Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

IPL 2025 Eliminator Match: Mumbai Indians Beat Gujarat Titans By 20 Runs1
IPL 2025 Eliminator Match: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై ముంబై ఇండియన్స్‌ గెలుపు

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించగా.. గుజరాత్‌ ఇంటిబాట పట్టింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. రోహిత్‌ శర్మ (81), బెయిర్‌స్టో (47), సూర్యకుమార్‌ యాదవ్‌ (33), తిలక్‌ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా (21 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ, సాయికిషోర్‌ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ ముంబై ఇండియన్స్‌ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్‌ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్‌ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్‌లో ఉన్నంత సేపు మ్యాచ్‌ గుజరాత్‌ చేతుల్లో ఉండింది. అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్‌ వరకు పోరాడినా గుజరాత్‌కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ (48) రాణించాడు. శుభ్‌మన్‌ గిల్ ఒక్క పరుగుకే ఔట్‌ కాగా.. రూథర్‌ఫోర్డ్‌ 24, తెవాతియా 16 (నాటౌట్‌), షారుఖ్‌ ఖాన్‌ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ 2, బుమ్రా, గ్లీసన్‌, సాంట్నర్‌, అశ్వనీ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ముంబై ఇండియన్స్‌ జూన్‌ 1న జరిగే క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్‌ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది.

YSRCP Slams Nara Lokesh Over Tenth Papers Valuation Errors2
ఇంత జరిగినా మౌనమేలా మంత్రి లోకేశా?: YSRCP

సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థపై ఘోరమైన మరక పడింది. పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేలమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయారంటూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌(Nara Lokesh)పై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది... పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. బోర్డు చేసిన దారుణమైన తప్పులు పాసైన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వమే ప్రమాదంలోకి నెట్టింది. ఇంత దారుణం జరిగినా మంత్రి నారా లోకేష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రశ్నించింది. .. నారా లోకేష్ చేసిన తీవ్రమైన ఒత్తిడి వలనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయటానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటి వరకు టెన్త్‌ రీవాల్యూషన్‌(AP 10th Class Revaluation) 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్వయానా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోందట. ఈ పరిణామంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని వైఎస్సార్‌సీపీ(YSRCP), ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను జోడించి తన ట్వీట్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో.. అన్ని నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.Unprecedented chaos in 10th class exam evaluation! Thousands of students’ futures at stake as 60% have applied for revaluation — a first in AP history. Shocking errors by the board failed even those who passed. Due to Nara Lokesh’s pressure, marks were tampered with. 66,363… pic.twitter.com/q34Gm46Yj1— YSR Congress Party (@YSRCParty) May 30, 2025

Rajasthan twins score identica in Class 10 board result3
వారిద్దరూ కవలలు.. వారి వెంటే అరుదైన సందర్భం!

జైపూర్‌: కవలలు.. ఇద్దరు పిల్లలు కలిసి పుడితే కవలలు అంటాం. కొన్ని సందర్భాల్లో కవలలు ఒకే పోలికలతో పుడితే.. మరికొన్ని సందర్భాల్లో వేరే పోలికలతో కూడా పుడతారు. కవలలు జంటగా పుట్టినంత మాత్రాన వారి వ్యవహారశైలి ఒకేలా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలాగని కొన్ని సందర్బాల్లో వారిద్దరూ చేసే పనులు చాలా దగ్గరగా ఉండే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ప్రధానంగా చదువుకునేటప్పుడు కవల పిల్లల తరగతుల్లో మార్పులు పెద్దగా ఉండవు. ఒకే ఏజ్‌లో ఉంటారు కాబట్టి.. వారి క్లాస్‌లు ఎప్పుడూ ఒకే రకంగా సాగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగని వారిద్దరూ ఒకేలా చదువుతారని చెప్పలేం. కానీ అలా జరిగితే మాత్రం అది చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్బంగానే చెప్పాలి. ఇప్పుడు అదే జరిగింది. రాజస్తాన్‌లోని నాగ్‌పూర్‌ జిల్లాకు చెందిన కనిష్క, కార్తీకలు.. కవలలుగా పుట్టడమే కాదు.. జంటగానే విద్యలో దూసుకుపోతున్నారు. రాజస్తాన్‌ బోర్డు నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో వారిద్దరూ ఒకే పర్సంటేజ్‌ను సాధించడమే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో వారిద్దరూ 97. 17 శాతం మార్కులతో ఉత్తీర్ణీత సాధించారు. వీరిద్దరూ సాధించిన వ్యక్తిగత మార్కుల్లో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ పర్సంటేజ్‌ పరంగా ఒకేలా రావడంతో ఆ కవలలే వెంటే అరుదైన సందర్భం అనుకోవడం మనవంతైంది. మెర్టా రోడ్డులోని కల్పనా చావ్లా ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ స్కూల్‌లో చదవిన వీరిద్దరూ.. ఒకే పర్సంటేజ్‌ సాధించడంతో తల్లి దండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. తమ పిల్లలు కలిసి పుట్టడమే కాదు.. కలిసి సాదించిన మార్కుల్లో కూడా తేడా లేకుండా ఉండటంతో వారు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్తాన్‌ రోడ్డు రవాణా సంస్థలో కండెక్టర్‌గా పని చేస్తున్న శివన్నారాయణ చౌదరి, సుమన్‌ చౌదరిల కుమార్తెలే కనిష్క, కార్తీకలు. వీరి సాధించిన మార్కులపై అటు స్కూల్‌ యాజమాన్యంతో పాటు ఇటు స్నేహితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్‌ కనిష్క, కార్తీక అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

IND A VS ENG LIONS 1st Test: Karun Nair Slams Huge Hundred, Sarfaraz Khan Misses Century4
England Tour: డబుల్‌ సెంచరీకి చేరువలో కరుణ్‌ నాయర్‌

ఇంగ్లండ్‌ లయన్స్‌తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌ ఇరగదీశారు. వీరిలో కరుణ​్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీకి చేరువలో (186 నాటౌట్‌) ఉండగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్‌ జురెల్‌ (82 నాటౌట్‌) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్‌బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత-ఏ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ కమ్‌ కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కరుణ్‌ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్‌ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్‌ ఔటయ్యాక ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను కరుణ్‌ నాయర్‌ తీసుకున్నాడు. కరుణ్‌.. సర్ఫరాజ్‌ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్‌ ఔటయ్యే సమయానికే భారత్‌ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్‌ జురెల్‌ కూడా ఇరగదీశాడు. కరుణ్‌, జురెల్‌ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్‌ను అతి భారీ స్కోర్‌ దిశగా తీసుకెళ్తున్నారు.

This Chinese CEO earned over Rs 13600 crores in 24 hours after his toy became an international sensation5
ఇదీ సంపాదనంటే.. 24 గంటల్లో రూ.13600 కోట్లు

ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్‌ అవుతుందో చెప్పలేం. మార్కెట్‌లో ఒక్కో వస్తువు ఒక్కోసారి ట్రెండ్‌ అవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు ఓ బొమ్మ ప్రపంచాన్ని షేక్‌ చేస్తోంది. స్టోర్లలో అల్లర్లకు కారణమైంది. సెలబ్రిటీల ఫేవరెట్ గా మారింది. దాని సృష్టికర్త సంపదను అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే 24 గంటల్లో రూ.13,600 కోట్లకు పైగా సంపాదించేంతలా...చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ సీఈఓ వాంగ్ నింగ్ సంపద ఒక్క రోజులోనే 1.6 బిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లకు పైగా) పెరిగింది. ఆ సంస్థ సృష్టించిన ‘లబుబు’ (Labubu) బొమ్మలే ఇందుకు కారణం. విచిత్రమైన గ్రెమ్లిన్‌ ముఖంతో రూపొందించిన ఈ బుజ్జి బొమ్మల క్రేజ్‌ ప్రపంచాన్ని ఊపేసింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ గర్ల్‌ గ్రూప్‌ బ్లాక్‌పింక్ లీసా, రోస్‌, రిహన్నా, అనన్య పాండే వంటి చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఈ లబుబు బొమ్మలు కనిపించాయి.టాప్‌ డౌన్‌లోడింగ్‌ యాప్‌లబుబు బొమ్మల క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఈ బొమ్మల కోసం కస్టమర్లు గొడవపడటంతో పాప్ మార్ట్ యూకేలో ఇన్ స్టోర్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆన్‌లైన్లో ఈ బొమ్మలు విక్రయించే పాప్ మార్ట్ మొబైల్ యాప్ అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్‌గా నిలిచింది, ఇది వాంగ్ నింగ్ నెట్‌వర్త్‌ను 18.7 బిలియన్ డాలర్లకు పెంచింది.లబుబు బొమ్మతో బ్లాక్‌పింక్‌ రోస్‌ఏప్రిల్ 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, వాంగ్ నింగ్ అమెరికాలో తన కంపెనీకి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా ఒక్క రోజులో 1.6 బిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అమెరికన్లు లబుబు బొమ్మలను కొనడానికి గంటల తరబడి క్యూ కట్టారు. ఫోర్బ్స్ ప్రకారం వాంగ్ నింగ్ రియల్ టైమ్ నెట్‌వర్త్‌ 18.7 బిలియన్ డాలర్లుగా ఉంది.

mlc kavitha comments on brs merge with bjp6
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత

సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా త‌పన అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్ర‌వారం మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా తప‌న‌. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్ద‌నేది నా వాద‌న. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుప‌డ‌లేదు. నేను జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని బీజేపీలో క‌లుపుతాన‌ని అన్నారు. పార్టీని బీజేపీలో క‌లుపుతానంటే నేను ఒప్పుకోను. లెట‌ర్ రాయ‌డంలో నా త‌ప్పేమీ లేదు. లెట‌ర్ బ‌య‌ట‌పెట్టిన వారిని ప‌ట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.

SRKs Son AbRam Celebrates 12th Birthday With Mom Sis At NMACC7
NMAC లో బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల కుమారుడు అబరామ్(AbRam) తన 12వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని నీతా ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC) లో అబ్‌రామ్‌ బర్త్‌డే వేడుక జరిగింది. ఆర్ట్స్ కేఫ్‌లో తల్లి గౌరీ ఖాన్‌, సిస్టర్స్‌ సుహానాతో కలిసి సందడి చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ,వీడియో నెట్టింట సందడి చేస్తున్నాయి.2013 మే 27న సరోగసీ ద్వారా పుట్టాడీ స్టార్‌ కిడ్‌. అబ్‌రామ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అందమైన వీడియోను NMACC అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తల్లి గౌరీ ఖాన్, ఆమె తల్లి, సవితా చిబ్బర్, సుహానా ఖాన్‌ను ఈ ఫోటోల్లో చూడవచ్చు. బబర్త్‌డే బోయ్‌ మల్టీ-టోన్ల షార్ట్స్‌తో నీలిరంగు పోలో టీ-షర్టులో డాషింగ్‌గా కనిపించాడు, సుహానా వేవ్ ప్యాటర్న్‌లతో స్ట్రాపీ మల్టీ-కలర్ మిడి-డ్రెస్‌లో అందంగా కనిపించింది. అబ్‌రామ్‌ తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య హ్యాపీ బర్త్‌డే అబ్రామ్' పేరుతో ఉన్న కేక్‌ను కట్‌ చేశాడు. మొత్తం మీద అబ్రామ్ పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు టోటల్‌ ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. అబ్‌రామ్ ఖాన్ ఇప్పటికే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ముఫాసా: ది లయన్ కింగ్ హిందీ వెర్షన్‌తో తన వాయిస్ ఓవర్‌తో అరంగేట్రం చేశాడు. చిన్ని'ముసాఫా' కి వాయిస్‌ను అందించగా, షారుఖ్ ఖాన్ ఓల్డ్‌ 'ముఫాసా'కి వాయిస్ ఇచ్చారు. అంతేకాదు గిటార్ , ఫుట్‌బాల్ వాయించడంలో అబ్‌రామ్‌కు నైపుణ్యం ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో ఇది తిరిగి విడుదలైంది. అంతేకాదు ఇదే మూవీలో ఆర్యన్ ఖాన్ 'సింబా' గా వాయిస్‌ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)> స్టార్‌ హీరో షారూఖ్‌తో పాటు, ఆయన కుమారుడు అబ్‌రామ్‌ను అభిమానులు చాలా ఇష్టపడతారు .. ఒక సందర్భంలో తన కొడుకు పేరు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, ప్రవక్త ఇబ్రహీం , రామ్ పేర్లు కలిసి ఉన్నాయని, తనకు ఆ పేరు చాలా ఇష్టమని చెప్పాడు.

