Top Stories
ప్రధాన వార్తలు

బాబూ.. సేవలను సమాధి చేయడమే మీ విజనా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. రేషన్ డోర్డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా?. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్..‘చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? అని ప్రశ్నించారు.మరోవైపు వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్ షాపులముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీపనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవారు. ఈ క్రమంలో లబ్ధిదారులు వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారు, దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడంకూడా మానేశారు. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.1.@ncbn గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా? మరోవైపు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 1, 2025మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటివద్దకే రేషన్ అందించే డోర్డెలివరీని ప్రారంభించింది. బియ్యం క్వాలిటీని పెంచి, మధ్యస్త సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్చేసి, రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం రేషన్ డోర్డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు?నెలకు రూ.10వేలు ఇస్తామంటూ వాలంటీర్లను మీ వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధికట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో, వార్డుల్లో డోర్డెలివరీ సంగతి పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఈ మూర్ఖపు చర్య కారణంగా, రేషన్ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయి. అంతేకాదు ఈ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబుగారూ..!’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

IPL 2025 Qualifier 2, PBKS VS MI: మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటి..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (జూన్ 1) పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు వరుస విరామాల్లో అడ్డుపడుతున్నాడు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సి మ్యాచ్ 9 గంటల వరకు ప్రారంభం కాలేదు. 9 గంటల ప్రాంతంలో వర్షం జోరుగా కురుస్తుంది. 9:30 గంటల లోపు మ్యాచ్ ప్రారంభమైతేనే ఎలాంటి ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఓవర్ల కోత లేకుండా మ్యాచ్ జరిగేలా లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో లేని వర్షం మ్యాచ్ ప్రారంభ సమయానికి జోరందుకుంది.మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..?ఒకవేళ ఈ మ్యాచ్ పూర్తిగా రద్దైతే పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుతుంది. ప్లే ఆఫ్స్లో మ్యాచ్లకు రిజర్వ్ డే లేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో చూడాలి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. ముంబై తరఫున గ్లీసన్ స్థానంలో రీస్ టాప్లే.. పంజాబ్ తరఫున హర్ప్రీత్ బ్రార్ స్థానంలో చహల్ తుది జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడనుంది.జట్ల వివరాలు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(w), శ్రేయాస్ అయ్యర్(c), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, జేవియర్ బార్ట్లెట్, హర్ప్రీత్ బ్రార్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీఇంపాక్ట్ సబ్స్: అశ్వని కుమార్, కృష్ణన్ శ్రీజిత్, రఘు శర్మ, రాబిన్ మింజ్, బెవోన్ జాకబ్స్

‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు
సాక్షి, విజయవాడ: జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా వెన్నుపోటు దినం రోజున వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. జూన్ 4 న వైఎస్సార్సీపీ నేతలు చేపట్టే నిరసనలకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో వెన్నుపోటు దినం నిమిత్తం వైఎస్సార్సీపీ నేతలు అనుమతుల కోసం పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. అయితే, నేతల విజ్ఞప్తుల్ని పోలీసులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30 అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజాస్వామ్య విధానాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేలా కూటమి ప్రభుత్వం అరాచకానికి దిగింది. వైఎస్సార్సీపీ నాయకులు కోరుతున్న అనుమతులు తిరస్కరించేలా చంద్రబాబు పోలీసుల్ని వాడుకోవడం గమనార్హం.కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేలా వెన్నుపోటు దినంప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారు. ‘జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వైఎస్ జగన్ కోరారు.

ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్ విమానాలు ధ్వంసం!
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడికి దిగింది. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. .యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.రష్యాపై తాము చేసిన దాడుల్లో 40 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా స్పష్టం చేసింది. సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది. ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది.2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం!ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, 69 మందికి గాయాలయ్యాయి. 524 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా చెబుతోంది.

యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
బెంగళూరు,సాక్షి: బస్సు డ్రైవర్లతో గొడవ పడతున్నారా? అయితే,తస్మాత్ జాగ్రత్త. ఓ యువతి తనతో గొడపడిందని బస్సుతో ఢీకొట్టి ప్రాణాలు తీసేందుకు ఓ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువతి తృటిలో ప్రాణలు దక్కించుకుంది. ప్రస్తుతం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బెంగళూరులో బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) డ్రైవర్ అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. నగరంలోని ఓ సిగ్నల్ దగ్గర యువతిపైకి బస్సును పోనిచ్చాడు. యువతి తనతో గొడవ పడిందన్న కారణంతో డ్రైవర్ కర్కశంగా వ్యవహరించాడు. బస్సు ముందు యువతి ఉందని తెలిసినా ఆమెను తోసుకుంటూ బస్సును నడిపాడు డ్రైవర్. అయితే, ఆ ప్రమాదం నుంచి యువతి తృటిలో తప్పించుకుంది.Murder on the Streets? BMTC Driver Caught on Camera Attempting to Crush PedestrianIn yet another deeply troubling incident involving a BMTC (Bangalore Metropolitan Transport Corporation) bus, shocking footage has emerged of a reckless act by the driver of bus number KA57F2046,… pic.twitter.com/oZRvsisICM— Karnataka Portfolio (@karnatakaportf) June 1, 2025 వివరాల్లోకి వెళితే.. కేఏ57ఎఫ్2046 నంబర్ గల బస్సు డ్రైవర్ మే 23న చినస్వామి స్టేడియం సిగ్నల్ వద్ద ఓ యువతిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. మ్యూజియం రోడ్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్తున్న సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు బస్సు డ్రైవర్,యువతి మధ్య వాగ్వాదం జరిగింది. అందుకు కారణాలేంటనేది తెలియాల్సి ఉండగా.. బస్సు డ్రైవర్తో గొడవ జరిగిన తర్వాత యువతి సిగ్నల్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించింది.డ్రైవర్ ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయలేదు. లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా, యువతిని ఢీకొట్టేందుకు బస్సు నడపడంతో ఉద్దేశపూర్వకంగానే సదరు బస్సు డ్రైవర్ యువతి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడనే స్పష్టంగా తేలింది. మరోవైపు, ఈ దుర్ఘటనపై బెంగళూరు వాసులు నిత్యం ప్రాణ భయంతోనే కాదు, సురక్షితమైన బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కోరుతున్నారు. వీడియోతో ఆధారంగా బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బ్యాంకు అకౌంట్లో పైసా లేకపోయినా పర్లేదు..!
బ్యాంక్ అకౌంట్.. దేశంలోని ప్రతి పౌరుడికీ కనీస అవసరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం అందరూ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఆ బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచడం పేదలు, సామాన్యులకు భారంగా మారింది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల పేరుతో బ్యాంకులు బాదేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఉపశమనం కల్పిస్తున్నాయి.తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని, తక్కువ లేదా జీరో బ్యాలెన్స్కు ఎటువంటి జరిమానాలు విధించని జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను మరికొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలాంటి అకౌంట్లను ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకోండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ)ను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి లేదా అకౌంట్ క్లోజర్కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.వడ్డీ రేటు: రూ .10 కోట్ల వరకు సంవత్సరానికి 2.70%అర్హత: భారతీయ నివాసితులు; చెల్లుబాటు అయ్యే కేవైసీ (ఆధార్, పాన్ మొదలైనవి) అవసరం.అదనపు గమనికలు: గరిష్ట బ్యాలెన్స్ పై గరిష్ట పరిమితి లేదు; ఏటీఎం లేదా బ్రాంచీల వద్ద విత్ డ్రా ఫారాల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్:జూన్ 1 నుండి, కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చింది.ఫీచర్లు: తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ లకు ఛార్జీలు ఉండవు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహిస్తాయి.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్:బీఎస్బీడీఏ, మైనర్ల ఖాతాలు వంటి నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తుంది (గరిష్టంగా రూ. 2,00,000 ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ లేదు).ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్ (అభ్యర్థనపై).వడ్డీ రేటు: సంవత్సరానికి 2.75% –2.90% (2024 లో బ్యాలెన్స్ ఆధారంగా).గమనిక: సాధారణ పొదుపు ఖాతాలకు రూ .500 (చెక్బుక్ లేకుండా) లేదా రూ. 1,000 (చెక్బుక్తో) కనీస బ్యాలెన్స్ అవసరం, కానీ ఈ ఖాతాలలో ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి జరిమానాలు ఉండవు. నిర్దిష్ట పథకాలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.యాక్సిస్ బ్యాంక్:ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, బేసిక్ బ్యాంకింగ్ సేవలు (డిపాజిట్లు/ ఉపసంహరణలు), ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% –3.5% (బ్యాలెన్స్ ఆధారంగా).బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కూడిన బరోడా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్కు ఎలాంటి పెనాల్టీలు ఉండవు.వడ్డీ రేటు: మారుతుంది (సాధారణంగా సంవత్సరానికి 2.75%–3.25%).హెచ్డీఎఫ్సీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, అపరిమిత ఏటీిఎం ఉపసంహరణలు, ఉచిత నెట్ / మొబైల్ బ్యాంకింగ్, ఎల్పీజీ సబ్సిడీలు, డీబీటీ వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు ప్రాప్యత.వడ్డీ రేటు: ఏడాదికి 3 శాతం (రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్లకు), 3.5 శాతం (రూ.50 లక్షలకు మించిన బ్యాలెన్స్లకు).ఐసీఐసీఐ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, 15,000+ ఏటీఎంలకు యాక్సెస్, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఆప్షనల్ ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% (ప్రారంభ రేటు).కోటక్ మహీంద్రా బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది.ఫీచర్లు: 811 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్షణ ఖాతా తెరవడం, ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు (సంవత్సరానికి రూ.199 వద్ద ఫిజికల్ కార్డు), అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 4% వరకుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్:కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రథమ్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు (మైక్రో ఏటీఎంలతో సహా), ఉచిత నెట్/ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ వడ్డీ క్రెడిట్లు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. రూ.35 లక్షల ప్రమాద బీమా, డైనింగ్ డీల్స్).వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు (లిస్టెడ్ బ్యాంకుల్లో అత్యధికం).ఆర్బీఎల్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు (విత్ డ్రా లిమిట్ రూ.50,000/రోజు), ఉచిత అన్ లిమిటెడ్ నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఉచిత నెట్/మొబైల్/ఫోన్ బ్యాంకింగ్, షాపింగ్/డైనింగ్ పై డిస్కౌంట్లు.వడ్డీ రేటు: ఏడాదికి 7.5% వరకు.యస్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, యెస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ ఐఎంపీఎస్, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. యాక్సిడెంటల్ డెత్ కవర్).వడ్డీ రేటు: ఏడాదికి 2.75% (రూ.50 లక్షల వరకు), 3.25% (రూ.40 కోట్ల వరకు).డీసీబీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత ఏటీఎం కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఉచిత నెట్/ మొబైల్/ ఫోన్ బ్యాంకింగ్, ఫిజికల్/ ఈమెయిల్ స్టేట్మెంట్లు.వడ్డీ రేటు: వనరులలో పేర్కొనబడదు, కానీ సాధారణంగా పోటీ.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్ (జీరో బ్యాలెన్స్, యువతను లక్ష్యంగా చేసుకుని) అందిస్తోంది.ఫీచర్లు: నో మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత డెబిట్ కార్డు, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, కాంపిటీటివ్ వడ్డీ రేట్లు.వడ్డీ రేటు: పరిశ్రమలో అత్యధికం (క్రెడిట్ త్రైమాసికం).ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, రూ .5,000 వరకు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు.

సెంచరీల మోత మోగిస్తున్న విండీస్ బ్యాటింగ్ సంచలనం.. 4 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో ఇవాళ (జూన్ 1) జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ వన్డౌన్ ఆటగాడు కీసీ కార్టీ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. కార్టీ 105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేయడంతో 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. కార్టీతో పాటు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్ ఆటగాడు షాయ్ హోప్ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ ఇన్నింగ్స్లో జువెల్ ఆండ్రూ 0, షిమ్రోన్ హెట్మైర్ 4, జస్టిన్ గ్రీవ్స్ 22, మాథ్యూ ఫోర్డ్ 1, రోస్టన్ ఛేజ్ 0, గుడకేశ్ మోటీ 18, అల్జరీ జోసఫ్ 10 పరుగులకు ఔటయ్యారు. కార్టీ, హోప్ క్రీజ్లో ఉండగా విండీస్ ఇంకా భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (10-0-63-4), సాకిబ్ మహమూద్ (9.4-0-37-3) చెలరేగడంతో విండీస్ 308 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్ కూడా తలో వికెట్ తీశారు.కాగా, విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు.గత తొమ్మిది ఇన్నింగ్స్ల్లో నాలుగో సెంచరీఇంగ్లండ్తో రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన కీసీ కార్టీకి గత తొమ్మిది వన్డే ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. 28 ఏళ్ల కార్తీ గత 10 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 2 అర్ద సెంచరీల సాయంతో 95కు పైగా సగటుతో 864 పరుగులు సాధించాడు. ఓవరాల్ కెరీర్లో 36 వన్డేలు ఆడిన కార్టీ 5 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీల సాయంతో 50కి పైగా సగటుతో 1403 పరుగులు చేశాడు.2nd ODI Vs ENG 103 (105)1st ODI Vs ENG 22 (26) 3rd ODI Vs IRE 170 (142) 2nd ODI Vs IRE 102 (109) 1st ODI Vs IRE 6 (15) 3rd ODI Vs BAN 95 (88) 2nd ODI Vs BAN 45 (47) 1st ODI Vs BAN 21 (37) 3rd ODI Vs ENG 128 (114) 2nd ODI Vs ENG 71 (77)

బాబొచ్చాక నేల చూపులే.. ఏపీలో మళ్లీ పడిపోయిన జీఎస్టీ ఆదాయం
సాక్షి, విజయవాడ: సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఉన్న సంపదను కూడా నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ ఆదాయం మళ్లీ పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో క్షీణతలే నమోదవుతున్నాయి.మే నెలలోనూ 2 శాతం జీఎస్టీ ఆదాయం మైనస్ అయ్యింది. గత ఏడాది మే ఆదాయం కంటే.. ఈ ఏడాది మే నెలలో తక్కువ ఆదాయం నమోదైంది. చంద్రబాబు పాలనలో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన జీఎస్టీ ఆదాయం.. చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రమే తగ్గింది.మే లో 3,803 కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా.. గత ఏడాది మే నెలలో 3,890 కోట్లు జీఎస్టీ ఆదాయం వచ్చింది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ ఆదాయం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జీఎస్టీ ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం పతనమైంది. చంద్రబాబు సీఎం అయ్యాక అత్యధిక మాసాలు ఆదాయం పతనమైంది. చంద్రబాబు పాలన వైఫల్యానికి ఇది నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

సింధూ నీళ్లు చుక్క కూడా ఇవ్వం.. పాక్కు భారత్ కౌంటర్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ ఎప్పటికప్పుడు వరుస షాక్లు ఇస్తూనే ఉంది. పహల్గాం ఘటన తర్వాత పాక్కు చుక్కలు చూపిస్తోంది. ఇటు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా సింధూ జలాల విషయంలో మరోసారి పాక్కు భారత్ ఝలక్ ఇచ్చింది. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అనేది సింధూ నదీ జలాల ఒప్పందం అమలులో జోక్యంతో సమానమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని పాక్కు హితవు పలికింది.కాగా, తజికిస్తాన్లోని దుషాన్బే నగరం వేదికగా హిమానీ నదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్లీనరీ సెషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్, పాకిస్తాన్కు సహా పలు దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయడాన్ని మేం అంగీకరించం. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇదంతా చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. భారతదేశం రెడ్ లైన్ను దాటడాన్ని మేం సహించం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.అనంతరం, పాకిస్తాన్కు భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఈ సందర్బంగా కీర్తి వర్థన్ ప్రసంగిస్తూ.. సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత్, పాక్ సంతకం చేసిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. పాకిస్తానే ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తానే తప్పు చేస్తూ భారత్ను పాక్ నిందించడం సరికాదు. ఈ సదస్సు వేదికను దుర్వినియోగం చేయడానికి, దీని పరిధిలోకి రాని అంశాలను ప్రస్తావించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ఖండిస్తున్నాను. సింధూ నదీ ఒప్పందపు నియమ నిబంధనలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సాంకేతిక, జనాభా, పర్యావరణపరమైన అంశాల్లో మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నాను. పాక్ సీమాంతర ఉగ్రవాదంపైనా చర్చ జరగాలన్నారు. సద్భావన, స్నేహ స్ఫూర్తితో కుదిరిన ఈ ఒప్పందం అమలుకు ఉగ్రవాదంతో పాకిస్తాన్ ఆటంకం కలిగిస్తోంది.హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంది. హిమానీనదాలు కరిగిపోతుండటం అనేది ఒక హెచ్చరిక మాత్రమే కాదు. ఈ వైపరీత్యం వల్ల జల భద్రత, జీవవైవిధ్యం, వందల కోట్ల ప్రజల జీవనోపాధి ప్రశ్నార్ధకంగా మారుతాయి. పర్యావరణ పరిరక్షణతో భూతాపాన్ని తగ్గించడంపై కుదిరిన పారిస్ ఒప్పందంలో భారత్ అంగీకరించిన నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ (NDCs)ను సాధించే దిశగా మోదీ సర్కారు గణనీయమైన పురోగతిని సాధించామం’ అని వెల్లడించారు.

ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు? శర్మిష్టా పనోలి ఎవరు?శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్ సిందూర్తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై ఓ పాక్ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్బాదియాపై విమర్శలు గుప్పించారు. Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ— IANS (@ians_india) May 31, 2025ఆ విమర్శలు మిస్ఫైర్ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ, కోల్కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. Free the brave Sharmishta Panoli!It’s a disgrace for the freedom of speech that she was arrested. Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad. Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండిశర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'పాడేరు 12వ మైలు' సినిమా జూన్ 6న రిలీజ్
యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
సెంచరీల మోత మోగిస్తున్న విండీస్ బ్యాటింగ్ సంచలనం.. 4 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు
'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్
ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్ విమానాలు ధ్వంసం!
PBKS VS MI, Qualifier 2 Updates: మళ్లీ మొదలైన వర్షం.. మరింత ఆలస్యం కానున్న మ్యాచ్
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల
‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
మన ఫైటర్ జెట్స్ను కోల్పోయాం: సీడీఎస్
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
డ్రైవర్తో వివాహేతర సంబంధం.. చివరికి..!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
నటి బ్రిగిడా సాగా..కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
కొడుకు బారసాల జ్ఞాపకాలతో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట
భైరవం మూవీ రివ్యూ
అడిగింది ఇస్తావా?.. మన వీడియో లీక్ చేయమంటావా..
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
'పాడేరు 12వ మైలు' సినిమా జూన్ 6న రిలీజ్
యువతిని గుద్ది చంపేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ యత్నం?.. వీడియో వైరల్
‘కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది’
సెంచరీల మోత మోగిస్తున్న విండీస్ బ్యాటింగ్ సంచలనం.. 4 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు
'చౌకీదార్' నుంచి 'నాన్న' పాట రిలీజ్
ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్ విమానాలు ధ్వంసం!
PBKS VS MI, Qualifier 2 Updates: మళ్లీ మొదలైన వర్షం.. మరింత ఆలస్యం కానున్న మ్యాచ్
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల
‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
మన ఫైటర్ జెట్స్ను కోల్పోయాం: సీడీఎస్
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
డ్రైవర్తో వివాహేతర సంబంధం.. చివరికి..!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై జైశంకర్ మాట
భైరవం మూవీ రివ్యూ
అడిగింది ఇస్తావా?.. మన వీడియో లీక్ చేయమంటావా..
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
సినిమా

సమంత- రాజ్ డేటింగ్ రూమర్స్.. డైెరెక్టర్ భార్య పోస్ట్ వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది. జిమ్లో వర్కవుట్స్తో పాటు పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుతో పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. అలా మరోసారి ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో డేటింగ్పై చర్చ మొదలైంది. ఇటీవల శుభం మూవీ రిలీజ్ తర్వాత విమానంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోను సామ్ షేర్ చేసింది. ఆ సమయంలోనే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.తాజాగా ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. 'అన్నింటినీ కాలమే నిర్ణయిస్తుంది.. కర్మ వాటిని సరిదిద్దుతుంది.. విశ్వం వినయాన్ని నేర్పిస్తుంది' అంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఆమె వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలపై పరోక్షంగా స్పందించారు.కాగా.. శుభం మూవీ సక్సెస్ తర్వాత విమానంలో సమంత షేర్ చేసిన ఫోటో చూశాకే రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. శుభం సక్సెస్ మీట్లోనూ రాజ్ నిడిమోరు కనిపించారు. అంతకుముందు ఇద్దరు కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కానీ ఇప్పటివరకు తమపై వస్తున్న వార్తలపై సమంత కానీ.. రాజ్ కానీ స్పందించలేదు. మరోవైపు సమంత, రాజ్ ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్' అనే కొత్త ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, జైదీప్ అహ్లవత్, వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది
యంగ్ హీరోయిన్ శ్రీలీల.. తాజాగా ఇంట్లో సెలబ్రేషన్స్ అని కొన్ని ఫొటోలు చేసింది. దీంతో ఈమెకు నిశ్చితార్థం జరిగిందా? పెళ్లెప్పుడు? అబ్బాయి ఎవరు? అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయమై తెగ మాట్లాడుకున్నారు. ఇంకా ఊరుకుంటే ఇది చాలా దూరం వెళ్తుందేమోనని ఊహించిన శ్రీలీల.. మొత్తానికి ఈ ఫొటోలపై క్లారిటీ ఇచ్చేసింది.'నా ముందస్తు పుట్టినరోజు వేడుకల్ని ఇట్లో మేం ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా అమ్మ చూసుకున్నారు' అని శ్రీలీల చెప్పింది. దీంతో పాటు ఓ నాలుగైదు ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వేడుకల్లో నటుడు రానా భార్య మిహిక పాల్గొనడం విశేషం.(ఇదీ చదవండి: పరమశివుడిగా సూపర్స్టార్ కృష్ణ.. పోస్టర్ చూశారా?)ఈ ఫొటోలు చూసి శ్రీలీల ఎంగేజ్మెంట్ అని అందరూ అనుకోవడానికి ఓ కారణముంది. ప్రస్తుతం బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో కలిసి ఓ సినిమా చేస్తున్న ఈమె.. సదరు హీరోతో డేటింగ్లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలీల తాజా ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.'పెళ్లి సందD' మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. వరస సినిమాలు చేసింది. చివరగా 'రాబిన్ హుడ్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్'లో నటిస్తోంది. అలానే పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్.(ఇదీ చదవండి: నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14)

ఖలేజా రీ రిలీజ్.. అనూహ్యంగా ట్రెండింగ్లోకి వచ్చిన నటి.. అసలు విషయం ఇదే!
మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ చేశారు. అప్పట్లో థియేటర్లలో అంతగా రాణించని ఈ చిత్రం.. రీ రిలీజ్లో మాత్రం ఊహించని రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్ రోజు మహేశ్ బాబు అభిమానులు థియేటర్లలో ఓ రేంజ్లో సందడి చేశారు. ఓ అభిమాని ఏకంగా పామును పట్టుకుని మూవీ థియేటర్కు వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.అయితే ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత అనూహ్యంగా ఆమె పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఆమె ఈ సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అని అందరూ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు.. ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్లో షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్ అయినా హీరో దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తాడు. ఈ సీన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సీన్స్లో నటించిన దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట తెగ వైరలైంది. అయితే ఇది చూసిన ఆమె.. ఖలేజా మూవీలో తాను నటించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది.తాజాగా ఖలేజా రీ రిలీజ్ కావడంతో దిలావర్ సింగ్ భార్యగా నటించింది దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ రోల్ తాను చేయలేదని స్పష్టం చేసింది. తానేనని చాలామంది పొరపాటుగా పోస్ట్ చేశారని తెలిపింది. View this post on Instagram A post shared by Divya Mary Cyriac (@divyacyriac)

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్లలో విడుదలైన సినిమాలకు ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ఒక్కో ఏడాదికిగానూ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాల్ని పురస్కారాలకు ఎంపిక చేసింది. 2014 ఏడాదిగానూ సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా 'పాఠశాల' చిత్రం ఎంపికైంది.మాహి వి రాఘవ దర్శకత్వం వహించిన 'పాఠశాల' చిత్రాన్ని రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఐదుగురు మిత్రులు, ఐదు వారాలపాటు, 5 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. యువత, స్నేహం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను అందంగా చూపించే ఒక అద్భుతమైన కథగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మనసుల్ని తాకిన గొప్ప కథనం, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన విజువల్స్ మేళవింపుతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 2014 ఏడాది సెకండ్ బెస్ట్ ఫిల్మ్గా గద్దర్ సినీ అవార్డ్కు ఎంపికైంది.ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారానికి పాఠశాల చిత్రం ఎంపికకావడం పట్ల చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. 'పాఠశాల' చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు మా చిత్రానికి ఉన్న శాశ్వతమైన ప్రభావాన్ని, విలువలను మరింత బలపరుస్తోందని అన్నారు.
న్యూస్ పాడ్కాస్ట్

మిస్ వరల్డ్గా సుచాత ఓపల్ చువాంగ్ శ్రీ.. కిరీటం దక్కించుకున్న థాయ్లాండ్ సుందరి

ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీల్లో విచ్చలవిడిగా వసూళ్ల దందా... నిబంధనలు, అర్హతలు పక్కనపెట్టి అంతా ఇష్టారాజ్యం

ఆంధ్రప్రదేశ్లో దేవుడి భూములకు దేవుడే దిక్కు... ఖరీదైన ఆలయ భూములను అస్మదీయులకు కట్టబెడుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
క్రీడలు

ఐపీఎల్పై ఫిక్సింగ్ అనుమానాలు.. ఫైనల్ మ్యాచ్ పోస్టర్లో హార్దిక్ పాండ్యా
క్వాలిఫయర్-2 మ్యాచ్కు ముందు ఐపీఎల్ మేనేజ్మెంట్ విడుదల చేసిన ఓ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఇందులో ఇదివరకే ఫైనల్కు చేరిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఫోటో ఐపీఎల్ ట్రోఫీకి ఓ పక్కన ఉండగా.. మరో పక్క ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ ఉంది. ఫైనల్ నేపథ్యంలో ఐపీఎల్ ఈ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఓ బెర్త్ ఆర్సీబీ దక్కించుకుంది. మరో బెర్త్ ఎవరిదో అన్న క్వశ్చన్ మార్కుతో ఈ పోస్టర్ను విడుదల చేసింది.2⃣ teams. 1⃣ seat next to #RCB 💙❤Qualifier 2 has all the answers 🔥#TATAIPL | #TheLastMile pic.twitter.com/gJNtTajmVk— IndianPremierLeague (@IPL) June 1, 2025వాస్తవానికి రెండో ఫైనల్ బెర్త్ కోసం ఇవాళ (జూన్ 1) పోటీ (క్వాలిఫయర్-2) జరుగనుంది. ఈ పోటీలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది.అయితే క్వాలిఫయర్-2 మ్యాచ్ ఫలితం రాకుండానే ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ పాండ్యా నీడను పోలిన ఇమేజ్ను పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని ఐపీఎల్ మేనేజ్మెంట్ క్లూ ఇచ్చిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 ఫిక్స్ అయ్యిందంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఐపీఎల్ మేనేజ్మెంట్ ఫైనల్ పోస్టర్పై హార్దిక్ నీడను పోలిన ఇమేజ్ పెట్టడంతో పాటు నీలం రంగు గుండె సింబల్తో ఏమోజీని పెట్టింది. నీలం రంగు ముంబై ఇండియన్స్ జెర్నీని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి.ఐపీఎల్ ఉద్దేశపూర్వకంగా చేసిందో ఏమో తెలీదు కానీ, ముంబై ఇండియన్స్కు ఫేవర్గా ఫైనల్ పోస్టర్ ఉండటం నెట్టింట దుమారాన్ని రేపుతుంది. ఐపీఎల్ ఫిక్స్ అయ్యిందంటూ ముంబై ఇండియన్స్ వ్యతిరేకులు ప్రచారం మొదలుపెట్టారు. ఐపీఎల్ యాజమాన్యం వ్యవహారశైలిపై పంజాబ్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ మేనేజ్మెంట్ ముంబై ఇండియన్స్కు అనుకూలంగా, మాకు వ్యతిరేకంగా మైండ్ గేమ్ ఆడుతుందని అంటున్నారు.ఐపీఎల్పై జరుగుతున్న ఫిక్సింగ్ ప్రచారంలో నిజానిజాలెంతో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ఒకవేళ మ్యాచ్ నిజంగానే ఫిక్స్ అయ్యుంటే క్రికెట్ అభిమానులు ఈజీగా పట్టేస్తారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

నిబంధనల అతిక్రమణ.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐసీసీ
మే 29న ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ స్లో ఓవర్ రేట్ పరిధిలోకి వస్తుంది. ఆ మ్యాచ్లో విండీస్ అదనపు సమయం ముగిసినా తమ కోటా ఓవర్లు (50) పూర్తి చేయలేకపోయింది. ఓ ఓవర్ వెనకపడింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో విండీస్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించాడు. ఈ జరిమానాను విండీస్ జట్టు సభ్యులు సవాలు చేయకుండా స్వీకరించారు. సాధారణంగా నిర్ణీత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్కు ఐదు శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధిస్తారు.ఇదిలా ఉంటే, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు మే 29న తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ (జూన్ 1) రెండో వన్డే జరుగుతుంది.

తొలి మ్యాచ్లోనే ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు బ్రెవిస్
సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ ఇంగ్లండ్ టీ20 లీగ్లో (వైటాలిటి టీ20 బ్లాస్ట్ 2025) తన తొలి మ్యాచ్లోనే ఇరగదీశాడు. ఈ లీగ్లో హ్యాంప్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రెవిస్.. ఎసెక్స్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. బ్రెవిస్తో పాటు టాబీ ఆల్బర్ట్ (54), జేమ్స్ విన్స్ (62) కూడా మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో హ్యాంప్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. హ్యాంప్షైర్ ఇన్నింగ్స్లో హోవెల్ 11, జేమ్స్ ఫుల్లర్ 4, వెథర్లీ 3, టామ్ ప్రెస్ట్ 3 పరుగులకు ఔట్ కాగా.. లియామ్ డాసన్ 19, వుడ్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఎసెక్స్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్, వాల్టర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కుక్, హార్మర్, క్రిచ్లే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఎసెక్స్ ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. డాసన్ (4-0-26-4), స్టార్ కర్రీ (2.2-0-20-2) చెలరేగడంతో ఆ జట్టు 16.2 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. ఫుల్లర్, హోవెల్ కూడా తలో వికెట్ తీశారు. ఎసెక్స్ ఇన్నింగ్స్లో కైల్ పెప్పర్ ఒక్కడే అర్ద సెంచరీతో (51) రాణించాడు. రొస్సింగ్టన్ (18), వాల్టర్ (23) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డీన్ ఎల్గర్ 0, క్రిచ్లీ 4, అల్లీసన్ 0, బెన్కెన్స్టెయిన్ 6, హార్మర్ 2, స్నేటర్ 5, ఆమిర్ 3 పరుగులకు ఔటయ్యారు.ఐపీఎల్ 2025లో అదరగొట్టిన బ్రెవిస్ఐపీఎల్ 2025లో లేట్గా రంగప్రవేశం చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్ల్లోనే తన తడాఖా చూపించాడు. ఈ మ్యాచ్లో అతను 180 స్ట్రయిక్రేట్తో రెండు హాఫ్ సెంచరీల సాయంతో 225 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బ్రెవిస్ ఆడిన ఇన్నింగ్స్లు వచ్చే సీజన్లో సీఎస్కే ప్రయాణానికి జీవం పోశాయి. బ్రెవిస్ను ఈ సీజన్లో సీఎస్కే రీప్లేస్మెంట్ ఆటగాడిగా తీసుకుంది. రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.

ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. ఎప్పుడంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్ను రింకూ పెళ్లిచేసుకోనున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 8న జరగనుంది. వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హాటల్లో జరగనుంది. అదేవిధంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్లో వివాహం చేసుకోనున్నారు. వారి పెళ్లి వారణాసిలో నవంబర్ 18న హోటల్ తాజ్లో గ్రాండ్గా జరగనుంది. ఈ విషయాన్ని రింకూ సింగ్ సన్నిహితులు వెల్లడించారు. కాగా వీరిద్దరి పెళ్లి అంశం ఈ ఏడాది జనవరిలో తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రియా తండ్రి, సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ ధృవీకరించారు. రింకూ, ప్రియాల పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. కాగా 27 ఏళ్ల రింకూ భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఈ యూపీ క్రికెటర్ టీమిండియా తరపున 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. అదేవిధంగా 26 ఏళ్ల ప్రియా ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్లోని మచ్లిషెహర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రియా సరోజ్ ఎంపీ మాత్రమే కాకుండా ఆమె న్యాయవాది వృత్తిలో కూడా కొనసాగుతున్నారు.చదవండి: IND vs ENG: 'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'
బిజినెస్

లిటిల్ ఫ్రెండ్స్ కోసం.. సూపర్ గాడ్జెట్స్
హుషారుగా ఆడుకుంటూ, సరదాగా నేర్పించే మ్యాజిక్ మెషిన్స్ను తెలివిగా వాడుకుంటే, ఏ పిల్లలైనా చదువుల్లోనే కాదు, ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ చూపిస్తారు. పిల్లల కోసం టెక్నాలజీ అందించిన ఫ్రెండ్లీ గాడ్జెట్స్ మీ కోసం..బ్రషింగ్ గేమ్ ఆడుదాం!చిన్నపిల్లలకు బ్రషింగ్ చేయించడం అంటే మినీ యుద్ధం చేయటంలాంటిది. శత్రుసైన్యంగా ఉండే టూత్పేస్ట్కి టార్చర్. బ్రష్కు బ్రేకప్.. ఇలా పేస్ట్, బ్రష్లతో పేరెంట్స్ పిల్లలకు బ్రషింగ్ చేయించడానికి పోరాడుతుంటారు. ఇప్పుడు ఈ యుద్ధానికి ఒక చిన్న టూత్బ్రష్ స్వస్తి పలికింది.'విల్లో అటో ఫ్లో’ కేవలం టూత్బ్రష్ మాత్రమే కాదు. ఇదొక అటోమెటిక్ బ్రషింగ్ డివైజ్. బలమైన, మృదువైన బ్రిసిల్స్తో ఇది చాలా సులభంగా పిల్లలకు బ్రషింగ్ చేయిస్తుంది. నీళ్లు తానే తీసుకుంటుంది. పేస్ట్ తానే ఇస్తుంది. దీనిని మొబైల్ యాప్కు కనెక్ట్ చేసుకొని వాడితే, మరింత ఆసక్తికరంగా పనిచేస్తుంది.‘క్యావిటీ కిల్లర్’ టైటిల్తో యాప్లో పిల్లలతో బ్రషింగ్ గేమ్ ఆడేలా చేస్తుంది. వివిధ కౌంట్డౌన్లు, బ్యాడ్జ్లు, రివార్డ్స్ ఇస్తూ వారికి బ్రషింగ్ అంటే ఇకపై యుద్ధంలా కాకుండా, ఒక సరదా ఆటలా కనిపించేలా చేస్తుంది. ఇక అప్పటి నుంచి టూత్పేస్ట్ బాత్రూమ్ గోడలపై కాదు, పళ్లపై ఉంటుంది. ధర 249 డాలర్లు (రూ.21,266).ఉఫ్.. ఉఫ్.. పిల్లిచూడటానికి చిన్నగా కనిపించే ఈ బుజ్జి పిల్లి. చేసే పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ పిల్లి అయినా తన తోక నొక్కితే వెంటనే ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ బయటకు వినిపించని బూతులెన్నో తిడుతుంది. కాని, ‘నికోజిటా ఫు ఫు’ అనే ఈ పిల్లి మాత్రం దీని తోకకున్న బటన్ నొక్కగానే ‘ఉఫ్.. ఉఫ్..’ అంటూ వేడి వేడిగా ఉండే ఫుడ్ని కేవలం మూడు నిమిషాల్లోనే ‘ఇప్పుడు లాగించొచ్చు’ అనే స్థితిలోకి వచ్చేలా చల్లారుస్తుంది.చిన్నపిల్లలు ఉండే ఇంట్లో దీని అవసరం చాలా ఉంటుంది. ప్లేట్, బౌల్, కప్పు ఇలా ఏ వస్తువుకైనా ఈజీగా దీనిని తగిలించుకొని ఉపయోగించుకోవచ్చు. రీచార్జబుల్, వాషబుల్. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఒక గంట వరకు పనిచేస్తుంది. ధర 27 డాలర్లు (రూ. 2,303) మాత్రమే!పీస్ఫుల్ గుడ్ఇల్లు పీకి పందిరేసే పిల్లలతో కూడా శాంతి మత్రం జపించేలా చేయగలడు ఇతడు. చూడ్డానికి చాలా చిన్నగా ఒక చిన్న పక్షి గుడ్డు సైజులో ఉంటాడు. తాకి చూస్తే దూది కంటే మెత్తగా ఉంటాడు. కాని, మహా మొండి ఘటాల్లాంటి పిల్లలను కూడా ప్రశాంతంగా మార్చేస్తాడు. ఇంతకీ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త యోగా గురువు పేరు ఏంటంటే ‘మూడ్ బడ్డీ’.దీనిని ఒక పది నిమిషాలు పిల్లల చేతికి అందిస్తే చాలు, వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. ఇందులో నాలుగు రకాల బ్రీతింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో వివిధ వాయిస్ కమాండ్స్, వైబ్రేషనల్ మోడ్స్ ఉంటాయి. ఇవి క్షణాల్లో మెదడును శాంతపరిచి, సెలెంట్ మోడ్లోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. రోజూ దీనిని వాడితే ప్రశాంతంగా మారడమే కాదు, సరైన సమయానికి నిద్ర కూడా పోతారట. ధర 99 డాలర్లు (రూ.8,458).

మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్ యాప్
సీమాంతర సైబర్ ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో క్విక్ హీల్ టెక్నాలజీస్ తాజాగా మోసాల నివారణ సొల్యూషన్ యాంటీఫ్రాడ్డాట్ఏఐ ఫ్రీమియం వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఫోన్లో కనిపించే హానికరమైన యాప్లతో పాటు కనిపించకుండా దాక్కునే యాప్లను కూడా గుర్తించడం దీని ప్రత్యేకత.ఫిషింగ్, స్పైవేర్, ఆర్థిక మోసాలపరమైన దాడుల కోసం ఉపయోగించే ఈ హిడెన్ యాప్లు యూజరుకు తెలియకుండా పని చేస్తాయి. ఇలాంటి యాప్ల గురించి యాంటీఫ్రాడ్డాట్ఏఐ యూజర్లను అలర్టు చేసి, తగు చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.స్కామ్ ప్రొటెక్షన్, రిస్క్ ప్రొఫైల్ అసెస్మెంట్, కాల్ ఫార్వార్డింగ్.. బ్యాంకింగ్ ఫ్రాడ్ అలర్ట్, ఫ్రాడ్ ప్రొటెక్ట్ బడ్డీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీన్ని ప్రాథమికంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, మరింత భద్రత కోరుకునే వారు సబ్్రస్కిప్షన్ ద్వారా ప్రీమియం వెర్షన్ తీసుకోవచ్చని సంస్థ సీఈవో విశాల్ సాల్వి తెలిపారు.

గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?
నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వెహికల్స్ వినియోగించాలని చెబుతూ.. హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు వెళ్లి, పర్యావరణంపై ఆయనకున్న మక్కువను చూపించారు. భర్త బాటలోనే నడుస్తూ.. గడ్కరీ సతీమణి ఆర్గానిక్ పద్దతిలో, మల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఉల్లిని పండించారు.ఉల్లిని అందరూ పండిస్తారు.. అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ వీరు పండించిన ఉల్లి ఒక్కొక్కటి సుమారు 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు లేదా ఒక కేజీ బరువు ఉన్నాయి. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతలో పేర్కొన్నారు. ''నా భార్య కాంచన్, నాగ్పూర్లోని ధపేవాడలోని మా భక్తి ఫామ్లో, మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి, ఒక కిలో వరకు బరువున్న సేంద్రీయ ఉల్లిపాయలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు'' అని ట్వీట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలను నాటు వేయడం వంటివన్నీ చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ పండిన ఉల్లి సాధారణ ఉల్లికంటే.. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒక రకంగా వీటిని బాహుబలి ఉల్లి అని కూడా చెప్పొచ్చు.మల్చింగ్ పేపర్ టెక్నాలజీమల్చింగ్ పేపర్ టెక్నాలజీలో.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పుతారు. దీనిపైన చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాటుతారు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ఉల్లిని పండించడానికి కాంచన్ గడ్కరీ సేంద్రీయ పద్ధతులనే ఉపయోగించారు. అంతే కాకుండా.. ఉల్లి విత్తనాలను ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికనాణ్యమైన విత్తనాలు ఉపయోగించి.. సహజ సిద్దమైన పద్దతులతో వ్యవసాయం చేస్తే తప్పకుండా మంచి దిగుబడి ఉంటుందని గడ్కరీ దంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్థానిక రైతులకు ఈ పద్దతిపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంచన్ గడ్కరీ పేర్కొన్నారు.नागपुर के धापेवाड़ा स्थित हमारे भक्ति फार्म में मेरी पत्नी, श्रीमती कांचन ने एक अनूठा प्रयोग करते हुए, मल्चिंग पेपर तकनीक का इस्तेमाल कर एक किलो तक वज़न वाले ऑर्गेनिक प्याज़ का सफल उत्पादन किया है।#OrganicFarming #OrganicOnion #Nagpur pic.twitter.com/nTjU11anHR— Nitin Gadkari (@nitin_gadkari) May 29, 2025

విద్యుత్కు భారీ డిమాండ్: వచ్చే ఐదేళ్లలో..
విద్యుత్ డిమాండ్ ఏటా 6 శాతం నుంచి 6.5 శాతం చొప్పున (కాంపౌండెడ్గా) వచ్చే ఐదేళ్ల పాటు పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తరణతోపాటు గ్రీన్ హైడ్రోజన్కు ఇస్తున్న ప్రాధాన్యం, డేటా సెంటర్ల విస్తరణ విద్యుత్ అవసరాలను అధికం చేస్తుందని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 44 గిగావాట్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో ఆల్టైమ్ గరిష్ట ఉత్పత్తి 34 గిగావాట్లుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అదనంగా ఏర్పడే డిమాండ్లో ఈ మూడు రంగాల నుంచే 20-25 శాతం వాటా ఉంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెండ్ విక్రమ్ తెలిపారు.రూఫ్టాప్ సోలార్ వినియోగం పెరుగుతుండడం, ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టుల నేపథ్యంలో గ్రిడ్ సామర్థ్య డిమాండ్ కొంత వరకు తగ్గొచ్చన్నారు. రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 520 గిగావాట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది.2025–2026లో థర్మల్ విభాగం నుంచి 9-10 గిగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుండగా.. మిగిలినదంతా పునరుత్పాదక విద్యుత్ వనరుల రూపంలో ఉంటుందని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో కొత్త సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. థర్మల్ విద్యుత్ విభాగం పట్ల స్థిరమైన అవుట్లుక్తో ఉన్నట్టు ఇక్రా తెలిపింది.
ఫ్యామిలీ

కింగులా బతికాడు సింగిల్గా..!
రోజూ పొద్దునే లేస్తాడు. ఆకలైతే తింటాడు. వ్యవసాయం తన వృత్తి. ఇంటి ముందే కొన్ని పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుకుంటుంటాడు. మనుషులెవ్వరితోనూ మాట్లాడడు. మూగజీవాలు, పక్షులే అతని ఫ్రెండ్స్. కాలక్షేపం కోసం ఇంటి పనులు, మరమ్మతులు, నీటి గుంటలు తవ్వటం వంటివి చేస్తాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక అలసట వస్తే, స్వయంగా నిర్మించుకున్న తన తాటాకుల గుడిసెలో సేద తీరుతాడు. అతన్ని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రతిసారి పెద్ద యుద్ధమే చేసి, విజయం సాధించాడు. అడగకుండా ఎన్ని ఇచ్చినా పుచ్చుకోకుండా, చేయి చాచని మహారాజులా నిలబడేవాడు. ఆఖరుకు ఎక్కడికైనా చేరగల ఇంటర్నెట్ కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అతన్ని మచ్చిక చేసుకోలేక పోయాయి. ఇలా హాయిగా తన పని తాను చేసుకునేవాడు. ఇంతే! ఇదే తన జీవితం. ఎంతో అందమైన, ప్రశాంతమైన జీవితం. ఇలా అందరూ బతకలేరు. ఎవరికీ సాధ్యం కాని పనికూడా! అయినప్పటికీ అతను ఈ సూపర్ సింగిల్ లైఫ్ని గత మూడు దశాబ్దాలుగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతనెవ్వరో కాదు, 1996లో తొలిసారి అమెజాన్ అటవీ అధికారులు గుర్తించిన ఒంటరి గిరిజనుడు. అతని తెగ మొత్తం అంతరించిపోయినా, అతను మాత్రం ఒక్కడే అడవిలో జీవిస్తున్నాడని తెలిసింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం అతన్ని 2018లో కెమెరాలో రహస్యంగా వీడియో తీసి, వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ మధ్యనే అధికారులకు అతని శరీరం గుడిసెలో కనిపించింది. నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఇరవై ఆరేళ్లపాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒంటరిగా మహారాజులా బతికి, అంతే రాజసంగా లోకం నుంచి నిష్క్రమించాడు. (చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!)

పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!
నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?– రమణి, శ్రీకాకుళం. మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్ అని అర్థం. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని అర్థం. అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్ లేదా వాటర్ లీక్ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్బీట్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్ క్రాక్స్ వస్తున్నాయి. బ్లడ్ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – లావణ్య, తిరుపతి. బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్ క్రాక్స్ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్ సర్కులేషన్ వస్తుంది. వ్యాసలిన్ లేదా పారాఫిన్ లేదా ప్యూరిఫైడ్ లోషన్తో నిపుల్ మీద మసాజ్ చెయ్యాలి. ఇలా ప్రతి ఫీడ్ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్ ఇవ్వండి. బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్ కాకుండా ప్రివెంట్ చెయ్యడానికి ఫీడ్ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి నిపుల్ మీద రాసి, తరువాత కవర్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ షీల్డ్ అని మెడికల్ షాప్స్లో రబ్బర్ కవరింగ్స్ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్ ఎక్కువ ఉండి, బ్లీడింగ్ అవుతుంటే క్రీమ్స్ రాసి దాని తరువాత సరైన సైజ్లోని షీల్డ్ పెట్టి ఫీడింగ్ ఇస్తే నిపుల్కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నిపుల్ క్రాక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. రొమ్ముల ఐరోలా, నిపుల్ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. నిపుల్ ఒక్కటే పట్టుకొని సక్ చేస్తే క్రాక్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్ కన్సలెంట్ని కలసి మీకు పొజిషన్స్ ఫర్ ఫీడింగ్ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్ బాగా వస్తుంది, నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..)

ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!
మయాన్మార్లోని బాగన్ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగన్ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం, వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. 11 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బర్మీస్ నిర్మాణ కళకు అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి.విస్తారమైన మైదానంలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయాల దృశ్యం గొప్ప అనుభూతినిస్తుంది. సంధ్యవేళలో బంగారుకాంతితో మెరిసే ఈ నిర్మాణాలు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదగాన్ పగోడా, థాబ్యిన్యు టెంపుల్ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి.బాగన్ అందాలను ఆస్వాదించడానికి ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ భలేగా ఉంటుంది. ఆ రైడ్తో ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోని విశాలమైన ఆలయాల దృశ్యాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం కలిగిస్తుందంటారు పర్యాటకులు. కాలక్రమేణా ఇక్కడ కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ, బాగన్ చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది చరిత్ర, సంస్కృతిని ప్రేమించే వారు, తప్పక చూడవలసిన ప్రదేశం. (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!)

వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! నెటిజన్లు ఫిదా
వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్లైన్’లో ఈ బామ్మ పేల్చే బ్లష్ బ్లాస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్ బ్రష్ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్ మీడియాను షేక్ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్కు చెందిన జోన్ పార్ట్రిడ్జ్. ఈమె వయసు 103.సరదా సరదాగా బ్యూటీ పాఠాలురోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్ బ్రష్ పట్టుకుంటుంది. ఆపై మొబైల్ కెమెరా ఆన్ చేసి, టిక్టాక్లో మేకప్ ట్యూటోరియల్ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరోజు బ్లష్ బ్రష్ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్ టెక్నిక్స్ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్ ఫిదా అయ్యారు. ‘ఇలా కాజల్ వేయాలి, ఇలా బ్రష్ తిప్పాలి, ఇలా బ్లష్ టచప్ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్ అయినా, సీరియస్గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్టాక్’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.వరుస గిఫ్ట్ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్ ఐటమ్స్ను కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాషన్ బ్రాండ్స్కు ట్యాగ్ చేశారు. బ్రాండ్స్ వాళ్లు కూడా బామ్మ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్టాక్లో వైరల్ స్టార్, మేకప్ గురు, బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్బుక్ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్ చేస్తున్నారు. బ్లష్ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్టాక్ స్టార్లుగా రెడీ అవ్వడానికి! (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..)
ఫొటోలు


కొత్తిల్లు కొన్న నటుడు.. ఘనంగా గృహప్రవేశం (ఫోటోలు)


ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం దండేలి..! చూడచక్కని ప్రదేశాలివే..


జనంపై బాబు పగ.. ఏపీలో ‘రేషన్’ కష్టాలు (ఫొటోస్)


దక్షిణాదిన ఈ జలపాతాలు చూశారా?


పెళ్లి వేడుకలా హీరోయిన్ శ్రీలీల బర్త్ డే (ఫొటోలు)


మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)


మిస్ వరల్డ్-2025 ఫైనల్స్ సందడి.. ర్యాంప్ వాక్తో మెరిసిన అందగత్తెలు (ఫొటోలు)


ట్రెడిషనల్ లుక్లో ముద్దుగుమ్మలా వర్ష (ఫొటోలు)


నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)


ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
అంతర్జాతీయం

మిస్వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత
Miss World 2025 Grand Finale Updates:👉మిస్వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరిమిస్ వరల్డ్ 2025గా థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాతవిజేత ఓపల్ సుచాతకు బ్లూక్రౌన్ అలంకరించిన క్రిస్టినామిస్ వరల్డ్ 1వ రన్నరప్గా ఇథియోపియా సుందరి అడ్మాస్సుమిస్ వరల్డ్ 2వ రన్నరప్గా పోలాండ్ సుందరి మాజా క్లాజ్డ్మిస్ వరల్డ్ 3వ రన్నరప్గా మార్టినిక్ భామ అరోలి జోచిమ్👉మిస్ వరల్డ్ లో ఫైనల్ రౌండ్ ప్రారంభంజడ్జీలు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్ల సమాధానాలువాటికి మార్కుల ఆధారంగా విజేత👉మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ (మానవతావాది) అవార్డు అందుకున్న సోనూ సూద్కోవిడ్ సమయంలో ఆయన చేసిన మానవతాచర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించిన మిస్ వరల్డ్ నిర్వాహకులురానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేతస్టేజ్ పైన వదల బొమ్మాళీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహ పరిచిన సోనూ సూద్తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పిన సోనూసూద్👉టాప్-8 లో చోటు దక్కించుకోలేకపోయిన ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తా ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేసిన నిర్వాహకులు👉మిస్ వరల్డ్ టాప్ నలుగురు వీరే..అమెరికా ఖండం నుంచి మార్టినిక్ఆఫ్రికా నుంచి ఇథియోపియాయూరోప్ నుంచి పోలెండ్ఆసియా నుంచి థాయిలాండ్👉మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించిన మిస్ ఇండియా నందిని గుప్తాఆసియా నుంచి టాప్-2లో చేరిన థాయ్లాండ్నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నతో 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశంఅభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు 👉మిస్ వరల్డ్ ఫినాలే నుంచి మిస్ ఇండియా ఎలిమినేట్ఎలిమినేటైన మిస్ ఇండియా నందిని గుప్తాటాప్-8లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోఫియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్, థాయ్లాండ్లు 👉ఆసియా నుంచి టాప్ 5లో మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 20 లో ఇండియా కంటెస్టెంట్ నందిని గుప్తాకు చోటు👉మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధా రెడ్డి నియామకంజ్ఞాపికను అందించిన మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీచాలా ఆనందంగా ఉందన్న సుధా రెడ్డిఅద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపిన సుధా రెడ్డి👉జడ్జిలుగా..జూలియా మోర్లీ నటుడు సోనూ సూద్సుధా రెడ్డి రానా దగ్గుబాటిజయేష్ రంజన్ మనూషి చిల్లర్ నమ్రత శిరోద్కర్ డోనా వాళ్ష్కరినా టర్రెల్👉అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్ ఫైనల్ ఈవెంట్కుటుంబ సమేతంగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్హాజరైన సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాక్షి, హైదరాబాద్: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఫినాలేకు రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్లుగా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు.2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్.. ఫినాలే ఈవెంట్ను హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరయ్యారు.ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్ను ప్రకటించనున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు ఫినాలేలో పోటీపడుతున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.బ్యూటీ విత్ ఎ పర్సస్లో మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజేతలుగా నిలిచారు. బ్యూటీ విత్ ఎ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోను మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్ లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్లో మిస్ టర్కీ విన్ అయ్యారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్ మోడల్గా నిలిచారు.

మాక్రాన్-బ్రిగెట్టా వీడియోపై ట్రంప్ ఫన్నీ.. డోర్ క్లోజ్ చేయాలంటూ..
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వీడియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇలాంటివి జరిగేటప్పుడు అక్కడ తలుపులు మూసి ఉన్నాయో.. తెరిచి ఉన్నాయో చూసుకోవాలి అని ఫన్నీ కామెంట్స్ చేశారు. అది చూసుకుంటే ఇలా సోషల్ మీడియాలో మనం ఉండం కదా.. అని చెప్పుకొచ్చారు.అధ్యక్షుడు మాక్రాన్ ముఖాన్ని ఆయన సతీమణి బ్రిగెట్టా నెట్టినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై స్పందించాలని ఓ విలేకరి ట్రంప్ను కోరారు. ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ.. దీని గురించి తాను నేరుగా మాక్రాన్తోనే మాట్లాడాను. అంతా బాగానే ఉందని తెలిపారు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు తలుపులు వేసి ఉన్నాయో, లేదో ఒకసారి గమనించుకోవాలి అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. మాక్రాన్-బ్రిగెట్టాల వియత్నాం పర్యటన సందర్బంగా హనోయ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం హనోయ్లో దిగిన తరవాత.. ఒక అధికారి తలుపును తెరిచినప్పుడు మాక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనిపించింది. అంతలోనే ఎర్రని స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మాక్రాన్ను నెట్టివేశాయి. ఆయన వెంటనే తలతిప్పి వెనక్కి జరిగారు. ఇది రికార్డు అవుతున్నట్లు గమనించి చిరునవ్వుతో చేయి ఊపారు. ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. భార్య చేతిని పట్టుకోవడానికి మాక్రాన్ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. తరువాత ఇద్దరూ కలసి మెట్లు దిగి రెడ్ కార్పెట్ మీద పక్కపక్కనే నడిచారు.BREAKING:@pdoocy just asked Donald Trump about Brigitte Macron slapping @EmmanuelMacron earlier this week.TRUMP: "Make sure the door remains closed."🤣🤣 pic.twitter.com/V05Hna79DG— Evan Kilgore 🇺🇸 (@EvanAKilgore) May 30, 2025అనంతరం, ఈ ఘటనపై మాక్రాన్ స్పందిస్తూ.. మా విషయంలో ప్రతీ ఒక్కరూ మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అప్పుడు నా భార్యతో నేను జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగేదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ‼️🇫🇷 Here's a higher-quality version of today’s most viral video. Enjoy! #Macron pic.twitter.com/aGkx0nXzKe— Maimunka News (@MaimunkaNews) May 26, 2025

శశిథరూర్ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా
న్యూఢిల్లీ: భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన సమయంలో పాకిస్తాన్లో చోటుచేసుకున్న మరణాలపై దక్షిణ అమెరికాలోని కొలంబియా సంతాపం ప్రకటించింది. అయితే దీనిపై ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) కొలంబియాకు అవగాహన కల్పించడంతో, తాను గతంలో చేసిన ప్రకటనను ఆ దేశం ఉపసంహరించుకుంది. అలాగే ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న భారత్కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది.కొలంబియా పర్యటనలో ఉన్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ కొలంబియా(Colombia) ఇటీవల పాక్ మరణాలపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నదని, త్వరలోనే భారత్ వైఖరికి మద్దతు పలుకుతూ, మరో ప్రకటన చేయనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్లోని మాజీ భారత రాయబారి, బీజేపీ నేత తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ తమ ప్రతినిధి బృందం భారత్-పాక్ యుద్ధంపై సరైన వివరణ ఇవ్వడంతో, అది కొలంబియా వైఖరిలో మార్పు వచ్చేందుకు సహాయపడిందని అన్నారు.దీనిపై కొలంబియా ఉప విదేశాంగ మంత్రి రోసా యోలాండా విల్లావిసెన్సియో మాట్లాడుతూ తమకు భారత్- పాక్ల మధ్యనున్న వాస్తవ పరిస్థితులు తెలిశాయని, కశ్మీర్లో ఏమి జరిగిందనే దానిపై అవగాహన ఏర్పడిందన్నారు. ఇకపై తాము స్పష్టమైన ప్రకటన చేయగలమన్నారు. కాగా ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో పాక్లో చోటుచేసుకున్న మరణాలపై కొలంబియా సంతాపం ప్రకటించడాన్ని ఎంపీ శశిథరూర్ ఖండించారు. ఇది కూడా చదవండి: అణు విపత్తును ఆపేశా: ట్రంప్ నోట అదే పాట

వీడ్కోలు వేళ ఎలాన్ మస్క్ ముఖంపై గాయం.. ఏం జరిగింది?
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ వీడ్కోల వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మస్క్ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్ను ప్రశ్నించారు.But what happened to Elon Musk’s eyes? Black eye? Or am I seeing something else….pic.twitter.com/Dc5SgG1IjH— Chewy Veetton (@bebem00m00) May 31, 2025ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ గాయం నా కుమారుడు చేసింది. నేను, నా ఐదేళ్ల కుమారుడు X Æ A-Xii బీచ్లో గుర్రపు స్వారీ చేస్తున్నాం. ఈ క్రమంలో అతడు నా ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడు. దీంతో, అక్కడ గాయం ఏర్పడింది. ఆ సమయంలో దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా? అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం స్పందిస్తూ.. ఇన్ని రోజులు తాను కూడా గాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. కానీ, మస్క్ కుమారుడు అలా చేయగలడు అని అన్నారు. ఇక, ట్రంప్, టెక్ మాగ్నెట్ కుమారుడే X Æ A-Xii.Elon Musk was seen with a noticeable black eye, showing visible bruising and discoloration around the area while at the White House with President Trump.President Trump presented him with the White House Key, calling it a gift from the nation.Musk will continue to serve as an… pic.twitter.com/CjcR1g9aK6— Shadow of Ezra (@ShadowofEzra) May 30, 2025అయితే, ఎలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్హౌస్లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా? అని మస్క్ను విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాస్క్ స్పందిస్తూ.. అది తప్పుడు కథనం అంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ, మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.Elon Musk's 5-year-old son, X, punched him so hard he got a black eye😂Reporter: "Mr. Musk, is your eye okay?"Elon: "Well, I wasn't anywhere near France... I was just walking around with Lil X, and I said, 'Go ahead,' punch me in the face, and he did. Turns out even a… pic.twitter.com/m7u2PSTluy— George (@BehizyTweets) May 30, 2025ఇదిలా ఉండగా.. వీడ్కోలు సందర్బంగా ట్రంప్.. మస్క్కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా..డోజ్కు వీడ్కోలు సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్నకు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్’కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు.
జాతీయం

ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. పాక్తో సంబంధాలపై ఆరా
న్యూఢిల్లీ: ‘పహల్గామ్’ ఘటన అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(National Investigation Agency)(ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో కొనసాగాయి.ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లలో పాకిస్తాన్ నిఘా సంస్థ (పీఐవో)లతో సంబంధాలున్న అనుమానితుల ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఐఏ బృందాలు పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఆర్థిక లావాదేవీల పత్రాలతో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్కు సహకరిస్తున్న వారు నిర్వహిస్తున్న గూఢచర్య రాకెట్కు సంబంధించిన ఆధారాల కోసం వీటిని సేకరించారు.ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం అనుమానితులకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని తేలింది. వారు పాక్ తరపున గూఢచర్య కార్యకలాపాలు సాగించారని వెల్లడయ్యింది. 2023 నుండి పాకిస్తాన్ అధికారులతో కీలక సమాచారాన్ని పంచుకుంటున్న నిందితుడిని ఎన్ఐఏ మే 20న అరెస్టు చేసింది. ఇతను జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేస్తూ, దినికి బదులుగా పాక్ నుంచి నిధులు అందుకున్నాడనే అనుమానాలున్నాయి. ఈ కేసుపై ఉగ్రవాద నిరోధక సంస్థ తన దర్యాప్తును కొనసాగిస్తోంది.ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే..

ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
గౌహతి: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే తరుణంలో గత రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, మిజోరం(Assam, Arunachal, Meghalaya, Manipur, Mizoram) రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో అతలాకుతలమవుతున్నాయి. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60 వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.అరుణాచల్ ప్రదేశ్లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఒక కారులపై కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. 10 వేలకుపైగా జనం వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గౌహతి శివార్లలోని బోండా ప్రాంతంలో కొండచరియలు(Landslides) విరిగిపడి, ముగ్గురు మహిళలు మరణించారని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా తెలిపారు. గౌహతిలో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని పలు నదులలోని నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి జిరోలోని పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే..

మావోయిజం అంతం? గణాంకాలివే..
న్యూఢిల్లీ: దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందనే మాట వినిపిస్తోంది.1967లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసే లక్ష్యానికి ప్రభుత్వం, భద్రతా దళాలు చేరువయ్యాయని ఎన్డీటీవీ యాక్సెస్ చేసిన డేటాలో వెల్లడవుతోంది. 2010లో 1,936 మావోయిస్టు హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఇది 2024కి 374కి తగ్గిందని, అంటే ఏకంగా 81శాతం మేరకు తగ్గిందని హోం మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గింది. 2013లో 126 ఉండగా, అది 2021నాటికి 70కి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 18కి చేరింది.మావోయిస్టులు సాగించిన హింసాత్మక ఘటనల్లో(violent incidents) పౌరుల మృతులను చూసుకుంటే 2010లో ఈ సంఖ్య 720గా ఉంది. 2019లో ఇది 150కి తగ్గింది. గత ఏడాది 131గా ఉండగా, 2023లో 106గా ఉంది. ఈ ఏడాది మార్చిలో ఈ తరహాలో 19 మరణాలు చోటుచేసుకున్నాయి. పౌరులు, భద్రతా దళాల సిబ్బంది మొత్తం మరణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంఖ్య 2010లో 1,005గా ఉండగా, గత సంవత్సరం 85శాతానికి తగ్గి, 150కి చేరుకుంది.కొన్నేళ్లుగా మావోయిస్టులు రైల్వే ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లు, టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు, మొబైల్ టవర్లు, రోడ్లు , పాఠశాలలు లాంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తరహా ఘటనలు 2010లో 365 నుండి 2017లో 75కి తగ్గాయి. 2024లో కేవలం 25గా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి నెలల్లోనే 150 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఖ్య 2017లో 136గా ఉంది. 2023లో 380గా ఉండగా, గత ఏడాది ఇది 290గా ఉంది.ఇటీవల ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్లో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ గడచిన మూడు దశాబ్దాల్లో ఒక సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి హతం కావడం ఇదే తొలిసారని అన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయ్యాక ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన అన్నారు. 2026 మార్చి 31 లోపు దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకున్నదని అమిత్ షా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘నమస్తే’కు రెండేళ్లు.. చేతులతో మలం ఎత్తడానికి ముగింపు పలుకుతూ..

‘టైగర్ మ్యాన్’: వాల్మీకి థాపర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్య మకారుడు, టైగర్ మ్యాన్గా పేరున్న వాల్మీకి థాపర్(73) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడు తున్న ఆయన శనివారం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్లోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. వన్యప్రాణుల సంరక్షణ, ప్రత్యేకించి పులులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాల పాటు తీవ్రంగా శ్రమించారు. అటవీ సంరక్షణలో ప్రజలను మమేకం చేసే లక్ష్యంతో 1988లో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ రణథంబోర్ ఫౌండేషన్కు థాపర్ సహ వ్యవస్థాపకుడు. సహజంగా సంచరించే ప్రాంతాల్లో పులులను అక్రమంగా వేటాడటంపై ఆయన ఉద్యమించారు. మానవ జోక్యాన్ని అడ్డుకు నేలా ప్రత్యేక టైగర్ జోన్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి సారథ్యంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్లైఫ్ వంటి రమారమి 150 ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. వన్యప్రాణుల గురించి టైగర్ ఫైర్, లివింగ్ విత్ టైగర్స్ వంటి 30కి పైగా పుస్తకాలను రాశారు. భారతీయ వన్యప్రాణులపై పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. 2024లో జీవావరణ పరిరక్షకురాలు నేహా సిన్హా తీసిన ‘మై టైగర్ ఫ్యామిలీ’అనే డాక్యుమెంటరీలో థాపర్ కూడా ఉన్నారు. కాగా, థాపర్ తండ్రి రమేశ్ థాపర్ ప్రముఖ జర్నలిస్ట్. బాలీవుడ్ దిగ్గజ నటుడు శశి కపూర్ కుమార్తె సంజనా కపూర్, వాల్మీకి థాపర్ దంపతులు కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
ఎన్ఆర్ఐ

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. హార్వర్డ్, ట్రంప్ సర్కార్కు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే, ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసిది. హార్వర్డ్ దాని SEVP స్థితిని పునరుద్ధరించాలని భావిస్తే, సంబంధిత పత్రాలను రూపొందించడానికి ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది. ట్రంప్ తాజా సంచలన నిర్ణయం అనేక మంది విదేశీ విద్యార్థులకు దెబ్బతీయనుంది.ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది.ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించిన ఈ నిర్ణయం, హార్వర్డ్లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో భారతదేశం నుండి దాదాపు 800 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుహార్వర్డ్ రికార్డుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్లు, వివిధ విభాగాలలో నమోదు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్లో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్-స్థాయి ప్రోగ్రామ్లలో ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు ఇప్పుడు అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దు , బహిష్కరణకు దారి తీయవచ్చు.హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) హార్వర్డ్పై జరుపుతోన్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని ప్రకటించింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో, క్యాంపస్లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా, క్యాంపస్లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణా రికార్డులు, ఆడియోవిజువల్ డాక్యుమెంటేషన్ను విశ్వవిద్యాలయం సమర్పించ లేదని లేఖలో ఆరోపించింది. అలాగే ‘హార్వర్డ్లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు.. అది ఓ అర్హత మాత్రమే” అని తెపారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమ కూర్చుకుంటున్నారు, ఇది హక్కు, కాదు’ అనిఆమె పేర్కొన్నారు.మరోవైపు దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ కక్షపూరిత చర్యగా అభివర్ణించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్ట విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ చర్య చట్టబద్ధమైనదేనా?అమెరికా చట్టాల ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థి వీసాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది. అలాగూ SEVPని పర్యవేక్షిస్తుంది. గతంలో నిష్ణాతులైన అధ్యాపకుల లేకపోవడం లేదా సంస్థను మూసివేయడం వంటి తీవ్రమైన పరిపాలనా లోపాలతో SEVP జాబితా నుండి కొన్నింటిని తొలగించినప్పటికీ, హార్వర్డ్ SEVP సర్టిఫికేషన్ను రద్దు చేయడం లాంటిది ఇంతకుముందెన్నడూ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.
H-1B visa applications for 2026 drops hit 4-year low
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థలనిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గింది. వీసా అప్లికేషన్లు సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.

హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
క్రైమ్

అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
యలమంచిలి రూరల్(అనకాపల్లి): రెండేళ్ల క్రితం యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన యువతి ఎల్లబిల్లి దివ్య(20) హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన అప్పట్లో జిల్లాలో సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో 25 నెలలుగా నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెండింగ్ కేసుల దర్యాప్తుపై దృష్టి సారించిన యలమంచిలి సర్కిల్ పోలీసులు చాకచక్యంగా పలు సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ హత్య కేసును ఛేదించిన యలమంచిలి సీఐ ధనుంజయరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, యలమంచిలి పట్టణం, మునగపాక ఎస్ఐలు కె.సావిత్రి, పి.ప్రసాదరావులను పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ అభినందించారు. ఈ సందర్భంగా యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన ఎల్లబిల్లి దివ్య(20) 2023 ఫిబ్రవరి 22న యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరం సమీపంలో దారుణ హత్యకు గురైంది. కాలిపోయిన ఆమె మృతదేహాన్ని గుర్తించిన ఎర్రవరం వీఆర్వో చేవేటి అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లో ఆమె ఎవరనేది, ఎవరు హత్య చేశారో కూడా గుర్తించలేని పరిస్థితి ఉండడంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మృతదేహంగాను, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కేసు నమోదు చేశారు. హత్యకు గురైన మహిళను తొలుత ట్రాన్స్జెండర్గా కూడా భావించారు. ఆ తర్వాత హత్యకు గురైంది పూడిమడకకు చెందిన ఎల్లబిల్లి దివ్యగా తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హతురాలు యలమంచిలిలో పలువురు యువకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండడంతో ఆమెతో పరిచయం ఉన్న చాలా మంది యువకులపై అనుమానంతో పోలీసులు విచారించారు. అయినా సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇటీవల ఈ కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన పోలీసులు పలు సాంకేతిక ఆధారాలతో యలమంచిలి ధర్మవరం సీపీ పేటకు చెందిన ప్రగడ రవితేజ(30), సెలంశెట్టి సాయికృష్ణ(20), కాకివాని వీధికి చెందిన బంగారి శివ(23)లను నిందితులుగా నిర్ధారణకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో నిందితులు నేరాన్ని అంగీకరించారు.వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే.. దివ్యకు కేసులో ప్రధాన నిందితుడు ప్రగడ రవితేజకు రిలేషన్షిప్ ఉండేది. రవితేజ మరో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆమెతో వివాహం కూడా నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న దివ్య.. తనను వివాహం చేసుకోవాలని రవితేజను కోరింది. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించింది. దివ్యను వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని రవితేజ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. ఇందుకు స్నేహితులైన సెలంశెట్టి సాయికృష్ణ, బంగారి శివల సహాయం కోరాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం దివ్యను పిడిగుద్దులు గుద్ది, చాకుతో పొడిచి చంపారు.అక్కడితో ఆగకుండా మృతురాలి ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. నిందితుల్లో ప్రగడ రవితేజ, సెలంశెట్టి సాయి కృష్ణలు యలమంచిలి రూరల్ పీఎస్లో గంజాయి చోరీ చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. మూడో నిందితుడు బంగారిశివపై కొట్లాట కేసు ఉంది. అంతేకాకుండా నిందితులు ముగ్గురూ గంజాయికి అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకెవరూ నిందితులు లేరని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ముగ్గుర్నీ శుక్రవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా జ్యుడీíÙయల్ రిమాండ్ విధించారు.

గొంతు కోసిన కత్తి ఏమైంది?
నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.ప్రేమ జంట ఆత్మహత్య

గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపనపల్లి(Gopanpally) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం(Road Accident) సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: భర్తకు మెసేజ్ పెట్టి బలవన్మరణం

మినీ సిలిండర్తో కొట్టి యువకుడి హత్య
రాజేంద్రనగర్(హైదరాబాద్): తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్ (31), నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్వర్క్ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్లకు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్ సిద్ధార్థ్ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్ ఇందుకు కారణమని సిద్ధార్థ్ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్ రూమ్లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్ షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ సముదాయించేందుకు ప్రయతి్నంచగా సిద్ధార్థ్ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్ రూమ్ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయతి్నంచగా నవీన్ బయటికి పరుగులు తీశాడు. బుద్వేల్ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


రేషన్ సరకుల కోసం మా పాట్లు ఇలా..!


పవన్ ధ్యాసంతా తన సినిమాలు.. సినిమా టిక్కెట్లు.. రిటర్న్ గిఫ్ట్ లపైనే


దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ విస్మరిస్తోంది


మళ్లీ సింగం గెటప్ తో సూర్య..


మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారుస్తుందని బాలయ్యకు ముందే తెలుసా?


రవితేజ తో అదిదా సర్ ప్రైజ్ అంటున్న కేతికా శర్మ..


కూటమిపై కన్నెర్ర


సింధు నీళ్ల కోసం కాళ్ళ బేరానికి పాకిస్తాన్


ఏపీలో పేదల రేషన్ కష్టాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన