Top Stories
ప్రధాన వార్తలు

రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025

ఎన్ని జన్మలెత్తినా.. కూతురు, అల్లుడిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: తన కుమార్తె, అల్లుడి కుటుంబంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై మరో కుటుంబం కొంత కాలంగా దాడి చేస్తోందని ముద్రగడ చెప్పుకొచ్చారు. తనకు కాన్సర్ వచ్చిందని.. తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను అంటూ క్లారిటీ ఇచ్చారు.తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ముద్రగడ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ముద్రగడ లేఖను విడుదల చేశారు. లేఖలో ముద్రగడ..‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.నాకు, నా వియ్యంకుడు శివాజీకి మధ్య మనస్పర్థలు తేవాలని చూస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు.. మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్లో నేను 15 రోజులు సేవ చేశాను. వీళ్ళు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. వయసు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. మరేవీ లేవు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. వీళ్లా ఈరోజు మాట్లాడేది. వీళ్లతో ఏడాది నుంచి రాకపోకలు ఆగిపోయాయి. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరు బెదిరిస్తే బెదిరి పోతానా?. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నాను.ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపి కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి. పథకాలు అమలు చేపించి చూపించండి.. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు. సిగ్గు, మర్యాద ఉంటే ఈరోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/QeI22pfm0Z— Mudragada Padmanabhareddy (@Iam_Mudragada) June 9, 2025

Mumbai: ఘోరం.. ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం
మహారాష్ట్ర: ముంబైలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం (జూన్9) ఛత్రపతి శివాజీ మహరాజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది.దివా నుంచి ముంబ్రాకు ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. 10 నుంచి 12 మంది ప్రయాణికులు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ముంబైలో విపరీతమైన రద్దీ కారణంగా లోకల్ ట్రైన్ ప్రయాణికులు ఫుట్ బోర్డింగ్లో ప్రయాణించడం సర్వసాధారణం. అయితే, ఇవాళ అలాగే ప్యాసింజర్లు డోర్లకు వేలాబడుతూ ప్రయాణించారు. ట్రైన్ ప్రారంభమైన కొద్ది సేపటికి కదులుతున్న ట్రైన్ నుంచి ప్రయాణికులు అదుపుతప్పి జారి కిందపడ్డారు. దీంతో పలువురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm— ANI (@ANI) June 9, 2025

హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య..
గౌహతి/షిల్లాంగ్: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్త జంట హనీమూన్కు వెళ్లి, అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఉదంతంలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురికాగా, భార్య సోనమ్ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమెను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ పోలీసులు అరెస్టు చేశారు.భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనమ్ కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని, భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ సోనమ్ను ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో అదుపులోకి తీసుకున్నామని, ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.దర్యాప్తు జరిగిదిలా..మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనమ్ దంపతులు మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్లోని నోంగ్రియాట్ గ్రామంలో గడిపిన 12 గంటల సమయంలో వారు ఏమి చేశారనేది ఆధారంగా చేసుకుని, పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగారు. ఇందుకోసం వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. మే 23న కనిపించకుండా పోయిన వీరు దీనికి ముందు మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్ ఆచూకీ కోసం పోలీసులు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు గాలించాయి. సోనమ్ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని ఒక గెస్ట్హౌస్కు ఆ జంట ముందుగా చేరుకుంది. మరుసటి రోజు వారు స్కూటీని అద్దెకు తీసుకుని, పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరాపుంజి)కి వెళ్లారు. తరువాత వారు తూర్పు ఖాసీ హిల్స్లోని మావ్లాఖియాట్ గ్రామానికి చేరుకుని, స్కూటీని పార్కింగ్ స్థలంలో ఉంచారు. అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్ను సంప్రదించారు. అతను మావ్లాఖియాట్ నుండి నాంగ్రియాట్కు ట్రెక్కింగ్కు చేరేందుకు మూడు గంటలు పడుతుందని, మూడు వేల మెట్లు దిగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే టైమ్ అయిపోయిందని, మర్నాడు వెళ్లవచ్చని గైడ్ వారికి చెప్పాడు. అయితే ఆ జంట తమకు రూట్ తెలుసని, గైడ్ సర్వీస్ అవసరం లేదని చెప్పారు.కాగా రాజా రఘువంశీ సోనమ్ దంపతులకు హోమ్ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసులు విచారణలో వారిద్దరూ సాయంత్రం 5.30 గంటలకు నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్స్టేకు వచ్చారని తెలిపారు. తాను రూమ్ ఛార్జీలు తీసుకుని, రిజిస్టర్లో సైన్ ఇన్ చేయమని చెప్పి, వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి, గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడటానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి, భోజనం చేసి, రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే.. మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్ అవుట్ చేస్తామని హోమ్స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట ముగ్గురు టూరిస్టులతో పాటు మావ్లాఖియాత్ గ్రామం వైపు వెళ్లడం చూశానని తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది.

కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
వాషింగ్టన్: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021

బామ్మ కోరిక నెరవేర్చిన ఆర్సీబీ స్టార్
ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ ఓ ముసలి మహిళా అభిమాని కోరిక తీర్చాడు. వెస్టిండీస్తో నిన్న (జూన్ 8) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ యువకుడు తన బామ్మ కోసం ఓ సిక్స్ కొట్టాలని బేతెల్ను కోరాడు. అడిగిందే తడువుగా బేతెల్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో (రెండో బంతి) సిక్సర్ కొట్టి బామ్మ కోరిక నెరవేర్చాడు. అల్జరీ జోసఫ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందు బంతికి కూడా బేతెల్ సిక్సర్ బాదాడు. అదే ఓవర్లో ఐదో బంతిని కూడా సిక్సర్గా మలిచిన బేతెల్, చివరి బంతికి ఔట్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్లో బేతెల్ ఆడిన ఇన్నింగ్స్ ఛేదనలో ఇంగ్లండ్ గెలుపుకు దోహదపడింది. ఈ ఇన్నింగ్స్లో బేతెల్ 10 బంతులు ఆడి 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా విండీస్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాన్సన్ ఛార్లెస్ (47), షాయ్ హోప్ (49) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్)) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు.పావెల్, షెపర్డ్, హోల్డర్, ఛేజ్ విజృంభించడంతో విండీస్ చివరి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు చేసింది. ఆదిల్ రషీద్ వేసిన 19 ఓవర్లో హోల్డర్, షెపర్డ్ ఊచకోత కోశారు. ఈ ఓవర్లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్లో 8, ఆఖరి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్ డకెట్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బేతెల్ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు), టామ్ బాంటన్ (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్లు సిరీస్ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్లోని చివరిదైన మూడో టీ20 మంగళవారం సౌతాంప్టన్లో జరుగుతుంది.

సాయం చేయాలంటూ 'మంచు మనోజ్' ట్వీట్
భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్.. తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే, తాజాగా రెండురోజుల ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్ ఒక పోస్ట్ చేశారు. సోషల్మీడియాలో వైరల్ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్లు తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్ కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే.సాయం చేయాలంటూ మంచు మనోజ్ ఇలా ట్వీట్ చేశారు. ' రెండురోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలాబాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ, ఆమెను కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను. ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనదే.' అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాను షేర్ చేశారు. అయితే, చాలామంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, వారి బ్యాంక్ వర్క్ చేయడం లేదని కొందరు స్క్రీన్ షాట్స్ పంపడంతో.. మంచు మనోజ్ మరోక బ్యాంక్ ఖాతా నంబర్ను షేర్ చేశారు. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రూ. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం మనోజ్ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్ సోషల్మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు.Thank you all for the immediate response.As most of you are facing problem while transferring, Here are the new bank details.Please do extend your help for this little one suffering with this acute heart problem she doesn't deserve 🙏CURRENT ACCOUNT YELLA NAVYA SRIACCOUNT… https://t.co/nwV0PthPLm— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 8, 2025

ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు
అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధులైన వేళ.. గవర్నమెంటు వారు రాతపూర్వకంగా గడువుతేదీని పొడిగించినట్లు సెలవిచ్చారు. ట్యాక్స్ ఆడిట్ కాని అన్ని కేసులకు గడువు తేదీ 2025 జులై 31. అన్ని ఫారాలను వరుసగా నోటిఫై చేశారు. నోటిఫై చేసిన తర్వాత తీరా రిటర్న్ ఫైల్ చేద్దామని వెళితే.. అంతా రెడీగా లేదు. అందరి ఉత్సాహం నీరుకారింది. అటు అసెస్సీలకు, ఇటు వృత్తి నిపుణులకు అసహనం, అనుమానం రెండూ ఏర్పడ్డాయి. అంతలోనే ఈ పొడిగింపు వార్త వచ్చింది. ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు పొడిగించారంటే..1. ఫారాలు నోటిఫై చేశారు కానీ అప్డేటెడ్ ఫారాలు చాలా లేటుగా వచ్చాయి. 2. ఫైలింగ్ చేయడానికి ఉండే యుటిలిటీలు రెడీగా లేవు.3. ఇక్కడ చేయవలసింది పొడిగింపు కాదు. ఈ చర్య అనివార్యం కాదు. దానికి బదులుగా యుటిలిటీలను రెడీ చేయాల్సింది. ఎన్నో విషయాలు చకచకా చేసే ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించిందో అంతుపట్టడం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి పొడిగింపు ఇవ్వకుండా/లేకుండా ఒక నిశ్చితమైన, నిర్దిష్టమైన వైఖరితో ఉంటూ ప్రభుత్వం ఒక మంచి సంప్రదాయాన్ని సృష్టించింది. అందరూ ఈ వైఖరిని మొదట్లో మెచ్చుకోక పోయినా, తర్వాత సర్దుకుని సద్దుమణిగారు. ఒక ముఖ్యమైన పని సకాలంలో జరిగిపోతుంది కదా అని సరదాపడ్డారు. యుటిలిటీని ఎనేబుల్ చేసి, అసెస్సీలను ఆకట్టుకుంటే ఎంతో బాగుండేది. ఒక సత్సంప్రదాయాన్ని మూడోసారి ముచ్చటగా కొనసాగించిన ఘనత దక్కించుకునే పరిస్థితుల్లో.. ఏకంగా 45 రోజులు పొడిగించారు. కొంత మంది సంతోషపడ్డారు. మరికొందరు సంబరపడ్డారు. కానీ పొడిగింపు అనేది పరిష్కారం కాదు. పని అలస్యం అవుతుందే తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు. పొడిగింపు అనగానే అందరు అసెస్సీలు ఈ విషయాన్ని లైట్గా తీసుకుని పోస్ట్పోన్ చేస్తారు. ఆటోమేటిక్గా అన్నీ పోస్ట్పోన్ అయిపోతాయి. గత రెండు నెలల్లో చేయలేని యుటిలిటీలను ఎప్పుడు రెడీ చేస్తారు? ఎన్ని రోజుల్లో రెడీ చేస్తారు? డెవలప్మెంట్కి, ఇంటిగ్రేషన్కి, టెస్టింగ్కి వ్యవధి కావాలని సెంట్రల్ బోర్డ్ చెప్తోంది. అంటే వారికి నిర్దిష్టమైన ప్లాన్ ఉన్నా ఎప్పుడు రెడీగా ఉంటారో తెలియదన్నమాట.సాధారణంగా మే 31 తర్వాత టీడీఎస్ స్టేట్మెంట్లలో అన్ని పద్దులు కనిపిస్తాయి. అవి ఆలస్యం అవుతాయి. ఒకవేళ కనిపించినా, సిస్టమ్స్ రెడీగా లేవు. ఇంకో సమస్య ఏమిటంటే, ట్యాక్స్ ఆడిట్కి గడువు తేదీ 2025 సెప్టెంబర్ 30. ఈ గడువు తేదీని కూడా పొడిగిస్తారా అనేదానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వృత్తి నిపుణులు జులై 31 తర్వాత ట్యాక్స్ ఆడిట్ కేసులను చేపడతారు. ఇప్పుడు రెండు గడువు తేదీలకు పదిహేను రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీని వల్ల పని ఒత్తిడి. మానసిక ఒత్తిడి. టైం చాలకపోవడం.. తప్పులు దొర్లే అవకాశం.. ఇలా ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: సెబీ పేరుతో మోసాలుట్యాక్స్ ఆడిట్ కేసుల విషయంలో పొడిగింపు లేదు. విద్యార్థులు పరీక్షలు నిర్వహించే తేదీ పొడిగించగానే ముందు సంతోషిస్తారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. నిజానికి ఆ పొడిగింపు వల్ల వారి శ్రమ రెట్టింపైందని. ఈ పొడిగింపు కూడా అలాంటిదే. గడిచిన సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఎంత కాలం సేకరిస్తూ కూర్చుంటారు. తినగ తినగ వేము తియ్యనుండులాగా ఇదేమీ పరిపక్వతకు సంబంధించిన విషయం కాదు. నైపుణ్యాలు, నాణ్యత పెరగవు. కానీ మీరు మాత్రం రెడీగా ఉండక తప్పదు. యుటిలిటీలు రెడీ కాగానే ఫైల్ చేయండి. వారు అడుతున్న సమాచారం మీ చేతిలో ఉందని బలమైన నమ్మకంతో ఉండండి.

ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్.. మాదిగ, గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు.

టీటీడీ విజిలెన్స్ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో
తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్ పాయింట్కు సమీపంలోని ఏటీఎం సెంటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్కు అభిముఖంగా ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో అండర్ పాస్ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రారంభమవుతుంది. భక్తులు ఈ అండర్ పాస్ ద్వారాకాలినడక ప్రారంభిస్తారు. ఏటీఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు.టీటీడీ విజిలెన్స్ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ నిద్ర మత్తులో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి విజిలెన్స్ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరాయంగా పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో వరుస నిఘా వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.🚨 #BRNaiduUnfitForTTDఅలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా @ncbn, @PawanKalyan, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ?శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు… pic.twitter.com/HftbdINhv1— YSR Congress Party (@YSRCParty) June 8, 2025
సండే ఆన్ సైకిల్ : సైకిల్ మన దినచర్యలోభాగం కావాలి!
ఎన్ని జన్మలెత్తినా.. కూతురు, అల్లుడిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
Mumbai: ఘోరం.. ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం
నెక్లెస్ రోడ్లో తెలంగాణా రన్ 2025
ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు
‘మోదీ 3.0’కు 11 ఏళ్లు.. ఈ ఏడాది మైలురాళ్లివే..
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
శివకార్తికేయన్తో ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్..
భారత్-భూటన్ చిల్.. లాంగ్.. టూర్
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
మొత్తానికి శ్రీవారు ప్రపోజ్ చేశారు, సీక్రెట్ చెప్పిన ‘ప్రేమపావురం’ (ఫొటోలు)
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
గ్రాండ్గా అఖిల్- జైనాబ్ రిసెప్షన్ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
అఖిల్ అక్కినేని సతీమణి 'జైనబ్' ఫోటోషూట్ లుక్స్ చూశారా..? (ఫొటోలు)
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
విమాన సిబ్బంది తీరుపై అసహనం
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్దే టైటిల్.. రన్నరప్ ముంబై ఇండియన్స్..!
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
సండే ఆన్ సైకిల్ : సైకిల్ మన దినచర్యలోభాగం కావాలి!
ఎన్ని జన్మలెత్తినా.. కూతురు, అల్లుడిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
Mumbai: ఘోరం.. ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం
నెక్లెస్ రోడ్లో తెలంగాణా రన్ 2025
ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు
‘మోదీ 3.0’కు 11 ఏళ్లు.. ఈ ఏడాది మైలురాళ్లివే..
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
శివకార్తికేయన్తో ఇద్దరు ట్రెండింగ్ హీరోయిన్స్..
భారత్-భూటన్ చిల్.. లాంగ్.. టూర్
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
స్పా ముసుగులో వ్యభిచారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అనూష కలిసి..
శ్రేయాస్ అయ్యర్ను పెళ్లి చేసుకున్నాను.. తల్లిని కూడా: నటి
అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
20 ఏళ్లు దాటేసినా 'వెంకీ'లో అది కనిపెట్టలేకపోయారు
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
రెండు వేల కోట్ల అధిపతి.. శ్రీను వైట్ల ఏం అన్నారంటే..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
ఈ రాశి వారు ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్
నన్ను దూరం పెట్టాడు.. ఎందుకు వదిలేస్తున్నావని నిలదీశా!
గ్రాండ్గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
IPL 2025: 'ఈ లెక్కన' పంజాబ్దే టైటిల్.. రన్నరప్ ముంబై ఇండియన్స్..!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఇంటిలో శుభకార్యాలు
విమాన సిబ్బంది తీరుపై అసహనం
నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా: అతియా ఎమోషనల్
టీడీపీకి బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా
సాక్షి కార్టూన్ 09-06-2025
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..
సినిమా

పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా.. లెక్క ప్రకారం జూన్ 12న థియేటర్లలోకి రావాలి. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బహుశా జూలైలో రిలీజ్ ఉండొచ్చు. మార్కెట్లో చూసుకుంటే ఈ సినిమాపై అసలు బజ్ లేదు. మొన్నీమధ్య అంటే శుక్రవారం మచిలీపట్నంలో మూవీ ఈవెంట్ జరగ్గా.. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఓ విషయాన్ని మర్చిపోయిన ఈమె.. ఓ రకంగా మూవీ పరువు తీసేసిందనే చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే?పవన్ 'హరిహర..' సినిమా నుంచి ఇదివరకే రెండు మూడు పాటలు రిలీజయ్యాయి కానీ వాటికి పెద్దగా రీచ్ లేదు. ఇప్పుడు మచిలీపట్నం ఈవెంట్ని యాంకరింగ్ చేసిన ఉదయభాను, డైరెక్టర్ జ్యోతికృష్ణతో మాట్లాడుతుంటే మధ్యలో కల్పించుకుని.. ఇదంతా చూస్తుంటే ఇందులో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓ పాట పాడి ఉంటారని, అదేంటో చెప్పండి.. సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారా? అని ఏమీ తెలియనట్టుగా అడిగేసింది. దీంతో డైరెక్టర్ ఏం అనాలో తెలీక బిక్కమొహం వేశాడు.(ఇదీ చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్బీ..)ఎందుకంటే కొన్నాళ్ల క్రితం పవన్ పాడిన 'మాట వినాలి' అనే పాటనే తొలుత రిలీజ్ చేశారు. ఈవెంట్కి యాంకరింగ్ చేస్తున్న ఉదయభానుకి ఆ విషయం కూడా తెలియకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె అడిగేసరికి అక్కడిక్కడ కవర్ చేసిన దర్శకుడు జ్యోతికృష్ణ.. పాట గురించి చెప్పుకొచ్చారు. అలానే ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ పవన్ ఇప్పటికీ మూడుసార్లు సినిమా చూశారని, ఆయనకు తెగ నచ్చడంతో గంటసేపు తనని మెచ్చుకున్నారని జ్యోతికృష్ణ చెప్పాడు.అప్పుడెప్పుడో 2020లో మొదలైన ఈ సినిమా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ ముగించుకుంది. థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటే ఎక్కడలేని కష్టాలన్నీ వస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని మూవీ టీమ్ అంటోంది గానీ మూవీ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రావడం లేదని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి అన్ని అడ్డంకులు దాటుకుని 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి ఎప్పుడొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు)

అరటిపండ్లు అమ్మా, నెంబర్ ప్లేట్లు తయారు చేశా.. మారుతి
సాక్షి, విశాఖపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. హారర్ జానర్అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్ (Prabhas)తో ద రాజా సాబ్ (The Raja Saab Movie) అనే హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్ ఫెస్టివల్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. బొమ్మలు గీసుకునేవాడినినేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్బుక్లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్ షాపు ఉండేది. నెంబర్ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నా.. అంచనాలు పెంచేసిన మారుతిరాజా సాబ్ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని రాజాసాబ్పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్ (ట్విటర్)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్స్టాప్, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్.. ఇలా పలు సినిమాలు చేశాడు. Still feels like yesterday :)#PremaKathaChitram Memories are fresh in my mind….♥️ And now even more excited for this anniversary… because after a long time stepping back into that zone again…..But this time it’s a horror fantasy.I promise #TheRajaSaab will be a celebration… https://t.co/naoZekmCBH— Director Maruthi (@DirectorMaruthi) June 7, 2025 చదవండి: ప్రభాస్ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు

క్యాన్సర్తో పోరాటం.. ఆ స్టార్ హీరో సపోర్ట్ మరిచిపోలేను: సోనాలి బింద్రే
మురారి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. ఆ సినిమాతో ఒక్కసారిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆ తర్వాత కూడా తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తాను క్యాన్సర్ చికిత్స తీసుకున్న అనుభవాలను పంచుకుంది. ఆ సమయంలో తనకు ఓ స్టార్ హీరో పూర్తి మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరు ఆ స్టార్ హీరో తెలుసుకుందామా?2018లో సోనాలి బింద్రేకు క్యాన్సర్ రావడంతో అమెరికాలోని న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుంది. ఆ సమయంలో తన చికిత్స గురించి పదే పదే ఆరా తీశారని తెలిపింది. నేను చికిత్స పొందుతున్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చాడని సోనాలి వెల్లడించింది. తనకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.. అంతేకాదు వారితో కూడా మాట్లాడాలని సల్మాన్ అడిగారని తెలిపింది.అయితే ఇటీవల 'హమ్ సాత్ సాత్ హై' చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ తీరుపై సోనాలి విమర్శలు చేసింది. తనను కొట్టాలన్నంత కోపం వచ్చిందని తెలిపింది. 1999లో వచ్చిన హమ్ సాత్ హై సినిమా షూటింగ్లో సల్మాన్ నన్ను చూసి ముఖం చిట్లించేవాడు. అది చూసి నాకు చాలా కోపమొచ్చేది. తను నచ్చేవాడే కాదు. ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేవాళ్లమని వెల్లడించింది. ఇక సినిమాల విషయానికొస్తే సోనాలి బింద్రే 'ది బ్రోకెన్ న్యూస్' రెండో సీజన్లో కనిపించింది.

కొత్త పయనం
సుప్రజ్, సంగీర్తనా విపిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పయనం’. చందు రామ్ దర్శకత్వంలో ఛాయా చిత్రాలు పతాకంపై స్వర్ణ కమల నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సంగీత దర్శకుడు–నటుడు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్ చేయగా, కొరియోగ్రాఫర్ రఘు క్లాప్ ఇచ్చారు.ఈ సందర్భంగా చందు రామ్ మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్తో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలో కనిపిస్తారు. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసే అంశాలెన్నో ఉన్నాయి’’ అన్నారు. ‘‘నేటి తరం ప్రేక్షకులు మెచ్చే వైవిధ్యమైన చిత్రమిది’’ అన్నారు స్వర్ణ కమల. రఘు కుంచె ఆమని, మైమ్ మధు, మెహబూబ్ భాషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: షోయబ్.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

70వ ప్రయత్నంలో ఒకరు... 52వ ప్రయత్నంలో మరొకరు
పారిస్: పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే... ఎట్టకేలకు తమ గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్ కలను నెరవేర్చుకున్నారు మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్), హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా). గెలవాలన్న కసి ఉండాలేగానీ వయసుతో సంబంధం లేదని వీరిద్దరూ నిరూపించారు. 39 ఏళ్ల గ్రానోలెర్స్ 2007 నుంచి... 40 ఏళ్ల జెబలాస్ 2009 నుంచి గ్రాండ్స్లామ్ టోర్నీలలో పోటీపడుతున్నారు. చివరకు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో వీరిద్దరి గ్రాండ్స్లామ్ టైటిల్ స్వప్నం సాకారమైంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ఐదో సీడ్ గ్రానోలెర్స్–జెబలాస్ ద్వయం 6–0, 6–7 (5/7), 7–5తో ఎనిమిదో సీడ్ జో సాలిస్బరీ–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జంటను ఓడించి తమ కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టైటిల్ను దక్కించుకుంది. తాజా ఫ్రెంచ్ ఓపెన్కంటే ముందు గ్రానోలెర్స్ 69 సార్లు... జెబలాస్ 51 సార్లు గ్రాండ్స్లామ్ టోర్నీనల్లో బరిలోకి దిగారు. గతంలో గ్రానోలెర్స్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019, 2014), ఫ్రెంచ్ ఓపెన్ (2014)లలో... జెబలాస్... వింబుల్డన్ (2023, 2021), యూఎస్ ఓపెన్ (2019)లలో ఫైనల్ చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతోనే సరిపెట్టుకున్నారు. ఈసారి మాత్రం విజేతలుగా అవతరించి తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. చాంపియన్గా నిలిచిన గ్రానోలెర్స్–జెబలాస్ జోడీకి 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్మనీగా లభించింది.మహిళల డబుల్స్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ జోడీ జాస్మిన్ పావోలిని–సారా ఎరాని (ఇటలీ) టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో పావోలిని–సారా ఎరాని ద్వయం 6–4, 2–6, 6–1తో అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జంటను ఓడించింది. సారా ఎరానికిది ఆరో గ్రాండ్స్లామ్ డబుల్స్ టైటిల్. రొబెర్టా విన్సీ (ఇటలీ)తో కలిసి సారా ఎరాని గతంలో యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లోనూ సారా ఎరాని ఇటలీకే చెందిన ఆండ్రియా వావసోరితో జతకట్టి టైటిల్ గెలిచింది. మహిళల డబుల్స్ టైటిల్ గెలిచిన పావోలిని–సారా ఎరాని ఖాతాలో 5,90,000 యూరోలు (రూ. 5 కోట్ల 76 లక్షలు) ప్రైజ్మనీగా చేరాయి.

ఇంగ్లండ్దే టి20 సిరీస్
బ్రిస్టల్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు... వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ షై హోప్ (38 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్లు), రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్లు), జేసన్ హోల్డర్ (9 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ల్యూక్ వుడ్ 2 వికెట్లు తీయగా... బ్రైడన్ కార్స్, జేకబ్ బెథెల్, ఆదిల్ రషీద్లకు ఒక్కో వికెట్ దక్కింది. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్ డకెట్ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బెథెల్ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్లు), టామ్ బాంటన్ (11 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. సిరీస్లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్ మంగళవారం సౌతాంప్టన్లో జరుగుతుంది.

భారత్ ఖాతాలో ఆరు స్వర్ణాలు
తైపీ సిటీ: తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో చివరిరోజు భారత అథెట్లు ఏకంగా అరడజను స్వర్ణ పతకాలతో మెరిశారు. మహిళల జావెలిన్ త్రోలో ఒలింపియన్ అన్ను రాణి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్ విభాగంలో విత్యా రామ్రాజ్... మహిళల 800 మీటర్ల విభాగంలో పూజ... పురుషుల 800 మీటర్ల విభాగంలో కృషన్ కుమార్... పురుషుల జావెలిన్ త్రోలో రోహత్ యాదవ్ పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు.పురుషుల 4–400 మీటర్ల రిలేలో సంతోష్, విశాల్, మనూ, ధరమ్వీర్లతో కూడిన భారత బృందం (3ని:05.58 సెకన్లు) బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అన్ను రాణి జావెలిన్ను 56.82 మీటర్ల దూరం... రోహిత్ యాదవ్ 74.42 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచారు. విత్యా 400 మీటర్ల దూరాన్ని 56.53 సెకన్లలో పూర్తి చేసింది.పూజ 800 మీటర్లను 2ని:02.79 సెకన్లలో... కృషన్ కుమార్ 800 మీటర్ల దూరాన్ని 1ని:48.46 సెకన్లలో పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో యశస్ పలాక్ష (42.22 సెకన్లు) రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మహిళల లాంగ్జంప్ ఈవెంట్లో భారత క్రీడాకారిణులు శైలీ సింగ్ (6.41 మీటర్లు) రజతం, అన్సీ సోజన్ (6.39 మీటర్లు) కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.

అల్కరాజ్ అదరహో
పారిస్: ఊహకందని మలుపులతో సాగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)తో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ అల్కరాజ్ 4–6, 6–7 (4/7), 6–4, 7–6 (7/3), 7–6 (10/2)తో చిరస్మరణీయ విజయం సాధించాడు. 5 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో అల్కరాజ్ తొలి రెండు సెట్లను చేజార్చుకున్నా... ఆందోళన చెందకుండా ఆడి తర్వాతి మూడు సెట్లలో నెగ్గి విజేతగా నిలిచాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ గెలుపుతో అల్కరాజ్ తన కెరీర్లో ఐదో గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ను దక్కించుకున్నాడు. చాంపియన్గా నిలిచిన అల్కరాజ్కు 25 లక్షల 50 వేల యూరోలు (రూ. 24 కోట్ల 91 లక్షలు), రన్నరప్ సినెర్కు 12 లక్షల 75 వేల యూరోలు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. అల్కరాజ్ ఆడిన ఐదు గ్రాండ్స్లామ్ ఫైనల్స్లోనూ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటి వరకు అల్కరాజ్ 2025, 2024 ఫ్రెంచ్ ఓపెన్... 2023, 2024 వింబుల్డన్... 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. కెరీర్లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడిన సినెర్ తొలి రెండు సెట్లను సొంతం చేసుకొని టైటిల్ దిశగా సాగిపోయాడు. అయితే అల్కరాజ్ పట్టువీడలేదు. మూడో సెట్ నుంచి అనూహ్యంగా పుంజుకున్నాడు. మూడో సెట్లోని నాలుగో గేమ్లో, పదో గేమ్లో సినెర్ సర్వీస్లను బ్రేక్ చేసిన అల్కరాజ్ సెట్ను 6–4తో నెగ్గి మ్యాచ్లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నాలుగో సెట్లో అల్కరాజ్ టైబ్రేక్లో పైచేయి సాధించాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఒకదశలో అల్కరాజ్ 5–4తో గెలుపు అంచులో నిలిచాడు. అయితే సినెర్ పదో గేమ్లో అల్కరాజ్ సర్వీస్ను బ్రేక్ చేసి స్కోరును 5–5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. దాంతో చివరి సెట్లోనూ టైబ్రేక్ అనివార్యమైంది. ముందుగా 10 పాయింట్లు సాధించిన అల్కరాజ్ సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.
బిజినెస్

అమెరికా రెట్టింపు సుంకాలతో భారత్పై తీవ్ర ప్రభావం: జీటీఆర్ఐ
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో భారతీయ ఎగుమతులు ప్రభావితం అవుతాయని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్(జీటీఆర్ఐ) తెలిపింది. ముఖ్యంగా వాల్యూ యాడెడ్, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. యూఎస్ స్టీల్ పరిశ్రమ మనుగడ దృష్ట్యా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్ను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మే 30న ప్రకటించారు. సుంకాల పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి వస్తాయన్నారు ‘‘భారత్పై సుంకాల పెంపు పరిణామం ప్రత్యక్షంగా ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. ఈ సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్ ప్రతీకార సుంకాలను విధిస్తుందో లేదో చూడాలి’’ అని జీఆర్టీఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో విధించిన ఉక్కు సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను విధించే ఉద్దేశాన్ని సూచిస్తూ భారత్ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ)లో అధికారిక నోటీసు జారీ చేసింది. భారత్ 2024–25లో 4.56 బిలియన్ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిలో 587.5 మిలియన్ డాలర్ల ఇనుము, ఉక్కు, 3.1 బిలియన్ డాలర్లు ఇనుము లేదా ఉక్కు ఉత్పత్తులు, 860 మిలియన్ డాలర్లు అల్యూమినియం సంబంధిత ఉత్పత్తులున్నాయి. ధరల పోటీతత్వం తగ్గుతుంది: ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ భారతీయ స్టీల్ ఎగుమతులైన స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, స్ట్రక్చరల్ స్టీల్ విడిభాగాలు, ఆటోమోటివ్ స్టీల్ భాగాలైన సెమీ ఫినిష్డ్, ఫినిష్ట్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అధ్యక్షుడు ఎస్సీ రాల్హన్ తెలిపారు. అధిక పన్నులు అమెరికా మార్కెట్లో ధరల పోటీతత్వాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ వాణిజ్యం, తయారీ సప్లై చైన్ను నిరాశపరుస్తాయన్నారు.

డిజిటల్ మోసాలపై కలసికట్టుగా పోరాడుదాం
న్యూఢిల్లీ: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కలసికట్టుగా పోరాడుదామంటూ 40కి పైగా బ్యాంక్లు, ఆర్బీఐ, ఎన్పీసీఐని ఎయిర్టెల్ కోరింది. మోసపూరిత డొమైన్ల సమాచారంతో రిపాజిటరీ ఏర్పాటు చేయడంతోపాటు సన్నిహిత సహకారానికి పిలుపునిచ్చింది. హానికారక, మోసపూరిత వెబ్సైట్లను బ్లాక్ చేసే విషయంలో కలసి పనిచేద్దామని కోరుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు రాసిన లేఖలో ఎయిర్టెల్ కోరింది. బహుళ అంచల రక్షణ కవచం ఏర్పాటు ద్వారా డిజిటల్ మోసాలపై పోరాడుదామని కోరింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత భద్రంగా మార్చే విషయంలో ఎన్పీసీఐ, ఎయిర్టెల్ మధ్య భాగస్వామ్యానికి బలమైన అవకాశాలున్నట్టు పేర్కొంది. మోసాలను గుర్తించి, వాటిని అడ్డుకునేందుకు ఎయిర్టెల్ అమలు చేస్తున్న చర్యలను ప్రస్తావించింది. హానికారక వెబ్సైట్లు, ఫిషింగ్ లింక్ల యాక్సెస్ను బ్లాక్ చేయడం ద్వారా యూజర్ల రక్షణ చర్యలు అమలు చేస్తున్నట్టు తెలిపింది. ఇదే మాదిరి ఆర్బీఐకి సైతం ఎయిర్టెల్ లేఖ రాసింది. నియంత్రణ పరమైన సంప్రదింపుల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలియజేసింది. వినియోగదారుల రక్షణ (మఖ్యంగా ఆర్థిక సమాచారం) విషయంలో ఓటీటీ ప్లాట్ఫామ్లను జవాబుదారీ చేసే కార్యాచరణ విషయంలో సహకారం అందిస్తానంటూ ఆర్బీఐకి ఎయిర్టెల్ తెలియజేసింది. డిజిటల్ మోసాలు, రక్షణ చర్యలపై ఉమ్మడి అవగాహన ప్రచార, శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మోసాల నివారణకు ఉమ్మడిగా కలసి పనిచేద్దామంటూ ఎయిర్టెల్ లోగడ పోటీ టెలికం కంపెనీలైన జియో, వొడాఫోన్ ఐడియాలకు సైతం విడిగా కోరడం గమనార్హం. 2024 మొదటి తొమ్మిది నెలల్లో 1.7 మిలియన్ సైబర్ మోసాల రూపంలో వినియోగదారులు రూ.11,000 కోట్లు నష్టపోయినట్టు ఎయిర్టెల్ పేర్కొంది.

ఎయిర్క్రాఫ్ట్ అప్గ్రేడ్పై రిలయన్స్ ఇన్ఫ్రా దృష్టి
న్యూఢిల్లీ: యుద్ధ విమానాల అప్గ్రేడ్ (నవీకరణ/ఆధునికీకరణ) వ్యాపారంలోని అవకాశాలపై అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా కన్నేసింది. వచ్చే 5–10 ఏళ్ల కాలంలో రూ.5,000 కోట్ల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవడం పట్ల కంపెనీ ఆశావహంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఓఈఎం కాకుండా సొంతంగా సమగ్రమైన ఎయిర్క్రాఫ్ట్ అప్గ్రేడ్ కార్యక్రమాలను నిర్వహించే తొలి దేశీ కంపెనీగా రిలయన్స్ ఇన్ఫ్రా గుర్తింపు తెచ్చుకోనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి ఇప్పటికే 55 డార్నియర్ –228 ఎయిర్క్రాఫ్ట్ల అప్గ్రేడ్ కాంట్రాక్టును సొంతం చేసుకోవడంతోపాటు విజయవంతంగా అమలు చేసినట్టు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన జెనెసిస్ కంపెనీ సహకారంతో ఈ కాంట్రాక్టును అమలు చేసినట్టు తెలిపాయి. మొదట 37 ఎయిర్క్రాఫ్ట్లకు సంబంధించి ఆర్డర్ సొంతం చేసుకోగా, అనంతరం మరో 18 ఎయిర్క్రాఫ్ట్ల అప్గ్రేడ్ కాంట్రాక్టు సైతం లభించినట్టు వెల్లడించాయి. ఈ మొత్తం ఆర్డర్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని తెలిపాయి. ఈ డార్నియర్ యుద్ధ విమానాలు ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ వినియోగిస్తున్నవి కావడం గమనార్హం. భారీ మార్కెట్.. యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ల జీవిత కాలం సాధారణంగా 30–40 ఏళ్లుగా ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని అప్గ్రేడ్ చేయడం అవసరం. ఎయిర్క్రాప్ట్ అప్గ్రేడ్, ఎంఆర్వో సేవల కోసం ఒక యుద్ధ విమానం కొనుగోలు ధరతో పోలి్చతే 200–300 శాతం వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఈ మార్కెట్ రూ.5 లక్షల కోట్లుగా ఉంటే, వచ్చే ఏడేళ్లలో రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు నెలకొన్నాయి. తొలుత దేశీ మార్కెట్తోపాటు తదుపరి అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలను సొంతం చేసుకోవాలన్న వ్యూహాత్మక దృష్టితో రిలయన్స్ ఇన్ఫ్రా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రంపచస్థాయి పరిష్కారాలను అందించాలనుకుంటోంది. ఫ్రాన్స్కు చెందిన థేల్స్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇన్ఫ్రా ఇప్పటికే రఫేల్ ఫైటర్ జెట్స్కు సంబంధించి పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ (పీబీఎల్) కార్యక్రమంలో కీలక సంస్థగా సేవలు అందిస్తోంది.

వర్షపాతంపై మార్కెట్ల దృష్టి
గత వారం ఆర్థికవేత్తలను ఆశ్చర్యపరుస్తూ ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.5 శాతం కోత పెట్టింది. అంతేకాకుండా బ్యాంకుల నగదు లభ్యతను పెంచుతూ సీఆర్ఆర్ను 1 శాతం తగ్గించింది. దీంతో వారాంతాన మార్కెట్లకు జోష్ వచ్చింది. పాలసీ నిర్ణయాల ప్రభావానికితోడు పలు ఇతర అంశాలు ఈ వారం దేశీ స్టాక్మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. బ్యాంకుల లిక్విడిటీ పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం చివర్లో జోరందుకున్నాయి. ఈ ప్రభావం ఇకపైన సైతం కనిపించే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, కన్జూమర్ రంగాలలో యాక్టివిటీ కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే రుతుపవనాల కదలికలు, దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు, యూఎస్, భారత్ వాణిజ్య చర్చలు తదితర పలు ఇతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మే చివర్లోనే ఆశలు రేపిన రుతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. ఇకపై వీటి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా వర్షాల ఆధారంగా పంటల సాగు, వ్యవసాయ పురోగతి నమోదుకానున్న సంగతి తెలిసిందే. ఇవి గ్రామీణ ప్రాంతాలలో డిమాండును ప్రభావితం చేయగలవని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. రిటైల్ ధరలుగత నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు గురువారం(12న) తెలియనున్నాయి. వార్షిక సీపీఐ 2025 ఏప్రిల్లో 3.16 శాతంగా నమోదైంది. 2019 జులై తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మార్చిలో 3.34 శాతానికి చేరింది. ఈ బాటలో మే నెలకు వాణిజ్య గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. 2025 ఏప్రిల్లో దేశీ వాణిజ్య లోటు 26.42 బిలియన్ డాలర్లను తాకింది. ఏప్రిల్లో దిగుమతులు 64.91 బిలియన్ డాలర్లకు చేరగా.. ఎగుమతులు 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024 ఏప్రిల్లో నమోదైన 19.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే వాణిజ్య లోటు భారీగా పెరిగింది. యూఎస్, భారత్ మధ్య తొలి దశ వాణిజ్య చర్చలపై నిర్ణయాలు వెలువడే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ రేట్ల కోత, నిలకడైన జీడీపీ ఔట్లుక్ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ గణాంకాలు నేడు(9న) మే నెలకు చైనా వాణిజ్య, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో చైనా వినియోగ ధరలు 0.1 శాతానికి చేరగా.. వాణిజ్య మిగులు 96.18 బిలియన్ డాలర్లను తాకింది. 2024 ఏప్రిల్లో నమోదైన 72 బిలియన్ డాలర్లతో పోలిస్తే చైనా వాణిజ్య మిగులు భారీగా ఎగసింది. ఇక మే నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 12న విడుదలకానున్నాయి. 2025 ఏప్రిల్లో 2.3 శాతంగా నమోదైంది. 2021 ఫిబ్రవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. పీపీఐ ఏప్రిల్లో 0.5 శాతంగా నమోదైంది. ఇవికాకుండా గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు, యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు వివరించారు. గత వారమిలా అంచనాలను మించుతూ ఆర్బీఐ.. రెపో రేటులో 0.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో 1 శాతం చొప్పున కోత పెట్టడంతో గత వారం(2–6) దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 738 పాయింట్లు(0.9 శాతం) పెరిగి 82,189 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 252 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 25,003 వద్ద ముగిసింది. వెరసి ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 82,000, 25,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించి స్థిరపడ్డాయి. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 2 శాతం స్థాయిలో ఎగశాయి. సాంకేతికంగా సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీ 25,150 వద్ద అవరోధాన్ని(రెసిస్టెన్స్) ఎదుర్కొనే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ స్థాయిని అధిగమిస్తే ఇండెక్స్ 25,350వరకూ బలపడవచ్చని అంచనా వేశారు. అయితే లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు ఊపందుకుంటే 24,850కు వెనకడుగు వేయవచ్చని తెలియజేశారు. ఈ స్థాయిలో నిఫ్టీకి సాంకేతికంగా మద్దతు(సపోర్ట్) లభించే వీలున్నట్లు విశ్లేషించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
ఫ్యామిలీ

Yoga కడుపు ఉబ్బరమా..? ఉందిగా యోగా
కడుపు ఉబ్బరం చాలా మందిలో కనిపించే ఒక సాధారణ సమస్య. ఇది చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. క్రమంగా జీర్ణ సమస్యలు, మానసిక రుగ్మతలు, నిద్ర లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. సహజంగానే ఈ సమస్యను నివారించు కోవచ్చు. ఎందుకు వస్తుంది?కడుపులో ఏర్పడే కొన్నిరకాల రసాయనాల ద్వారా ఇలా జరుగుతుంది. సాధారణంగా కడుపు ఉబ్బరం అనేది మలబద్ధకం ద్వారా వస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా కడుపు ఉబ్బరాన్ని కొన్ని యోగాసనాల ద్వారా తగ్గించుకోవచ్చుకటి చక్రాసనం...పేరుకు తగ్గట్లుగానే ఈ ఆసనం వెన్నెముకకు సంబంధించినది. నేలపై నిల్చొని వీపును రెండు పక్కలా తిప్పుతూ ఉండాలి. ఈ సమయంలో చేతులను భుజాలకు రెండు వైపులా స్ట్రెచ్ చేస్తూ చా΄ాలి. ఇలా రెండువైపులా కనీసం 10 రౌండ్లు, 2 నిమిషాల వరకు చేయాలి.చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’సైడ్ యాంగిల్ పోజు: కాళ్లను స్ట్రెచ్ చేసి, ఒకవైపుగా వంగాలి. ఇంకో కాలును వెనక్కి చాపాలి. వంగిన కాలుమీద చేతిని ఉంచి మరో చేతిని నిటారుగా పైకి చూపిస్తూ, బాడీని వీలైనంత వరకు వంచాలి. మొదట్లో 15–20 సెకన్ల నుంచి ప్రారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60ఫ్రాగ్ పోజ్: ముందుగా వజ్రాసన భంగిమలో మీ కాళ్లను వెనుకకు మడిచి యోగా మ్యాట్పై కూర్చోవాలి. మీ చేతులను పిడికిలిగా చేసి, వాటిని ఉదరం దగ్గర పెట్టుకుని మెల్లగా ముందుకు వంగాలి. ఈ ఆసనం కూడా మొదట్లో 15–20 సెకన్ల నుంచి ్ర΄ారంభించి క్రమంగా 2 నిమిషాల వరకు చేయాలి.

వీటికి చాలా దూరంగా ఉండాలి...ఫుడ్ @ 60
వయసు పెరిగే కొద్దీ శరీర అవసరాలు కూడా మారుతాయి. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత. మనసు తీపి, వేయించిన వంటకాలు వంటి వివిధ రకాల రుచుల వైపు ఆకర్షిస్తుంది. కానీ ఈ వయస్సులో, మీ ఆహారం శరీరానికి శక్తిని అందించేలా, జీర్ణక్రియను సులభతరం చేసేలా, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, తేలికగా భావించేలా ఉండాలి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీరు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం మిమ్మల్ని శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసికంగా సంతోషంగా, శక్తివంతంగా ఉంచుతుంది.వేపుళ్లకు దూరం...60 ఏళ్ల తర్వాత శరీర జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంటుంది. ఈ స్థితిలో సమోసా, కచోరి, పూరీ, భుజియా వంటి వేయించిన, భారీ ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ఈ ఆహారం కడుపుపై భారంగా ఉండటమే కాకుండా గ్యాస్, ఆమ్లత్వం, అలసటను కూడా కలిగిస్తుంది. శరీరంలో నిరంతరం బరువుగా ఉన్నప్పుడు, నిద్ర, మానసిక స్థితి, శక్తి స్థాయులు కూడా ప్రభావితమవుతాయి. వృద్ధులు ప్రతిసారీ టీతో పాటు క్రిస్పీ లేదా వేయించినవి ఏదైనా తినాలని కోరుకుంటారు. కానీ ఈ అలవాటు క్రమంగా హానికరంగా మారుతుంది.సరైన ఎంపిక...నూనెతో చేసిన ఆహారానికి బదులుగా జీలకర్ర, ఇంగువ చేర్చి కూరగాయలతో చేసిన తేలికపాటి సలాడ్స్ తినవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరాన్ని తేలికగా, సమతుల్యంగా ఉంచుతాయి.చదవండి: డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ! స్వీట్లు, పిండి పదార్థాలకు దూరం...ఈ వయస్సులో స్వీట్లు, పిండితో చేసిన వస్తువులు స్లో పాయిజన్గా భావించాలి. బిస్కెట్లు, కేకులు, పిండితో చేసిన టోస్ట్, మిల్క్ కేక్, హల్వా లేదా పేడా వంటి స్వీట్లు రుచికరంగా కనిపిస్తాయి కానీ వాటిలో పోషకాలు ఏవీ ఉండవు. ఇవి రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. మలబద్ధకానికి కారణమవుతాయి. దీర్ఘకాలంలో మధుమేహం, కీళ్ల నొప్పులు, అలసటకు దారితీస్తాయి. భోజనం తర్వాత స్వీట్లు తినడం మంచిదే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ అలవాటు హానికరం కావచ్చు. ఈ అలవాటును పూర్తిగా తొలగించుకోకుండానే మనం మెరుగైన ప్రత్యామ్నాయాలను అందించగలం.మంచి ఎంపిక...స్వీట్లు తినాలపిస్తే భోజనం తర్వాత బెల్లం–నువ్వుల లడ్డు, రాగి లడ్డు, 1–2 ఖర్జూరం లేదా అర టీస్పూన్ గుల్కంద్ తినవచ్చు. కాలానుగుణంగా లభించే చిరు ధాన్యాలతో తయారు చేసిన రోటీలు, కూరగాయలతో శనగ పిండి టోస్ట్, నెయ్యితో పోహా కూడా మంచి ఎంపికలు.చల్లని– పుల్లని పదార్థాలకు దూరం...రోజువారీ భోజనంలో కారంగా ఉండే ఊరగాయలు, చల్లని పదార్థాలు, ప్యాక్ చేసిన పానీయాలను చేర్చడం ఈ రోజుల్లో సర్వసాధారణమై΄ోయింది. కానీ ఇది మీ శరీరంలో వాపు, అధిక రక్తపోటు, వాతం వంటి సమస్యలను పెంచుతుంది. మార్కెట్లో లభించే కారంగా, నూనెతో కూడిన ఊరగాయలలో అధిక సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తుంది. రక్త΄ోటు అసమతుల్యతకు కారణమవుతుంది. అదేవిధంగా ఫ్రిజ్లో దీర్గకాలం ఉంచిన కోల్డ్ లస్సీ, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్లు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. శరీరం పొడిబారడం, గ్యాస్, అలసటను కలిగిస్తాయి.ఇదీ చదవండి: లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’మంచి ప్రత్యామ్నాయాలు... వీటికి బదులుగా తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలతో ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ లేదా గూస్బెర్రీ ఊరగాయ, పుదీనా–కొత్తిమీర చట్నీ, జీలకర్రతో మజ్జిగ లేదా వేడి సూప్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వేడి సూప్లు, ఉడికించిన కూరగాయలు, నిమ్మకాయ–పుదీనా నీరు లేదా మరిగించిన జీలకర్ర–కొత్తిమీర నీటిని ΄ానీయంగా తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది.

లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన బిలియనీర్ కొడుకులు: మెట్రోకు జై కొట్టిన ‘అమ్మ’
జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ తల్లి రేవతి కామత్ కోసం ఇటీవల ఒక లగ్జరీకారు కొనిచ్చారు. అలా కొనిచ్చిన మూడు నెలల తరువాత ఆమె బెంగళూరు మెట్రోలో ప్రయాణించడం విశేషంగా నిలిచింది. పర్యావరణవేత్త , వీణ కళాకారిణి కూడా అయిన రేవతి పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారు. దీనిపై ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.బిలియనీర్ కొడుకులు నిఖిల్, నితిర్ ఇద్దరే సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సంగతిని ఫేస్బుక్లో షేర్ చేస్తూ, తన కొడుకులు తనకు సాంప్రదాయ పద్ధతిలో, సరైన ఆచారాలతో పాటు బహుమతినిచ్చారంటూ సంతోసాన్ని వ్యక్తం చేశారు. మెర్సిడెస్ GLS ధర రూ.1.5 కోట్లకు పైగా ఉంది. విశాలమైన క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ,పవర్ఫుల్ ఇంజిన్ ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి ఇందులో. సరిగ్గా మూడు నెలల తర్వాత మరోపోస్ట్ చేశారు. బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తూ, ప్రజా రవాణా వ్యవస్థ సౌలభ్యాన్ని ప్రశంసించారు."మెట్రోలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది, అది కూడా మహిళా కంపార్ట్మెంట్లో! నమ్మమెట్రో" అంటూ ఇన్స్టా క్యాప్షన్లో రాసుకొచ్చారు.చదవండి: Bakrid speical : నోరూరేలా.. కాలా మటన్కాగా పర్యావరణ పరిరక్షణకు ఆమె చేసిన కృషిని వెబ్సైట్ ప్రస్తావించింది. రేవతి కామత్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం ఆమె లక్షకు పైగా చెట్లను నాటారు. కర్ణాటకలోని కనకపురలోని సోమనహళ్లి సరస్సును పునరుద్ధరించరు. దీంతో అదిపుడు పచ్చిన ప్రకృతితో, నిండుగా కళకళలాడుతోంది. అంతేకాదు 28 ఎకరాల భూమికి, 300 బోర్వెల్స్, 200 ఓపెన్ బావులకు ప్రయోజనకరంగా మారింది. ప్రతీ తల్లికి, ఆమె పిల్లల విజయం గొప్ప బహుమతి. కానీ రేవతి కామత్ విషయంలో ఆమె కుమారులు, జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ , నితిన్ కామత్ మరో అడుగు ముందుకు వేశారు. అయితే ఒక ‘అమ్మ’గా పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చి మరో మెట్టు ఎక్కారు అంటున్నారు అభిమానులు. ఈ అమ్మలందరూ అంతే.. అంటూ మరికొందరు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Revathi Kamath (@revathikamath.world) ఇదీ చదవండి: డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ!

డాడీ అంత పాపులర్ కాదు కానీ.. ఫ్యాషన్ వరల్డ్లో స్పెషల్ లేడీ!
భారతీయ బ్యాంకులకు వేలకోట్ల ఎగవేసి లండన్లో తలదాచుకున్న వ్యాపార వేత్త విజయ్ మాల్యా(Vijay Mallya) భారతదేశంలో సుపరిచితుడు. కింగ్ఫిషర్ బ్రాండ్, ఎయిర్లైన్స్,అందాల భామలతో కేలండర్లు, లగ్జరీ జీవనశైలి, మనీలాండర్, ఆర్థిక నేరస్తుడు, తాజాగా ఐపీఎల్ ఇలా ఏదో కారణంతో నిరంతరం వార్తల్లో ఉండే వ్యక్తి. కానీ చాలా మందికి అతని వ్యక్తిగత జీవితం , అతని దత్తపుత్రిక ‘లైలా మాల్యా’ (Laila Mallya) గురించి పెద్దగా తెలియదు. తండ్రిలా వార్తల్లో ఉండే వ్యాక్తిలా కాకుండా ప్రశాంతంగా ప్రైవేట్ జీవితాన్ని గడుపుతూ ఫ్యాషన్ ప్రపంచంలో రాణిస్తోంది.విజయ్ మాల్యాకు లియానా, తాన్య, లైలా అనే ముగ్గురు కూతుళ్లున్నారు. అయితే మాల్యాకు దత్తత కూతురు. తన మొదటి భార్య సమీరాతో విడిపోయిన తర్వాత 1993లో చిన్ననాటి ప్రేమికురాలు రేఖను వివాహం చేసుకున్నాడు మాల్యా. రేఖ మొదటి భర్త మెహమూద్తో విడాకులు, తనతో వివాహం తర్వాత చట్టబద్ధంగా లైలాను తన కుమార్తెగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా మాల్యా కుటుంబంలో భాగమైంది. 'మాల్యా' నుతన ఇంటిపేరుగా మార్చుకుంది. ఆమె తండ్రి జీవితం నిరంతరం మీడియాలో హెడ్లైన్గా మారినప్పటికీ, లైలా తన చదువుపై దృష్టి పెట్టింది. విజయ్ పిల్లల్ని తన సొంత చెల్లెళ్లలా చూసుకుంది. తల్లిరేఖకు మునుపటి వివాహం నుండి ఒక అన్నయ్య కబీర్ కూడా ఉన్నాడు.2011లో, లైలా మాల్యా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సమర్ సింగ్ను వివాహం చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో వీరి పెళ్లి జరిగింది. లైలా భర్త సమర్ సింగ్, శరద్ పవార్ మనవడు, రాజకీయ నాయకుడు పార్థ్ పవార్కు మంచి స్నేహితుడు. 2019లో, సమర్ లోక్సభ ఎన్నికల మార్కెటింగ్ ప్రచారంలో పార్థ్కు క్యాంపెయిన్ కూడా చేశాడు.లైలా చదువు, కరియర్లైలా కర్ణాటకలోని బెంగళూరులోని మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, మసాచుసెట్స్లోని వాల్తామ్లోని బెంట్లీ యూనివర్సిటీలోఇంటర్నేషనల్ బిజినెస్లో గ్రాడ్యుయేషన్ , ఆ తరువాత న్యూయార్క్ నగరంలోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కూడా పూర్తి చేసింది. 2009లో, ఆమె IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా పనిచేసింది, క్రీడలు , ఈవెంట్ మేనేజ్మెంట్పై తొలి అడుగు వేసింది. అయితే ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.ఆభరణాల లేబుల్, సోషల్ బటర్ఫ్లైని ప్రారంభించింది. ఆభరణాల డిజైన్లో ప్రతిభను చాటుకుంటోంది 2015 నాటికి వోగ్ బ్రాండ్ జ్యువెలరీ డిజైనర్, స్టైలిస్ట్గా ఎదిగింది. లైలా ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా అనేక ఫ్యాషన్ వీక్ షోలలో కూడా పాల్గొంది. లైలా మాల్యా తన తండ్రి అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని కెరీర్ను నిర్మించుకున్న ఇండిపెండెంట్ మహిళ అనడంలో సందేహం లేదు.
ఫొటోలు
అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో నిరసనల టెన్షన్.. ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ వలసదారుల అరెస్ట్ల నేపథ్యంలో వందలమంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి.. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో నిరసన కారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.ఈ సందర్భంగా నిరసనలపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తాం. అక్రమ వలసదారులు నిరసనలు చేయడం సరైన పద్దతి కాదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jun 07, 2025, 8:25 PM ET )If Governor Gavin Newscum, of California, and Mayor Karen Bass, of Los Angeles, can’t do their jobs, which everyone knows they can’t, then the Federal Government will step in and solve the… pic.twitter.com/mLvzMt9OFb— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) June 8, 2025ఇదిలా ఉండగా.. అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్ అధికారులు లాస్ ఏంజెలెస్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. సుమారు 1000 మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం.. నిరసనకారులను చెదరగొట్టేందకు పోలీసులు.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు.🚨🇺🇸 #BREAKING: STAND-OFF WITH ICE: MEXICAN FLAGS GO UP AS ROADS SHUT DOWNProtesters backing illegal immigrants have turned parts of L.A. into a demolition derby.News vans were smashed, roads barricaded, and tempers lit like it’s the Fourth of July. pic.twitter.com/AT5ZQdZ2tE— Md.Sakib Ali (@iamsakibali1) June 8, 2025మరోవైపు.. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం వెలుపలకు చేరుకొని ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Pro-illegal immigrant supporters waving foreign flags celebrating their handiwork on American soil.pic.twitter.com/U8sBQINvog— The Daily Sneed™ (@Tr00peRR) June 8, 2025

‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్కు ట్రంప్ వార్నింగ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య అంతకంతకూ వైరం తీవ్రస్థాయికి చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యలు తీసుకోవాలని టెక్ బిలియనీర్ ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు. వ్యయ బిల్లుపై మస్క్ విమర్శల అనంతరం అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అండగా నిలుస్తున్న రిపబ్లికన్లను మస్క్ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు ట్రంప్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ట్రంప్ బహిరంగంగా మస్క్కు హెచ్చరించారు. ట్రంప్ తీసుకువస్తున్న బడ్జెట్ బిల్లును వ్యతిరేకిస్తున్న కొంతమంది డెమోక్రాట్ ఎంపీలు తమకు భారీగా నిధులు సమకూర్చాలని ఎలాన్ మస్క్ను కోరారు. దీనికి మస్క్ సమ్మతించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో డెమోక్రాట్లకు నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎలాన్ మస్క్ను ట్రంప్ హెచ్చరించారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్, అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఎలాన్ మస్క్తో సంబంధాన్ని సరిదిద్దుకోవాలనే ఆసక్తి తనకు లేదని, ఆయనతో మాట్లాడే ఉద్దేశ్యం కూడా తనకు తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపై మస్క్ తీవ్ర విమర్శలు చేసిన దరిమిలా వారి మధ్య సంబంధం తెగిపోయింది.ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?

హమాస్ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్వర్క్ను కొనుగొన్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని విడుదల చేసింది.గాజాలోని ఖాన్ యూనిస్లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది. ⭕️UNCOVERED: An underground tunnel route beneath the European Hospital in Khan Yunis, Gaza. In a special, targeted operation, IDF soldiers located an underground tunnel route containing numerous findings such as command and control rooms, weapons, and additional intelligence… pic.twitter.com/7bPM5ozHN8— Israel Defense Forces (@IDF) June 7, 2025ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో వీడియో ఫుటేజ్ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆస్పత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి కింద కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?

అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ఒక్క ‘హగ్’ ఇవ్వండి.. 600 తీసుకోండి..
బీజింగ్: మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఓ కొత్త ట్రెండ్ హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు.. అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు.. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి.. 50 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) చెల్లించి ఉంటుంది. దీంతో, చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి 'మ్యాన్ మమ్స్' (man mums) అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో 'మ్యాన్ మమ్స్' అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే, ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను 'మ్యాన్ మమ్స్'గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి, ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్లోకి వచ్చింది. ఇక, ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ.. మూడు గంటల పాటు ఓవర్టైమ్ పని చేసిన తర్వాత, ఒక 'మ్యాన్ మమ్'ను కలుసుకున్నాను. అతను మూడు నిమిషాల పాటు నన్ను కౌగిలించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీసు ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో, ఒత్తిడి దూరమే ప్రశాంతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.అంతకుముందు.. ఒక విద్యార్థిని, తనకు ఓదార్పునిచ్చేందుకు దయగల, ఫిట్గా ఉండే 'మ్యాన్ మమ్' నుంచి కౌగిలింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ‘నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్గ్రౌండ్ స్టేషన్లో ఐదు నిమిషాలు కౌగిలించుకుంటే చాలు’ అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి.
జాతీయం

6,133కు కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కు చేరుకుంది. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో ఆరుగురు బాధితులు మరణించినట్లు తెలియజేసింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా కరోనా వల్ల 65 మందికిపైగా మంది మృతి చెందారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్య చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.

రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో(2024)మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ప్రముఖ పత్రికలో వ్యాసం రాశారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, రాహుల్ ఆర్టికల్కు కౌంటర్గా మరో పత్రికలో వ్యాసం రాశారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవిచూసిందని పేర్కొంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధానాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దీనిపై ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో వ్యాసం రాశారు.దీనికి కౌంటర్గా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాసిన వ్యాసం నేడు(ఆదివారం)ఒక మరాఠీ దినపత్రికలో ప్రచురితమయ్యింది. దానిలో ఫడ్నవీస్ కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారని, అందుకే వారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాహుల్ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని నేత అని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరైనవేనా? అంటూ ఫడ్నవీస్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేనల మహా వికాస్ అఘాడి కూటమి నవంబర్ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 46 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అప్పటి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీల మహాయుతి కూటమి 235 సీట్లను గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 సీట్లను గెలుచుకుంది. ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలిచింది.ఇది కూడా చదవండి: భగ్గుమన్న మణిపూర్.. ఏటీ నేత అరెస్టుతో ఉద్రిక్తత

మణిపూర్లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. మొయితీ వర్గం నాయకులను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో ఆ వర్గం ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు. నిరసనలతో హోరెత్తించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. రోడ్లపై టైర్లు వేసి దహనం చేశారు. దాంతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల రాకపోకలు అడ్డుకొనేందుకు రోడ్లు తవ్వేశారు. దుకాణాలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్లో కొందరు ఆత్మాహుతికి ప్రయత్నించినట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. కొన్నిచోట్ల కర్ఫ్యూ సైతం విధించింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరోవైపు మణిపూర్ గవర్నర్ అజయ్కుమార్ భల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఘర్షణలు కొనసాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజభవన్లో గవర్నర్ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయనకు వివరించారు. మరోవైపు అస్సాంలోని జిరిబామ్ జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మొయితీ వర్గానికి చెందిన అరంబాయ్ తెంగోల్ తెగ కీలక నాయకుడితోపాటు మరికొందరు సభ్యులు పోలీసులు శనివారం అరెస్టు చేయడం మణిపూర్, అస్సాంలో ఘర్షణలకు దారితీసింది. ఆ కీలక నాయకుడు కానన్ సింగ్ అంటున్నారు. అతడికి మొయితీల్లో గట్టి పట్టుంది. మణిపూర్లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.సీఎం బీరేన్సింగ్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది.ఇది కూడా చదవండి: ‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్కు ట్రంప్ వార్నింగ్

రూ.20 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మధుర: శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ఉత్తరప్రదేశ్లోని మధుర–బృందావన్లో వానరాల బెడద పెరిగిపోతోంది. భక్తుల వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ అధికారులు వాటి ఆగడాలను అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షలకుపైగా విలువైన వజ్రాల నగలున్న సంచిని కోతి ఎత్తుకెళ్లింది.అలీగఢ్కు చెందిన అభిషేక్ అగర్వాల్ బంగారు అభరణాల వ్యాపారి. కుటుంబంతో కలిసి శుక్రవారం బృందావన్ దర్శనానికి వచ్చాడు. తమ వద్దనున్న నగలను ఓ సంచిలో భద్రపర్చాడు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి కారు వద్దకు వెళ్తుండగా ఓ కోతి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఆ సంచిని లాక్కెళ్లింది. ఆందోళనకు గురైన అభిషేక్ అగర్వాల్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు దొంగ మర్కటం కోసం వేట ప్రారంభించారు. 8 గంటల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. అదృష్ట ఏమిటంటే నగల సంచి దాని దగ్గరే ఉంది. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టి, నగల సంచిని జాగ్రత్తగా తీసుకొచ్చి, బాధితుడికి అప్పగించారు.
ఎన్ఆర్ఐ

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

నీటిలో మునిగి ఆరుగురి మృతి
డుంబ్రిగుడ/అమరావతి/ఏయూ క్యాంపస్(విశాఖ జిల్లా): అల్లూరి సీతారామరాజు, పల్నాడు, విశాఖ జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందారు. అల్లూరి జిల్లా పోతంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామానికి చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్ కుమారులు గుంట సాయికిరణ్ (14), గుంట భానుతేజ్ (14)లు 9వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరు డుంబ్రిగుడ మండలం గంగవలస గ్రామంలో ఉన్న తమ మేనత్త ఇంటికి వెళ్లారు. ఆదివారం మామిడి పండ్లు సేకరించేందుకు కొండ వద్దకు వెళ్లి వస్తున్న తరుణంలో..అదే గ్రామానికి చెందిన వీరి స్నేహితుడు కొర్ర సుశాంత్(14)తో కలిసి చెరువులో స్నానాలకు దిగారు. ఇటీవల మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులో 12 అడుగుల మేరకు నీరు చేరింది. ఇది గమనించని విద్యార్థులు ఈతకు దిగి..మునిగిపోయారు. వారిని రక్షించేందుకు సమీపంలోని పొలాల వద్ద ఉన్న వారు వచి్చనా ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురూ మృతి చెందారు. అలాగే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అగతవరప్పాడు ఏవీఎస్ కాలనీ నుంచి రెండు కుటుంబాలకు చెందిన 10 మంది బక్రీద్ అనంతరం నదిలో స్నానాలు చేసేందుకు ఆదివారం పల్నాడు జిల్లాలోని అమరావతికి వచ్చారు. అమరేశ్వరఘాట్ సమీపంలో కృష్ణానదిలోని ఇసుకలో బాల్తో ఆడుకుంటుండగా.. బాల్ పక్కనే ఉన్న నదిలో పడింది. బాల్ కోసం సయ్యద్ ఖాదర్ వలి (13), సయ్యద్ కాజా(21)లు నీటిలో దిగి...మునిగిపోయారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగా..సీఐ అచ్చియ్య ఘటనా స్థలాన్ని సందర్శించి గజ ఈతగాళ్లను రప్పించారు. వారు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడిని బలిగొన్న అలలు విశాఖ సాగర తీరంలో విక్టరీ ఎట్ సీ ఎదురుగా బీచ్లో స్నానానికి దిగి ఎం.శ్రీపాద సూర్య(7) కెరటాలకు బలయ్యాడు. ఆదివారం ఉదయం అగనంపూడికి చెందిన ఓ కుటుంబం బీచ్కు వచ్చింది. వీరిలో స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న సతీష్ది శనివారం పెళ్లి రోజు. వేడుకల అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బీచ్కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా బలమైన కెరటాలు బాలుడిని లోపలికి లాక్కెళ్లాయి. సమీపంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు పరదేశి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేశారు. బాలుడిని వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి 108 వాహనంలో కేజీహెచ్కు తరలించారు. బాలుడు నీరు ఎక్కువగా తాగడంతో మరణించినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. బాలుడి తల్లిదండ్రులను వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు పరామర్శించారు.

నదీగర్భంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం
కాళేశ్వరం: వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు నదీగర్భంలో ఆదివారం లభ్యమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎగువన మూడవ బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రవాహ ప్రాంతంలో అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి ఇద్దరు కుమారులు మధుసూదన్ (18), శివమనోజ్ (15), కర్ణాల సాగర్ (16), తొగరి రక్షిత్ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రామ్చరణ్ (17), అదే మండలం స్తంభంపల్లి (పీపీ)కి చెందిన పసుల రాహుల్ (19)తో మేడిగడ్డ బ్యారేజీ చూసి గోదావరిలో ఈతకు వెళ్లి శనివారం సాయంత్రం 6 గంటలకు నీట మునిగారు. ఆ ఘటనలో పట్టి శివమణి (18) ప్రాణాలతో బయటపడ్డాడు. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి భూపాలపల్లి ఏఎస్పీ నరేశ్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించాయి. ఏడు గంటలపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాల ఆచూకీ నీటమునిగిన ప్రాంతం నుంచి 50 మీటర్ల దూరంలో లభించింది. మృతదేహాలను వెలికి తీసి అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబాలకు మృతదేహాలు అప్పగించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆర్తనాదాలతో మేడిగడ్డ ప్రాంతం శోకసంద్రంగా మారింది.

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న చైత్ర..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడి మోజులో ఉన్న వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నగా అది బెడిసి కొట్టింది. భర్త అప్రమత్తం కావడంతో ఆకుటుంబం బతికి బట్ట కట్టింది. ఈఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో చోటుచేసుకుంది. కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. మూడేళ్లుగా చైత్ర పునీత్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం గజేంద్రకు, అత్తమామకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఇక భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని భావించి భోజనంలో విషం కలిపింది. చైత్ర ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైత్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

‘వీకెండ్’ కోసం వచ్చి అనంతలోకాలకు...
ఘట్కేసర్(హైదరాబాద్): ఓ ఐటీ కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరారు ఆ యువకులు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో స్నేహితులతో ఉత్సాహంగా పార్టీ చేసుకునేందుకు శుక్రవారం సాయంత్రం ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్లోని విహారి నెస్ట్ ఫాంహౌస్కు వచ్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత బయటకు వచ్చి మిగతా స్నేహితులతో కలిసి రెండు కార్లలో ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును చూసేందుకు వెళ్లారు. తిరిగి ఫాంహౌస్కు చేరుకునే క్రమంలో ఓ కారు రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన మేరకు గచి్చ»ౌలిలోని అసెన్షన్ ఐటీ కంపెనీలో పనిచేసే మిత్రులు కుంట్లూరుకు చెందిన భార్గవ్యాదవ్ (23), సైనిక్పురికి చెందిన వర్షిత్ (22), పటాన్చెరుకు చెందిన దినేశ్ (22), అల్వాల్కు చెందిన ప్రవీణ్ (30) నలుగురు ఒక కారులో, మరొక కారులో మరో నలుగురు కలిసి మొత్తం ఎనిమిది మంది శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఫౌహౌంస్కు చేరుకున్నారు. రాత్రి వరకు విందు చేసుకొని అర్థరాత్రి దాటిన తర్వాత కారులో బయటకు వచ్చి లక్ష్మీనారాయణ చెరువు తిలకించారు. తిరిగిఫాంహౌస్కు చేరుకునే క్రమంలో కిలోమీటర్కు ముందే రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటనలో రెండు స్తంభాలు విరిగిపోయాయి. వెనక కూర్చున్న భార్గవ్, వర్షిత్ బెల్ట్ పెట్టుకోకపోవండతో కారు డోర్లు తెరుచుకొని రోడ్డుపై పడి అక్కడికక్కడే మృంతిచెందారు. కారులో ముందు భాగంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న దినేశ్కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ వైపు నుంచి స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నడుపుతున్న ప్రవీణ్కు తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న కారు వెనకాల మరో కారులో ఉన్న స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన ప్రవీణ్ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనుమతి లేకుడా మద్యం?కాగా ఫాంహౌస్లో యువకులు మద్యం సేవించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఫాంహౌస్లలో అనుమతి లేకుండానే మందు పార్టీలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు∙జరిగి మరణాలు సంభవిస్తున్నా ఎక్సైజ్ అధికారుల్లో చలనం రావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.