Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious On Chandrababu Govt Over Ration Vehicles1
బాబూ.. సేవలను సమాధి చేయడమే మీ విజనా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?. రేషన్‌ డోర్‌డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా?. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన​ ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌..‘చంద్రబాబు గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్‌’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా? అని ప్రశ్నించారు.మరోవైపు వైఎస్సార్‌సీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్‌ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20వేలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? పారదర్శకంగా ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా? పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులుగానూ చిత్రీకరించేలా నిన్న మీరుచేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్‌ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్‌ షాపులముందు పడిగాపులు పడేవారు. ఎప్పుడు రేషన్‌ ఇస్తారో, ఎంతసేపు రేషన్‌ ఇస్తారో తెలియక కూలీపనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవారు. ఈ క్రమంలో లబ్ధిదారులు వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారు, దోపిడీకి గురయ్యేవారు. సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్‌ సరుకులు తీసుకోవడంకూడా మానేశారు. దీనిపై నా పాదయాత్రలో ప్రజలు నా వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.1.@ncbn గారూ ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై మీకు ఎందుకు కక్ష? మళ్లీ పేదలకు “రేషన్‌’’ కష్టాలు ఎందుకు తెస్తున్నారు? ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలికానీ, వారిని కష్టపెట్టడం సబబేనా? ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా? మరోవైపు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 1, 2025మా ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటివద్దకే రేషన్‌ అందించే డోర్‌డెలివరీని ప్రారంభించింది. బియ్యం క్వాలిటీని పెంచి, మధ్యస్త సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్‌ చేసిన బియ్యాన్ని ప్యాక్‌చేసి, రేషన్‌ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం రేషన్‌ డోర్‌డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు?నెలకు రూ.10వేలు ఇస్తామంటూ వాలంటీర్లను మీ వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామవార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధికట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో, వార్డుల్లో డోర్‌డెలివరీ సంగతి పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాజాగా ఈ మూర్ఖపు చర్య కారణంగా, రేషన్‌ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయి. అంతేకాదు ఈ వాహనాలపై ఆధారపడ్డ 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదు. మొత్తంగా మీరు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6లక్షల మంది, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్, ఏపీ ఫైబర్‌ నెట్‌ల్లో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబుగారూ..!’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ENG VS WI 2nd ODI: 18th Hundred For Root, Becomes 1st England Batter To Complete 7000 ODI Runs2
ENG VS WI 2nd ODI: 54వ సెంచరీ.. చరిత్ర సృష్టించిన జో రూట్‌

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 54వ సెంచరీ, వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్‌ 1) జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. సెంచరీ చేసే క్రమంలో రూట్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ తరఫున వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌ నిర్దేశించిన 309 పరుగుల లక్ష్య ఛేదనలో రూట్‌ అజేయమైన సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్‌ సిక్సర్‌, బౌండరీతో సెంచరీ పూర్తి చేశాడు. 🚨 54th INTERNATIONAL HUNDRED FOR JOE ROOT 🚨- The Greatest England Batter ever. 🐐 pic.twitter.com/bs7uEjregH— Johns. (@CricCrazyJohns) June 1, 202538 ఓవర్ల అనంతరం​ ఇంగ్లండ్‌ స్కోర్‌ 226/5గా ఉంది. రూట్‌తో (117) పాటు విల్‌ జాక్స్‌ (35) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే 72 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఛేదనలో ఇంగ్లండ్‌ ఆదిలో ఎదురుదెబ్బలు తినింది. ఓపెనర్లు జేమీ స్మిత్‌, బెన్‌ డకెట్‌ ఇద్దరూ డకౌట్‌ అయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన రూట్‌ అజేయమైన సెంచరీతో విజయం దిశగా తీసుకెళ్తున్నాడు. హ్యారీ బ్రూక్‌ 47, జోస్‌ బట్లర్‌ 0, జేకబ్‌ బేతెల్‌ 17 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 2, జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు.అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ కీసీ కార్టీ సూపర్‌ సెంచరీతో (105 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు), ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (67 బంతుల్లో 59; 10 ఫోర్లు), నాలుగో నంబర్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ (10-0-63-4), సాకిబ్‌ మహమూద్‌ (9.4-0-37-3) చెలరేగగా.. బ్రైడన్‌ కార్స్‌, జేకబ్‌ బేతెల్‌, విల్‌ జాక్స్‌ తలో వికెట్‌ తీశారు.కాగా, విండీస్‌ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లు)..విరాట్‌ కోహ్లి-82జో రూట్‌-54రోహిత్‌ శర్మ-49కేన్‌ విలియమ్సన్‌-48స్టీవ్‌ స్మిత్‌-48వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు..జో రూట్‌-7000 (నాటౌట్‌)ఇయాన్‌ మోర్గాన్‌-6957ఇయాన్‌ బెల్‌-5416జోస్‌ బట్లర్‌-5196పాల్‌ కాలింగ్‌వుడ్‌-5092

Sakshi Guest Column On Chandrababu Govt BC Corporation3
ప్రజలే సమాధానం చెబుతారు!

వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయటం అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లటమనే సత్యాన్ని 41 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో ఓ 50 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తే, రాష్ట్రంలోని 139 బీసీ కులాలు బాగుపడినట్టేనా? రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ఆయన పార్టీ ఇచ్చే ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్‌ పదవులు మాత్రమే గీటురాయి కాదు కదా! అభివృద్ధి అంటే అన్ని రంగాల్లోనూ ఇతర కులాలతో పోటీపడే సమాన అవకాశాలను కల్పించటం. బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆయనే ముందు తీసుకొచ్చి ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్ళు పాలించిన చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి ఆలోచించనే లేదు. ప్రభుత్వ బీసీ హాస్టళ్ల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల సంఖ్యలు కూడా తగ్గిపోతున్నాయి. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన ఏ రోజైనా బీసీల విద్యావకాశాల గురించి సమీక్షించారా? బీసీల అభివృద్ధి కోసం ఆయన దగ్గర ప్రణాళిక లేదు. హామీలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని 139 బీసీ కులాల్లో ఇప్పటి వరకూ 28 కులాల ప్రతినిధులు మాత్రమే శాసనసభ మెట్లు ఎక్కారు. శాసనసభకు పోటీ చేసి గెలిచే అవకాశం లేని సామాజిక వర్గాలకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి, మరచిపోయారు. కానీ ఈ హామీని ఈ రాష్ట్రంలోని బీసీలు ఇంకా మర్చిపోలేదు. కడప మహా నాడులో సోషల్‌ ఇంజనీరింగ్‌ తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, బీసీల తలరాత మార్చేస్తామని నారా లోకేష్‌ అంటున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ బీసీల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలు, ఫలి తాలపై శ్వేత పత్రం విడుదల చేయగలరా?2016లో 32 ఎంబీసీ కులాలను గుర్తించి, కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఆ 32 కులాల్లో ఒక్కరినైనా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? ఎంబీసీల మీద బాబు ప్రేమ ఏమైంది? సోషల్‌ ఇంజనీరింగ్‌ అంటే ఇదేనా? 2024లో మరలా అధికారంలోకి వచ్చినా బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బీసీ జాబితాలో కులాల సంఖ్య 92 నుండి 139 కి పెరిగాయి కదా! ఆ స్థాయిలో రిజర్వేషన్‌ను ఆయన ఎందుకు పెంచలేకపోయారు? బీసీ జాబితాలోని రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి ఇత్యాది సేవా కులాలకు అనాదిగా ఉన్న ఈనాం భూములు అన్యాక్రాంత మయ్యాయి. ఈ భూముల్ని తిరిగి ఆ కులాలకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఏ రోజూ ప్రయత్నించలేదు. ‘ఆదరణ’ పేరుతో ఈ కులాలకు పనిముట్లను ఇస్తున్నారు కానీ ఈనాం భూములను వెనక్కి ఎందుకు ఇప్పించటం లేదు? సేవా కులాల వృత్తి అవసరాల కోసమైనా భూమి కొనుగోలు చేసి ఇచ్చే ప్రయ త్నమూ చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం తన 22 ఏళ్ళ పాలనలో బీసీల కోసం భూమి కొనుగోలు పథకాన్ని ఏ రోజూ అమలు చేయలేదు. బీసీ కార్పొరేషన్‌ ద్వారా బీసీలకు ఇచ్చేందుకు ఎంపిక చేసిన యూనిట్లలో వ్యవసాయ సంబంధమైన యూనిట్లు లేక పోవడం ఆశ్చర్యకరమే. వ్యవసాయ భూములకు కరెంట్‌ కనెక్షన్‌ తెచ్చుకోలేక, బావులు, బోర్లు నిర్మించుకోలేక బీసీలు భూములను అమ్ముకుంటున్నారు. బీసీ లకు ప్రత్యేకమైన సబ్‌ ప్లాన్‌ ఉందని చెప్తున్నారు కదా, వారి పొలాలలో కరెంటు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేందుకు, బావులు, బోర్లు నిర్మించుకొని పంటలు పండించుకునేందుకు అవకాశం ఇవ్వని తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎలా అవుతుందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా ? జగన్‌ ప్రభుత్వంలో ‘చేయూత’ పేరుతో రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఏడాదికి పదివేల రూపాయలుగా ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వం బీసీల మీద ప్రేమ చూపించే ప్రభుత్వమా? ఇంతకూ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్‌ హామీ ఏమయ్యింది? డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ఎల్లకాలం ప్రజల్ని మభ్య పెట్టలేరు, ఏమార్చలేరు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినా చెప్పకున్నా, ఈ పాలనకు ప్రజలు తమదైన రోజున సరైన సమాధానం చెబుతారు! – పొటికలపూడి జయరామ్‌బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ‘ 95151 84699

Sakshi Guest Column On Judges and Supreme Court Of India4
పరిధి అతిక్రమించడం కాదా?

మన న్యాయమూర్తులకు బయటి శత్రువు లెవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. ఇలా అనడం మీకు విచిత్రం కావచ్చు. కానీ నాకు అలాగే తోచింది. వారు ఒక్కోసారి తమను తాము మర్చిపోయారా అన్నట్లు అసాధారణంగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేప్పుడు తమ మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన వారిలో ఉండదా? వాటి ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందరా? అశోకా యూనివర్సిటీలో ప్రొఫెసరైన అలీ ఖాన్‌ మహ్ముదాబాద్‌ వ్యాఖ్యల కేసులో వారు వ్యవహరించిన తీరు ఎలా ఉందో ఈ సందర్భంగా పరిశీలిద్దాం.మొదటగా వారు ఆయన పోస్టును ‘డాగ్‌–విజిలింగ్‌’ అని నిందించారు. పదాలను ద్వంద్వార్థాలతో ఉపయోగించారని వ్యాఖ్యానించారు. ‘‘ఇతరులను అవమానించడానికి, కించపరచ డానికి లేదా అసౌకర్యం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా పదాలు ఎంపిక చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు. కానీ తాము అనుకుంటున్న ఆ పదాలేమిటో చెప్పారా? చెప్పలేదు. పైగా, ‘‘ఆయన ఈ భావాలను సులభమైన, మర్యాదపూర్వకమైన, ఎంతో తటస్థమైన పదజాలం ఉపయోగిస్తూ, అతి సులభమైన భాషలోనూ వ్యక్తం చేయొచ్చు’’ అంటూ చెప్పుకుపోయారు. ఇక్కడ కూడా తాము అనుకుంటున్న ఆ భావాలేమిటో వారు చెప్పలేకపోయారు. డాగ్‌–విజిల్‌ అంటే ఏమిటి? ఆ విజిల్‌ సాధారణంగా మనిషి చెవులు ఆలకించలేని శబ్దతరంగాల్లో (ఫ్రీక్వెన్సీలో) ఉంటుందని రాజ్యాంగ న్యాయశాస్త్రంలో పండితుడైన గౌతమ్‌ భాటియా అంటారు. మరి మహ్ముదాబాద్‌ ఫేస్‌బుక్‌ పోస్టుల్లో ఏ భాగాలను డాగ్‌ విజిల్స్‌ అని భావించాలి? ఏ ‘కుక్కల’కు ఆయన విజిల్స్‌ వేశారు? ఆయన ఉద్దేశించని ‘శునకేతరులు’ ఎవరు? అసలు ఆందోళనజడ్జీలు వీటిలో వేటినీ వేలెత్తి చూపించలేదు. ఏం... వారు అలా చేయదగిన పని కాదా అది? అందుకు బదులుగా... ‘‘అతను వాడిన పదజాల సంక్లిష్టతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, ఈ రెండు ఆన్‌లైన్‌ పోస్టుల్లో ఉపయోగించిన కొన్ని వ్యక్తీకరణల స్వభావాన్ని సరైన రీతిలో గ్రహించడానికి ఒక సిట్‌ ఏర్పాటు చేయాలని హరియాణా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ను మేం ఆదేశిస్తున్నాం’’ అని ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఈ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌)లో పోలీసు అధికారులే ఉంటారు. శామ్యూల్‌ జాన్సన్, నోవా వెబ్‌స్టర్‌ వంటి నిఘంటుకారులు (లెక్సికోగ్రాఫర్లు) ఉండబోరు. వాస్తవం చెప్పాలంటే, ఈ ఇద్దరు న్యాయమూర్తులు రేకెత్తించిన ఆందోళనల్లో ఇది చిన్నమెత్తు కూడా ఉండదు. తీవ్రంగా ఆందోళన కలిగించేవి ఇంకా ఉన్నాయి. వారు పేర్కొన్న ఈ వాక్యాలను చూడండి: ‘‘ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు. నాకు ఇది చేసే హక్కు ఉందని, అలా చేసే హక్కు ఉందని అంటారు. కాని దేశం పట్ల మీ బాధ్యత ఏమిటో చెప్పరు.’’నిజం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? పౌరులుగా మనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను మాత్రమే అది ప్రత్యేకంగా గుర్తించింది తప్ప, రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సినవి అంటూ ఎలాంటి బాధ్యతలనూ రాజ్యాంగం గుర్తించలేదు. దేశ భక్తుడిగా ఉండాల్సిన బాధ్యత కూడా మనకు లేదు. జెండా చుట్టుకు తిరగమని రాజ్యాంగం చెప్పలేదు. దేన్నయినా సరే సందేహించ డానికి, ప్రశ్నించడానికి మనకు ప్రతి హక్కూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన ఈ న్యాయమూర్తులు హక్కులను, బాధ్యతలను ఒకే గాట కట్టారు? ఆ విషయం వారు చెప్పలేదు. ఏమైనప్పటికీ, మహ్ముదాబాద్‌ ప్రొఫెసర్‌గా ఉన్న అశోకా యూని వర్సిటీ విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి వారు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అత్యంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అవేమిటో చదవండి: ‘‘వారు ఏమైనా సరే చేయగలం అనుకుంటే మేం ఒక ఉత్తర్వు జారీ చేస్తాం... ప్రైవేటు యూనివర్సిటీలు అని చెప్పుకొనే ఇలాంటి కొన్ని సంస్థలను ప్రారంభించడం, వాటిలో నానా రకాల శక్తులూ చేరి చేతులు కలపటం, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం మాకు సమ్మతం కాదు. ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు.’’మాటలు న్యాయసమ్మతమేనా?ఈ భూమ్మీద ఏ శక్తి వారిని ఇందుకు పురికొల్పింది? ఎలాంటి వివరణ గానీ, న్యాయ ఔచిత్యం గానీ లేకుండా కలగాపులగంగా మాట్లాడిన అనేక విషయాల్లో అలవోకగా చేసిన ఈ వ్యాఖ్యా చేరుతుంది. తమ ఆలోచనల విపరీత పోకడ వల్లే ఒక అంశం నుంచి మరొక అంశంలోకి, అది తమకు సంబంధం లేనిదైనప్పటికీ, వారు ఇలా ఒక గెంతు గెంతినట్లు అనుకోవాలి.న్యాయమూర్తులు ఇలా మాట్లాడేందుకు వారిని ప్రోత్సహించిందేమిటి? ఎదుటి పక్షం వాదనలను లోతుగా తరచి చూసే ‘డెవిల్స్‌ అడ్వకేట్‌’ పాత్ర పోషించేప్పుడు, వారు మాట్లాడాల్సిన విషయాలు కావివి. ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాల్లా ధ్వనిస్తున్నాయి.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు పూచీ వహించడమే వారి బాధ్యత. దానికి వారు విధేయతతో కట్టుబడి ఉండాలి. అయితే ఏం జరిగింది? అలా కాకుండా, కొందరు రాజకీయ ప్రేక్షకుల ముందు వినమ్రతతో శిరస్సు వంచుతున్నారా? ఇలా అని ఎవరైనా అనుకుంటే ఆశ్చర్య పోనవసరం లేదు. వారు ఎక్కువగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే, ఆ మాటలు న్యాయసమ్మతం కావు. గౌతమ్‌ భాటియా ఒక జాతీయ దినపత్రిక ద్వారా లేవనెత్తిన అంశం నన్ను నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. మహ్ముదాబాద్‌ మీద ప్రకటించిన గ్యాగ్‌ ఆర్డర్‌ను ప్రస్తావిస్తూ, ‘‘ఒకరి నోరు నొక్కే అధికారం (గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వడం) న్యాయవ్యవస్థకు లేదన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింటు. ఒకవేళ ప్రభుత్వం ఇలా చేయాలని నిర్ణయిస్తే, అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా అనేది తేల్చడానికి మాత్రమే దానికి అధికారం ఉంది’’ అని భాటియా పేర్కొన్నారు. అంటే ఈ న్యాయమూర్తులు తమకు లేని అధికారాలను ఉపయోగించారా అని ఆయన్ను ప్రశ్నించాను. దానికి ఆయన ఎంతో వివేకంతో, ఎంతో స్పష్టంగా, ‘‘వారు తమ పరిధులను మించి పోయి’’ వ్యవహరించారని చెప్పారు. ఓహ్‌! కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Sakshi Guest Column On Kalingandhra Migrations5
కళింగాంధ్ర వలసలకు ఎక్స్‌పైరీ డేట్‌ లేదా?

పదేళ్ల కిందటి గణాంకాల ప్రకారం కళింగాంధ్ర నుంచి పొట్ట చేత్తో పట్టుకొని, ఉపాధి వెదుక్కుంటూ... ఇరవై రెండు లక్షల మంది గుజరాత్, బొంబాయి, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్‌ వంటి నగరాలకు వలస పోయినారు. అంటే కళింగాంధ్ర జనాభాలో అయిదో వంతు జనాభా వలస పోయినట్టు. ఇదెంతటి విషాదం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విడివడిన ఆంధ్ర లోనూ వలసలు పోయే జనాభాలో కళింగాంధ్ర మొదటి స్థానంలో ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి మిగిలిన అన్ని రంగాల్లోనూ కళింగాంధ్ర (ఉమ్మడి ఆంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు) అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఆఖరి స్థానంలో ఉంది. ఈ దుఃస్థితి దేశ స్వాతంత్య్రం పూర్వం నుంచి నేటిదాకా కొనసాగుతూనే ఉంది.‘రా పిలడో బిలాయి పోదాం – నీకు బీడీలు లేక పోతే బియ్యం అమ్ముతాను – రా పిలడో భిలాయి పోదా మ’ని గ్రామాల్లో అలనాడు పాట మార్మోగేది. అంటే అంతగా ఇక్కడి వాళ్ళు భిలాయి, అండమాన్‌ వంటి ప్రాంతాలకు వలస పోయే వారన్నమాట.ఓ ఇంజనీర్‌ మిత్రుడు మాటల సందర్భంలో– ‘కళింగాంధ్ర పేదల వలస బాటకు ఎక్స్‌పైరీ డేట్‌ లేదా?’ అని తన కొడుకు ప్రశ్నించాడన్నాడు. చాలా వేదనతో కూడిన ప్రశ్న అది. బహుశా కళింగ ప్రజలు చాన్నాళ్లుగా వేస్తున్న ప్రశ్న కూడా! కాకపోతే పాలకులు వినడం లేదు. ఇటీవల కూటమి ముఖ్యమంత్రిగారు కళింగమ్‌ లోని మత్స్య తీర ప్రాంతానికి వచ్చి, ఆ ప్రాంతాన్నీ, ఆ ప్రజలనూ పరిశీలించి ఇంతగా పేదరికంలో, ఉపాధి లేమితో, అభివృద్ధికి నోచుకోకుండా వెనకబాటులో ఉంటే మీకు సిగ్గుగా (ఇదే అర్థంలో పదాలు) లేదా అని ఈ ప్రాంత తన పార్టీ నేతలను ప్రశ్నించారని పత్రికల వార్త.ఎక్స్‌పైరీ డేట్‌ లేదా అని ప్రశ్నించిన వాడు పౌరుడు, సిగ్గు లేదా అని ప్రశ్నించిన వారు పాలకులు. సిగ్గు పడాల్సింది ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రమేనా? సమస్యల్లా ప్రజలు కోరుకునే అభివృద్ధి మోడల్‌ వేరు, పాలకులు అమలు చేసే అభివృద్ధి మోడల్‌ వేరు కావడంలోనే ఉంది. దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల సముద్ర తీర ప్రజలు కోరుకునేది... ఫిషింగ్‌ హార్బర్లు, కోల్డ్‌ స్టోరేజీలు, సముద్రంతో సాము జేసే మత్స్య కారులు ఏ వేరావాలి(గుజరాత్‌)కో వలస పోయి, ప్రమాదాలకు గురి కాకుండా, విదేశీ జైళ్ళల్లో బందీలు కాకుండా ఆదుకునే ప్రణాళికలు, పథకాలును! కోట్ల రూపాయల మత్స్య సంపద, తీరంలోని విలువైన ఖనిజాలు కార్పొ రేట్లకు, ప్రైవేట్‌ శక్తులకు గాక, మత్స్యకారులకు, దేశానికీ చెందాలన్న మోడల్‌ అభివృద్ధిని ప్రజలు కోరుకుంటు న్నారు. కానీ పాలకులు ప్రైవేట్‌ శక్తుల, కార్పొరేట్‌ శక్తుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని నమ్మబలుకుతూ ఆ నమూనాను అమలుచేస్తున్నారు.పాతిక లక్షల ఎకరాల సాగుభూమి వుంది. నాగా వళి, వంశధార, జంఝావతి వంటి పద్దెనిమిది జీవ నదులున్నాయి. అధిక వర్షపాత ప్రాంతం. అయినా మూడో వంతు భూమికి మాత్రమే సాగునీరు అందుతోంది ప్రాజెక్టుల ద్వారా. మిగిలిన భూమి కోసం రైతులు ఆకాశాన్ని ఆశగా చూడాలి. వంశధార రెండో దశ పూర్తి కాదు, నదుల అనుసంధానం ఆగిపోయింది. ‘వెంగళ రాయ సాగరం’ వెక్కిరిస్తోంది. నదుల మీద ఆనకట్టలు, పంటలకు గిట్టుబాటు ధర, పంట మదుపులకు సబ్సిడీ రుణాలు, పంటల ఆధార పరిశ్రమలు ఈ ప్రాంత అభివృద్ధి మోడల్‌ అని ప్రజలు కోరుకుంటున్నారు. పాలకులేమో కాలుష్య కారక ఫార్మా కంపెనీలు, థర్మల్, అణువిద్యుత్‌ కర్మాగారాలతో డంపింగ్‌ యార్డ్‌ చేస్తున్నారు. ఏటా ఈ కర్మాగారాల్లో ప్రమాదాలతో ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. ఎర్ర బస్సులకే దిక్కులేని ప్రాంతానికి విమానాశ్రయాలను నిర్మించి అభివృద్ధి మోడల్‌ అంటున్నారు పాలకులు. అనేక చిన్న పరిశ్రమలు మూత పడినాయి. చేతివృత్తుల జీవుల బతుకులు పోయాయి. ఉక్కు కర్మాగారంతో పాటుగా మరిన్ని భారీ పరిశ్రమలు మూతకు, ప్రైవేట్‌ శక్తుల అధీనంలోకి పోతున్నాయి. విస్తారమైన అటవీప్రాంతం ఉంది. టేకు, మద్ది, ఎగిస వంటి వృక్ష సంపద, అయిదు వందల రకాల ఔషధ వృక్షాలు, కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు... మామిడి, అరటి, పనస, కందులు, చింతపండు వంటి పంటలు... వీటికి ప్రాసెసింగ్‌ యూనిట్లను, మార్కెటింగ్‌ సౌకర్యాలను; ఖనిజాల వెలికితీతకు ఆదివాసీ సొసైటీలు, ఆర్థిక వనరులు సమకూర్చి చేసే అభివృద్ధి మోడల్‌ను ప్రజలు కోరుతున్నారు. అడవులను, కొండ లను తొలిచేసే, ఆదివాసీలను విస్తాపనకు గురి చేసే నమూనాను, కార్పొరేట్లకు లాభించే మోడల్‌ను పాల కులు చెప్తున్నారు. పాలకుల ఈ అభివృద్ధి మోడల్‌ వలన లక్షలాది మంది కళింగాంధ్రులు నిర్వాసితులై, ఉపాధి వెదుక్కుంటూ వలస పోయినా... రోడ్లు, భవనాలు, కార్పొరేట్‌ సెజ్‌లతో, ప్రైవేట్‌ విద్యా, వైద్యాలయాలతో గతంలో కంటే ఈ ప్రాంతం కాస్తయినా అభివృద్ధి చెందిన ప్రాంతంగా కనిపిస్తుంది. కానీ ఇవేవీ నేటివ్‌ కళింగాంధ్ర వారివి కావు. పెట్టుబడులతో, పాలకుల సహకారంతో పరాయి జిల్లాల, రాష్ట్రాల నుండి వచ్చిన బడా, బడా బాబులవి. కనిపించే అభివృద్ధి అందుకొని అనుభవిస్తున్నది వారు. కళింగాంధ్ర తీరం భిన్నమైన ప్రాకృతిక భూభాగం. సహజ సంపదల సీమ. దీన్ని అభివృద్ధి చేయాలంటే... ప్రజలు కోరుకునే అభివృద్ధి నమూనా అమలు కావాలి. లేనినాడు ఇక్కడి ప్రజలు సర్వమూ కోల్పోయి, రెక్కలు కట్టుకొని వలసలు పోవడం తప్పదు. ఈ వలసబాటకు ఎక్స్‌పైరీ డేట్‌ వుండదు..!అట్టాడ అప్పల్నాయుడు వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితల,కళాకారుల వేదిక (ఉరకవే) అధ్యక్షుడు

Coalition Government Conspiring Against Ysrcp Vennupotu Dinam6
‘వెన్నుపోటు దినం’పై చంద్రబాబు కుట్రలు

సాక్షి, విజయవాడ: జూన్‌ 4న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా వెన్నుపోటు దినం రోజున వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగిస్తోంది. జూన్ 4 న వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టే నిరసనలకి పోలీసులు అనుమతి నిరాకరించారు. శ్రీకాకుళం, ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో వెన్నుపోటు దినం నిమిత్తం వైఎస్సార్‌సీపీ నేతలు అనుమతుల కోసం పోలీసులకు విజ్ఞప్తులు చేశారు. అయితే, నేతల విజ్ఞప్తుల్ని పోలీసులు నిరాకరించారు. పలుచోట్ల సెక్షన్ 30 అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రజాస్వామ్య విధానాలు,రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాసేలా కూటమి ప్రభుత్వం అరాచకానికి దిగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు కోరుతున్న అనుమతులు తిరస్కరించేలా చంద్రబాబు పోలీసుల్ని వాడుకోవడం గమనార్హం.కూటమి ప్రభుత్వంపై నిరసన గళం వినిపించేలా వెన్నుపోటు దినంప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారు. ‘జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

Youngster Ends Life By Police Harassment In AP7
AP: పోలీసుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం అండదండలతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇటీవల దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన ముగ్గురు యువకులపై తెనాలి పట్టణంలో పట్టపగలే దాడి చేసిన పోలీసులు.. మరో యువకుడు ఆత్మహత్యకు కారణమయ్యారు. పోలీసుల వేధింపులతో సిద్ధేష్ శివాజీ అనే యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ ధ్వజంతెనాలిలో పోలీసుల వేధింపులతో మరొకరు బలికావడంపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. కొందరు పోలీసుల దారుణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. ఈ సంఘటనపై నేషనల్ మీడియాను ట్యాగ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ట్వీట్ చేసింది.కాగా, బంగారం రికవరీ కేసులో సిద్ధేష్ ను పోలీసులు వేధింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక సిద్ధేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తప్పించుకోవడానికి సిద్ధేష్ మృతదేహాన్ని మహారాష్ట్రకు తరలించారు. Same Tenali cops behind another tragedy: Siddhesh dies after police harassmentTenali, June 1: The same police officers who were recently caught on video brutally assaulting three Dalit youths in broad daylight in Tenali are now being accused of driving another young man,… pic.twitter.com/rFyyglLpXk— YSR Congress Party (@YSRCParty) June 1, 2025

Mukesh Kumar Wears Virat Kohli's Iconic Jersey No 18 In India A Vs England Lions Match8
విరాట్‌ కోహ్లికి అవమానం.. 18 నంబర్‌ జెర్సీ మరొకరికి కేటాయింపు

భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్‌ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత విరాట్‌ జెర్సీ నంబర్‌ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్‌ కుమార్‌ 18 నంబర్‌ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్‌కు ఈ జెర్సీ నంబర్‌ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్‌ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్‌ చేస్తున్నారు.క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్‌ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్‌ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్‌ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత్‌ చాలాకాలం పాటు నంబర్‌ వన్‌ జట్టుగా కొనసాగింది. విరాట్‌ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్‌కు‌ టెస్ట్‌ల్లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది.అలాంటి విరాట్‌కు టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించినా సంబంధిత క్రికెట్‌ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్‌లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్‌ జెర్సీ నంబర్‌ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్‌కు విరాట్‌ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం​ కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్‌ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. ఈసారి టైటిల్‌ సాధించి ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలకాలని విరాట్‌ భావిస్తున్నాడు. జూన్‌ 3న ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ జరుగుతుంది. ఇవాళ (జూన్‌ 1) జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో (ముంబై వర్సెస్‌ పంజాబ్‌) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

Gst Revenue Falls Again In Andhra Pradesh9
బాబొచ్చాక నేల చూపులే.. ఏపీలో మళ్లీ పడిపోయిన జీఎస్టీ ఆదాయం

సాక్షి, విజయవాడ: సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు.. ఉన్న సంపదను కూడా నాశనం చేసే విధంగా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ ఆదాయం మళ్లీ పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ తిరోగమనంలో పయనిస్తోంది. కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ ఆదాయంలో క్షీణతలే నమోదవుతున్నాయి.మే నెలలోనూ 2 శాతం జీఎస్టీ ఆదాయం మైనస్ అయ్యింది. గత ఏడాది మే ఆదాయం కంటే.. ఈ ఏడాది మే నెలలో తక్కువ ఆదాయం నమోదైంది. చంద్రబాబు పాలనలో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన జీఎస్టీ ఆదాయం.. చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రమే తగ్గింది.మే లో 3,803 కోట్ల జీఎస్టీ ఆదాయం రాగా.. గత ఏడాది మే నెలలో 3,890 కోట్లు జీఎస్టీ ఆదాయం వచ్చింది. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ ఆదాయం పెరిగింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో జీఎస్టీ ఆదాయం పెరిగింది. చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం పతనమైంది. చంద్రబాబు సీఎం అయ్యాక అత్యధిక మాసాలు ఆదాయం పతనమైంది. చంద్రబాబు పాలన వైఫల్యానికి ఇది నిదర్శనమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Ukrainian Drones Strike Multiple Airbases in Russia10
ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్‌ విమానాలు ధ్వంసం!

కీవ్: రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడికి దిగింది. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. .యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.రష్యాపై తాము చేసిన దాడుల్లో 40 ఎయిర్ క్రాఫ్ట్‎లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా స్పష్టం చేసింది. సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది. ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్‌పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది.2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం!ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్‌ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, 69 మందికి గాయాలయ్యాయి. 524 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చేశామని రష్యా చెబుతోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement