగా ఈ సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం. – డాక్టర్ రామకృష్ణ, ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ చైర్మన్
ఫొటోలు


Miss world 2025 : ఆల్ ది బెస్ట్ మిస్ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)


ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్కు మండింది (చిత్రాలు)


విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)


'సీతా పయనం' మూవీ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)


అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)


జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)


కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)


మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)


పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? (ఫొటోలు)


NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళి (చిత్రాలు)
అంతర్జాతీయం

Rachel Gupta: అందాల రాణికి బిగ్ షాక్
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.న్యూఢిల్లీ/బ్యాంకాక్: ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా(Rachel Gupta) ఇన్స్టాగ్రామ్లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. ‘‘‘వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అంటూ త్వరలో ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారామె.అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) నిర్వాహకులు ఆమె పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆమె తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించార’’ని పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని ఆమెను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఫిలిప్పీన్స్కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయిపంజాబ్ జలంధర్కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగష్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందెగత్తెలను వెనక్కినెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది. ఇదీ చదవండి: తప్పతాగాడు.. టేబుల్ ఎక్కి నన్ను డ్యాన్స్ చేయమన్నాడు

‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. "Shoot me, bury me here, in Ganabhaban". These were the words of deposed Bangladeshi Prime Minister Sheikh Hasina on the fateful morning of August 5, 2024, as army officers asked her to resign amid violent student protests. Hasina eventually fled to India hours before protesters… pic.twitter.com/JzfwBtHUMp— India Today Global (@ITGGlobal) May 28, 2025

తప్ప తాగి.. నాతో అనుచితంగా ప్రవర్తించారు
ఆయనో సీనియర్ పార్లమెంటేరియన్. చట్ట సభకు సంబంధించిన ఓ కార్యక్రమం జరుగుతోంది. ఆ ఈవెంట్లో పీకల దాకా తాగారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న యువ సభ్యురాలితో అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఫిర్యాదు దాకా వెళ్లింది. సీనియర్ సభ్యుడొకరు తనను బాగా ఇబ్బంది పెట్టారని ఆస్ట్రేలియా స్వతంత్ర సెనేటర్ ఫాతిమా పేమన్(Fatima Payman) ఆరోపణలకు దిగారు. ఈ మేరకు పార్లమెంటరీ వర్క్ప్లేస్ సపోర్ట్ సిస్టమ్(PWSS)లో ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ‘‘పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన బాగా తాగారు. నన్ను కూడా తాగి.. టేబుల్ ఎక్కడి డ్యాన్స్ చేయమంటూ బలవంతం చేయబోయారు. అయితే అందుకు నేను ఒప్పుకోలేదు. .. నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అంటూ కటువుగానే ఆయనకు సమాధానం ఇచ్చా’’ ఆమె తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సదరు సీనియర్ సెనేటర్ పేరును ఆమె మీడియాకు ప్రస్తావించలేదు. అయితే ఆ వ్యాఖ్యలు మతపరంగా తన మనోభావాలను దెబ్బతీయడంతో పాటు లైంగిక వేధింపుల కిందకు వస్తుందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పీడబ్ల్యూఎస్ విచారణ జరుపుతామని ఆమెకు హామీ ఇచ్చింది.అఫ్గన్ సంతతికి చెందిన ఫాతిమా(30).. 2022లో లేబర్ పార్టీ(Labour Party) తరఫున వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికయ్యారు. ఆ టైంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. 2024లో పాలస్తీనా తీర్మానం సమయంలో ఆమె పార్టీ వైఖరికి విరుద్ధంగా ఓటేశారు. ఈ పరిణామంతో ఆమె లేబర్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ఇదేం చెండాలం?.. నడిరోడ్డు మీద డర్టీ పిక్చర్