A Wife Ends Life After Sent A Message To Husband Rajahmundry8
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!

ఏలూరు టౌన్‌: అన్నింటికీ నీపై ఆధారపడుతున్నాను.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్‌లో మెసెజ్‌ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్‌ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ, కళ్యాణి (32) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు శాంతినగర్‌ 21 వ డివిజన్‌ సచివాలయంలో కళ్యాణి ఏఎన్‌ఎంగా పనిచేస్తుండడంతో ఆమె కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఆమెకు ఒక రోడ్డు ప్రమాదంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఆమె చేస్తున్న ఉద్యోగంలో, కుటుంబ జీవనంలోనూ భర్తపై ఆధారపడుతోంది. ఒకవైపు కరోనా వ్యాప్తి చెందుతుందనే భయం, మరోవైపు పని భారం పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె బుధవారం ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. భర్త రామకృష్ణకు ఫోన్‌లో.. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను.. నాకు జీవితంపై విరక్తి కలిగింది.. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్‌ పెట్టింది. దీంతో ఏలూరు త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ట్రేస్‌ చేశారు. లొకేషన్‌ రాజమండ్రిలో చూపించగా అక్కడకు వెళ్లి వెదికారు. తీరా చూస్తే ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రాజమండ్రి త్రీ టౌన్‌ సీఐ వీ అప్పారావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని రాజమండ్రి సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

Kamal Haasan's Thug Life banned in Karnataka amid Kannada language row9
కమల్‌ హాసన్‌ కామెంట్స్.. కర్ణాటకలో థగ్‌ లైఫ్‌కు బిగ్‌ షాక్!

కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్‌పై వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే క్షమాపణ చెప్పాలని కమల్‌కు డెడ్‌లైన్‌ విధించిన కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమల్‌ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఎఫ్‌సీసీ కర్ణాటకలో థగ్‌ లైఫ్ సినిమాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన గడువులోగా క్షమాపణలు చెప్పకపోతే నిషేధం అమల్లోకి వస్తుందని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సారా గోవిందు స్పష్టం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ అనుకూల సంస్థల డిమాండ్లకు కూడా తమ మద్దుతు ఉంటుందని ఆయన తెలిపారు.కాగా.. ఇటీవల బెంగళూరులో జరిగన థగ్ లైఫ్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడం తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై కన్నడ భాష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో కమల్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) 'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో నిషేధించింది. ఇ‍ప్పటికే కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశారని కమల్ హాసన్‌పై కర్ణాటక రక్షణ వేదిక ఫిర్యాదు చేసింది.

Miss England Milla Magee Row: Telangana Govt Probe Done10
మిల్లా మ్యాగీ వ్యవహారం.. తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మ్యాగీ(Milla Magee) సంచలన ఆరోపణల వ్యవహారంపై విచారణ ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై తెలంగాణ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ సాక్షితో శుక్రవారం మాట్లాడారు.‘‘మిస్‌ ఇంగ్లండ్‌ మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది. అయితే ఆమె విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు లండన్‌లో కేసు వేశారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్‌ చర్యలు తీసుకుంటుంది’’ అని జయేష్‌ రంజన్‌(Jayesh Ranjan) స్పష్టం చేశారు.వ్యక్తిగత, నైతిక కారణాలను చూపుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్‌ 2025 (Miss World 2025)పోటీల నుంచి నిష్క్రమిస్తూ మిల్లా మ్యాగీ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆపై ఆమె బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్‌తో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యా. తెలంగాణపై గౌరవం పెరిగింది. అక్కడి అతిథ్యం బాగుంది. కానీ, మేం పోటీలకు వచ్చామో, దేనికొచ్చామో అర్థం కాలేదు.. ఇవేం పోటీలు?’’ అని ఆమె అన్నట్లు సదరు టాబ్లాయిడ్‌ కథనం ఇచ్చింది.అయితే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ ఈ ఆరోపణలను ఖండించారు. తన తల్లి అనారోగ్యం కారణంగా కుటుంబ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, అందుకే ఆమె పోటీ నుండి వైదొలగాలని అభ్యర్థించారని తెలిపారు. మిస్‌ వరల్డ్‌ పోటీలు.. గౌరవం, బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ విలువలకు కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు.అయితే ఈ వ్యవహారంపై తెలంగాణాలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement