Top Stories
ప్రధాన వార్తలు

బేరం కుదిరితేనే బదిలీ
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరూ బదిలీల కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు! ఎలాంటి రిక్వెస్టు అయినా ఎమ్మెల్యే లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరాఖండిగా చెబుతుండటంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఓ మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించినా అధికారులు పక్కన పడేశారు. బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగికి లేఖ ఇవ్వడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తన అవసరాలు, ఇబ్బందులు, అర్హతలు వివరించి ఒక మండలంలో పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థించగా సంబంధిత ఎమ్మెల్యే సిఫారసుతో రావాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఉద్యోగి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించగా ఆ పోస్టును అప్పటికే ఇతరులకు బేరం పెట్టినట్లు తెలియడంతో హతాశుడయ్యాడు! పట్టు పరిశ్రమ శాఖలో ముడుపులు తీసుకుని బదిలీలు చేయడంపై కొందరు ఉద్యోగులు చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు చేతులు మారుతున్నట్లు వెల్లడించారు. ఏడీ పోస్టు కోసం కదిరిలో రూ.5 లక్షలు, చిత్తూరు జిల్లాలో రూ.8 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.10 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఆదాయ మార్గంగా.. పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాల్సిన ఉద్యోగుల బదిలీలను టీడీపీ కూటమి సర్కారు అక్రమాల పర్వంగా మార్చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులకు ఎలాంటి మేలు చేయకపోగా కనీసం బదిలీల విషయంలోనూ కరుణించడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాలతో పని లేకుండా రాజకీయ జోక్యంతో బదిలీలు చేపడుతోంది. అన్ని స్థాయిల పోస్టుల్లో ఏ ఉద్యోగి ఉండాలనే విషయాన్ని ఆయా నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులే నిర్ణయిస్తున్నారు. వారి మాట కాదనేందుకు ఉన్నతాధికారులు సాహసించడం లేదు. మే 15వతేదీ నుంచి జూన్ 2వతేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేశారు. ఈ సమయంలో బదిలీలకు అవకాశం కల్పించి మార్గదర్శకాలు విడుదల చేసినా అవి ఎక్కడా అమలు కావడంలేదు. ఎమ్మెల్యేల సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరుగుతుండడంతో ఉద్యోగులకు దిక్కు తోచడం లేదు. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వితంతు మహిళా ఉద్యోగులు, ఇతర సమస్యలు ఉన్నవారు తగిన ఆధారాలతో బదిలీల కోసం అభ్యర్థించే వీలున్నా టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు వారికి ఆదాయం సమకూర్చే కార్యక్రమంగా మారిపోయింది! సిఫారసు లేఖల కోసం అగచాట్లు.. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో ఉద్యోగులు సిఫారసు లేఖల కోసం టీడీపీ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల్లో తమ పనులు చేసే వారిని, తమ మాట వినే వారిని నియమించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మొగ్గు చూపుతున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు చెబితేనే ఆయా చోట్ల పోస్టింగ్లు ఇస్తామని కలెక్టర్లు, జేసీలు, ఇతర అధికారులు చెబుతున్నారు. బదిలీలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు, నిబంధనలున్నా వాటిని పక్కనపెట్టి ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తెచ్చుకోవాలని స్పష్టం చేస్తున్నారు. సిఫారసులు లేకుండా వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత వారితో మాట్లాడి ధ్రువీకరించుకున్నాకే పోస్టింగ్లు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. వేలం పాటల తరహాలో.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సామాజిక వర్గం, డబ్బులు తదితర అంశాలు బేరీజు వేసుకున్నాకే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. చాలాచోట్ల డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, తహశీల్దార్ కార్యాలయాల్లో ముఖ్యమైన పోస్టుల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తహశీల్దార్, ఎంపీడీఓ పోస్టుల కోసం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఎంపీడీవోలు, ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సులు లాంటి పోస్టుల కోసం కూడా వసూళ్లకు దిగుతున్నారు. అడిగినంత డబ్బులిచ్చిన వారికే సిఫారసు లేఖలు అందుతున్నాయి. కొందరికి సిఫారసు లేఖలు ఇచ్చిన తర్వాత తాము అంతకంటే ఎక్కువ ఇస్తామని ఇతరులు ముందుకు రావడంతో మొదట ఇచ్చిన లేఖను పట్టించుకోవద్దని ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మండల స్థాయి కూటమి నేతలు ఈ సిఫారసు లేఖలతో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్లి సిఫారసు లేఖలు ఇప్పిస్తున్నారు. తిరుపతి అర్బన్ తహశీల్దార్ పోస్టు రూ.కోట్లు! అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్లో ఉన్న తిరుపతి జిల్లాకు చెందిన ఒక తహశీల్దార్కి అర్బన్లో పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.కోట్లలోనే బేరం కుదిరినట్లు తెలిసింది. గతంలో ఆయన రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పని చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఆయన్ను కీలకమైన తిరుపతి అర్బన్ తహశీల్దార్గా నియమించేందుకు రంగం సిద్ధమైంది. కూటమి పార్టీ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

లక్ష మందికి.. రూ.లక్ష వరకు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం..రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల యూనిట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్ 2న లక్ష మంది అర్హులకు యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. మొత్తం నాలుగు కేటగిరీలకు గాను తొలివిడతలో రెండు కేటగిరీలకు చెందిన లక్ష మంది లబ్ధిదారులకు, రూ.లక్ష లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.మొత్తం 16.23 లక్షల దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకం కింద వివిధ సంక్షేమ కార్పొరేషన్ల వారీగా దరఖాస్తుల స్వీకరణ మార్చి 17న ప్రారంభమైంది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యింది. మొత్తం 16,23,764 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను నాలుగు కేటగిరీల్లో స్వీకరించారు. రూ.50 వేల లోపు పరిమితి యూనిట్లను కేటగిరీ–1గా, రూ.50 వేల నుంచి రూ.1లక్ష లోపు వాటిని కేటగిరీ–2గా, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల పరిమితి ఉన్న యూనిట్లను కేటగిరీ–3గా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య ఉన్న యూనిట్లను కేటగిరీ–4గా విభజించారు. ఈ క్రమంలోనే తొలుత కేటగిరీ–1, 2లోని అర్హులకు తొలి విడత కింద మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 కేటగిరీలకు 1.32 లక్షల దరఖాస్తులే.. తొలి రెండు కేటగిరీలకు సంబంధించి 2.81 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. ఈ రెండు కేటగిరీల్లో కేవలం 1.32 లక్షల దరఖాస్తులే వచ్చాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన మండల, మున్సిపల్ స్థాయి కమిటీలు...జాబితాలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాయి. కలెక్టర్ల వద్దకు చేరిన ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపికను పూర్తిచేశాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతో ఆదివారం సాయంత్రానికి తుది జాబితాలు ఖరారు చేసి... లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించేలా కసరత్తు ముమ్మరం చేశారు.అయితే దరఖాస్తుదారుల ఆధార్, పాన్కార్డులు, బ్యాంకు ఖాతాల ఆధారంగా పరిశీలించి వడపోత అనంతరం తొలి విడత లక్ష మందికి అర్హత కల్పించారు. వీరికి ఈ నెల 2వ తేదీన మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. రూ.50 వేల లోపు యూనిట్లకు పూర్తి సబ్సిడీ ఇస్తారు. రూ.లక్ష లోపు యూనిట్లకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ కేటగిరీ–2లోని దరఖాస్తుదారులు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత బ్యాంకు నుంచి అంగీకార పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వారం శిక్షణ..16 కల్లా యూనిట్ల ప్రారంభం లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తారు. క్షేత్రస్థాయిలో జూన్ 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పత్రాల పంపిణీ పూర్తయ్యాక జూన్ 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు యూనిట్లను ప్రారంభించాలి. జూన్ 16వ తేదీ నుంచి యూనిట్ల ప్రారంబోత్సవాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి నాటికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, తొలుత జూన్ 2న ఒకేసారి 5 లక్షల మందికి యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యయమయ్యే యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం తొలి రెండు కేటగిరీలకే పరిమితమైంది. కేటగిరీ–3, 4లకు సంబంధించి ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాలేదు. వీరికి విడతల వారీగా మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు.

ముంబై ముందుకు... గుజరాత్ ఇంటికి
ఒత్తిడితో కూడిన మ్యాచ్లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు చేరింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ దూకుడుకు... బెయిర్స్టో, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్... కీలక ఎలిమినేటర్ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్లు) దుమ్మురేపగా... జానీ బెయిర్స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఫోర్తో దూకుడు పెంచిన బెయిర్స్టో... ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన రోహిత్ సాయి కిషోర్ బౌలింగ్లో 6, 4, 4తో గేర్ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్ మరో సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్స్టోను అవుట్ చేసి సాయి కిషోర్ గుజరాత్కు బ్రేక్ ఇచ్చాడు. రషీద్ ఓవర్లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్లు పూర్తి చేసుకున్న రోహిత్... 28 బంతుల్లో హాఫ్సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్ను సాయి కిషోర్ పెవిలియన్ పంపగా... ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్ను ప్రసిధ్ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్లో మూడు సిక్స్లు కొట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 సిక్స్లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్ (1) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్ సుదర్శన్ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) కాస్త సహకరించగా... సుదర్శన్ క్లాస్ కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్ పవర్ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్తో సుందర్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్ను గ్లీసన్ను అవుట్ చేయగా... రూథర్ఫోర్డ్ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (13; 1 సిక్స్) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 81; బెయిర్స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్ 47; సూర్యకుమార్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 33; తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25; హార్దిక్ (నాటౌట్) 22; నమన్ ధీర్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 9, సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్: సిరాజ్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్ 4–0–42–2; రషీద్ ఖాన్ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్ 1–0–7–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80; గిల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 1; మెండిస్ (హిట్ వికెట్) (బి) సాంట్నర్ 20; సుందర్ (బి) బుమ్రా 48; రూథర్ఫోర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24; తెవాటియా (నాటౌట్) 16; షారుక్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) అశ్వని కుమార్ 13; రషీద్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్: బౌల్ట్ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్ 3.3–0–39–1; హార్దిక్ పాండ్యా 3–0–37–0; సాంట్నర్ 1–0–10–1; నమన్ ధీర్ 1–0–9–0; అశ్వని కుమార్ 3.3–0–28–1.

ఏరా.. ల...కొడకా.. నీ..మ్మా!
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రౌడీయిజం చేస్తూ బరితెగిస్తున్నారు. ఇటీవల మేయర్ వసీం చాంబర్లోకి టీడీపీ చోటా నాయకులు అక్రమంగా చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాజాగా 30వ డివిజన్ టీడీపీ ఇన్చార్జి రాజేష్నాయుడు రెచ్చిపోయాడు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తున్న సచివాలయ ఉద్యోగి (29వ వార్డు సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ) అశ్వత్థరెడ్డిని నానా దుర్భాషలాడాడు. మహానాడుకు ప్రజలను ఎందుకు తరలించలేదంటూ గురువారం బూతులతో రెచ్చిపోయాడు. దీంతో నగరంలోని ఉద్యోగులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని, రాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ధర్నాచేశారు. కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్కు వినతిపత్రం ఇచ్చారు.నేను మాట్లాడేది రికార్డు చెయ్..కడపలో జరిగిన మహానాడుకు ఎవ్వరూ రాలేదంటూ రాజేష్నాయుడు ఫోన్లో అశ్వత్థరెడ్డిని నోటికొచి్చనట్లు బూతులతో దూషించాడు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా.. రాత్రి నుంచి ఫోన్చేసినా.. నీ క్లస్టర్ నుంచి ఏ..ల..కొడుకూ రాలా.. కాల్ రికార్డు చెయ్ నేను మాట్లాడేది.. సచివాలయంలో నువ్వేమైనా పీ..తున్నావా? రేయ్..ల...కొడకా.. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చినా.. ఒక్క ల.. ల..కొడుకు రాలేదు మీటింగుకు నీ..మ్మా..’ అంటూ రాయలేని భాషలో ఇంకా నోటి కొచ్చినట్లు తిట్టాడు.పెద్దఎత్తున సచివాలయ ఉద్యోగుల ధర్నా..ఈ ఘటనకు నిరసనగా నగరంలోని సచివాలయ ఉద్యోగులు శుక్రవారం రాత్రి పెద్దసంఖ్యలో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ధర్నా చేపట్టారు. ఆ సమయంలో కమిషనర్ బాలస్వామి అందుబాటులో లేకపోవడంతో క్యాంపు క్లర్క్కు వినతిపత్రం అందజేశారు. మహానాడుకు ప్రజలను తరలించే డ్యూటీ తమది కాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఇలాగైతే తాము ఉద్యోగం ఏ విధంగా చేయాలని వారంతా ప్రశ్నించారు. పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇది మంచి సంస్కృతి కాదు..సచివాలయ ఉద్యోగిపట్ల దౌర్జన్యానికి పాల్పడ్డ రాజేష్నాయుడుపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇంత దారుణమైన పరిస్థితులుంటే ఎలా? అశ్వత్థరెడ్డితో మాట్లాడిన తీరుచూస్తే టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తించాలని మహానాడులో నేర్పినట్లుంది. ఇది మంచి సంస్కృతి కాదు. – రామిరెడ్డి, సీపీఎం అనంతపురం నగర కార్యదర్శిరాజేష్నాయుడుపై చర్యలు తీసుకోవాలి..టీడీపీ నేత రాజేష్నాయుడుపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఇతను డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా హోటల్కు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వోద్యోగిని అంతుచూస్తానంటూ రౌడీలా బెదిరించాడు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎక్కడా ఉండవు. – ఎస్. నాగేంద్రకుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శికూటమి ప్రభుత్వంలో దారుణ పరిస్థితులు..టీడీపీ కూటమి ప్రభుత్వంలో జిల్లాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల నా చాంబర్లోకే టీడీపీ చోటా నాయకులు చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగిని టీడీపీ నాయకుడు నానా మాటలన్నాడు. ప్రభుత్వోద్యోగులపట్ల ఇలాగేనా ప్రవర్తించేది? మరీ ఇంత దారుణమా? ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులపట్ల ఇలా దాష్టీకంగా ప్రవర్తిస్తే ఎలా? – వసీం, మేయర్, అనంతపురం నగర పాలక సంస్థ

ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.పంచమి రా.12.33 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పుష్యమి రా.1.28 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.9.35 నుండి 11.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.7.13 నుండి 8.50 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.26.మేషం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.మిథునం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.కర్కాటకం: పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు.. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కీలక నిర్ణయాలు.సింహం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.కన్య: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలం.తుల: సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.వృశ్చికం: అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులకు కొంత ఆదరణ..మకరం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.కుంభం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మీనం: బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి ఎవరో శనివారం తేలబోతోంది. హైదరాబాద్లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాలె (ఫైనల్స్) శనివారం రాత్రి జరగబోతోంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ను సొంతం చేసుకోనున్నారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు మూడున్నర వేల మంది తిలకించనుండగా, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టీనా పిష్కోవా (చెక్ రిపబ్లిక్) దాదాపు రూ.6.21 కోట్ల విలువైన బ్లూ క్రౌన్ను అలంకరించనుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపు రూ.ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 10 మందికి బెర్తులు ఖరారు తుది పోటీ 40 మంది మధ్య సాగనుంది. ప్రస్తుతం పోటీలోఉన్న 108 దేశాల సుందరీమణులను నాలుగు ఖండాల వారీగా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు చాలెంజ్ల ద్వారా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 16 మంది ఎంపికయ్యారు. మిగతా 24 మందిని శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. మొత్తం 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండం నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 20 మందిని షార్ట్ లిస్టు చేస్తారు. సెమీ ఫైనల్స్లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 8 మందిని ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. వీరినుంచి విజేతను, మొదటి, రెండు, మూడో రన్నరప్లను ప్రకటిస్తారు. అలరించనున్న బాలీవుడ్ తారలు మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ ఫైనల్స్లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రపంచ సుందరి పోటీలకు ప్రధాన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు సోనూసూద్కు ఈ సందర్భంగా మానవతావాది పురస్కారాన్ని మిస్ వరల్డ్ సంస్థ అందించనుంది. కోవిడ్ సహా వివిధ సందర్భాల్లో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. సోనూసూద్ కాకుండా, ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారినా టర్రెల్ (మిస్ ఇంగ్లాండ్ 2014), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2017, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. వివిధ చాలెంజ్ల ద్వారా ఎంపికైన వారు వీరే.. స్పోర్ట్స్ చాలెంజ్: విజేత మిస్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా టాలెంట్ చాలెంజ్: విజేత మిస్ ఇండోనేసియా మొనికా కెజియా సెంబిరింగ్ హెడ్ టు హెడ్ చాలెంజ్: విజేతలు మిస్ వేల్స్, మిస్ తుర్కియే, మిస్ ట్రినిడాడ్–టొబాగో, మిస్ జాంబియా ఫైనల్ పోటీలో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్ బ్వాల్వా, అమెరికా–కరీబియన్ దీవుల నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్ నుంచి వేల్స్ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్ ఎంపికయ్యారు. టాప్ మోడల్ చాలెంజ్: విజేతలు: మిస్ ఇండియా, మిస్ నమీబియా, మిస్ మారి్టనిక్, మిస్ ఐర్లాండ్ రెండు రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా చాలెంజ్లో ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ఇస్సీ ప్రిన్సెస్, అమెరికా నుంచి డొమినిక్ రిపబ్లిక్ నుంచి మాయ్రా డెల్గాడో, ఏషియా–ఓíÙయానియా నుంచి థాయ్లాండ్ ముద్దుగుమ్మ సుచతా చౌంగ్శ్రీ, యూరప్ నుంచి మోంటెనిగ్రో సుందరి ఆండ్రీ నికోలిక్లు విజయం సాధించారు. మిల్లా మాగీపై మిస్ వరల్డ్ సంస్థ చర్యలు: జయేశ్ రంజన్ పోటీల నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి పోటీల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీపై మిస్ వరల్డ్ సంస్థ న్యాయపరంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. లండన్ కోర్టులో కేసు దాఖలు చేసిందని వెల్లడించారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆమెపై చర్యలకు ఉపక్రమించిందని చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. 2న రాజ్భవన్కు కొత్త ప్రపంచ సుందరి హైటెక్స్లో జరిగే మిస్ వరల్డ్ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జయేశ్ రంజన్ తెలిపారు. శనివారం విజేతగా నిలిచి కొత్త ప్రపంచ సుందరిగా అవతరించే యువతి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్కే్వర్పై తెలంగాణ సోయగం సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రఖ్యాత టైమ్స్సే్క్వర్పై తెలంగాణ సంస్కృతి తళుక్కున మెరిసింది. ’తెలంగాణ– జరూర్ ఆనా’ అంటూ హైదరాబాద్లో నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ –2025 పోటీల వీడియోను టైమ్స్స్క్వేర్పై ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఆ వీడియో న్యూయార్క్ వాసులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?
సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్ మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడింటిని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకేశ్ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శాఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొనేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలుగులో 97, ఇంగ్లిష్లో 81, గణితంలో 86, సైన్స్లో 97, సోషల్లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేశారు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్సీపీ ట్వీట్సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది.

ముంచుకొస్తున్న ముప్పు
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. → 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ఉపయోగించారు. → ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. → ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. → పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. → ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. → యూరప్లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్తోపాటు ఐస్ల్యాండ్లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. → హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. → గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యింగ్మింగ్ యాంగ్ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. → మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్మింగ్ యాంగ్ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు.

‘నవ’ మోసాలు
అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు. నాటి లోకేశ్ వీడియో వైరల్ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్ మీడియంపై ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది. సంతకాలతో మంత్రి లోకేశ్కు లేఖలుఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) యూనియన్ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్కు మెయిల్స్, వాట్సాప్ల ద్వారా పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్ లేఖ సీఎస్పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారాలోశ్కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తులశ్పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్ చేశారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.నాయబ్రసూల్, సీఎస్పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్.ఆనంద్బాబు పేర్కొన్నారు. ఆ తొమ్మిది అంశాలివే1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్ స్కూల్ స్ధానంలో 1 నుంచి 5 తరగతులుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 3. ఎస్జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి. 4. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్ 1 ఉపాధ్యాయులను నియమించాలి.5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్లకు మించకుండా చూడాలి. 7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. 8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల సంఖ్యను బట్టి అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి.

ఎంఐటీ వేదిక నుంచి పాలస్తీనాకు సంఘీభావం
కేంబ్రిడ్జ్ (యూఎస్): పాలస్తీనా మాటెత్తితే చాలు, ఏకంగా యూనివర్సిటీలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న వేళ భారత సంతతికి చెందిన మేఘ వేమూరి అనే విద్యార్థిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి ఏకంగా పాలస్తీనాకు మద్దతు పలికారు. ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్తో తమ వర్సిటీ పరిశోధన ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా కెఫెయే (హిజాబ్ వంటిది) ధరించి మరీ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు! తన ప్రసంగంలో పాలస్తీనాకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడికి అమెరికా మాత్రమే కాదు, మన యూనివర్సిటీ కూడా సాయం చేస్తోంది. వాటిని ప్రోత్సహిస్తోంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎంఐటీ విద్యార్థులు స్వేచ్ఛాయుత పాలస్తీనాను కోరుకుంటున్నారు. ఒక జాతి విధ్వంసాన్ని విద్యార్థులు సహించలేరు. మా జీవితాలను శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లు, విద్యావేత్తలు, నాయకులుగా తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఆయుధ నిషేధానికి పిలుపునిచ్చేందుకు కూడా మేం అంతే కట్టుబడి ఉన్నాం. ఎంఐటీ పూర్వ విద్యార్థులుగా ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకోవాలని వర్సిటీని డిమాండ్ చేస్తూనే ఉంటాం’’ అని ఆమె ఉద్ఘాటించారు. అమెరికాలో విద్యా రంగంలో అనిశ్చితి, విద్యార్థి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా మేఘ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా విద్యాసంస్థలపై అనిశ్చితి చీకట్లు కమ్ముకున్నాయన్నది బహిరంగ రహస్యం. తర్వాత ఏం జరగనుందనే ప్రశ్న మా మనస్సుల్లో ప్రతిధ్వనిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంఐటీ విద్యార్థులుజాతి విధ్వంసాన్ని సహించరుఅమెరికాలో చాలామంది విద్యార్థుల హృదయాల్లో భయాందోళనలు గూడుకట్టుకుని ఉన్నాయని మేఘ అన్నారు. ‘‘మేమంతా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవితాల్లో ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నాం. గాజాలో మాత్రం అసలు విద్యా సంస్థలే లేకుండా చేశారు. పాలస్తీనాను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాల్లో ఎంఐటీ కూడా భాగస్వామి కావడం సిగ్గుచేటు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు ఎంఐటీ విద్యార్థులు పిలుపునిచ్చారు. క్యాంపస్లో పాలస్తీనా అనుకూల కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. వర్సిటీ నుంచే బెదిరింపులు, అణచివేత ఎదుర్కొన్నా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఎంఐటీ విద్యార్థులు మారణహోమాన్ని ఎప్పటికీ సహించరు. జాతి విధ్వంసాన్ని హర్షించరు’’ అని స్పష్టం చేశారు.
ఆ అక్షరం అమ్మ గోరుముద్ద
నేడు ఫినాలే..బ్యూటీ కిరీటం ఎవరికి?
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
తయారీ రంగ దన్ను కావాలి
జీడీపీ వృద్ధి 7.4%
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే
సర్కారు బడుల్లో టీచర్ల సర్దుబాటు
ఇంటర్వ్యూ స్లాట్ల కోసం చెక్ చేసుకోండి
ఆర్ఐసీని పునరుద్ధరిద్దాం: రష్యా
జూబ్లీహిల్స్ బేబీలాన్ పబ్లో దారుణం
‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
అదేదో ఎన్నికలప్పుడు పార్టీ వాణీ కూడా వినిపిస్తే గెలిచేవాళ్లం కదా!?
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
కడప మేయర్ తొలగింపుపై హైకోర్టు స్టే
నటి బ్రిగిడా సాగా..కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
వంశీకి తక్షణమే వైద్యం అందించాలి.. హైకోర్టు ఆదేశం
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
ఆ అక్షరం అమ్మ గోరుముద్ద
నేడు ఫినాలే..బ్యూటీ కిరీటం ఎవరికి?
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
తయారీ రంగ దన్ను కావాలి
జీడీపీ వృద్ధి 7.4%
స్పెల్లింగ్ బీ విజేత హైదరాబాదీ
ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే
సర్కారు బడుల్లో టీచర్ల సర్దుబాటు
ఇంటర్వ్యూ స్లాట్ల కోసం చెక్ చేసుకోండి
ఆర్ఐసీని పునరుద్ధరిద్దాం: రష్యా
జూబ్లీహిల్స్ బేబీలాన్ పబ్లో దారుణం
‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
అదేదో ఎన్నికలప్పుడు పార్టీ వాణీ కూడా వినిపిస్తే గెలిచేవాళ్లం కదా!?
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
కేటీఆర్పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
కడప మేయర్ తొలగింపుపై హైకోర్టు స్టే
వంశీకి తక్షణమే వైద్యం అందించాలి.. హైకోర్టు ఆదేశం
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
సిక్స్ బాదాడని బ్యాటర్ను కొట్టిన బౌలర్! వీడియో వైరల్
సినిమా

'షష్టిపూర్తి' సినిమా రివ్యూ
టైటిల్ : షష్టి పూర్తినటీనటులు: రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ తదితరులునిర్మాత: రూపేష్ చౌదరిఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్కథ, దర్శకత్వం: పవన్ ప్రభసంగీతం: ఇళయరాజాసినిమాటోగ్రఫీ: రామ్విడుదల: మే30, 2025'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన.. సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'. మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించారు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ పబ్లిక్కు బాగా రీచ్ అయింది. ఈ సినిమాతో నిర్మాతగా, హీరోగా రూపేష్ చౌదరి ఎంట్రీ ఇచ్చారు. తనకు మొదటి సినిమానే అయినప్పటికీ మంచి పాయింట్తోనే షష్టి పూర్తి కథను ఎంచుకున్నారు. ప్రతి కుటుంబంలో కనిపించే చిన్నచిన్న అలకలు, సంతోషాలు ఎలాంటి అనుభూతిని ఇస్తాయో ఈ సినిమా చూసినవారికి గుర్తుచేస్తాయి. బిడ్డల కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, కన్నవారి పట్ల పిల్లలు చూపించాల్సిన బాధ్యతలు ఎలా ఉండాలో ఈ చిత్రం చూపుతుంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కడుతూ.. మంచి కుటుంబ విలువలున్న కథతో ఈ మూవీని రూపొందించారు.(ఇదీ చదవండి: భైరవం మూవీ రివ్యూ)షష్టి పూర్తి కథేంటంటే?తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం వారి బిడ్డలకి ఉండదు. కానీ, పిల్లలు అనుకుంటే వారు చూడగలిగే పెళ్లి షష్టిపూర్తి ఒక్కటే. కానీ, తల్లిదండ్రులు గొడవలు పడి విడాకులు తీసుకునే స్థాయికి చేరితే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ నేపథ్యంలోనే షష్టి పూర్తి కథ సాగుతుంది. ఈ కథ హీరో రూపేష్ (శ్రీరామ్)తో మొదలౌతుంది. తన కాలనీలో అత్యంత నీతి, నిజాయితీ ఉన్న ప్రభుత్వ న్యాయవాదిగా ఉంటాడు. తన నిజాయితీ చూసి కాలనీ వాసులకు కూడా చిరాకు వస్తుంది. అందుకు కారణం తన అమ్మకు ఇచ్చిన మాట కోసమే అంటూ ముందుకెళ్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల శ్రీరామ్ తన తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ (దివాకర్), అర్చన (భువన)లకు దూరంగా ఒంటరిగానే ఉంటాడు. ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అనుకోకుండా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (జానకి).. శ్రీరామ్ ఇంట్లోకి వెళ్లి దాక్కుంటుంది. అలా వారిద్దరి మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండీషన్స్ ఉన్నాయని శ్రీరామ్కు చెబుతుంది. ఇంత నిజాయితీగా ఉంటే తనకు ఇష్టం ఉండదని సూచిస్తుంది. ప్రియురాలి కోసం తనమీద తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని పక్కన పెట్టేసి.. అవినీతి లాయర్గా కోర్టులో కేసులు వాదిస్తూ ఉంటాడు. అలా జానకి చెప్పిన ప్రతిపనిని శ్రీరామ్ చేస్తూ ఉంటాడు. అయితే, తను తప్పుడు దారిలో వెళ్తున్నట్లు తన తల్లికి ఎక్కడ తెలుస్తోందోననే భయంతో జానకి చెప్పిన పనులన్నీ చేస్తూంటాడు. ఒకరోజు భువన స్నేహితురాలి కొడుకును ఒక విలన్ గ్యాంగ్ చంపేస్తుంది. ఆ కేసులో తన స్నేహితురాలికి న్యాయం చేయాలని కుమారుడు శ్రీరామ్ను భువన కోరుతుంది. అయితే, అప్పటికే జానకి ప్రేమలో ఉన్న శ్రీరామ్.. విలన్ గ్యాంగ్ ఇచ్చిన డబ్బు తీసుకుని తల్లి స్నేహితురాలికి అన్యాయం చేస్తాడు. నిజాయితీగా ఉన్న శ్రీరామ్ను జానకి ఎందుకు టార్గెట్ చేస్తుంది..? విలన్ గ్యాంగ్తో జానకీకి ఉన్న లింకేంటి.? జానకి కుటుంబానికి శ్రీరామ్ తండ్రి దివాకర్ (రాజేంద్ర ప్రసాద్) చేసిన అన్యాయం ఏంటి..? 30 ఏళ్ల తర్వాత పథకం ప్రకారం రివేంజ్ తీర్చుకునేందుకు జానకీ వేసిన ఎత్తులు ఎలాంటివి..? రాజేంద్ర ప్రసాద్ (దివాకర్), అర్చన (భువన) ఒకే ఇంట్లో 30ఏళ్లుగా వేరువేరుగా ఎందుకు ఉంటున్నారు..? వారి విడాకుల కేసునే శ్రీరామ్ వాదించాల్సిన పరిస్థితికి కారణాలు ఎంటి..? తెలియాలంటే షష్టి పూర్తి సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?కొత్త వారిని ఎంకరేజ్ చేస్తేనే వారు మరిన్ని సినిమాలు తీసేందుకు ముందుకు వస్తారు. షష్టి పూర్తి సినిమా కోసం రూపేష్ నిర్మాతగా, హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న లొకేషన్లు అన్నీ చాలా అందంగా తెరపై కనిపిస్తాయి. రూపేష్కు మొదటి సినిమా అయినప్పటికీ కథలో పెద్దగా బలం లేనప్పటికీ సింగిల్ హ్యాండ్తో నడిపించాడు. ఆకాంక్ష సింగ్ (జానకి)తో రూపేష్ కాంబినేషన్స్ సీన్లు చాలా బాగుంటాయి. సినిమా ప్రారంభం పెద్దగా ఆకట్టుకోకపోయినా తర్వాత మెల్లగా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. షష్టిపూర్తి సినిమా టైటిల్ పెట్టడం వల్ల సినిమా అంతా కుటుంబం చుట్టే తిరుగుతుంది అనుకుంటారు. కానీ, దర్శకుడు ఆ ట్రాక్ను తప్పించి ఫస్ట్ పార్ట్ అంతా లవ్ స్టోరీతో నడిపించాడు. రెండో పార్ట్లో రాజేంద్రప్రసాద్, అర్చనల ప్రేమ కథతో పాటు స్నేహం గురించి చూపాడు. అయితే, టైటిల్కు తగ్గట్లు సినిమా లేదనిపిస్తుంది. ఇదే పెద్ద మైనస్ కావచ్చు కూడా.. మొదటి భాగంలోనే రాజేంద్రప్రసాద్, అర్చనలకు కాస్త ప్రాధాన్యత ఇచ్చింటే బాగుండు అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడు కూడా వారి ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఎదురౌతుంది. ఆపై విలన్ గ్యాంగ్తో జానకీకి ఉన్న కనెక్షన్ను తెరపై చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథలో ప్రతి పాత్ర వెంటనే తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం వారిలో మార్పు వచ్చినట్లు తెరపై చూపించడం పెద్దగా కనెక్ట్ కాలేదు. రూపేష్, ఆకాంక్ష సింగ్ల మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయడంతో వారిద్దరి మధ్య ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఆపై రాజేంద్రప్రసాద్, అర్చనల నుంచి వచ్చే సీన్లు ఎమోషనల్గా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో 15 నిమిషాల పాటు రన్ అయ్యే కోర్టు డ్రామా సీన్కు ఫిదా అవుతారు.ఎవరెలా చేశారంటే?ఈ సినిమాలో ప్రధాన బలం రాజేంద్రప్రసాద్, అర్చనల నటనే.. కొత్తవారితో వారు నటిస్తున్నప్పటికీ తమదైన స్టైల్లో మెప్పించారు. ఆపై హీరో రూపేష్, ఆకాంక్ష సింగ్ల జోడీ అభినందనీయంగా ఉంటుంది. సీనియర్స్ నటులకు పోటీగా తమ సత్తా చూపారు. ఎక్కడా కూడా ఇదే మొదటి సినిమా అనే సందేహం రాకుండా మెప్పించారు. దర్శకుడు ఇంకాస్త కథలో మార్పులు చేసి ఉంటే బాగుండు. సినిమాలో అచ్యూత్ కుమార్, మురళీధర్ గౌడ్, చలాకీ చంటి వంటి మంచి నటులు ఉన్నప్పటికీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇళయరాజా సంగీతానికి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఆయన కేవలం పాటలకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చినట్లు ఉన్నారు. బీజీఎం స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. డైలాగ్స్కు ఇంకాస్త పదును పెట్టింటే బాగుండు. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక హీరోగా, నిర్మాతగా రూపేష్ పూర్తిగా విజయం సాధించాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

అలా జరిగి ఉంటే బిన్ లాడెన్ పదేళ్ల ముందే దొరికేవాడు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల రోజుకొక పాడ్కాస్ట్తో అభిమానులను అలరిస్తున్నారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఆయన తరచుగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక సబ్జెక్ట్పై తన పరిశోధన జరిపి ఫ్యాన్స్కు, సినీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే రోటీన్గా కాకుండా ఈ సారి భిన్నమైన అంశాన్ని తీసుకొచ్చారు. ఏకంగా మోస్ట్ వాంటెడ్ పేరుతో ఒసామా బిన్ లాడెన్ చివరి పదేళ్లు ఎలా బతికాడు? అనే విషయాన్ని పంచుకున్నారు. ఎంతోమంది చావుకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ చివరికీ భయపడుతూ బతకాల్సి వచ్చిందని అన్నారు.పూరి మాట్లాడుతూ..'పాకిస్థాన్ స్వాట్ వ్యాలీలో స్పీడ్గా వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. ఆ కారులో నీట్గా షేవ్ చేసుకున్న వ్యక్తి కూర్చున్నాడు. ఆ కారు డ్రైవర్తో ఏదో మాట్లాడిన తర్వాత పోలీసులు వారిని వదిలేశారు. కానీ ఆ కారులో ఉన్నంది ఒసామా బిన్ లాడెన్ అని పోలీసులకు తెలియదు. ఆరోజు గనుక అతన్ని వదలకుండా ఉంటే.. దశాబ్దం ముందే దొరికే పోయేవాడు. అలా తప్పించుకున్న బిన్ లాడెన్ స్వాట్ వ్యాలీ, పెషావర్, హరిపూర్ తర్వాత చివరికీ అబోటాబాద్లో సెటిలయ్యాడు. అతను ఉన్న ఇంటి పేరు వజీరిస్థాన్ హవేలి. దాదాపు చుట్టూ 12-18 అడుగుల ఎత్తున్న గోడలతో మూడు అంతస్తుల ఇల్లు ఇది. తన ముగ్గురు పెళ్లాలు.. 8మంది పిల్లలు.. ఐదుగురు మనవళ్లతో అక్కడే ఉండేవాడు' అని పంచుకున్నారు.ముఖ్యంగా బిన్ లాడెన్ తన చిన్న పెళ్లాంతోనే ఎక్కువగా ఉండేవాడు. ఆ ఇంటికి టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది కాదు. చెత్త కూడా ఇంట్లోనే కాల్చేసేవారు. తలుపు తీసేవారు కాదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఆ చుట్టుపక్కల వాళ్లకూ తెలియదు. బిన్ లాడెన్కు నాలుగు జతల బట్టలు, ఒక జాకెట్, రెండు స్వెటర్స్ మాత్రమే ఉండేవి. అలా 9ఏళ్లు అజ్ఞాతంలో కాలం వెళ్లదీశాడు. స్పై శాటిలైట్స్ నుంచి తప్పించుకోవడం కోసం బయటకు వచ్చినప్పుడల్లా కౌబాయ్ టోపీ పెట్టుకుని కాంపౌండ్లో తిరిగేవాడు. అతని రైట్ హ్యాండ్ అబు అహ్మద్ అల్ కువైటీ.. అతని స్నేహితుడు అబ్రార్ మాత్రమే లాడెన్తో ఇతరులకు కమ్యూనికేషన్. అలాగే ఇంట్లో అవసరాలు వాళ్లే చూసుకునేవారు' అని పంచుకున్నారు.లాడెన్ తన ఇంట్లోనే కూరగాయలు పండించుకుంటూ కుందేళ్లు, కోళ్లను పెంచుకుంటూ బతికేవాడు. మనవళ్లతో మొక్కలు నాటించి.. ఎవరిది పొడుగ్గా పెరిగితే వాళ్లకు బహుమతులు ఇస్తానని పోటీలు పెట్టేవాడట. సీక్రెట్ శాటిలైట్ డిష్ పెట్టుకుని టీవీ చూసేవాడట. తన గురించి ఒబామా ఏం మాట్లాడుతున్నాడో అనుక్షణం తెలుసుకునేవాడు. అతడు ఎక్కువగా టామ్ అండ్ జెర్రీ యానిమేటెడ్ సినిమాలు చూసేవాడు. స్వీట్స్, చాక్లెట్లు అంటే కూడా అతనికి బాగా ఇష్టం. ఒకసారి తన భార్య డెలివరి అవుతుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో తానే స్వయంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. మారువేషంలో ఉన్న బిన్ లాడెన్.. డాక్టర్తో నా భార్య మూగ, చెవిటిది అని అబద్ధం చెప్పాడు. దాంతో ఆమెను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఆ రోజు అమాయకంగా ఆస్పత్రిలో కూర్చొన్న బిన్లాడెన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు' అని తెలిపారు.'అల్ఖైదా ఆపరేషన్స్ గురించి అతడు చెబుతుంటే.. కూతుళ్లు కాగితం మీద రాసేవారు. ఆ సమయంలో అల్ఖైదా బలహీనపడటంపై ఎక్కువగా బాధపడేవాడట. ఒకసారి అల్ఖైదా పేరు కూడా మార్చాలని ఆలోచించాడు. తన పిల్లలు, మనవళ్లు స్కూల్కు వెళ్లే అవకాశమే లేదు. దీంతో తానే పాఠాలు చెప్పేవాడు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కంప్యూటర్ ఉండేది. ఏదైనా సమాచారం చేరవేయాలంటే యూఎస్బీ డ్రైవ్స్ వాడేవాడు. ఏళ్ల తరబడి అదే ఇంట్లో అనుక్షణం భయపడుతూ బతికాడు. రోజంతా ఏం చేయాలో తోచక అతని దగ్గరున్న వీడియో కెమెరాతో కోళ్లు, మొక్కలు, అప్పుడప్పుడు ఇంటిపై నుంచి వెళ్తున్న హెలికాప్టర్ దృశ్యాలను రికార్డు చేసేవాడు. ఎందుకంటే పక్కనే పాకిస్థాన్ ఆర్మీ కంటోన్మెంట్ ఉండేది. ఏ హెలికాప్టర్ వచ్చినా భయం వేసేదంట. ఆ తర్వాత సీల్ టీమ్ ఇంట్లో చొరబడి అతడిని చంపిన తర్వాత అక్కడి కంప్యూటర్ నుంచి 4.70 లక్షల ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో పోర్న్ వీడియోలు కూడా దొరికాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఎలా చంపాలో వేసిన ప్లాన్స్ అన్నీ సీల్ టీమ్కు దొరికాయి. ఎన్నో వేల మంది చావులకు, సెప్టెంబరు 11 దాడులకు కారణమైన బిన్లాడెన్ తన చివరి పదేళ్లు కష్టాలు పడుతూ, భయపడుతూ బతికాడు. ఇవి బిన్ లాడెన్ గురించి తెలియని కొన్ని విషయాలు' అంటూ పూరి జగన్నాథ్ తన మ్యూజింగ్స్తో వివరిచారు.

కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో హీరో సూర్య
స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ టైంలో మాత్రం 'కంగువ', 'రెట్రో' చిత్రాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవన్నీ పక్కనబెడితే కొన్నాళ్ల క్రితం సూర్య ఫ్యామిలీ గురించి అనుకోని కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు కూతురు గ్రాడ్యుయేషన్తో వాటన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.తమిళంలో చాన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న సూర్య.. తనతో పాటు కలిసి నటించిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. కూతురు దియా, కొడుకు దేవ్ కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత నటిగా రీఎంట్రీ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం పిల్లల్ని పట్టుకుని జ్యోతిక.. ముంబైలోని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో లేనిపోని రూమర్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)జ్యోతిక ముంబైలో, సూర్య చెన్నైలో ఉంటున్నారని.. ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కామెంట్స్ వినిపించాయి. కానీ తాజాగా కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో అటు సూర్య తల్లిదండ్రులు, ఇటు జ్యోతిక పేరెంట్స్ పాల్గొన్నారు. అందరూ ఒక్కచోట కనిపించడంతో ఇప్పటివరకు వినిపించిన మాటలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.సూర్య కూతురు దియా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు. ప్రస్తుతం ఇంటర్మీడియట్(ప్లస్ టూ) పూర్తి చేసింది. త్వరలో పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. మరి తల్లిదండ్రుల్లా దియా కూడా ఇండస్ట్రీలోకి వస్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం చూడటానికి మాత్రం హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనంత అందంగా ఉంది. మరి జ్యోతిక.. తన కూతురి గురించి ఏం ఆలోచిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: విష్ణుని రెచ్చగొట్టేలా మంచు మనోజ్ మరో పోస్ట్!)

Manchu Lakshmi: 20 మంది ప్రముఖులతో రియాలిటీ గేమ్ షో.. కంటెస్టెంట్గా మంచు లక్ష్మీ!
గతంలో కాఫీ విత్ కరణ్ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్ మరో రియాలిటీ షోతో ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన హోస్ట్గా వస్తోన్న రియాలిటీ గేమ్ షో 'ది ట్రైటర్స్'. ఈ షోలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. బాలీవుడ్తో పాటు దక్షిణాది నటులు కూడా ఉండడం ఈ షోపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ షోలోనే పాల్గొనే వారి పేర్లను రివీల్ చేశారు. అంతేకాకుండా ఈ రియాలిటీ షో ట్రైలర్ను కూడా విడుదల చేశారు.ఈ రియాలిటీ షోలో దాదాపు 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఈ గేమ్ షోలో ఊహించని మలుపులు, హై-వోల్టేజ్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన గేమ్ ఆడనున్నారు. ఈ షోను రాజస్థాన్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో నిర్వహించనున్నారు. ఇందులో కరణ్ కుంద్రా, రాజ్ కుంద్రా, రఫ్తార్, జాస్మిన్ భాసిన్, జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, అన్షులా కపూర్, మహీప్ కపూర్, మంచు లక్ష్మీ కూడా కంటెస్టెంట్గా అడుగు పెట్టనున్నారు. ఈ రియాలిటీ షో గెలిచిన వారికి భారీగా నగదు బహుమతి అందుకోనున్నారు.అయితే గేమ్ షోను ఓటీటీ వేదికగా ప్రసారం చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 12 నుంచి తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ రియాలిటీ గేమ్ షోను వెబ్ సిరీస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ గేమ్ షోపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు రానుంది.
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్లో దేవుడి భూములకు దేవుడే దిక్కు... ఖరీదైన ఆలయ భూములను అస్మదీయులకు కట్టబెడుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
క్రీడలు

IPL 2025 Eliminator Match: ఉత్కంఠ పోరులో గుజరాత్పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ముంబై ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్లో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ చేతుల్లో ఉండింది. అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్ వరకు పోరాడినా గుజరాత్కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్తో పాటు వాషింగ్టన్ సుందర్ (48) రాణించాడు. శుభ్మన్ గిల్ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. రూథర్ఫోర్డ్ 24, తెవాతియా 16 (నాటౌట్), షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వనీ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది.

England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు.

IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఐపీఎల్లో రోహిత్ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. ఐపీఎల్లో 7000 పరుగులు సహా 300 సిక్సర్లు పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా, ఓవరాల్గా రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో 8 పరుగుల వద్ద 7000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ ఐపీఎల్లో విరాట్ కోహ్లి తర్వాత ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 బ్యాటర్లు..క్రిస్ గేల్-357రోహిత్ శర్మ-300విరాట్ కోహ్లి-291ఎంఎస్ ధోని-264ఏబీ డివిలియర్స్-251ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు..విరాట్ కోహ్లి-8618రోహిత్ శర్మ-7000 (ఇన్నింగ్స్ కొనసాగుతుంది)శిఖర్ ధవన్-6769డేవిడ్ వార్నర్-6565సురేశ్ రైనా-5528మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 13 ఓవర్ల అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (0) క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో జానీ బెయిర్స్టో 22 బంతుల్లో 47 (4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33 పరుగులు (ఫోర్, 3 సిక్సర్లు) చేశారు. ఈ ఇద్దరి వికెట్లు సాయి కిషోర్కు దక్కాయి. కాగా, ఈ మ్యాచ్లో ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్కు ముందు మరో మ్యాచ్ (క్వాలిఫయర్-2లో పంజాబ్తో) ఆడాల్సి ఉంటుంది. నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్పై విజయం సాధించి ఆర్సీబీ నేరుగా ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసకర శతకాలు
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (మే 30) జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్లు ట్యామీ బేమౌంట్, యామీ జోన్స్ చెలరేగిపోయారు. ఈ ఇద్దరూ విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ జోడీ తొలి వికెట్కు 222 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. బేమౌంట్ 107 (104 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), యామీ జోన్స్ 122 పరుగులు (121 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్) చేసి ఔటయ్యారు. 41 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 262/3గా ఉంది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (8), సోఫియా డంక్లీ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ ఇవాళ ప్రారంభమైంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.
బిజినెస్

EPFO గుడ్న్యూస్.. ఇక అలాంటి రిజెక్షన్స్ ఉండవు
ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బదిలీ ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తొలగించింది. వివిధ సంస్థల్లో పనిచేసిన సందర్భంలో సర్వీస్ వ్యవధులు సరిపోలని కారణంగా పీఎఫ్ బదిలీ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు కొత్త వివరణ ఇచ్చింది. ఇలాంటి సాంకేతికతల కారణంగా ఆలస్యాన్ని ఎదుర్కొన్న వేతన జీవులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.పీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ఎందుకు స్తంభిస్తున్నాయంటే..ఇటీవలి కొన్ని నెలలుగా అనేక ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు (ఆర్పిఎఫ్ఓలు) పీఎఫ్ బదిలీ అభ్యర్థనలను తిరస్కరించడమో లేదా తిరిగి పంపడమో చేస్తున్నాయి. ఒక ఉద్యోగాన్ని అధికారికంగా విడిచిపెట్టడానికి ముందే కొత్త ఉద్యోగంలో చేరినవారి విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. రెండు సంస్థలలో ఏక కాలంలో పనిచేసినట్లు ఉండటంతో ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది.👉 ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులుఈపీఎఫ్వో తాజా ఆదేశాలుపీఎఫ్ బదిలీ క్లెయిమ్ను పూర్తిగా తిరస్కరించడానికి సర్వీసు వ్యవధిని కారణాలుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం మే 20న ఒక సర్క్యులర్ జారీ చేసింది. పెన్షన్ డివిజన్ గతంలో జారీ చేసిన సర్క్యులర్ను కూడా ఇందులో ప్రస్తావించింది. ఎక్కువ ఖాతా నంబర్లున్న సందర్భాల్లో ఈపీఎస్ ప్రయోజనాలను ఎలా నిర్వహించాలో ఆ సర్క్యులర్లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగి రికార్డులో సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ క్లెయిమ్లను ప్రాసెస్ చేయాలని అన్ని బదిలీ కార్యాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ, మెటల్, ఆటో రంగాల్లో విస్తృత స్థాయి అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి సెషన్ లో నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 182.01 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 81,451.01 వద్ద ముగిసింది. ఈ సూచీ 81,698.21 - 81,286.45 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 82.90 పాయింట్లు (0.33 శాతం) క్షీణించి 24,750.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,863.95 వద్ద, ఇంట్రాడే కనిష్ట స్థాయి 24,717.40 వద్ద నమోదయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.06 శాతం, 0.06 శాతం నష్టంతో ముగియగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్ నేతృత్వంలో 2.88 శాతం లాభంతో స్థిరపడింది.నిఫ్టీ మీడియా, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మినహా ఎన్ఎస్ఈలోని మిగతా సెక్టోరల్ ఇండెక్స్లలన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా దాదాపు ఒక శాతం (0.98 శాతం) నష్టపోయింది.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,955 షేర్లలో 1,581 నష్టాల్లో ముగియగా, 1,299 షేర్లు లాభాలను అందుకున్నాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది.2025 మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ ఆదాయాల తుది సెట్ను ఇన్వెస్టర్లు అంచనా వేయడం, క్యూ4 జీడీపీ గణాంకాల కోసం వేచి ఉండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య పరిణామాలను ట్రాక్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉంది.

బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఐదేళ్లలో 50 శాతం ఉద్యోగాలు ఉఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో జాబ్మార్కెట్లో దీని ప్రభావం భారీగా ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంతకు ముందు ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉంటుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 50 శాతం ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేయబోతుందని చెప్పారు. దాంతో నిరుద్యోగ రేటు 20 శాతానికి చేరుకుంటుందని అమోది అంచనా వేస్తున్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ ఇప్పటికే టెక్నాలజీ, ఫైనాన్స్, లా, కన్సల్టింగ్.. వంటి చాలా రంగాల్లోని ఉద్యోగులకు విఘాతం కలిగిస్తోంది. సంక్లిష్టమైన డేటా విశ్లేషణ, కంటెంట్ సృష్టి, చట్టపరమైన పరిశోధన చేసేలా మెషిన్ లెర్నింగ్ నమూనాలు, సాంప్రదాయకంగా ఇంటర్న్లు, జూనియర్ ఉద్యోగులు నిర్వహించే పనులను ఏఐ భర్తీ చేస్తోందని అమోది తెలిపారు. ఫలితంగా కంపెనీలు కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం తగ్గించాయని చెప్పారు. ముఖ్యంగా గతంలో వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకంగా ఉన్న ఉద్యోగాల స్థానంలో రిక్రూట్మెంట్ గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. కొవిడ్ ముందు పరిణామాలతో పోలిస్తే పెద్ద టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ నియామకాలు 50% పడిపోయాయని తెలిపారు. ఆటోమేషన్ వర్క్ఫ్లోలను క్రమబద్ధీకరిస్తుండడం, వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుండడంతో ఏఐ కీలకంగా మారిందన్నారు.మౌనం తగదు..భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నోరుమెదపడం లేదని అమోది చెప్పారు. ముఖ్యంగా యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ఈ అంశంపై మౌనంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. చైనాతో జరుగుతున్న ఏఐ రేసులో ఎదురుదెబ్బలు తగులుతాయనే భయంతో విధాన నిర్ణేతలు నష్టాలను అంగీకరించడానికి వెనుకాడుతున్నారని అంచనా వేశారు. ఏఐ ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోస్తుందని, అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలకు ప్రమాదకరంగా మారుతుందని అమోది అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రంఏం చేయాలంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రభావాన్ని తగ్గించడం మానేసి ఈ మార్పులకు సిద్ధంగా ఉండడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అమోది కోరారు. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్కు నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా రీస్కిల్లింగ్, అప్ స్కిల్ ప్రోగ్రామ్ల అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఫ్యామిలీ

రెండో భగవద్గీత అనుగీత, ఆసక్తికర విషయాలు
శ్రీకృష్ణుడు, అర్జునునికి చేసిన రెండవ ప్రబోధం ‘అనుగీత.’ దీనిని భగవద్గీత సారాంశంగా చెప్పవచ్చు. కురు–పాండవ యుద్ధం తర్వాత ధర్మరాజు రాజ్య పాలన చేస్తూ ఉంటాడు. కృష్ణార్జునులు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నదులు, అడవులు, కొండలలో విహరిస్తూ కబుర్లు చెప్పుకునేవారు. ఒక రోజు కృష్ణునితో అర్జునుడు ‘యుద్ధానికి పూను కున్నప్పుడు నా మనసు కలతచెంది, నేను కుంగిపోయినప్పుడు నువ్వు తత్త్వ బోధకాలైన మహా వాక్యాలను నా మీద కరుణతో బోధించి యుద్ధా నికి సిద్ధం చేశావు. అప్పుడు ఆ మాటల సారాంశాన్ని మనసులో పదిలపరుచుకోలేక పోయాను. మరోసారి ఆ తత్వోపదేశాన్ని అనుగ్రహించ’ మని ప్రార్థించాడు.యుద్ధ ప్రారంభంలో చెప్పినదే ‘భగవద్గీత’. మానవులు పూర్తిగా లౌకిక ప్రపంచంలో మునిగి, సంసార తాపత్రయం నుండి బయటపడలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు అందులో నుంచి బయటపడి తరించటానికి భగవద్గీత 18 మెట్లు చూపిస్తుంది. ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క అధ్యాయం. ఇవి దైవా నికి దగ్గర చేస్తాయి. బ్రహ్మ విద్యను తెలిపే గీతా శ్లోకాలను యథాతథంగా పునరుక్తం చేయటం సాధ్యం కాదని తెలిపి, కృష్ణుడు వేరే పద్ధతిలో కొన్ని పాత్రల పరంగా ప్రతిపాదించాడు.ఇందులో ‘బ్రాహ్మణ గీత’లో బ్రాహ్మణుడు, అతని భార్య సంభాషణ ద్వారా బ్రహ్మ విద్యా ప్రబోధకాలైన అంశాలను తెలిపాడు. ‘అధ్వర్య– యతి సంవాదం’లో యజ్ఞాలలో కెల్లా తపోయజ్ఞమే శ్రేష్ఠమని చెప్పాడు. గురు శిష్య సంవాద రూపంలో సత్వ గుణ సహాయంతో రజస్తమో గుణాలను జయించి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొంది, సత్వాన్ని కూడ విడిచిపెట్టాలని చెప్పాడు. అశ్వమేధ పర్వంలో బోధించిన ఈ ‘అనుగీత’ గీతా తాత్పర్యమే! ఇది అర్జునునిలో ఆధ్యాత్మిక పరిణామాన్ని కలిగించటానికి ఉద్దేశించినది. ఇది చదివితే, మననం చేస్తే సకల మానవాళిలో ఆధ్యాత్మిక భావ వికాసం పెంపొందుతుంది. – డా.చెంగల్వ రామలక్ష్మి

Miss world 2025 పెరిగిన ఇమేజ్!
హైదరాబాద్ ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా మారడంతో తెలంగాణ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఏప్రిల్ నెలలో పెట్టు బడులను ఆకర్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ సమ్మిట్’ను రాష్ట్ర ప్రభుత్వం హైదరా బాదులో ఘనంగా నిర్వహించింది. దాదాపు వంద దేశాల నుంచి 400మంది పైగా ప్రతి నిధులు హాజరయ్యారు. తెలంగాణను ప్రత్యక్షంగా చూసిన వీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ‘మిస్ వరల్డ్’ పోటీలో పాల్గొంటున్నసుందరీమణులు తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలను తెలుసుకునేందుకు ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే నినాదంతో నిర్వహించిన ప్రపంచసుందరీమణుల పర్యటన కార్యక్రమం మనరాష్ట్రం ఓ పెద్ద ప్రపంచ పర్యాటక కేంద్రంగా అవతరించేందుకు వీలు కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో సుందరీమణుల ఆట పాటలు, పర్యటన విశేషాల ప్రత్యక్ష ప్రసారం... ఆ యా దేశాల పర్యా టకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇదీ చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా!మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడమే కాక స్థానిక ఉత్పత్తులకు మంచి ప్రచారం కలించాయి. స్పెయిన్కు చెందిన కీమో ఫార్మా వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరా బాద్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపడం ఈ సందర్భంగా గమనార్హం. పోటీల సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాలు, హస్తకళలకు సంబంధించిన ఉత్పత్తుల వాడకం... స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్ను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. చదవండి: Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయం– జి. లక్ష్మణ్ కుమార్ సమాచార–పౌరసంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్

స్టడీ అండ్ సర్వీస్ : గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో యువత సేవలు
చదువులు, ఉద్యోగాలు ఆ తర్వాత జీవితపు బాధ్యతలలో తలమునకలవడంతోనే సరిపెట్టుకోకూడదు అనుకుంటుంది నవతరం. సమాజసేవను బాధ్యతగా తీసుకుంటూ చదువు–సేవ రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా దాదాపు తొంభై మంది యువ విద్యార్థులు నగరంలోని స్లమ్స్తో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి సేవలు అందిస్తూ ‘మేమున్నాం’ అని బాసటగా నిలుస్తున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలు బాగుపడినప్పుడే దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నది మహాత్ముని మాట. ఇప్పుడు ఆ మాటలు నిజం చేస్తూ యువత ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలను హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా నిర్వహిస్తున్నారు. తమ సేవాకార్యక్రమాలతో మారుమూలస్థాయి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ కాలేజీల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు తమ సేవలను అందిస్తున్నారు. ‘యువతలో సాధికారత, సామాజిక మార్పు’ అనే నినాదంతో వీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఇరువైపులా అవగాహనఇప్పుడు మేం చేస్తున్నది రెవల్యూషనరీ సీజన్. దీనిలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సోలార్ పవర్, శుభ్రత పట్ల అవగాహన, మంచినీటి సౌకర్యం, ఆహార వ్యర్ధాన్ని నిరోధించడం, వాటర్ వీల్ డిస్ట్రిబ్యూషన్... మొదలైన వాటి మీద వర్క్ చేస్తున్నాం. ఇందులో దాదాపు 90 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని మారు మూల ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాం. నగరంలోని స్లమ్స్, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని సమస్యలను గుర్తించడం, పరిష్కార దిశగా చేసిన ఆలోచలను మూడు నెలలకు ఒకసారి అందరం కలిసి, చర్చిస్తాం. ఎక్కడ ముందస్తు సేవ అవసరం అవుతుందో దానిని ప్రధానంగా తీసుకుంటాం. వీటి ద్వారా చదువొక్కటే కాకుండా సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన కూడా కలుగుతుంది. బాధ్యత పెరుగుతుంది. – లాస్య వంకదారి,ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ చైర్ పర్సన్ప్రాజెక్ట్ రిపోర్ట్తో: ప్రతి సీజన్లో ఎనిమిది ప్రధాన సమస్యలపై వర్క్ చేస్తుంటాం. ముందుగా అందరం కలిసి, చర్చించుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసుకుంటాం. మెంబర్స్ అందరం అమ్మానాన్నలు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఫండ్ సేకరిస్తాం. ఆ మొత్తాన్ని యూత్ అసెంబ్లీ ద్వారా ఒక మంచి పనికోసం కేటాయించి, సేవలో పాల్గొనడం సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్కి సంబంధించి ఈవెంట్ చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న తాండాల వారికి, గర్భవతులకు, పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేలా ప్లాలాన్ చేస్తున్నాం. నవజాత శిశువులకు అవసరమయ్యే వస్తువులను కూడా అందిస్తున్నాం. కిందటిసారి ములుగులో చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. – విజయ్, బిటెక్ ఫస్టియర్, కరియర్ గైడెన్స్లో అవగాహన: హైదరాబాద్స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్లో మూడేళ్ల పాటు వర్క్ చేశాను. ఇప్పుడు యూత్ అసెంబ్లీ నుంచి సేవలు అందిస్తున్నాను. పట్టణాల్లో ఉన్న నిరుపేదల జీవనశైలిని మార్చే ప్రయత్నం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, స్కూల్స్కు వెళ్లి కెరియర్ గైడెన్స్ వంటివి చేస్తున్నాం. సిద్దిపేటలోని కిష్టాపూర్, ములుగు ప్రాంతంలోని తక్కెళ్లగూడెంలో సోలార్ ΄్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, డిజిటల్ అవేర్నెస్... వంటివి చేశాం. – చంద్రశేఖర్, బీటెక్ థర్డ్ ఇయర్, ఇంబ్రహీంపట్నం

అలరించిన మహా నృత్యోత్సవం..
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ నాట్య శిల్పి ఆర్ట్స్ అకాడమీ 35వ ఉచిత నాట్య శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు రవీంద్రభారతిలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ పొందిన వంద మంది చిన్నారులు మహా నృత్యోత్సవం పేరిట కూచిపూడి, జానపద, దాండియా నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. చిన్నారులకు ఉచితంగా శాస్త్రీయ సంగీత కళలపై శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. అంతకు ముందు అకాడమీ వ్యవస్థాపకులు వాసుకి శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రదర్శించిన లైట్ ఆఫ్ బుద్ద నాటకం హైలెట్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు లయన్ సర్దార్ హర్బీందర్ సింగ్, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్రెడ్డి, అకాడమీ డైరెక్టర్ పుష్పలత పాల్గొన్నారు. (చదవండి: విశ్వ వేదికపై.. నాటు పాట..! వైరల్గా తెలుగు పాటలు..)
ఫొటోలు


'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)


బిగ్బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)


చాహల్తో విడాకులు.. లండన్లో చిల్ అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)


పెళ్లయి పదేళ్లు.. అల్లరి నరేశ్ భార్య-కూతుర్ని చూశారా? (ఫొటోలు)


కొడుకు బారసాల జ్ఞాపకాలతో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)


2024 'గద్దర్ అవార్డ్స్'తో ట్రెండ్ అవుతున్న తెలుగమ్మాయి (ఫోటోలు)


నటి బ్రిగిడా సాగా..కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


విశాఖపట్నం : సంద్రం.. కల్లోలం (ఫొటోలు)


వైజాగ్ లో గ్రాండ్గా ‘థగ్ లైఫ్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)


పంజాబ్ను మట్టికరిపించిన పాటీదార్ సేన.. ఫైనల్కు దూసుకెళ్లిన ఆర్సీబీ (ఫొటోలు)
అంతర్జాతీయం

ఇదంతా ట్రంప్పై ద్వేషంతో చేసిందే!
లిబరేషన్ డే సుంకాలకు లైన్ క్లియర్ అయినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కోపం చల్లారలేదు. తన ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా మాన్హట్టన్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదని, అధ్యక్షుడి అధికారాలను న్యాయమూర్తులు అణగదొక్కారని మండిపడ్డారు.‘‘అంతర్జాతీయ వాణిజ్యపు న్యాయస్థానం అమెరికాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అదృష్టవశాత్తూ.. మాన్హట్టన్ వాణిజ్యపు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని 11 మంది న్యాయమూర్తులతో కూడిన ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. అసలు ఆ ముగ్గురు న్యాయమూర్తులు(మాన్హట్టన్ బెంచ్) ఎక్కడి నుంచి వచ్చారు?. అమెరికాకు తీవ్ర నష్టం చేకూర్చే పనిని చేయడం వాళ్లకు ఎలా సాధ్యమైంది?. ఇదంతా ట్రంప్పై ద్వేషంతో చేసిందే. ఇది తప్పుడు చర్య. రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదే’’ అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలను(Liberation Day tariffs) విధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన మాన్హట్టన్ వాణిజ్య న్యాయస్థానం(Manhattan Trade Court).. సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే.. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ సర్కారు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో.. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని న్యాయధికారులు కోర్టుకు తెలిపారు. కానీ, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా నిలుపుదల చేసింది. అయితే.. .. మాన్హట్టన్ కోర్టు ఆదేశాలపై ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు స్పందించాలని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి!

International Potato Day: మూడవ ర్యాంకులో ఆలూ
మనిషి ఆహారం కోసం ప్రధానంగా వినియోగించే వాటిలో బియ్యం, గోధుమల తర్వాత మూడవ స్థానంలో బంగాళదుంప నిలిచింది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆహార పంటగా బంగాళదుంప(ఆలూ) చోటు దక్కించుకుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రతీయేటా మే 30 ఇంటర్నేషనల్ పొటాటో డే(International Potato Day)(అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవం) నిర్వహిస్తూ వస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలలో బంగాళాదుంపలను పండిస్తుంటారు. దక్షిణ అమెరికాలోని ఆండీస్లో తొలుత బంగాళ దుంపలను పండిచారని చెబుతారు. పరిమాణం, రంగు, పోషక విలువల పరంగా 1,500 నుంచి 2,000 విభిన్న రకాల బంగాళాదుంపలు ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. బంగాళాదుంప శాస్త్రీయ నామం సోలనమ్ ట్యూబెరోసమ్. ఇవి నైట్ షేడ్ కుటుంబానికి చెందిన మొక్కలు. బంగాళాదుంపలు ప్రపంచవ్యాప్తంగా విభిన్న వంటకాల్లో ఉపయోగించే రూట్ వెజిటేబుల్. బంగాళాదుంపలలో అధికశాతంలో పిండి పదార్ధం ఉన్నందున వాటిని మితంగా తినాలని నిపుణులు చెబుతుంటారు.బంగాళాదుంపలో కేలరీలు: 168, కొవ్వు: 0 గ్రాములు, ప్రోటీన్: 5 గ్రాములు, కార్బోహైడ్రేట్లు: 37 గ్రాములు, ఫైబర్: 4 గ్రాములు, సోడియం: 24 మిల్లీగ్రాములు, విటమిన్ సి: 37%, విటమిన్ బీ6: 31%, పొటాషియం: 27%, మాంగనీస్: 20% ఉంటాయి. బంగాళాదుంపలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఆరోగ్యకరమైనవని చెబుతుంటారు. దీనిలో లభించే ఖనిజాలు మెరుగైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని వివిధ పరిశోధనల్లో తేలింది. జీర్ణక్రియకు, వృద్ధాప్య లక్షణాలతో పోరాడేందుకు కూడా బంగాళ దుంపలు దోహదపడతాయి. బంగాళాదుంపలు ఆకలిని తగ్గించడం ద్వారా శరీర బరువు తగ్గడానికి సహాయపడతాయి. మితంగా తీసుకుంటే, బంగాళాదుంపలు(Potatoes) ఎంతో ప్రయోజనాన్ని అందిస్తాయి. భారతదేశంలో ఉత్పత్తయ్యే బంగాళాదుంపలలో ఎక్కువ భాగం ఉత్తర ప్రదేశ్ నుండే వస్తాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, పంజాబ్లలో బంగాళదుంపలను విరివిగా పండిస్తారు. ఇది కూడా చదవండి: జోదా- అక్బర్ల పెళ్లి పచ్చి అబద్ధం: రాజస్థాన్ గవర్నర్

వివేక్ రామస్వామిపై జాతి విద్వేష వ్యాఖ్యలు
వాషింగ్టన్: బయోటెక్ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన ప్రముఖ రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామిపై అమెరికన్లు జాతి విద్వేష వ్యాఖ్యలకు దిగారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పంచుకున్న పోస్టుపై వలస వ్యతిరేక వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రామస్వామి, ఆయన భార్య డాక్టర్ అపూర్వ ఇద్దరివీ భారత మూలాలే. వారికిద్దరు పిల్లలు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ‘‘2011లో అపూర్వ అనే తెలివైన వైద్య విద్యార్థినిని కలిశాను. తొలి డేటింగ్ కోసం రాకీ సానువుల్లోకి ఫ్లాట్టాప్ పర్వతంపైకి హైకింగ్కు వెళ్లాం. దారిలో మంచు తుపాను విరుచుకుపడింది. అయినా శిఖరంపైకి వెళ్దామని నేను మూర్ఖంగా పట్టుబట్టాను. అందుకు జీవితకాలం ఉందంటూ అపూర్వ వారించింది. ఇది జరిగి 14 ఏళ్లు. ఈ వారాంతం మా పదో వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఫ్లాట్టాప్ శిఖరాన్ని అధిరోహించాం’’అంటూ అక్కడ దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్టుపై అమెరికన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. ‘గో బ్యాక్ టు ఇండియా’, ‘మీ నాన్నను ఎప్పుడు బహిష్కరిస్తారు?’‘పర్వతపు తెలుపు అందాలను గోధుమ రంగు (భారతీయుల ఒంటి రంగును ఉద్దేశించి) నాశనం చేసింది’, ‘భారత్ తిరిగి వెళ్లి అక్కడ ట్రెక్కింగులు చేసుకోండి’అంటూ సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలకు దిగారు. వివేక్ ఒహాయో గవర్నర్ పదవికి పోటీ పడుతున్నారు. అందుకోసం డోజ్ సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకొన్నారు. కానీ ఆయనను గెలిపిస్తే హెచ్–1బీ వీసా తదితరాలపై వలసదారులకు అనుకూల వైఖరే ప్రదర్శిస్తారంటూ ట్రోలర్లు ఆక్షేపించారు. నిజానికి వివేక్ గతంలో వలసవాదులకు అనుకూలంగా మాట్లాడినా కొంతకాలంగా హెచ్–1బీ వీసా పథకం తదితరాలను వ్యతిరేకిస్తున్నారు. భారతీయ అమెరికన్లు కూడా దీనిపై ఆయన్ను తీవ్రంగా తప్పుబడుతున్నారు. In the fall of 2011, I met a brilliant medical student named Apoorva & asked her out on a first date - to head west for a weekend & hike Flattop Mountain in the Rockies. She accepted. We got within striking distance of the summit when a blizzard hit. I was foolishly stubborn… pic.twitter.com/pdV1joMUeg— Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 26, 2025

పాక్ నష్టాలకు కొలంబియా సంతాపమెందుకు?: శశిథరూర్
న్యూఢిల్లీ: భారత్ ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) చేపట్టిన సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా సంతాపం వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నిరాశ వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను ఉసిగొల్పేవారికి, కేవలం తమను తాము రక్షించుకునేవారికి మధ్య ఎటువంటి తేడా ఉండడని శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాడాలనే భారతదేశ బలమైన సంకల్పాన్ని తెలియజేయడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్తో పాటు పలువురు ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంతో ప్రస్తుతం కొలంబియా పర్యటనలో ఉంది.ఈ సందర్భంగా కొలంబియా(Colombia)లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ పాక్పై భారత్ ప్రతీకార దాడులు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లో జరిగిన ప్రాణనష్టంపై కొలంబియా సంతాపం వ్యక్తం చేయడంపై నిరాశచెందామని, ఇటువంటి సమయంలో ఉగ్రవాదానికి బలైనవారిపై సానుభూతి వ్యక్తం చేయడం అవసరమన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పౌరుల ఊచకోత వెనుక పాకిస్తాన్ హస్తముందని ప్రభుత్వం వద్ద వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని ఎంపీ పునరుద్ఘాటించారు.కొలంబియా పలు ఉగ్ర దాడులను ఎదుర్కొన్నట్లే, నాలుగు దశాబ్దాలుగా భారత్ పెద్ద సంఖ్యలో ఉగ్రదాడులను ఎదుర్కొన్నదని శశిథరూర్ అన్నారు. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ గురించి ప్రస్తావించిన ఆయన పాకిస్తాన్ దగ్గరున్న రక్షణ పరికరాలలో 81 శాతం చైనా సరఫరా చేసినవేనని పేర్కొన్నారు. రక్షణ అనేది మర్యాదపూర్వక పదం. అయితే పాకిస్తాన్ తన సైనిక పరికరాలను దాడుల కోసం వినియోగిస్తోందని శశిథరూర్ అన్నారు. ఎంపీ థరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పనామా, గయానాలను సందర్శించిన అనంతరం కొలంబియాకు చేరుకుంది. ఇది కూడా చదవండి: పాక్లో మకాం.. సిమ్ల దుర్వినియోగం.. రాజస్థాన్ యువకుడు అరెస్ట్
జాతీయం

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: అత్యంత భారీ వర్షాలు, విపరీతమైన వేగంతో కూడిన ఈదురు గాలులు కేరళ(Kerala)ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ బీభత్సం కొనసాగుతున్న సమయంలోనే రాబోయే మూడు గంటల్లో కేరళలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటా వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు, కొన్ని ప్రదేశాలలో 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. తిరువనంతపురం(Thiruvananthapuram), కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు చెట్లు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ వైర్లు తెగిపడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకరమైన విద్యుత్ లైన్లు గమనిస్తే ఈ విషయాన్ని విద్యుత్శాఖ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు కోరారు.ఇది కూడా చదవండి: ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్నాథ్

రిసెప్షనిస్ట్ అంకిత కేసులో సంచలన తీర్పు
దాదాపు మూడేళ్ల కిందట.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారి కేసు (Ankita bhandari Case)లో సంచలన తీర్పు వెలువడింది. లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్ ఓనరే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులను దోషులుగా తేలుస్తూ ఉత్తరాఖండ్ స్థానిక కోర్టు జీవితఖైదు శుక్రవారం తీర్పు వెల్లడించింది .పౌరీ జిల్లాకు చెందిన అంకిత భండారి(19) రిషికేష్లోని వంతారా రిసార్ట్లో రిసెప్షనిస్టుగా పని చేసేది. అయితే 2022 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఆమె కనిపించకుండా పోయింది. నాలుగు రోజుల తర్వాత ఆమె మృతదేహం స్థానికంగా ఉన్న ఓ కాలువలో కనిపించింది. ఆమెపై హత్యాచారం జరిగి ఉండొచ్చన్న ప్రచారంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. పుల్కిత్ ఆర్య(Pulkit Arya) తండ్రి వినోద్ ఆర్య బీజేపీ నేత. దీంతో కేసు నుంచి అతన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ విమర్శల నేపథ్యంలో వినోద్ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేశారు.మరోవైపు.. జస్టిస్ ఫర్ అంకిత పేరుతో యువత రోడ్డెక్కింది. ఇటు సోషల్ మీడియాలోనూ #Justiceforankitaఉద్యమం నడిచింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆమె హత్యకు గురైనట్లు తేలింది. ఈ కేసులో రిసార్ట్ ఆపరేటర్ పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరు ఉద్యోగులు సౌరభ్ భాస్కర్, అకింత్ గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదిక ధృవీకరించింది. తన రిసార్ట్కు వచ్చేవాళ్లతో పాటు తనకూ పడక సుఖం అందించాలని అంకితపై పుల్కిత్ ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమె లొంగలేదు. 2022 సెప్టెంబర్ 18వ తేదీన ఆమెతో ఈ అంశంపై వాగ్వాదానికి దిగాడు. జరిగిన పెనుగులాటలో పుల్కిత్, మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ఆమెను కాలువలోకి తోసి చేశాడని తేలింది. హత్య, లైంగిక వేధింపులతో పాటు పలు నేరాల సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సిట్ దర్యాప్తు పూర్తి చేసి 500 పేజీల ఛార్జిషీట్ రూపొందించింది. 2023 మార్చి చివర్లో కోట్ద్వార్ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. మొత్తం 97 మంది సాక్షుల్లో.. 47 మందిని కోర్టు విచారించింది. రెండేళ్లపాటు సాగిన విచారణ తర్వాత.. ఇవాళ(మే 30వ తేదీన0 అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రీనా నెగి.. ఆ ముగ్గురిని దోషులుగా ప్రకటించారు. దోషులకు జీవిత ఖైదు ఖరారు కాగా.. అంకిత కుటుంబం మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది.ఇదీ చదవండి: అలా మాట్లాడాల్సింది కాదు.. ఆమెకు క్షమాపణలు చెప్పండి

మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ
పాట్నా: పహల్గాం నిందితుల్ని మట్టిలో కలిపేస్తానని ఆరోజు మాట ఇచ్చా.. ఇచ్చిన మాట ప్రకారం ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదాల్ని హతమార్చాం’ అని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోదీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి బీహార్లో పర్యటించిన సమయంలో మీకు హామీ ఇచ్చా. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది. వాళ్ల వెనకున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని. మీకు మాట ఇచ్చినట్లుగా ఆపరేషన్ సిందూర్తో పహల్గాం ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. ఆ నాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని బీహార్ గడ్డపై అడుగుపెట్టా. #WATCH | Karakat, Bihar | Prime Minister Narendra Modi says, "... Pakistan and the world have seen the power of India's daughters' Sindoor... The world has seen the unprecedented valour and courage of the BSF during Operation Sindoor... While performing the sacred duty of serving… pic.twitter.com/38eFvCPtww— ANI (@ANI) May 30, 2025ఆపరేషన్ సిందూర్లో మన దళాలు నిమిషాల వ్యవధిలో మెరుపు వేగంతో వారిని అణిచేశాయి. పాక్ ఉగ్రస్థావరాల్ని నేలమట్టం చేయడమే కాదు, నిమిషాల వ్యవధిలోనే పాక్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాయి. పాకిస్తాన్తోపాటు ప్రపంచ దేశాలు ఆపరేషన్ సిందూర్ పవర్ని చూశాయి. ఉగ్రవాదంపై మా పోరు ఆగదు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల చరిత్ర ముగిసిపోతుంది. చాలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడ్డాయి. ఇది నయా భారత్. ఇదే భారత్కు కొత్త బలం అని పునరుద్ఘాటించారు.ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేస్తాం.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీహార్లో ప్రధాని మోదీ ‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారిని మట్టిలో కలిపేస్తాం. వాళ్లు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం.శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్నాథ్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయం తర్వాత ఆయన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ను దర్శించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant)ను అరేబియా సముద్రంలో మోహరించారు.ఐఎన్ఎస్ విక్రాంత్ సందర్శన అనంతరం రక్షణ మంత్రి నావికాదళ అధికారులు, సైనికులను కలుసుకుని, ఆపరేషన్ సింధూర్లో సాధించించిన విజయంపై వారిని అభినందించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారత నావికాదళ బృందానికి ఐఎన్ఎస్ విక్రాంత్ నాయకత్వం వహించింది. దీనిలో డిస్ట్రాయర్లు, స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్(Stealth Guided Missile Frigate)లు మొదలైన 10 యుద్ధనౌకలు ఉన్నాయి. పాక్ ఉద్రిక్తతలను మరింతగా పెంచిన పక్షంలో భారత నావికాదళం యుద్ధనౌకలను మాత్రమే కాకుండా భూ లక్ష్యాలను కూడా టార్గెట్ చేసుకుంటుందని ఈ మోహరింపు పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్నిచ్చింది. ఫలితంగా పాకిస్తాన్ నావికాదళం కరాచీ నావికా స్థావరం నుండి ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేకపోయింది. కాల్పుల విరమణకు డిమాండ్ చేసింది. Goa | Defence Minister Rajnath Singh onboard at INS Vikrant.(Source: RM Office) pic.twitter.com/k2OqUvOXG9— ANI (@ANI) May 30, 2025ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాన్ని జరుపుకునేందుకు, నావికా దళాలలో మనోధైర్యాన్ని పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. దీనికిముందు ఆయన శ్రీనగర్లో ఆర్మీ అధికారులను, భుజ్లోని వైమానిక దళాన్ని కలుసుకున్నారు. కాగా రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ను 2022 సెప్టెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత నావికాదళంలో చేర్చారు. 45,000 టన్నుల బరువున్న ఈ విమాన వాహక నౌక 76 శాతం మేరకు స్వదేశంలోనే తయారయ్యింది.ఇది కూడా చదవండి: 20 ఏళ్ల కుర్రాడు.. 16వ అంతస్థు నుంచి దూకి..
ఎన్ఆర్ఐ

హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.
క్రైమ్

వదిన కుమారుడు మరణించాడని.. గుండెపోటుతో బాబాయి మృతి
యర్రగొండపాలెం(ప్రకాశం): వదిన కుమారుడు మరణించాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక బాబాయి గుండెపోటుతో మరణించిన సంఘటన బుధవారం యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఆలేటి అఖిల్ మంగళవారం నీటి కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి పిన్ని భర్త పెద్దారవీడు మండలంలోని చాట్లమడ గ్రామానికి చెందిన జి.దానియేలు(45) హైదరాబాద్లో బేల్దారి పని చేస్తుంటాడు.అఖిల్ మృతి విషయం తెలిసి యర్రగొండపాలెం వచ్చాడు. ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాన్ని చూసిన తీవ్రంగా కలతచెందాడు. అఖిల్ మృతి చెందిన ఫారం పాండ్ పరిసరాలను పరిశీలిస్తూ దానియేలు ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు. బంధువులు హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో వీరభద్రాపురం, చాట్లమడ గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

భర్త కర్కశత్వం.. భార్య హతం
యశవంతపుర(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తివేటుకు బలి చేశాడు కర్కోటక భర్త. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా కైమరా చెక్పోస్టు వద్ద జరిగింది. అవినాశ్(32) కీర్తి(26)లు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండన్నరేళ్ల చిన్నారి ఉంది. వీరి సంసారం సవ్యంగా సాగుతుండగా ఇటీవల కలతలు ఏర్పడ్డాయి. విడాకులు ఇవ్వాలని అవినాశ్ ఒత్తిడి చేసేవాడు. భార్య నాలుగు నెలల గర్భిణిగా ఉండగా అబార్షన్ చేయించినట్లు తెలిసింది. కొంతకాలంగా పుట్టింటిలో ఉన్న కీర్తి బట్టలు తీసుకురావటానికి బుధవారం భర్త వద్దకు వచ్చింది. ఆ సమయంలో అవినాశ్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. చుట్టు పక్కలవారు గమనించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది. అవినాశ్ అక్క వల్లనే తమ కుమార్తె కాపురంలో కలతలు ఏర్పడ్డాయని మృతురాలి తల్లిదండ్రులు చిక్కమగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న అవినాశ్ కోసం గాలింపు చేపట్టారు.

అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్ అవతారమెత్తి..
హైదరాబాద్: పారిశ్రామిక వేత్త కూన రవీందర్ గౌడ్ను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు ఇద్దరు సూడో నక్సలైట్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాడు. బుధవారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. విజయవాడ, గన్నవరానికి చెందిన యర్రంశెట్టి రాజు అక్కడ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. వ్యసనాలకు బానిసైన అతను అప్పులు చేసి జల్సా చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో షాపూర్నగర్లో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూన రవీందర్గౌడ్ను బెదిరించి డబ్బు లాగాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా గన్నవరానికి చెందిన తన స్నేహితుడు కందురెల్లి రాజు(24)ను నగరానికి రప్పించుకున్నాడు. ఈనెల 21న రాత్రి పథకం ప్రకారం కందురెల్లి రాజును కూన రవీందర్గౌడ్ ఇంటికి పంపించాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే అతను మెయిన్ గేట్లోనుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న తులసి మొక్కను పీకేశాడు. అనంతరం ఎర్రరంగు టవల్లో ఓ లేఖను ఉంచి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రవీందర్గౌడ్ కారుపై ఉన్న లేఖను చదివిన రవీందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సవాల్ తీసుకున్న పోలీసులు ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్ రంగంలోకి దిగారు. దాదాపు 500 సీసీ కెమరాలను పరిశీలించి రవాందర్గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యర్రంశెట్టి రాజును నిందితుడిగా గుర్తించారు.దీంతో యర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 13నాటు బాంబులు, 4 సెల్ఫోన్లు, ఒక బెదిరింపు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును చేదించిన ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్, పీసీలు నరేష్, రవినాయక్, వెంకటే‹Ùలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా నాటు బాంబులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

దత్తత పేరుతో శిశువుల విక్రయం
సూర్యాపేట టౌన్: ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన భార్యాభర్తలు నక్క యాదగిరి, ఉమారాణితోపాటు మరో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ మీడియాకు వెల్లడించారు. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటివరకు టేకుమట్లలో ముగ్గురు మగశిశువులను, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులను, పెన్పహాడ్లో ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్లో ఇద్దరు మగ శిశువులు, తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలో ఒక ఆడశిశువు, హైదరాబాద్లో ఒక మగ శిశువును విక్రయించినట్టు గుర్తించారు. పిల్లలందరినీ రక్షించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అరెస్టయినవారిలో నక్క యాదగిరి, ఉమారాణి, కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్కర్నూల్కు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్కు చెందిన ఎండి.షాహానా, ఇస్తా శోభారాణి, సబావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత, రాజస్తాన్కు చెందిన ఖాన్ షాహీనా ఉన్నారు. ఈ ముఠాపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగామ, ముంబైలో కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. శిశువుల విక్రయం ఇలా.. యాదగిరి, ఉమారాణి దంపతులు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్ మధ్యవర్తిత్వంతో దత్తత పేరుతో విక్రయిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం నక్క యాదగిరిని సంప్రదించారు. వారికి 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో మరో 11 మంది ముఠా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. కొనుగోలుచేసిన వారినుంచి శిశువులను పోలీసులు తీసుకురావటంతో వారంతా సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
వీడియోలు


ప్రధాని మోదీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశి


వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన YSRCP నేతలు


దేశాలు చూపిస్తానంటూ.. దేశ ద్రోహం


ఓ మహిళకు బీజేపీ నేత అబ్బినేని బాబు లైంగిక వేధింపులు


మిల్లా మ్యాగీపై లండన్ లో కేసు


చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి


బీజేపీలో పార్టీ విలీనాన్ని నేను ఒప్పు కోను: ఎమ్మెల్సీ కవిత


అంకితా భండారీ హత్య కేసులో దోషులకు జీవితఖైదు


కన్నడ భాష వివాదంపై స్పందించిన కమల్ హాసన్


మహేష్ బాబు అభిమాని అత్యుత్సాహం..