కెనడాకు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కెనడా విలీన ఆఫర్ను ప్రకటించారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా (Canada) చేరితే.. గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందవచ్చు అని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా రక్షణ కోసం అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్ (Golden Dome)’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టులో చేరేందుకు అమెరికా పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబర్చింది.#BREAKING: Donald Trump says Canada is considering his offer to become the 51st state pic.twitter.com/QNPGN7VB92— 6ixBuzzTV (@6ixbuzztv) May 27, 2025ఈ నేపథ్యంలో కెనడా విషయమై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. మరోసారి విలీన డిమాండ్ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే.. గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందొచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కెనడా ఈ ఆఫర్ను పరిశీలించుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కెనడా నుంచి ఎలాంటి ప్రతి స్పందనా రాలేదు.గోల్డెన్ డోమ్ ఇలా..అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచం గోల్డెన్ డోమ్పై డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విలువ 175 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలావరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా.. మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకమైంది. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్వార్స్ వ్యవస్థను తలపిస్తోంది.అమెరికా విశాలమైన దేశం కావడంతో.. అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే.. అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్వర్క్నే సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఫారెన్ పాలసీ ప్రోగ్రామ్ పరిశోధన విభాగం డైరెక్టర్ మిషెల్ ఓ హన్లోన్ అభిప్రాయపడ్డారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని.. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు ఇతర సామగ్రిని పెద్ద మొత్తంలో రోదసీలోకి చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇది చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్రస్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని.. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి.
జాతీయం

ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
న్యూఢిల్లీ: ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యాచారానికి గురైనట్లు చెబుతున్న 40 ఏళ్ల మహిళ చిన్నపిల్ల కాదని పేర్కొంది. ఆమె అంగీకారంతోనే లైంగిక చర్య జరిగిట్లు పరోక్షంగా వెల్లడించింది. అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు న్యాయస్థానం బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్టు చేసి, జైల్లో పెట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా పోలీసులు అభియోగాలు నమోదు చేయలేదని, అందుకే మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ మహిళ ఆ యువకుడిని ఇష్టపూర్వకంగానే కలిస్తే అతడిపై రేప్ కేసు ఎలా నమోదు చేస్తారని ఢిల్లీ పోలీసులను జస్టిస్ బి.బి.నాగరత్న, జస్టిస్ సతీశ్చంద్ర శర్మతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అతడితో ఏడుసార్లు జమ్మూకశ్మీర్కు వెళ్లిందని, అతడిపై సెక్షన్ కింద 376 కింద కేసు పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ఈ కేసులో సదరు మహిళ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. తమ దుస్తుల బ్రాండ్ ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువకుడిని సంప్రదించారు. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యువకుడు కోరగా, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దాంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, బెయిల్పై బయట ఉన్నప్పుడు ఈ మహిళను కలవొద్దని షరతు విధించింది.

రాబోయే ఐదేళ్లూ భగభగలే!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల ధాటికి భూగోళంపై ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వాతవరణ మార్పులను కట్టడి చేసేందుకు చేపడుతున్న చర్యలేవీ ఆశించిన ఫలితాలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామికవిప్లవం కంటే ముందున్న స్థాయికి తగ్గించాలన్న లక్ష్యాలు నెరవేరడం లేదు. అభివృద్ధి చెందిన, పారిశ్రామిక దేశాల నిర్వాకం వల్ల ఈ లక్ష్యాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా పరిస్థితి ఇలాగే కొనసాగితే భూగోళం మరింత వేడెక్కడం ఖాయమని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ)తోపాటు యునైటెడ్ కింగ్డమ్ వాతావరణ కార్యాలయం హెచ్చరించాయి. ఈ మేరకు బుధవారం ఒక నివేదిక విడుదల చేశాయి. ఉష్ణోగ్రతలు పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే 2025 నుంచి 2029 వరకు ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్కుపైగా అధికంగా నమోదు కావడానికి 70 శాతం అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూఎంఓ తేల్చిచెప్పింది. రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక సంవత్సరం అత్యధిక వేడి కలిగిన సంవత్సరంగా రికార్డుకు ఎక్కడానికి 80 శాతం అవకాశాలు ఉన్నట్లు స్పష్టంచేసింది. 2024 సంవత్సరం అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. రాబోయే ఐదేళ్లలో ఈ రికార్డు బద్ధలు కానున్నట్లు డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. 1850–1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2024లో 1.5 డిగ్రీలకుపైగా అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. → ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని 2015లో జరిగిన పారిస్ వాతావరణ సదస్సులో లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు ప్రపంచ దేశాలు అంగీకారం తెలిపాయి. → 2031–2035కు సంబంధించిన జాతీయ వా తావరణ ప్రణాళికలను దేశాలు ఈ ఏడాది ఐక్యరాజ్యసమితికి సమరి్పంచాల్సి ఉంది. → 1850–1900 నాటి సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2025 నుంచి 2029 దాకా ప్రపంచ ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు ప్రతిఏటా 1.2 డిగ్రీల నుంచి 1.9 డిగ్రీల చొప్పున పెరుగుతాయని డబ్ల్యూఎంఓ నివేదిక తెలియజేసింది. → 1850–1900 నాటి సగటు ఉష్ణోగ్రతల కంటే 2025 నుంచి 2029లో కనీసం ఒక సంవత్సరంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్(2.7 డిగ్రీల ఫారెన్హీట్) అధికంగా నమోదయ్యే అవకాశం 86 శాతం ఉన్నట్లు పేర్కొంది. → ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఎన్నెన్నో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని డబ్ల్యూఎంఓ డిప్యూటీ సెక్రెటరీ జనరల్ కో బారెట్ చెప్పారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని, రోజువారి జీవితాలకు, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. → ప్రపంచంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతం వేగంగా వేడెక్కే ప్రమాదం కనిపిస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఇక్కడ మంచు చాలావరకు కరిగిపోతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. → దక్షిణాసియాలో 2023లో మినహా గత కొన్నేళ్లలో మంచి వర్షాలే కురిశాయి. ఇక్కడ 2025 నుంచి 2029 దాకా సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. కొన్ని సీజన్లలో మాత్రం వర్షాలు పడకపోవచ్చని తెలియజేసింది. → ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులకు, తుపాన్లు, కరువులకు దారి తీస్తుందని కార్నెట్ యూనివర్సిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త నటాలీ మహొవాల్డ్ చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ భూమిపై మనుషులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుంటారని స్పష్టంచేశారు.

ముక్కు కొరికేశాడు
కాన్పూర్: అపార్ట్మెంట్లో తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో వేరెవరిదో కారు నిలిపి ఉండటం చూసి పట్టరాని కోపంతో ఓ వ్యక్తి ఆ అపార్ట్మెంట్ సొసైటీ సెక్రటరీ ముక్కును రక్తమోడేలా కొరికేశాడు. ఈ అనూహ్యపరిణామం ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో జరిగింది. బాధితుడు రూపేంద్ర సింగ్ యాదవ్ కుమారుడు ప్రశాంత్, కుమార్తె ప్రియాంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాన్పూర్ శివారు నారామవూ ప్రాంతంలోని రతన్ ప్లానెట్ అపార్ట్మెంట్లో క్షితిజ్ మిశ్రా ఉంటున్నారు. ఆయనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో ఆదివారం గుర్తు తెలియని కారు ఉండటంతో మిశ్రా వెంటనే సొసైటీకి ఫిర్యాదుచేశాడు. సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ యాదవ్ అదేరోజు సాయంత్రం మిశ్రా దగ్గరకు వచ్చాడు. వాచ్మెన్, సెక్యూరిటీ గార్డులకు చెప్పానని, కారు ఎవరిదో ఆరాతీసి వెంటనే మీ స్థలం నుంచి తీయిస్తానని మిశ్రాకు నచ్చజెప్పారు. అయినాసరే ఏమాత్రం వినిపించుకోని మిశ్రా కోపంతో యాదవ్పై పలుమార్లు చేయిచేసుకున్నారు. తర్వాత యాదవ్ మెడను గట్టిగా పట్టుకుని ముక్కు కొరికేశాడు. దీంతో రక్తం ధారలా కారింది. రక్తమోడుతున్న యాదవ్ను ఆయన కుటుంబసభ్యులు దగ్గర్లోని రీజెన్సీ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అవసరమని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఆగమేఘాల మీద ఆయనను ఢిల్లీకి తరలించారు. ‘‘ ప్రస్తుతం యాదవ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తే మిశ్రాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదుచేస్తాం’’ అని కళ్యాణ్పూర్ ఏసీపీ అభిషేక్ పాండే చెప్పారు. ‘‘ రక్తమొచ్చేలా కొరికిన కోపిష్టిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని వదిలేశారు’’ అని బాధితుడి కుమార్తె ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. ముందుగా ఎలాంటి ఫిర్యాదు అందని కారణంగానే మిశ్రాను విడిచిపెట్టామని, ఇకపై ఎఫ్ఐఆర్ ప్రకారం నడుచుకుంటామని ఏసీపీ చెప్పారు.

రైతులకు రుణ పథకం పొడిగింపు
న్యూఢిల్లీ: కిసాన్ క్రెడిట్ కార్డుల(కేసీసీ) ద్వారా తక్కువ కాలవ్యవధికి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందజేసేందుకు ఉద్దేశించిన మాడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్ఎస్)ను 2025–26లోనూ కొనసాగించాలని కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయించింది. ఈ పథకం కింద 7 శాతం వడ్డీకే రుణాలు అందజేస్తారు. ఇందులో 1.5 శాతం వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే వడ్డీపై 3 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అంటే రైతులకు దాదాపు 4 శాతం వడ్డీకే రుణం లభిస్తుందని చెప్పొచ్చు. ఈ పథకం కొనసాగింపు వల్ల ఖజానాపై రూ.15,640 కోట్ల భారం పడుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఎంఐఎస్ఎస్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. కేసీసీ ద్వారా రైతులు రూ.3 లక్షల దాకా రుణం పొందవచ్చు. పాడి పశువులు, చేపల పెంపకం కోసం ఈ సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలో 7.75 కోట్లకుపైగా కేసీసీ ఖాతాలు ఉన్నాయి.
ఎన్ఆర్ఐ

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.

డాక్టర్ సతీష్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తులకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు-2025 వరించింది. అమెరికాలో గ్లోబల్ హెల్త్కేర్ లీడర్స్ ఫౌండేషన్ వార్షిక లీడర్షిప్ గాలా 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన గ్లోబల్ హెల్త్కేర్ లీడర్స్ ఫౌండేషన్ ఆయనకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ 2025 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల డాక్టర్ సతీష్ కత్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ సతీష్ కత్తుల తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. 30 ఏళ్లుగా ఆయన అమెరికాలో వైద్య సేవలందిస్తున్నారు. డేటన్, ఒహియోలో నివసిస్తున్న డాక్టర్ సతీష్ కత్తుల ప్రఖ్యాత హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్. 2024- 2025 సంవత్సరానికి గాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- AAPI కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 2024లో AAPI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన భారత్లో మూడు ప్రధాన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సమావేశాలకు నాయకత్వం వహించారు. AAPI నిర్వహించిన అనేక అంతర్జాతీయ ఆరోగ్య శిఖరాగ్ర సమావేశాలలో ఆంకాలజీ ట్రాక్స్కు అధ్యక్షత వహించారు.డాక్టర్ సతీష్ కత్తుల ఇటీవల జీవనశైలి మార్పులు, టీకాల ద్వారా క్యాన్సర్ నివారణపై దృష్టి సారించిన “స్టాప్ 3 అండ్ స్టార్ట్ 3” అనే పరివర్తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో, AAPI విద్య, స్క్రీనింగ్ మరియు రోగనిరోధకతలో సమగ్ర ప్రయత్నాల ద్వారా గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ -GAIMS తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
క్రైమ్

అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!
పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు.

12 టీబీ డాటా డిలీట్ చేసి.. ఐఎస్ఐ ఏజెంట్లతో ముచ్చట్లు
పాకిస్తాన్కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఐఎస్ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..జ్యోతి వ్యక్తిగత డివైజ్లను(ఫోన్లు, ల్యాప్ట్యాప్) పోలీసులు సీజ్ చేశారు. ఆ డివైజ్ల్లో భారీగా మెసేజ్లు, డాటా డిలీట్ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది. అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్లో ట్రావెల్ వ్లోగింగ్ చానెల్ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్మెన్లతో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి.. అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్లో ఆమె అసలు వీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు!

మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!
మిర్యాలగూడ అర్బన్: తాను డాక్టర్, ఐఏఎస్ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమెపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్టౌన్, నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాద్లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలో ఓ సీఐకి ఫోన్చేసి స్వీచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్ చేసినట్లు తెలిసింది.
వీడియోలు


నాపై పడి ఏడిస్తే ఏమొస్తుంది ?: కవిత


కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు పెట్టిన శశిథరూర్ వ్యాఖ్యలు


గద్దర్ అవార్డ్స్ ప్రకటన


సీజ్ ద థియేటర్ అంటారేమోనని వణికిపోతున్న యజమానులు


Big Question: మహానాడులో జగన్ జపం


ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు


ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్


పేరుకే బాబు సీఎం.. కానీ నడిపించేదంతా..


ఆంధ్రజ్యోతిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్


చంద్రబాబును గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారన్న రైతులు