Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana New Ministers Take Oath Ceremony Updates1
కాసేపట్లో తెలంగాణ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

సాక్షి, హైదరాబాద్‌: కాసేపట్లో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రులు మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేయించనున్నారు. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌), గడ్డం వివేక్‌ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌(ధర్మపురి) పేర్లు ఖరారయ్యాయి.ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు చేయగా.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ,వివేక్ ,అడ్లూరి లక్ష్మణ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. ముగ్గురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.వివేక్‌ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి.అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్‌ పేరు ఖరారు చేసిందిశ్రీహరి రాజకీయ ప్రస్థానంకర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు.ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్రను మక్తల్‌ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది.లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానంధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

BRS KCR Sad Over Maganti Gopinath Tribute2
మాగంటిని చూసి.. కన్నీరు పెట్టిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మాగంటి మృతదేహానికి నివాళి అర్పించేందుకు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెళ్లారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కాసేపటి క్రితమే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. మాగంటి గోపీనాథ్‌ ఇంటికి చేరుకున్నారు. అనంతరం, మాగంటి భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురైన పెద్దాయన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అండగా ఉంటమాని భరోసా ఇచ్చారు. Live: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. https://t.co/lyGtihkFJr— BRS Party (@BRSparty) June 8, 2025

Teachers Besiege Visakhapatnam Deo Office3
మంత్రి లోకేష్‌ మోసం.. తిరగబడ్డ టీచర్లు

సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా చేపడతామని చెప్పి.. ఆన్‌లైన్‌ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్‌ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్‌ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్‌లైన్‌ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్‌ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్‌ విధానంలో కౌన్సెలింగ్‌ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్‌లైన్‌ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్‌ కౌన్సెలింగ్‌కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్‌ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి.

Anil Ambani Gets Big Win NCLAT Halts Reliance Infra Insolvency4
అనిల్‌ అంబానీకి భారీ ఉపశమనం

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్‌ మేరకు ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్‌ సరఫరా చేసిన ధుర్సర్‌ సోలార్‌ పవర్‌కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్‌కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్‌ సర్వీసెస్‌ సంస్థ 2022 ఏప్రిల్‌లో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై కార్పొరేట్‌ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్‌ ఇన్‌ఫ్రాపై ఎన్‌సీఎల్‌టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్‌ సోలార్‌ పవర్‌కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్‌లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది.

Balakrishna Lakshmi Narasimha Re Release Song Goes Controversy5
బాలకృష్ణ బర్త్‌డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!

ఆధునిక టెక్నాలజీతో బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో తీసిన సినిమాలను కలర్‌ లోకి తీసుసుకురావడం, ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్‌ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్‌ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత విజువల్స్‌కు కొత్త పాటని జత చేసే ట్రెండ్‌ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమా. ప్రస్తుతం రీ రిలీజ్‌ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి అప్పట్లో హిట్‌ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. జూన్‌ 8 న ఈ సినిమా రీరిలీజ్‌ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్‌ హీరోయిన్‌ గా నటించింది. 21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్‌ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు రీరిలీజ్‌ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్‌ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్‌ ను రివీల్‌ చేసే సాంగ్‌ ఒకటి రూపొందించారట. అయితే షూటింగ్‌ కూడా చేసినా ఆ సాంగ్‌ ని వాడలేదట. దీంతో ఆ పాత బాలయ్య డ్యాన్స్‌ విజువల్స్‌ను కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్‌కు జత చేశారట.తాజాగా ఈ కొత్త సాంగ్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్‌ హౌస్‌ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్‌ రాయగా, స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించగా, భీమ్స్‌ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ. సినిమా రీరిలీజ్‌ రోజు కలెక్షన్స్‌ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్‌ హౌస్‌ తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు... అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే... ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా?

BRS MLA Maganti Gopinath Passed Away In AIG Hospital6
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్‌(62) మృతిచెందారు. అనారోగ్యం కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్‌ ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మాగంటి గోపీనాథ్‌ 1963 జూన్‌ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు. గోపినాథ్‌కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్‌ నుంచే పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్‌ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్‌ఎస్‌ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు.

Navjot Singh Sidhu names Rohit Sharma as captain of his IPL 2025 team of the tournament7
ఐపీఎల్‌-2025 బెస్ట్ టీమ్ ప్ర‌క‌ట‌న.. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌

ఐపీఎల్‌-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రకటించాడు. తన ఎంపిక చేసిన జట్టుకు అనుహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్‌గా సిద్దు నియమించాడు. ఈ ఏడాది సీజన్‌లో రోహిత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా లేనప్పటికి.. సిద్దు మాత్రం తన ఎంచుకున్న జట్టుకు సారథిగా రోహిత్ వైపే మొగ్గు చూపాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎన్నో అద్బుత విజయాలను సాధించాడని, అందుకే తన జట్టుకు నాయకుడిగా ఎంపిక చేశానని సిద్దు తెలిపాడు. కాగా ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌.. భారత్‌కు టీ20 వరల్డ్‌కప్‌, ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు.ఇక సిద్దూ ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా రోహిత్‌, విరాట్ కోహ్లికి చోటిచ్చాడు. అదేవిధంగా మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా జోస్ బట్లర్‌, పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఐదో స్ధానంలో నికోల‌స్ పూర‌న్‌కు ఛాన్స్ ద‌క్కింది. ఆల్‌రౌండ‌ర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాకు సిద్దు అవ​కాశం కల్పించాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నూర్ ఆహ్మద్‌ను ఎంపిక చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధు.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, హాజిల్‌వుడ్‌లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ జట్టులో ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయిసుదర్శన్‌, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఐపీఎల్‌-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పంజాబ్‌ను ఓడించి తొలి ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంది.సిద్దు ఎంచుకున్న ఐపీఎల్ బెస్ట్ టీమ్‌రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి, జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్.చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్య‌కుమార్‌, పంత్‌: విజయ్‌ మాల్యా డ్రీమ్‌ టీమ్‌

Chandrababu Govt Mistakes again in Polavaram diaphragm wall works8
డయాఫ్రం వాల్‌ పనులు 'డిజైన్‌కు విరుద్ధం'

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) గ్యాప్‌–2లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్‌కు విరుద్ధంగా డయా ఫ్రం వాల్‌ (పునాది) పనులు చేస్తుండటాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. డయా ఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో నిర్మించేలా డిజైన్‌ను ఆమో­దిస్తే.. క్షేత్ర స్థాయిలో 0.9 మీటర్ల మందంతో బావర్‌ సంస్థ నిర్మిస్తోందని ఎత్తి చూపింది. మందం తగ్గించటంపై తక్షణమే సమీక్షించి.. తగిన నిర్ణయం తీసుకోవాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి సూచించింది. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగిస్తున్న టీ–16 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమంలో నీటి శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం గుర్తించింది. ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని.. కానీ డయాఫ్రం వాల్‌లో వినియోగిస్తున్న కాంక్రీట్‌ మిశ్రమం ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉందని ఎత్తి చూపింది. డిజైన్‌ ప్రకారం 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సి ఉండగా 0.9 మీటర్ల మందంతో నిర్మిస్తున్నారని.. మందం తగ్గించడంపై సమీక్షించాలని నివేదికలో పేర్కొన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ గత మూడు నెలల్లో 52 ప్యానళ్లతో డయాఫ్రం వాల్‌ పనులు చేశారని, అందులో 9 ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్‌ ఉపరితలంపై నీటి బుడగలు (సీపేజీ) ఉన్నట్లుగా చెప్పింది. సీపేజీ తీవ్రతను తేల్చడానికి ఇప్పటి దాకా వేసిన డయాఫ్రం వాల్‌పై రెండు నుంచి 3 మీటర్ల లోతు వరకు రంధ్రాలు చేసి, పరీక్షలు చేయాలని ప్రతిపాదించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా, సీపేజీ ఉన్న ప్యానళ్ల పరిధిలో డయా ఫ్రం వాల్‌ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకు తొలగించి.. మళ్లీ కొత్తగా వేయాలని పీపీఏకు సూచించింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్‌లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో డయాఫ్రం వాల్‌ పనులు ప్రారంభించి.. 2018 జూన్‌ నాటికి పూర్తి చేసింది. దీంతో 2018 జూన్‌ తర్వాత వచ్చిన వరదలకు కోతకు గురై దెబ్బతింది. దాంతో దెబ్బతిన్న దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్‌ వేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన డయాఫ్రం వాల్‌ పనులను సైతం లోపభూయిష్టంగా ఇప్పటి చంద్ర­బాబు ప్రభుత్వం చేస్తుండటంపై ఇంజినీరింగ్‌ నిపు­ణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రా­జెక్టుకు చంద్రబాబు పాపాలు వెంటాడుతున్నా­య­న­­డానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదిక తార్కాణ­మని రిటైర్డు చీఫ్‌ ఇంజినీర్‌ ఒకరు చెప్పారు. ఈ నెల 4న సీడబ్ల్యూసీకి నివేదికపోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఏడాది క్రితం సియాన్‌ హించ్‌బెర్గర్, మెస్సర్స్‌ సీ రిచర్డ్‌ డొన్నెళ్లి, గియానో ఫ్రాంకో డీ క్యాప్పో, డేవిడ్‌ పాల్‌ సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నాలుగోసారి గత నెల 5 నుంచి 9వ తేదీ వరకు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో గుర్తించిన అంశాలు, అధికారుల సమీక్షలో వెల్లడైన విషయాలు ఆధారంగా ఈ నెల 4న పీపీఏ, సీడబ్ల్యూసీలకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పనుల్లో లోపాలను ఎత్తిచూపుతూ.. వాటిని సరిదిద్దుకోవడానికి చేప­ట్టాల్సిన చర్యలను ఆ నివేదికలో సిఫార్సు చేసింది. ఆ నివేదికలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. పనుల్లో తీవ్ర జాప్యం ⇒ ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో డయా ఫ్రం వాల్‌ పనులను 66 వేల చదరపు మీటర్ల పరిధిలో చేయాలి. నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం వర్షాలు ప్రారంభం కావడానికి ముందే అంటే 2025 జూన్‌ నాటికి 28 వేల చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్‌ పనులు పూర్తి చేయాలి. 2025 ఏప్రిల్‌ నాటికి 15 వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. 12 వేల చదరపు మీటర్ల పరిధిలో మాత్రమే పూర్తయ్యాయి. అంటే.. మూడు వేల చదరపు మీటర్ల పరిధిలో పనులు వెనుకబడినట్లు స్పష్టమవుతోందని నిపుణుల కమిటీ తేల్చింది. ⇒ పనుల్లో జాప్యానికి కాంట్రాక్టు సంస్థ బావర్‌ చెబు­తున్న కారణాలు సహేతుకంగా లేవని నిపు­ణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. డయాఫ్రం వాల్‌ ప్యానళ్లను అత్యంత కఠిన శిల (సౌండ్‌ హార్డ్‌ రాక్‌) లోపలికి రెండు మీటర్ల లోతు వరకు దించితేనే.. సీపేజీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంది. అలా చేయడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పడం విడ్డూరమని పేర్కొంది. డయాఫ్రం వాల్‌లో సీపేజీ⇒ ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో డయాఫ్రం వాల్‌ పనుల్లో ఏప్రిల్‌ వరకు 373 ప్యానళ్లు వేయాల్సి ఉండగా, 52 ప్యానళ్ల పరిధిలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇందులో 9 ప్యానళ్ల పరిధిలో డయాఫ్రం వాల్‌ పైభాగంలో 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ నీటి బుడగలు బయటకు వస్తున్నట్లు(సీపేజీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది. ⇒ డయాఫ్రం వాల్‌లో వినియోగించే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమం 32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాణ్యంగా ఉంటుందని గతంలో నిర్వహించిన సమావేశాల్లో తాము అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది. కానీ.. పోలవరం డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉన్నట్లుగా గుర్తించింది. ప్లాస్టిక్‌ కాంక్రీట్‌లో నీటి శాతం అధికంగా ఉన్నట్లుగా పసిగట్టింది. ⇒ కాంక్రీట్‌ మిశ్రమంలో ఉష్ణోగ్రత, నీటి శాతం ఎక్కువగా ఉండటం, ముడి పదార్థాల మోతాదు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేక పోవడం వల్లే సిమెంట్, బెంటనైట్, కంకర, ఇసుక, నీరు విడిపోతోందని (సెగ్రిగేట్‌), దానివల్ల అది పటిష్టంగా, నాణ్యంగా ఉండదని స్పష్టం చేసింది. అందువల్లే డయాఫ్రం వాల్‌లో సీపేజీ వస్తోందని అభిప్రాయపడింది.⇒ సీపేజీ తీవ్రతను తేల్చడానికి తక్షణమే డయాఫ్రం వాల్‌పై రెండు మీటర్ల లోతు వరకు వరుసగా రంధ్రాలు వేసి.. పరీక్షలు చేయాలని పీపీఏకు సూచించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా సీపేజీ ఉన్న చోట్ల డయాఫ్రం వాల్‌ పైభాగం 1 నుంచి 2 మీటర్ల లోతు వరకూ తొలగించి.. దానిపై కొత్తగా డయాఫ్రం వాల్‌ వేయాలని సిఫార్సు చేసింది.నాడూ నేడూ అవే తప్పులు⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను తొలుత పూర్తి చేయాలి. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించాక.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో 1,396.6 మీటర్లు్ల, గ్యాప్‌–1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్‌లను నిర్మించాలి.⇒ కానీ.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వరదను మళ్లించే పనులను పూర్తి చేయకుండానే 2016 డిసెంబర్‌లో ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో డయాఫ్రం వాల్‌ పనులను ప్రారంభించి, చారిత్రక తప్పిదం చేసింది. 2017 జూన్‌ వరకూ డయాఫ్రం వాల్‌ పనులు చేసింది. ఆ తర్వాత గోదావరి వరద ఆ డయాఫ్రం వాల్‌ మీదుగా ప్రవహించడంతో కోతకు గురైంది. అయినా సరే.. 2017 నవంబర్‌లో మళ్లీ పనులు ప్రారంభించి, 2018 జూన్‌ నాటికి గ్యాప్‌–2లో 1.396.6 మీటర్ల పొడవున డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసింది.⇒ ఆ డయాఫ్రం వాల్‌పై 2018 జూన్‌ తర్వాత వచ్చిన గోదావరి వరద ప్రవహించింది. దీంతో వరద ఉద్ధృతికి డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఆదిలోనే తేల్చింది. 2019 మే 30న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తి చేసి.. 2021 జూన్‌ 11న గోదావరి వరదను మళ్లించింది.⇒ ఆ తర్వాత గ్యాప్‌–1లో డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసింది. గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యాన్ని తేల్చడంలో సీడబ్ల్యూసీ తీవ్ర జాప్యం చేసింది. లేదంటే అప్పట్లోనే డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసే వారని ఇంజినీరింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు.. గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి గతేడాది సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణంలోనూ చంద్రబాబు సర్కార్‌ అవే తప్పులు చేస్తుండటంపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ తుంగలోకి⇒ పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్‌ స్థానంలో కొత్త డయా ఫ్రం వాల్‌ నిర్మించడం శ్రేయస్కరమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనను సీడబ్ల్యూసీ ఆమోదించింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త డయా ఫ్రం వాల్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. ⇒ కొత్త డయా ఫ్రం వాల్‌ను 1.5 మీటర్ల మందంతో 1,396.6 మీటర్ల పొడవున 100 మీటర్ల లోతుతో (పునాది) నిర్మించేలా ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా డిజైనర్‌ ఆఫ్రి డిజైన్‌ (ఆకృతి)ను రూపొందించింది. దాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమీక్షించి, అనుమతి ఇచ్చింది. దాంతో ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. టీ–16 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమంతో డయా ఫ్రం వాల్‌ను నిర్మించాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను నిర్దేశించింది. ⇒ డయాఫ్రం వాల్‌ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయా ఫ్రం వాల్‌ మందం గరిష్టంగా 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్ల వరకు తగ్గొచ్చని సీడబ్ల్యూసీ పేర్కొంది. ⇒ రూ.990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రం వాల్‌ పనులను 2016–18 మధ్య ఆ పనులు చేసిన బావర్‌ సంస్థకు మేఘా సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ను తుంగలో తొక్కి.. 1.5 మీటర్ల (1500 మిల్లీ మీటర్లు) మందంతో కాకుండా 0.9 మీటర్ల (900 మిల్లీమీటర్లు) మందంతో బావర్‌ సంస్థ డయా ఫ్రం వాల్‌ పనులు చేస్తోందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఎత్తిచూపింది. అంటే.. సీడబ్ల్యూసీ ఆమోదించిన మందం కంటే 0.6 మీటర్లు మందం తగ్గించి పనులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ⇒ మందం తగ్గించడంపై తక్షణమే సమీక్షించి.. దీనివల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది విశ్లేషించి.. దీనిపై సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పీపీఏకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.⇒ డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ఒక ప్యానల్‌ను మరో ప్యానల్‌తో నిలువునా జత చేసేటప్పుడు (ఓవర్‌ల్యాప్‌).. 7.5 సెంటీమీటర్ల పొడవున ఒకదానితో మరొకటి జత చేస్తున్నారని.. కనీసం పది సెంటీ మీటర్ల పొడవున ఓవర్‌ ల్యాప్‌ చేయాలని సూచించింది. అప్పుడే సీపేజీకి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంది.

Colombian Presidential Candidate Miguel Uribe shot in Head During Rally9
అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు.. కొలంబయాలో ఉద్రిక్తత

బొగోటా: అమెరికాలోని కొలంబియాలో దారుణం చోటుచేసుకుంది. కొలంబియన్ మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థి మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే(39)పై కాల్పులు జరిగాయి. బొగోటాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే జనం మధ్య ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అటార్నీ జనరల్ లూజ్ అడ్రియానా కామార్గో కారకోల్ మీడియాతో మాట్లాడుతూ మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నారని తెలిపారు.సెనేటర్ మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే తలకు ఒక బుల్లెట్ తగిలిందని స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిని ఖండిస్తున్నట్లు వామపక్ష అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రభుత్వం పేర్కొంది. ఈ హింసాత్మక చర్య కేవలం అతనిపైన మాత్రమే కాదని ఇది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, కొలంబియాలో చట్టబద్ధమైన రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన దాడి అని అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. Urgente 🇨🇴 Aquí está el momento del atentado al Dr Miguel Uribe Que dolor de PatriaGobierno miserable !Imágenes sensibles pic.twitter.com/tA3VWGap5V— Luis Aníbal Rincón Arguello. ® 🇨🇴 (@Rincon001A) June 7, 2025డెమోక్రటిక్ సెంటర్ పార్టీ సభ్యుడైన మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే గత అక్టోబర్‌లో తాను 2026లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా సాయుధుడైన ఒక వ్యక్తి తమ సెనేటర్‌ను వెనుక నుండి కాల్చాడని డెమోక్రటిక్ సెంటర్ పార్టీ తెలిపింది. ఈ దాడి ఒక రాజకీయ నాయకుని ప్రాణానికి ముప్పు కలిగించడమే కాకుండా, కొలంబియాలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు కూడా ముప్పు ఏర్పడేలా చేసిందని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ నేత కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్ మాట్లాడుతూ ఇది దేశానికున్న ఆశపై జరిగిన దాడిగా అభివర్ణించారు.బొగోటా మేయర్ కార్లోస్ గాలన్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో షూటర్‌ పట్టబడ్డాడని తెలిపారు. ఈ ఘటనలో ఒక 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే కొలంబియాలో రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తాత కొలంబియా మాజీ అధ్యక్షుడు జూలియో సీజర్ టర్బే. ఆయన 1978 నుండి 1982 వరకు అధికార బాధ్యతలు చేపట్టారు. ఆయన తల్లి డయానా టర్బే.. ఆమె ప్రఖ్యాత జర్నలిస్ట్. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే 2022 నుంచి సెనేటర్‌గా ఉన్నారు. గతంలో బొగోటా ప్రభుత్వ కార్యదర్శిగా, నగర కౌన్సిలర్‌గా పనిచేశారు. 2019లో నగర మేయర్ పదవికి కూడా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు.ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్‌ అధికారితో లింకు ?

Sakshi Editorial On TDP Coalition government by Vardhelli Murali10
ఈ పతనం ఏ లోతుల్లోకి?

కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్‌స్పెక్టర్‌కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్‌ టీవీల్లో కనిపించాయి.తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్‌కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్‌ మీద ఆ ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్‌ సివిల్‌ డ్రెస్‌లో ఉంటూనే, లా అండ్‌ ఆర్డర్‌ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్‌ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్‌ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్‌ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్‌ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్‌ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్‌ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్‌ హెడ్‌పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్‌ హెడ్‌ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్‌ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్‌కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్‌ చేశారని కళాశాల ప్రిన్సిపాల్‌ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్‌ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్‌ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్‌కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్‌ ట్రాఫిక్‌ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్‌ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్‌ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్‌ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్‌ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్‌ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్‌.ఎస్‌. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్‌ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement