Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Former CM YS Jagan anger against Chandrababu Naidu government1
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండాపోయింది. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో @ncbn గారి వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్‌ 3న తమ కుమార్తె… pic.twitter.com/WSSOoiAIwL— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2025

Mudragada Padmanabha Reddy Sensational Comments2
ఎన్ని జన్మలెత్తినా.. కూతురు, అల్లుడిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, కాకినాడ: తన కుమార్తె, అల్లుడి కుటుంబంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై మరో కుటుంబం కొంత కాలంగా దాడి చేస్తోందని ముద్రగడ చెప్పుకొచ్చారు. తనకు కాన్సర్ వచ్చిందని.. తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను అంటూ క్లారిటీ ఇచ్చారు.తన ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ముద్రగడ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ముద్రగడ లేఖను విడుదల చేశారు. లేఖలో ముద్రగడ​..‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.నాకు, నా వియ్యంకుడు శివాజీకి మధ్య మనస్పర్థలు తేవాలని చూస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు.. మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్‌లో నేను 15 రోజులు సేవ చేశాను. వీళ్ళు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. వయసు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. మరేవీ లేవు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. వీళ్లా ఈరోజు మాట్లాడేది. వీళ్లతో ఏడాది నుంచి రాకపోకలు ఆగిపోయాయి. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరు బెదిరిస్తే బెదిరి పోతానా?. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నాను.ప్రభుత్వ జీవోలపై ఆ​ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపి కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి. పథకాలు అమలు చేపించి చూపించండి.. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు. సిగ్గు, మర్యాద ఉంటే ఈరోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/QeI22pfm0Z— Mudragada Padmanabhareddy (@Iam_Mudragada) June 9, 2025

5 Feared Dead After Many Passengers Fall Off Overcrowded Local Train In Mumbai3
Mumbai: ఘోరం.. ట్రైన్‌ నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం

మహారాష్ట్ర: ముంబైలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం (జూన్‌9) ఛత్రపతి శివాజీ మహరాజ్‌ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.దివా నుంచి ముంబ్రాకు ప్రయాణిస్తున్న లోకల్‌ ట్రైన్ నుంచి జారి ప‌డి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. 10 నుంచి 12 మంది ప్ర‌యాణికులు తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌మాద బాధితుల‌కు అత్య‌వ‌స‌ర చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.ముంబైలో విప‌రీత‌మైన ర‌ద్దీ కార‌ణంగా లోక‌ల్ ట్రైన్ ప్ర‌యాణికులు ఫుట్ బోర్డింగ్‌లో ప్ర‌యాణించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే, ఇవాళ అలాగే ప్యాసింజ‌ర్లు డోర్ల‌కు వేలాబ‌డుతూ ప్ర‌యాణించారు. ట్రైన్ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికి కదులుతున్న ట్రైన్ నుంచి ప్ర‌యాణికులు అదుపుత‌ప్పి జారి కింద‌ప‌డ్డారు. దీంతో ప‌లువురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm— ANI (@ANI) June 9, 2025

Tourist Couple Meghalaya Village Before they Disappeared what Witnesses Said4
హనీమూన్‌ జంట కేసులో బిగ్‌ ట్విస్ట్.. ప్లాన్‌ ప్రకారమే భార్య..

గౌహతి/షిల్లాంగ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన కొత్త జంట హనీమూన్‌కు వెళ్లి, అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును చేధించారు. ఈ ఉదంతంలో భర్త రాజా రఘువంశీ హత్యకు గురికాగా, భార్య సోనమ్‌ కనిపించకుండా పోయింది. తాజాగా ఆమెను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.భర్త హత్య కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం సోనమ్ కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకుని, భర్తను హత్య చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్‌రాంగ్ మాట్లాడుతూ సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అదుపులోకి తీసుకున్నామని, ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు.దర్యాప్తు జరిగిదిలా..మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ సోనమ్‌ దంపతులు మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని నోంగ్రియాట్ గ్రామంలో గడిపిన 12 గంటల సమయంలో వారు ఏమి చేశారనేది ఆధారంగా చేసుకుని, పోలీసులు దర్యాప్తులో ముందుకు సాగారు. ఇందుకోసం వారు స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. మే 23న కనిపించకుండా పోయిన వీరు దీనికి ముందు మేఘాలయలోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్‌ ఆచూకీ కోసం పోలీసులు పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు గాలించాయి. సోనమ్‌ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.మే 21న మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని ఒక గెస్ట్‌హౌస్‌కు ఆ జంట ముందుగా చేరుకుంది. మరుసటి రోజు వారు స్కూటీని అద్దెకు తీసుకుని, పర్యాటక ప్రదేశం సోహ్రా (చిరాపుంజి)కి వెళ్లారు. తరువాత వారు తూర్పు ఖాసీ హిల్స్‌లోని మావ్లాఖియాట్ గ్రామానికి చేరుకుని, స్కూటీని పార్కింగ్ స్థలంలో ఉంచారు. అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు స్థానిక గైడ్‌ను సంప్రదించారు. అతను మావ్లాఖియాట్ నుండి నాంగ్రియాట్‌కు ట్రెక్కింగ్‌కు చేరేందుకు మూడు గంటలు పడుతుందని, మూడు వేల మెట్లు దిగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పటికే టైమ్‌ అయిపోయిందని, మర్నాడు వెళ్లవచ్చని గైడ్‌ వారికి చెప్పాడు. అయితే ఆ జంట తమకు రూట్‌ తెలుసని, గైడ్‌ సర్వీస్‌ అవసరం లేదని చెప్పారు.కాగా రాజా రఘువంశీ సోనమ్‌ దంపతులకు హోమ్‌ స్టే కల్పించిన ఒక మహిళ పోలీసులు విచారణలో వారిద్దరూ సాయంత్రం 5.30 గంటలకు నోంగ్రియాట్ గ్రామంలోని తమ షిపారా హోమ్‌స్టేకు వచ్చారని తెలిపారు. తాను రూమ్‌ ఛార్జీలు తీసుకుని, రిజిస్టర్‌లో సైన్ ఇన్ చేయమని చెప్పి, వారి గదిని చూపించానన్నారు. వారు చెక్ ఇన్ చేసి, గదికి తాళం వేసి లివింగ్ రూట్ బ్రిడ్జిలను చూడటానికి వెళ్లారని ఆ మహిళ చెప్పారు. కొద్దిసేపటి తర్వాత వారు తిరిగి వచ్చి, భోజనం చేసి, రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి బంగ్లా యూనస్‌ లేఖ.. ఏమన్నారంటే.. మరుసటి రోజు ఉదయం ఆ జంట త్వరగా చెక్ అవుట్ చేస్తామని హోమ్‌స్టే యజమానికి చెప్పారు. అల్పాహారం వద్దని, ఆకలిగా లేదని చెప్పి ట్రెక్కింగ్‌ కోసం వెళతామని అతనితో అన్నారు. మే 23న ఉదయం 6 గంటలకు ఆ జంట హోమ్‌స్టే నుండి బయలుదేరింది. ఆ జంటను చూసిన చివరి వ్యక్తి గైడ్ ఆల్బర్ట్ పిడే. పోలీసుల విచారణలో అతను 23న ఉదయం 10 గంటల సమయంలో ఆ జంట ముగ్గురు టూరిస్టులతో పాటు మావ్లాఖియాత్ గ్రామం వైపు వెళ్లడం చూశానని తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆ జంట కనిపించకుండా పోయింది.

Internet mocks Trump after stumble on Air Force One steps5
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్‌పై మాస్‌ ట్రోలింగ్‌

వాషింగ్టన్‌: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్‌ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్‌ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజ​న్లు ట్రంప్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్‌ఫోర్స్‌ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్‌ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. బైడెన్‌ 2.0 ట్రంప్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్‌ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్‌ను టార్గెట్‌ చేసిన ట్రంప్‌.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్‌కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021

ENG VS WI 2nd T20: A GRANDMA ASKED FOR A SIX AND BETHEL DID IT6
బామ్మ కోరిక నెరవేర్చిన ఆర్సీబీ స్టార్‌

ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బేతెల్‌ ఓ ముసలి మహిళా అభిమాని కోరిక తీర్చాడు. వెస్టిండీస్‌తో నిన్న (జూన్‌ 8) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ యువకుడు తన బామ్మ కోసం ఓ సిక్స్‌ కొట్టాలని బేతెల్‌ను కోరాడు. అడిగిందే తడువుగా బేతెల్‌ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో (రెండో బంతి) సిక్సర్‌ కొట్టి బామ్మ కోరిక నెరవేర్చాడు. అల్జరీ జోసఫ్‌ వేసిన ఆ ఓవర్‌లో అంతకుముందు బంతికి కూడా బేతెల్‌ సిక్సర్‌ బాదాడు. అదే ఓవర్‌లో ఐదో బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన బేతెల్‌, చివరి బంతికి ఔట్‌ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లో బేతెల్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఛేదనలో ఇంగ్లండ్‌ గెలుపుకు దోహదపడింది. ఈ ఇన్నింగ్స్‌లో బేతెల్‌ 10 బంతులు ఆడి 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా విండీస్‌ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాన్సన్‌ ఛార్లెస్‌ (47), షాయ్‌ హోప్‌ (49) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఇన్నింగ్స్‌ చివర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (9 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్‌ ఛేజ్‌ (1 బంతిలో 6 పరుగులు (నాటౌట్‌)) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.పావెల్‌, షెపర్డ్‌, హోల్డర్‌, ఛేజ్‌ విజృంభించడంతో విండీస్‌ చివరి 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు చేసింది. ఆదిల్‌ రషీద్‌ వేసిన 19 ఓవర్లో హోల్డర్‌, షెపర్డ్‌ ఊచకోత కోశారు. ఈ ఓవర్‌లో ఇరువురు కలిసి 5 సిక్సర్లు బాదారు. ఫలితంగా ఆ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి. అంతకుముందు 17 ఓవర్లో 20, 18వ ఓవర్‌లో 8, ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్‌ డకెట్‌ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బేతెల్‌ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టామ్‌ బాంటన్‌ (11 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌లు సిరీస్‌ను ఇంగ్లండ్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో చేజిక్కించుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 మంగళవారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది.

Manchu Manoj Asking Help For 2 days Baby7
సాయం చేయాలంటూ 'మంచు మనోజ్‌' ట్వీట్‌

భైరవం సినిమాతో చాలా విరామం తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చారు మంచు మనోజ్‌.. తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ మూవీతో మెప్పించారు. అయితే, తాజాగా రెండురోజుల ఒక చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు సాయం చేయాలంటూ మనోజ్‌ ఒక పోస్ట్‌ చేశారు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న దానిని చూసిన అభిమానులు, నెటిజన్లు తోచినంత సాయం చేస్తున్నారు. మంచు మనోజ్‌ కొంత కాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తన కుటుంబంతో ఫైట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.సాయం చేయాలంటూ మంచు మనోజ్‌ ఇలా ట్వీట్‌ చేశారు. ' రెండురోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతుంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలాబాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది. కానీ, ఆమెను కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సాయం చేశాను. ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సాయం చేద్దాం. ప్రతి సాయం కూడా విలువైనదే.' అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాను షేర్‌ చేశారు. అయితే, చాలామంది సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కానీ, వారి బ్యాంక్‌ వర్క్‌ చేయడం లేదని కొందరు స్క్రీన్‌ షాట్స్‌ పంపడంతో.. మంచు మనోజ్‌ మరోక బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను షేర్‌ చేశారు. అయితే, ఈ విషయంలో కొందరు నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రూ. 10 లక్షలు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా అన్నా అంటూ అభిమానులు కూడా కామెంట్‌ చేస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం మనోజ్‌ను మెచ్చుకుంటూ సాయం చేయడంలో తామందరినీ భాగస్వామ్యం చేయడం చాలా సంతోషం అంటూ చెబుతున్నారు. మరిన్ని వివరాలు మనోజ్‌ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తెలుసుకోగలరు.Thank you all for the immediate response.As most of you are facing problem while transferring, Here are the new bank details.Please do extend your help for this little one suffering with this acute heart problem she doesn't deserve 🙏CURRENT ACCOUNT YELLA NAVYA SRIACCOUNT… https://t.co/nwV0PthPLm— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 8, 2025

ITR filing deadline extended due to several reasons8
ఐటీఆర్‌ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు

అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధులైన వేళ.. గవర్నమెంటు వారు రాతపూర్వకంగా గడువుతేదీని పొడిగించినట్లు సెలవిచ్చారు. ట్యాక్స్‌ ఆడిట్‌ కాని అన్ని కేసులకు గడువు తేదీ 2025 జులై 31. అన్ని ఫారాలను వరుసగా నోటిఫై చేశారు. నోటిఫై చేసిన తర్వాత తీరా రిటర్న్‌ ఫైల్‌ చేద్దామని వెళితే.. అంతా రెడీగా లేదు. అందరి ఉత్సాహం నీరుకారింది. అటు అసెస్సీలకు, ఇటు వృత్తి నిపుణులకు అసహనం, అనుమానం రెండూ ఏర్పడ్డాయి. అంతలోనే ఈ పొడిగింపు వార్త వచ్చింది. ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు పొడిగించారంటే..1. ఫారాలు నోటిఫై చేశారు కానీ అప్‌డేటెడ్‌ ఫారాలు చాలా లేటుగా వచ్చాయి. 2. ఫైలింగ్‌ చేయడానికి ఉండే యుటిలిటీలు రెడీగా లేవు.3. ఇక్కడ చేయవలసింది పొడిగింపు కాదు. ఈ చర్య అనివార్యం కాదు. దానికి బదులుగా యుటిలిటీలను రెడీ చేయాల్సింది. ఎన్నో విషయాలు చకచకా చేసే ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించిందో అంతుపట్టడం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి పొడిగింపు ఇవ్వకుండా/లేకుండా ఒక నిశ్చితమైన, నిర్దిష్టమైన వైఖరితో ఉంటూ ప్రభుత్వం ఒక మంచి సంప్రదాయాన్ని సృష్టించింది. అందరూ ఈ వైఖరిని మొదట్లో మెచ్చుకోక పోయినా, తర్వాత సర్దుకుని సద్దుమణిగారు. ఒక ముఖ్యమైన పని సకాలంలో జరిగిపోతుంది కదా అని సరదాపడ్డారు. యుటిలిటీని ఎనేబుల్‌ చేసి, అసెస్సీలను ఆకట్టుకుంటే ఎంతో బాగుండేది. ఒక సత్సంప్రదాయాన్ని మూడోసారి ముచ్చటగా కొనసాగించిన ఘనత దక్కించుకునే పరిస్థితుల్లో.. ఏకంగా 45 రోజులు పొడిగించారు. కొంత మంది సంతోషపడ్డారు. మరికొందరు సంబరపడ్డారు. కానీ పొడిగింపు అనేది పరిష్కారం కాదు. పని అలస్యం అవుతుందే తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు. పొడిగింపు అనగానే అందరు అసెస్సీలు ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుని పోస్ట్‌పోన్‌ చేస్తారు. ఆటోమేటిక్‌గా అన్నీ పోస్ట్‌పోన్‌ అయిపోతాయి. గత రెండు నెలల్లో చేయలేని యుటిలిటీలను ఎప్పుడు రెడీ చేస్తారు? ఎన్ని రోజుల్లో రెడీ చేస్తారు? డెవలప్‌మెంట్‌కి, ఇంటిగ్రేషన్‌కి, టెస్టింగ్‌కి వ్యవధి కావాలని సెంట్రల్‌ బోర్డ్‌ చెప్తోంది. అంటే వారికి నిర్దిష్టమైన ప్లాన్‌ ఉన్నా ఎప్పుడు రెడీగా ఉంటారో తెలియదన్నమాట.సాధారణంగా మే 31 తర్వాత టీడీఎస్‌ స్టేట్‌మెంట్లలో అన్ని పద్దులు కనిపిస్తాయి. అవి ఆలస్యం అవుతాయి. ఒకవేళ కనిపించినా, సిస్టమ్స్‌ రెడీగా లేవు. ఇంకో సమస్య ఏమిటంటే, ట్యాక్స్‌ ఆడిట్‌కి గడువు తేదీ 2025 సెప్టెంబర్‌ 30. ఈ గడువు తేదీని కూడా పొడిగిస్తారా అనేదానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వృత్తి నిపుణులు జులై 31 తర్వాత ట్యాక్స్‌ ఆడిట్‌ కేసులను చేపడతారు. ఇప్పుడు రెండు గడువు తేదీలకు పదిహేను రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీని వల్ల పని ఒత్తిడి. మానసిక ఒత్తిడి. టైం చాలకపోవడం.. తప్పులు దొర్లే అవకాశం.. ఇలా ఎన్నో ఉన్నాయి.ఇదీ చదవండి: సెబీ పేరుతో మోసాలుట్యాక్స్‌ ఆడిట్‌ కేసుల విషయంలో పొడిగింపు లేదు. విద్యార్థులు పరీక్షలు నిర్వహించే తేదీ పొడిగించగానే ముందు సంతోషిస్తారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. నిజానికి ఆ పొడిగింపు వల్ల వారి శ్రమ రెట్టింపైందని. ఈ పొడిగింపు కూడా అలాంటిదే. గడిచిన సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఎంత కాలం సేకరిస్తూ కూర్చుంటారు. తినగ తినగ వేము తియ్యనుండులాగా ఇదేమీ పరిపక్వతకు సంబంధించిన విషయం కాదు. నైపుణ్యాలు, నాణ్యత పెరగవు. కానీ మీరు మాత్రం రెడీగా ఉండక తప్పదు. యుటిలిటీలు రెడీ కాగానే ఫైల్‌ చేయండి. వారు అడుతున్న సమాచారం మీ చేతిలో ఉందని బలమైన నమ్మకంతో ఉండండి.

CM Revanth Reddy Delhi Tour Deatils9
ఢిల్లీకి రేవంత్‌.. మంత్రుల శాఖలు ఫిక్స్‌!

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్‌ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్‌ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్‌ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్‌ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్‌లు, చాంబర్‌ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్‌.. మాదిగ, గడ్డం వివేక్‌.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్‌ వర్గీయుడు.

Drinkers Hulchul At Tirumala Alipiri10
టీటీడీ విజి­లె­న్స్‌ వైఫల్యం.. తిరుమలలో మరో అపచారం.. వీడియో

తిరుపతి: తిరుమలలోని అలిపిరి చెక్‌ పాయింట్‌కు సమీపంలోని ఏటీఎం సెంటర్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతున్న వీడి­యో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం తాగిన వ్యక్తులు ఖాళీ సీసాను అలిపిరి మెట్ల మార్గంలో వేయడం శ్రీవారి భక్తులు ఆగ్రహానికి కారణమైంది.అయితే, అలిపిరి తనిఖీ కేంద్రానికి కూతవేటు దూరంలో అలిపిరి నడక మార్గం ప్రారంభం అవుతుంది. ఈ ప్రాంతంలో దాదాపు 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా టీటీడీ నిఘా ఉంచింది. అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ ద్వారం వద్ద లగేజీ కౌంటర్‌కు అభిముఖంగా ఏటీఎం సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతా­ల్లో అండర్‌ పాస్‌ ద్వారా అలిపిరి మెట్ల మార్గం ప్రార­ంభమవుతుంది. భక్తులు ఈ అండర్‌ పాస్‌ ద్వా­రా­కాలినడక ప్రారంభిస్తారు. ఏటీ­ఎంకు ఆనుకుని కొంత ఖాళీస్థలం ఉండటంతో మందు­బాబులు రెచ్చిపోతు­న్నారు.టీటీడీ విజిలెన్స్‌ నిఘా వైఫల్యమే ఇందుకు కారణమని భక్తులు ఆగ్ర­హం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజి­లె­న్స్‌ నిద్ర మత్తు­లో తూలుతోందనే విషయం ఇటీవల వరుస ఘట­నలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి ఘట­నలు ఎన్ని జరిగిన ‘మాకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్య ధోరణి వి­జిలెన్స్‌ నిఘా విభాగం సిబ్బందిలో పెరిగిపోయింది. సిబ్బంది పనితీరును నిరంతరా­య­ంగా పర్య­వేక్షించా­ల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ­హ­రించడంతో వరుస నిఘా వైఫ­ల్యాలు వెలు­గు చూస్తున్నాయి. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి ఘ­ట­న­లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకో­వా­లని డిమాండ్‌ చేస్తున్నారు.🚨 #BRNaiduUnfitForTTDఅలిపిరి మెట్ల మార్గంలో కాకుండా.. మద్యం సీసాలపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్లాలా @ncbn, @PawanKalyan, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ?శ్రీవారి సన్నిధిలో మద్యాన్ని ఏరులైపారిస్తున్న కూటమి ప్రభుత్వం. మందు తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు… pic.twitter.com/HftbdINhv1— YSR Congress Party (@YSRCParty) June 8, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement