Top Stories
ప్రధాన వార్తలు

IPL 2025: పంజాబ్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ
ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఇవాళ (మే 29) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పంజాబ్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో రేపు (మే 30) జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో (గుజరాత్ వర్సెస్ ముంబై) విజేతతో తలపడుతుంది.ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి దర్జాగా విజయతీరాలకు చేరింది. ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పాటిదార్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ తలో వికెట్ తీశారు.అతి పెద్ద విజయంఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీ అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ మరో 60 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో ఈ రికార్డు కేకేఆర్ పేరిట ఉండేది. 2024 సీజన్ ఫైనల్లో కేకేఆర్ ఎస్ఆర్హెచ్పై 57 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.నాలుగోసారి..తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ అవుతుంది. ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో కూడా ఫైనల్కు చేరింది. అయితే మూడు సందర్భాల్లో ఈ జట్టుకు ఓటమే ఎదురైంది.

ఔను ఆ రోజు జరిగింది ఇదే.. నిజం ఒప్పుకున్న పాక్
భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్థాన్.. పచ్చి అబద్ధాలతో నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో తమకు ఎలాంటి నష్టం జరగలేదంటూ బీరాలు పలికిన పాక్.. నిజాలను ఒక్కొక్కటిగా ఒప్పుకుంటోంది. తాజాగా, ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ (Shehbaz Sharif) భారత్ తమపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసిందని స్వయంగా ఆయనే చెప్పారు.భారత్ రావల్పిండిలోని ఎయిర్బేస్తో సహా కీలక సైనిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసిదని.. తాము చర్య తీసుకునే సమయానికి ముందే దాడి జరిగిందంటూ షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. పాక్ మిత్ర దేశమైన అజర్ బైజాన్లో పర్యటిస్తున్న షెహ్బాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత భారత్పై దాడి చేయాలని పాక్ ప్లాన్ చేసింది. అయితే, పాకిస్తాన్ చర్య తీసుకునే ముందే భారత్ మరో బ్రహ్మోస్ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని షెహ్బాజ్ చెప్పుకొచ్చారు. కాగా, దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చిన సంగతి తెలిసిందే. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని మూడు రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ వేదికగా ప్రకటించారాయన. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటనను పాక్ పత్రిక ది డాన్ ప్రముఖంగా ప్రచురించింది.

‘టీడీపీ మహానాడు అట్టర్ ఫ్లాప్’
తాడేపల్లి: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. గత అయిదేళ్ళ పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్దేనని అన్నారు. రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హతే లేదని ధ్వజమెత్తారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...కడప నగరంలో తెలుగుదేశం అట్టహాసంగా నిర్వహించిన మహానాడు తమను తాము పొగుడుకునేందుకు, వైయస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకే అన్నట్లుగా నిర్వహించారు. ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు. మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ మహానాడులో ప్రజలకు కోసం ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండ మూడు రోజులు గడిపేశారు. కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేశారుమహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్ను విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు. మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని అర్థమవుతోంది. వైఎస్ జగన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. అమ్మ ఒడి, ఫీజురీయింబర్స్మెంట్, ఉచిత బస్సు, గ్యాస్ సిలెండర్, చేయూత, ఆసరా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. మరోవైపు ఏడాది కాలంలోనే ఏకంగా రూ.1.49 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చి రికార్డు సృష్టించారు. ఈ సొమ్మంతా దేనికి ఖర్చు చేశారో చెప్పే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ గారి ఏడాది పాలనలో ఆఖరి మూడు నెలలు కరోనా ఉంది. అంతకు ముందు రెండు నెలల పాటు కూడా దాని ప్రభావం ఉంది. మిగిలిన ఏడు నెలల్లో జగన్ గారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మహిళలకు డ్వాక్రారుణమాఫీ, పెన్షన్లు పెంచారు, చేయూత, అమ్మ ఒడి ఇలా అనేక పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రజలు గుర్తుంచుకోదగ్గ పాలనను అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలో ఏం చేశారని వారిని గుర్తు చేసుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.వైఎస్ జగన్ పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలివైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే లక్షా నలబై వేల ప్రభుత్వ ఉద్యోగాలు, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ది చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాడు-నేడు నిలిచిపోయింది. ఇంగ్లీష్ మీడియం లేకుండా చేశారు. విద్యాదీవెన, వసతి దీవెనలు బకాయిలు పెట్టారు. ఏడాది పూర్తియినా డీఎస్సీనీ పూర్తి చేయలేకపోయారు. ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయలేకపోయారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఏమయ్యింది? ప్రతిసారీ రాయలసీమ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారే తప్ప, ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి. గాలేరీ-నగరీ, హంద్రీనీవాకు చంద్రబాబు ఏం చేశారు? ఆనాడు ఎన్డీఆర్ పునాది వేస్తే, చంద్రబాబు హయాంలో కేవలం అయిదు టీఎంసీలకే వాటిని పరిమితం చేశారు. రాయలసీమలో పోతిరెడ్డిపాడు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు వైయస్ఆర్, వైఎస్ జగన్ హయాంలోనే వచ్చాయి. కర్నూలు రాజధానిని వదులుకున్నందుకు ఈ ప్రాంతానికి హైకోర్ట్ వస్తుందని భావిస్తే, దానికి కూడా ఆటంకాలు కల్పించారు. సత్యవేడు, శ్రీసిటీ, కొపర్తి పారిశ్రామికవాడలను తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. రాయలసీమకు ద్రోహం చేసింది చంద్రబాబేతాజాగా బనకచర్ల అంటూ చంద్రబాబు కొత్త పాటపాడుతున్నారు. చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అలాగే గాలేరు-నగరి నుంచి హంద్రీనీవాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్తితి ఏమిటని ఆలోచిస్తేనే భయం వేస్తోంది. పోలవరం-బనకచర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గండికోట ప్రాజెక్ట్లో కనీసం 13 క్యూసెక్కుల నీటిని నిల్వ చేయలేకపోయారు. వైఎస్సార్ దానిని నిర్మిస్తే, చంద్రబాబు నిర్వీర్యం చేశారు. అదే గండికోట రిజర్వాయర్లో వైఎస్ జగన్ ముందుచూపుతో తీసుకున్న చర్యల కారణంగా 27 టీఎంసీలను నిలబెట్టారు. సీమలోని అనేక ప్రాజెక్ట్ల్లో నీటి నిల్వలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎప్పటి నుంచో నంద్యాల, తిరుపతి జిల్లా కావాలని ప్రజలు పోరాటాలు చేస్తే, వైఎస్ జగన్ ఎటువంటి పోరాటాలు లేకుండానే కొత్తగా సీమకు నాలుగు కొత్త జిల్లాలను తీసుకువచ్చారు. ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రీసెర్చ్ సెంటర్, శుద్ది చేసిన జలాలను తీసుకువచ్చారు. కొత్తగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ అయినా తీసుకువచ్చారా? చంద్రబాబు హయాంలోనే సీమలో ఫ్యాక్షన్ సంస్కృతి పెరిగింది. వైయస్ఆర్ హయాంలో ఫ్యాక్షన్ తో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేసుకుని సీట్లు ఇచ్చారు. విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. నేడు వివిధ ప్రాంతాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం ఫీజురీయింబర్స్మెంట్. వైయస్ఆర్ పేరు చెబితే 108, 104 ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఇలా అనేక పథకాలు గుర్తుకు వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం ప్రజలకు ఏం చేయకుండానే, తనకున్న ఎల్లో మీడియా బలంతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడం తెలియని వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు చేసిన మంచిని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఎక్కడకు వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారుపులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కరలేదని చంద్రబాబు మోకాలడ్డారు. పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచన చేయాలి. చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్ట్ల నిర్మాణం దండుగ అని రాసుకున్నారు. అటువంటి చంద్రబాబు పోలవరంను నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే, కమీషన్ల కోసం తానే చేపడతానంటూ, పోలవరంను నాశనం చేశారు. పోలవరంతో పాటు అనేక ప్రాజెక్ట్లను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయకక్షలను పెంచిపోషించారు. పల్నాడులో పట్టపగలు హత్యలు, తెనాలిలో దళత, మైనార్టీ యువకులపై పోలీసుల దాష్టీకం ఇవ్వనీ ప్రజాస్వామిక స్పూర్తితోనే చేస్తున్నారా? కేవలం తెలుగుదేశం వారికే పథకాలు అందించాలి, పని చేయాలంటూ ఒక సీఎంగా ఉండి ఎలా పిలుపునిచ్చారు? దీనినే పరిపాలన అంటారా? గతంలో రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు పథకాల సొమ్మును చేరువ చేశాం. దానిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు తన పాలనలోవైఎస్సార్సీపీ వారికి ఎటువంటి పథకాలు అందకూడదని మాట్లాడటంను ఎలా చూడాలి. నరేంద్రమోదీ గురించి గత అయిదేళ్ళ కిందట ఎంత దారుణంగా మాట్లాడాడో చంద్రబాబు మరిచిపోయారు. ఈరోజు మహానాడులో ఎన్డీఆర్ పేరును జపిస్తున్న చంద్రబాబు అధికారం కోసం ఆయన జీవించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రజలు మరిచిపోలేదు. బ్రాహ్మిణీ స్టీల్ను నిర్మించాలని వైయస్ఆర్ అనుకుంటే, చంద్రబాబు దానిని దారుణంగా అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు.గొప్పలు చెప్పుకోవడంలో ఘనుడు చంద్రబాబుహైదరాబాద్ను తానే నిర్మించానంటూ చంద్రబాబు నిస్సిగ్గుగా గొప్పలు చెప్పుకుంటారు. ఏడాది పాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హత్యారాజకీయాలు పెరిగిపోయాయి. మహానాడు మొదలయ్యే రోజున వైఎస్సార్జిల్లా పేరును మార్పిస్తూ జీఓ తెప్పించుకున్నారు. మీలాగా మేం ఏనాడు ఆలోచించలేదు. ఎన్డీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేశాం. హెల్త్ యూనివర్సిటీకి స్వతాహాగా ఒక డాక్టర్, సీఎంగా వైద్య, ఆరోగ్యరంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్సార్ పేరు పెడితే సహించలేకపోయారు. ఈ రోజు కడపలో వైఎస్సార్ విగ్రహాలను అవమానించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్ల ముసుగులో కమీషన్లు దండుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తే, దానిని కూడా తొలగించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మహానాడు పేరుతో కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకోవడం, ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు. వైఎస్ జగన్ ఒక్క సమావేశం పెడితే, మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు’ అని గడికోట స్పష్టం చేశారు.

IPL 2025, Qualifier 1: ప్లే ఆఫ్స్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న పంజాబ్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలిన పంజాబ్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. 2008 సీజన్లో ఢిల్లీ 16.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ చేసిన 101 పరుగుల స్కోర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో నాలుగో అత్యల్ప స్కోర్గానూ రికార్డైంది.ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో అత్యల్ప స్కోర్లు..82 - డెక్కన్ ఛార్జర్స్ vs RCB, DY పాటిల్, 2010 (3వ స్థానం ప్లేఆఫ్)87 - DC vs RR, ముంబై, 2008 SF101 - LSG vs MI, చెన్నై, 2023 ఎలిమినేటర్101 - PBKS vs RCB, ముల్లన్పూర్, క్వాలిఫైయర్ 1*104 - డెక్కన్ ఛార్జర్స్ vs CSK, DY పాటిల్, 2010 SFకాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. హాజిల్వుడ్, సుయాశ్ శర్మ తలో 3, యశ్ దయాల్ 2, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (18), మార్కస్ స్టోయినిస్ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రియాంశ్ ఆర్య 7, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులకే ఔటయ్యారు. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 30 పరుగుల వద్ద కోహ్లి (12) వికెట్ కోల్పోయింది. 4 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 30/1గా ఉంది. సాల్ట్ (14), మయాంక్ అగర్వాల్ (0) క్రీజ్లో ఉన్నారు.

‘ఆ కోవిడ్ పేషెంట్ను చంపేయ్’.. డాక్టర్ల సంభాషణ వైరల్
ముంబై: నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టిన కోవిడ్-19 ప్రపంచాన్ని కకావికలం చేసింది. అయితే, ఆ సమయంలో కోవిడ్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ మహిళా పేషెంట్ను చంపేయండి అంటూ ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ తాలూకు ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 2021లో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దయామి అజిమోద్దీన్ గౌసోద్దీన్ భార్య కౌసర్ ఫాతిమాకు కోవిడ్-19 సోకింది. దీంతో చికిత్స చేయించుకునేందుకు లాతూర్లోని ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో కోవిడ్ -19 కేర్ సెంటర్లో విధులు నిర్వహించిన డాక్టర్ శశికాంత్ డాంగే, అదనపు జిల్లా సర్జన్ డాక్టర్ శశికాంత్ దేశ్పాండే మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిందిజస్ట్ కిల్ డయామీ ఉమెన్ ఆ ఆడియో క్లిప్లో దేశ్ పాండే.. శశికాంత్ డాంగేతో ఇలా చెప్పారు. కోవిడ్ వార్డ్లోకి ఇంకా ఎవర్నీ అనుమతించొద్దు. జస్ట్ కిల్ డయామీ ఉమెన్ అని దేశ్ పాండే ఆదేశించగా.. అందుకు శశికాంత్ డాంగే.. ఆమెకు అందిస్తున్న ఆక్సిజన్ను మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నట్లు చెప్పాడు. ఇక,బాధితురాలి భర్త ఫిర్యాదుతో ఉదయ్గిర్ సిటీ పోలీసులు డాక్టర్ దేశ్ పాండేపై మే 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతని మొబైల్ను సీజ్ చేశారు. నోటీసులు జారీ చేసి అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ ఘటనపై తాము ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆ ఆడియో క్లిప్ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై దిలీప్ గాడే తెలిపారు. డాక్టర్ డాంగే ప్రస్తుతానికి అందుబాటులో లేడని, వచ్చిన వెంటనే అతనిని విచారిస్తామన్నారు.కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే..కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తే.. ఎఫ్ఐఆర్ ఆధారంగా.. 2021లో తన భార్య కౌసార్ ఫాతిమాకు కోవిడ్-19 సోకింది. అదే ఏడాది ఏప్రిల్ 15న ఉద్గీర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.భోజనం చేస్తున్న డాక్టర్ పక్కనే బాధితురాలి భర్త ఆ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న నాందేడ్ రోడ్డులో ఉన్న ఓ కంటి ఆస్పత్రిలో కోవిడ్ వార్డ్లో చికిత్స అందిస్తున్నారు. ఆ కోవిడ్ వార్డ్లో పేషెంట్లకు డాక్టర్ శశికాంత్ డాంగే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పది రోజుల పాటు ఫాతిమా ఆ వార్డ్లో చికిత్స తీసుకున్నారు. ఏడవ రోజు వార్డులో భోజనం చేస్తున్న డాక్టర్ డాంగే పక్కనే ఫాతిమా భర్త కూర్చున్నాడు.అలా చంపడం మీకు అలవాటే కదాఆ సమయంలో డాక్టర్ డాంగేకు.. డాక్టర్ దేశ్పాండే ఫోన్ చేశారు. ఫోన్ స్పీకర్ ఆన్లోనే ఉంది. ఫోన్ మాట్లాడే సమయంలో కోవిడ్ వార్డ్లో బెడ్లు,ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయా? లేవా? అని అడిగారు. అందుకు డాక్టర్ డాంగే ఖాళీ బెడ్లు లేవని చెప్పాడు. వెంటనే డాక్టర్ దేశ్పాండే దయామి రోగిని చంపేయండి. అలా చంపడం మీకు అలవాటే కదా’ అని చెప్పిన విషయాన్ని పక్కడనే ఉన్న ఫాతిమా భర్త విన్నాడు. కానీ ఏమీ అనలేకపోయాడు. భార్యకు ట్రీట్మెంట్ అందుతున్న సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదనుకున్నాడు. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫాతిమా కోవిడ్ నుంచి కోలుకున్నారు.అనూహ్యంగా ఆ సమయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ మే 2, 2025న సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. నాడు తనని కలత పెట్టేలా డాక్టర్లు మాట్లాడారని ఫాతిమా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో 18 పరుగులకే ఔటైన ప్రభ్సిమ్రన్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసిన ఆరో అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.ఐపీఎల్ తొలి సీజన్లో పంజాబ్కే చెందిన షాన్ మార్ష్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కాగా.. 2018లో సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), 2020 సీజన్లో ఇషాన్ కిషన్ (ఎంఐ), 2023 సీజన్లో యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్), 2024 సీజన్లో రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్) ఈ ఘనత సాధించిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రికార్డుల్లో ఉన్నారు. ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన ప్రభ్సిమ్రన్ 517 పరుగులు చేశాడు. ఈ సీజన్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 500 పరుగుల మార్కును దాటాడు (15 మ్యాచ్ల్లో 516 పరుగులు).ఇదిలా ఉంటే, ఆర్సీబీతో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ దాదాపుగా చేతులెత్తేసింది. ఈ జట్టు 13 ఓవర్లలో కేవలం 92 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. సుయాశ్ శర్మ 3, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్ తలో 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 7, ప్రభ్సిమ్రన్ సింగ్ 18, జోస్ ఇంగ్లిస్ 4, శ్రేయస్ అయ్యర్ 2, నేహల్ వధేరా 8, మార్కస్ స్టోయినిస్ 26, శశాంక్ సింగ్ 3, ముషీర్ ఖాన్ 0 పరుగులకు ఔట్ కాగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా మరో అవకాశం (క్వాలిఫయర్-2) ఉంటుంది.

‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వమని, హింసాత్మక ప్రభుత్వమని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ప్రజలు.. మమతా బెనర్జీ ప్రభుత్వం అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ప్రజల భావనగా ఉందని మోదీ తెలిపారు.దీనికి సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో జవాబిచ్చారు. తాను ప్రధాని మోదీ తరహాలో వ్యాఖ్యానించలేనంటూనే వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో అనేది తేలుతుందని మోదీకి సవాల్ విసిరారు. మోదీ వ్యాఖ్యలపై కౌంటర్ రిప్లై ఇచ్చిన మమతా.. ‘ ఎన్నికలు రానివ్వండి. చూద్దాం.. ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది. ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారో చూద్దాం. మా వెంట, మా పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లో చూస్కుందాం’ అని మోదీకి మమతా సవాల్ విసిరారు.ఈరోజు(గురువారం) ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని అలీపుర్దౌర్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టారు. పశ్చిమ బెంగాల్ ఎక్కడ చూసినా అవినీతి, అల్లర్లు, హింస ఇవే కనిపిస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్
డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు మన డేటా దొంగలిస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫేస్ స్కాన్ వంటి సున్నితమైన సమాచారంతో అనుసంధానించబడి ఉండటంతో.. చిన్న లోపం కూడా పెద్ద దుర్వినియోగానికి దారితీస్తుంది. ఆధార్ కార్డు భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆధార్ బయోమెట్రిక్ను ఆన్లైన్లో లాక్ చేయడం ఎలా?మీ ఆధార్ బయోమెట్రిక్స్ను లాక్ చేయాలనుకుంటే.. మీకు ముందుగా వర్చువల్ ఐడీ (VID) అవసరం. మీరు UIDAI అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో 'వర్చువల్ ఐడి జనరేటర్' ట్యాబ్పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకున్న తరువాత.. ఆధార్ బయోమెట్రిక్స్ను ఆన్లైన్లో లాక్ చేయడం కోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..➤యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్కి వెళ్లండి.➤ఆధార్ సర్వీస్ విభాగంలో కనిపించే 'లాక్/అన్లాక్ ఆధార్' ఆప్షన్ క్లిక్ చేయండి.➤అక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.➤సూచనల తరువాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వర్చువల్ ఐడీ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఆధార్ బయోమెట్రిక్ విజవంతంగా లాక్ అవుతుంది. అన్లాక్ చేయడానికి కూడా ఇదే దశలను 'అన్లాక్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిచేయాలి.బయోమెట్రిక్ లాకింగ్ ఉద్దేశ్యం ఆధార్ లాక్ని యాక్టివేట్ చేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు. గుర్తింపు ధృవీకరణ, ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డ్ జారీ కోసం అయినా, మీ ఆమోదం తప్పనిసరి అవుతుంది.ఆధార్ను పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటరు ఐడీలు (కొన్ని రాష్ట్రాల్లో), రేషన్ కార్డులు, మొబైల్ నెంబర్ల వంటి కీలక డాక్యుమెంట్లకు లింక్ చేస్తున్నారు. ఈ అనుసంధానం.. గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి, మోసాన్ని తగ్గించడానికి, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు లేదా సబ్సిడీలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి అలాంటి ఆధార్ డేటాను కొందరు సైబర్ నేరగాళ్లు.. మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆధార్ లాక్ చాలా అవసరం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..ఆధార్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు & ఐరిస్ స్కాన్ వంటి వాటిని ద్రువీకరించలేరు. మీరు అన్లాక్ చేయనంత వరకు మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయి.

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్కు వైఎస్ జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి, దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్ జగన్ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025

సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్తో తెరకెక్కించనున్న మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ను అధికారికంగా అనౌన్స్ చేశారు. యానిమల్తో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి.. బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీనే ప్రభాస్కు జోడీగా తీసుకొస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ యానిమల్ చిత్రంలో తన గ్లామర్తో అభిమానులను కట్టిపడేసింది. ఇక ప్రభాస్ సరసన స్పిరిట్లోనూ తన అందాలతో టాలీవుడ్ ప్రియులను అలరించనుంది.అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెగా హీరో రామ్ చరణ్ దంపతులు పంపిన సర్ప్రైజ్ గిఫ్ట్ను ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు ఆహార ఉత్పత్తులు విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సందీప్ రెడ్డికి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడిని జాడీలో పంపించినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా వైరల్ కావడంతో వావ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)
‘లవ్ జిహాద్’పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
2025 జుపీటర్: రూ.88942 మాత్రమే!
సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన వైఎస్ జగన్
ప్రేమ జంట ఆత్మహత్య
తెలంగాణ కిడ్నీ రాకెట్ వ్యవహారం.. సీఐడీ దూకుడు
ఔను ఆ రోజు జరిగింది ఇదే.. నిజం ఒప్పుకున్న పాక్
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నివాళి (చిత్రాలు)
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
సాక్షి కార్టూన్ 27-05-2025
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
‘లవ్ జిహాద్’పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
2025 జుపీటర్: రూ.88942 మాత్రమే!
సందీప్ రెడ్డి వంగాకు రామ్ చరణ్ దంపతుల సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
IPL 2025, Qualifier 1: అరుదైన రికార్డు సాధించిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్
బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన వైఎస్ జగన్
ప్రేమ జంట ఆత్మహత్య
తెలంగాణ కిడ్నీ రాకెట్ వ్యవహారం.. సీఐడీ దూకుడు
ఔను ఆ రోజు జరిగింది ఇదే.. నిజం ఒప్పుకున్న పాక్
రిషబ్ పంత్కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
జైలర్-2లో విలన్గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్బుక్ కర్కశత్వం
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్నగర్లో మంజూరు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
సాక్షి కార్టూన్ 27-05-2025
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
కన్నప్ప చిత్రం హార్డ్డ్రైవ్తో యువతి పరార్
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
మళ్లీ దొరికిపోయిన రష్మిక.. తానే హింట్ ఇచ్చిందిగా!
ఏయ్ నీవు ఏమి చేస్తున్నావు.. కోపంతో ఊగిపోయిన కోహ్లి! వీడియో వైరల్
సినిమా

దీపిక తొలగింపు.. పరేష్ రావల్ కంపు... ఈ బాలీవుడ్కేమైంది?
బాలీవుడ్ అంటే దేశంలోని అన్ని వుడ్లకూ గాడ్ లాంటిది అనలేకపోయినా కనీసం పెద్దన్న లాంటిది అనొచ్చేమో... దేశవ్యాప్తంగా నటీనటులందరిపైనా, అన్ని భాషా చిత్ర పరిశ్రమలపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాలీవుడ్ ప్రభావం ఉంటుంది. అలాంటి బాలీవుడ్కి అకస్మాత్తుగా ఏమైంది? గత కొంత కాలంగా హిందీ చిత్ర పరిశ్రమ విజయాలు తక్కువ వివాదాలెక్కువ అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు నటీనటుల వివాహేతర సంబంధాలు, తెరవెనుక అలవాట్లు...వంటివి మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశమయ్యేవి. అవన్నీ వ్యక్తిగతం అంటూ బాలీవుడ్ పెద్దలు సమర్ధించుకునేవారు. కానీ ఇప్పుడు వస్తున్న వివాదాలు వ్యక్తిగతమైనవి కావు...వ్యవస్థాగతమైనవే. అవి కూడా చిన్నా చితకా స్టార్స్కు సంబంధించినవి కావు.. బాలీవుడ్ని ఓ రకంగా ఏలుతున్న నటీనటులకు సంబంధించినవి కావడం గమనార్హం. బాలీవుడ్లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కధానాయకుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. అలాంటి సినిమా నుంచి అనూహ్యంగా మరో ప్రముఖ నటుడు పరేష్ రావల్ (శంకర్ దాదా ఎంబిబిఎస్ ఫేం) తప్పుకోవడం బాలీవుడ్ పరిశ్రమను, ప్రేక్షకుల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. పరేష్ రావల్(Paresh Rawal) ఆకస్మిక నిర్ణయం తర్వాత, సహనటుడు అక్షయ్ కుమార్ తో పాటు ఆ సినిమా నిర్మాతలు పరేష్ రావల్పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దాంతో పరేష్ రావల్ తన సంతకం చేసి ముందస్తుగా స్వీకరించిన రూ.11 లక్షలను 15% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అతని మొత్తం పారితోషికం రూ.15 కోట్లు అని సమాచారం.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone ), ప్రభాస్తో కలిసి నటించాల్సిన ‘స్పిరిట్‘(Spirit) చిత్రం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ కి తలొగ్గినా కూడా దీపిక ఒకదాని తర్వాత ఒకటిగా రకరకాల డిమాండ్లు పెడుతుండడంతో విసుగు చెందిన స్పిరిట్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఆమెను తన ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే ఈ నిర్ణయం తర్వాత కూడా వీరిద్దరి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ దీపికాపై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా తనకు అనుకూలమైన వాతావరణం ఉన్నచోట మాత్రమే తాను పనిచేయాలనుకుంటున్నట్లు దీపిక వ్యాఖ్యానించారు. మొత్తం మీద బాలీవుడ్లో వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలూ...బాలీవుడ్ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే సినిమాల నుంచి నటీనటులు మధ్యలో తప్పుకోవడం ఇదే మొదటి సారి కాదని గతంలోనూ పలు మార్లు ఇలాంటివి జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు.గత 2013లో’రేస్ 2’ చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత, దీపికా పదుకునే అకస్మాత్తుగా ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో నిర్మాత రమేష్ తౌరానీ దీపిక అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే గత 2018లో సల్మాన్ ఖాన్ తో కలిసి ’భారత్’ చిత్రంలో నటించాల్సి ఉన్న ప్రియాంక చోప్రా షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్ను వదిలివేశారు. దీంతో సల్మాన్ ఖాన్, ఆమెపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత, కత్రినా కైఫ్ ఈ పాత్రను స్వీకరించారు. అలాగే ఇంకా ముందుకు వెళితే..2000లో కహో నా ప్యార్ హై సినిమా నుంచి కరీనాకపూర్ , 2003లో చల్తే చల్తే చిత్రం నుంచి సల్మాన్ఖాన్ గందరగోళం కారణంగా ఐశ్వర్యరాయ్ లు తప్పుకున్నారు. గత 2015లో ఊపిరి సినిమాలో నటించాల్సి ఉన్న శృతిహాసన్ మధ్యలో వదిలేయడంతో చిత్ర నిర్మాతలు ఆమెపై కోర్టుకెక్కారు. అయితే ఈ ఘటనలన్నీ కూడా సంవత్సరాల వ్యవధిలో జరుగగా... ఇప్పుడు వరుసగా బాలీవుడ్లో జరుగుతుండడమే చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు : అల్లు అర్జున్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులపై అల్లు అర్జున్ స్పందించారు. పుష్ప 2 చిత్రానికి ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేయడం గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు పుష్ప టీమ్ మొత్తానికి ఈ ఘనత దక్కుతుందని చెప్పారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. (చదవండి: గద్దర్ అవార్డులు : ఉత్తమ చిత్రాలివే.. ప్రత్యేకత ఏంటంటే?)అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డులపై స్పందించారు. సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు గెలుచుకున్న గణేష్తో పాటు విజేతలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. (చదవండి: :'గద్దర్ అవార్డ్స్' విజేతలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం)కాగా, 2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప 2), ఉత్తమ నటిగా నివేధా థామస్ ( 35 చిన్న కథ కాదు) అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 14న ఈ అవార్డులను అందిస్తారు.

20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
సినిమా రంగం ఎవరిని ఎప్పుడు నెత్తికి ఎక్కించుకుంటుందో ఎవరిని నేలకేసి కొడుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. అందుకు నిదర్శనంగా మన తెలుగు హీరోను చెప్పొచ్చు. వయసులో ఉన్నప్పుడు ఉరకలేసే ఉత్సాహంతో ఫైట్లూ, డ్యాన్సులూ వేసినా సమకాలికులైన హీరోలపై సాధించలేకపోయిన పైచేయిని..సక్సెస్నూ వృద్ధాప్యంలో సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు బాలకృష్ణ. ఇటవలి కాలంలో సీనియర్ నటుల్లో బాలకృష్ణ అందుకుంటున్న విజయాలు మరెవ్వరికీ సాధ్యం కావడం లేదనేది వాస్తవం. నిజానికి యుక్తవయసులో ఉండగా కూడా బాలయ్య ఇంత సందడి చేయలేదని చెప్పొచ్చు. వయసులో ఉండగా చేయలేకపోయిన యాడ్స్లో కూడా ఆయన ఇప్పుడు సత్తా చాటుతుండడం దీనికో నిదర్శనం. ఈ నేపధ్యంలో తాజాగా సినీరంగంలో హల్చల్ చేస్తున్న ఒక వార్త మరోసారి బాలకృష్ణ సరికొత్త స్టామినాను చాటి చెబుతోంది. అదేమిటంటే జైలర్ 2 సినిమాలో అతిధి పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నాడని, అందుకు గాను అత్యధిక పారితోషికం అందుకుంటున్నారని.. కేవలం 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా రూ.20కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇవ్వడానికి జైలర్2 నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఒకప్పుడు అంటే దాదాపుగా ఒక పదేళ్ల క్రితం డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించే సమయంలో బాలకృష్ణ మొత్తం సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా దాదాపుగా అంతే ఉంటుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా మొత్తం కనిపించే హీరోగా పదేళ్ల క్రితం తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు కేవలం 20 నిమిషాల పాత్ర కోసం తీసుకుంటూ బాలకృస్ణ కొత్త రికార్డ్ సాధించారని చెప్పొచ్చు. మొదటి నుంచీ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోగా బాలకృష్ణకు పేరుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పారితోషికం రూపంలో నిర్మాతల నెత్తిన భారం మోపే వాడు కాదని అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలకృష్ణ చేతిలో సినిమాలు లేని పరిస్థితి ఎప్పుడూ లేదని అంటుంటారు. అంతెందుకు ఆయన రెమ్యునరేషన్ అమాంతం పెరిగిన ఈ పదేళ్లలో చూసుకున్నా... బాలకృష్ణ కెరీర్లో విజయాలకన్నా అపజయాలే ఎక్కువ.గత 2014లో లెజెండ్ తర్వాత లయన్, డిక్టేటర్, గౌతమ్ పుత్ర శాతకర్ణి, పైసా వసూల్, జై సింహా, కధానాయకుడు పార్ట్ 1, కధానాయకుడు పార్ట్ 2, రూలర్... వరకూ వరుస ప్లాఫులే. ఆ తర్వాత ‘అఖండ’తో మాత్రమే విజయాలు ప్రారంభమయ్యాయి. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకూ మహరాజ్..లు హిట్స్గా నిలిచాయి.అంటే పదేళ్లలో 9 ఫ్లాపులు, 4 మాత్రమే విజయాలు. హిట్టయిన నాలుగింటిలోనూ బాలకృష్ణ డ్యాన్సులు ఫైట్లు చేసే కుర్ర హీరోలా కాకుండా డైలాగులు పేల్చడం, విలన్లను నరకడం వరకే పరిమితమైన వయసుకు తగ్గ పాత్రలు పోషించడం కూడా ఈ సినిమాల సక్సెస్కు కారణంగా చెప్పొచ్చు. ఏదేమైనా వచ్చే జూన్ 10వ తేదీతో 65ఏళ్లు నిండుతున్న బాలయ్య... రేపోమాపో యువహీరోగా తెరకెక్కనున్న తన కొడుకుతో పోటీపడే స్థాయిలో నిలవడం విశేషమే అని చెప్పాలి.

రెండేళ్ల క్రితమే బ్రేకప్.. మరో నటుడితో యంగ్ హీరోయిన్ డేటింగ్!
సినీ ఇండస్ట్రీలో బ్రేకప్, డేటింగ్ అనే పదాలు చాలా కామన్. ఇక బాలీవుడ్ సినీ పరిశ్రమలో అయితే ఇవీ కాస్తా ఎక్కువగానే వినిపిస్తుంటాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ డేటింగ్కు సంబంధించిన వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ తారా సుతారియా మరో నటుడితో డేటింగ్ ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. అడార్ జైన్తో బ్రేకప్ తర్వాత ఈ బ్యూటీ మరో బాయ్ఫ్రెండ్తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ నటుడు వీర్ పహరియాతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు కొన్ని నెలల క్రితం డేటింగ్ ప్రారంభించారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇటీవల కొద్ది కాలంగా ఈ జంట పలుసార్లు ఈవెంట్లకు హాజరైనట్లు తెలుస్తోంది. లక్మే ఫ్యాషన్ వీక్తో పాటు ఎ సమ్మర్ ఆఫ్ స్టైల్ అనే ఈవెంట్లో జంటగా కనిపించారు. (ఇది చదవండి: కాజోల్ హారర్ మూవీ.. వెన్నులో వణుకు పుట్టించేలా ట్రైలర్!)కాగా.. మరోవైపు వీర్ పహారియా గతంలో సారా అలీ ఖాన్తో డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరు జంటగా స్కైఫోర్స్ అనే మూవీలో నటించారు. అయితే తమపై డేటింగ్ వార్తలపై ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. తారా సుతారియా అంతకుముందు ఆడార్ జైన్తో రిలేషన్లో ఉంది. అయితే 2023లో వారు విడిపోయిన తర్వాత.. అడార్ జైన్ తన స్నేహితురాలు అలేఖా అద్వానీని వివాహం చేసుకున్నారు.గతంలో డేటింగ్పై వీర్ పహారియా మాట్లాడుతూ.. 'నా రిలేషన్స్ గురించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. నాకు కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ వార్తలు వింటున్నా. అప్పుడు నేను పబ్లిక్ ఫిగర్ కాదు. అందుకే ఎవరూ నన్ను అడగలేదు. సోషల్ మీడియాలో ఏది ఉన్నా అది ప్రజలకు నిజమనిపిస్తుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. కానీ నేను ఏం చేయగలను? అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను.' అని అన్నారు. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria)
న్యూస్ పాడ్కాస్ట్

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?
క్రీడలు

విండీస్తో వన్డే సిరీస్ నుంచి ఇంగ్లండ్ తాజా మాజీ కెప్టెన్ ఔట్.. భారత్తో సిరీస్కు కూడా..!
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు తాజా మాజీ కెప్టెన్ హీథర్ నైట్ త్వరలో వెస్టిండీస్తో జరుగనున్న వన్డే సిరీస్ నుంచి నిష్క్రమించింది. గాయం కారణంగా నైట్ ఈ సిరీస్తో పాటు జూన్, జులైల్లో షెడ్యూలైన భారత పర్యటనకు కూడా దూరమైంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నైట్ పై రెండు సిరీస్లతో పాటు హండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నైట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మూడు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే నైట్ ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్లో జరిగే వన్డే వరల్డ్కప్లో ఆడేది కూడా అనుమానంగా కనిపిస్తుంది. నైట్ గైర్హాజరీలో విండీస్తో సిరీస్లో నాట్ సీవర్ బ్రంట్ ఇంగ్లండ్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఈ సిరీస్లో నైట్ స్థానాన్ని అలైస్ క్యాప్సీ భర్తీ చేయనుంది. నైట్ మే 26న విండీస్తో జరిగిన మూడో టీ20 సందర్భంగా గాయపడింది. ఈ మ్యాచ్లో 66 పరుగుల వద్ద ఉన్న సమయంలో నైట్ అర్దంతరంగా మైదానాన్ని వీడింది.కాగా, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ల కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్ ఇదివరకే ముగియగా.. వన్డే సిరీస్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ను కూడా అదే తరహాలో ముగించాలని భావిస్తుంది. మే 30, జూన్ 4, 7 తేదీల్లో మూడు వన్డేలు వేర్వేరు వేదికల్లో జరుగనున్నాయి.విండీస్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్, మహిక గౌర్, సోఫీ డంక్లీ, ట్యామీ బేమౌంట్, అలైస్ క్యాప్సీ, ఆమీ జోన్స్, ఎమ్మా లాంబ్, ఎమ్ ఆర్లాట్, సారా గ్లెన్, కేట్ క్రాస్, లిన్సే స్మిత్, లారెన్ బెల్, చార్లెట్ డీన్

భారత ఆటగాడిని అవమానించిన పాక్ టెన్నిస్ ప్లేయర్.. వైరల్ వీడియో
పాకిస్తాన్ టెన్నిస్ ప్లేయర్ ఒకరు భారత ఆటగాడిని అవమానించాడు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక ఓవరాక్షన్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యాక షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వెళ్లిన భారత ఆటగాడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోతూ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కజకిస్థాన్ వేదికగా జరిగిన ఏసియా-ఓసియానియా జూనియర్ డేవిడ్ కప్ (అండర్-16) టెన్నిస్ టోర్నీమెంట్లో ఇది జరిగింది. India defeats Pakistan 2-0 in Junior Davis CupLook at the Pakistan player's attitude on handshake after loosing, Pathetic Stuff! 😡 pic.twitter.com/8twsAbDqPd— India Insights 🇮🇳 (@India_insights0) May 27, 2025ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. పాక్ ఆటగాడి ప్రవర్తనను భారత క్రీడాభిమానులు ఖండిస్తున్నారు. క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని మండిపడుతున్నారు. పాక్ ఆటగాళ్ల నుంచి ఇంతకంటే గొప్ప ప్రవర్తన ఆశించలేమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్-పాక్ మధ్య యుద్దం తర్వాత జరిగిన ఘటన కావడంతో భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.కాగా, జూనియర్ డేవిడ్ కప్ టెన్నిస్ టోర్నీలో 11వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో భారత్ పాక్ను 2-0 తేడాతో చిత్తుగా ఓడించింది. సింగిల్స్ మ్యాచ్ల్లో భారత ఆటగాళ్లు ప్రకాశ్ సర్రన్, తవిశ్ పహ్వా వరుస సెట్లలో పాక్ ఆటగాళ్లును ఓడించారు.

భారత్లో ఆస్ట్రేలియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. ఈ పర్యటనలో ఆసీస్ మహిళా టీమ్ భారత మహిళల క్రికెట్ జట్టుతో మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నై వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభమవుతాయి.ఆస్ట్రేలియా-ఏ, సౌతాఫ్రికా-ఏ జట్లు కూడా..!ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుండగానే ఆ దేశ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటించనుంది. సెప్టెంబర్ 16- అక్టోబర్ 5 మధ్య తేదీల్లో ఆసీస్-ఏ టీమ్ భారత ఏ జట్టుతో రెండు అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లకు లక్నో ఆతిథ్యమివ్వనుండగా.. వన్డేలు కాన్పూర్లో జరుగనున్నాయి.భారత్లో ఆస్ట్రేలియా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: సెప్టెంబర్ 16-19 (లక్నో)రెండో టెస్ట్: సెప్టెంబర్ 23-26 (లక్నో)తొలి వన్డే: సెప్టెంబర్ 30 (కాన్పూర్)రెండో వన్డే: అక్టోబర్ 3 (కాన్పూర్)మూడో వన్డే: అక్టోబర్ 5 (కాన్పూర్)ఆస్ట్రేలియా ఏ పురుషుల టీమ్ భారత్లో పర్యటిస్తుండగానే సౌతాఫ్రికా ఏ పురుషుల ఏ టీమ్ కూడా భారత్లో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియా ఏ టీమ్ లాగే ఈ జట్టు కూడా భారత్ ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడుతుంది. టెస్ట్ మ్యాచ్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లో జరుగనుండగా.. వన్డేలు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి.భారత్లో సౌతాఫ్రికా-ఏ మెన్స్ టీమ్ షెడ్యూల్..తొలి టెస్ట్: అక్టోబర్ 30-నవంబర్ 2 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)రెండో టెస్ట్: నవంబర్ 6-9 (బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్)తొలి వన్డే: నవంబర్ 13 (చిన్నస్వామి స్టేడియం)రెండో వన్డే: నవంబర్ 16 (చిన్నస్వామి స్టేడియం)మూడో వన్డే: నవంబర్ 19 (చిన్నస్వామి స్టేడియం)

Qualifier 1: స్టార్ బౌలర్ దూరం.. బలహీనంగా కనిపిస్తున్న పంజాబ్ బౌలింగ్ విభాగం
ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మే 29) జరుగబోయే క్వాలిఫయర్-1కు ముందు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్కు ఆ జట్టు స్టార్ పేసర్ మార్కో జన్సెన్ దూరమయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా అతను స్వదేశానికి వెళ్లిపోయాడు. జన్సెన్ స్థానాన్ని అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేసే అవకాశం ఉంది. కీలకమైన ఈ మ్యాచ్లో జన్సెన్ లేకపోవడం పంజాబ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చహల్ ఆడేది కూడా అనుమానమే..!నేటి మ్యాచ్లో పంజాబ్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఆడేది కూడా అనుమానమే అని తెలుస్తుంది. చహల్ కొద్ది రోజుల కిందట గాయపడ్డాడు (చేతి వేలికి). ఈ కారణంగా అతను గత రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. కీలక మ్యాచ్ కావడంతో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించే సాహసం చేయవచ్చు.జన్సెన్, చహల్ లాంటి నాణ్యమైన బౌలర్లు నేటి మ్యాచ్లో ఆడకపోతే పంజాబ్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. వీరిద్దరు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల బౌలర్లు. వీరి గైర్హాజరీలో పంజాబ్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తుంది. నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ ఉన్నా ఒక్కడు ఏ మేరకు ప్రభావం చూపగలడో చూడాలి. జేమీసన్, ఒమర్జాయ్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి అతిగా ఆశించలేని పరిస్థితి. స్పిన్ విభాగంలో హర్ప్రీత్ బ్రార్పై కొద్దొగొప్పో నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ చహల్ దూరమైతే అతని స్థానంలో విజయ్కుమార్ వైశాక్ ఆడవచ్చు. అయితే వైశాక్ చహల్ లేని లోటును భర్తీ చేయలేడు. వైశాక్ తుది జట్టులోకి వస్తే పంజాబ్ స్పిన్ విభాగాన్ని హర్ప్రీత్ బ్రార్ ఒక్కడే మోయాల్సి వస్తుంది. కాబట్టి గాయం తగ్గకపోయినా నేటి మ్యాచ్లో పంజాబ్ యాజమాన్యం చహల్ను బరిలోకి దించవచ్చు. భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లిని బలహీనంగా కనిపిస్తున్న ఈ పంజాబ్ బౌలింగ్ యూనిట్ ఏ మేరకు నిలువరించగలదో చూడాలి.బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే.. పంజాబ్ బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఈ జట్టులో దాదాపు అందరు బ్యాటర్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఇంగ్లిస్ గత మ్యాచ్లో తడాకా చాటాడు. శ్రేయస్ సీజన్ ఆరంభం నుంచి మంచి టచ్లో ఉన్నాడు. నేహల్ వధేరా, శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ చివర్లో అద్భుతాలు చేయడం చూశాం. పంజాబ్ బ్యాటింగ్ విభాగాన్ని స్టోయినిస్ ఫామ్ ఒక్కటే కలవరపెడుతుంది. ఇతను కూడా నేటి మ్యాచ్లో టచ్లోకి వస్తే ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి.నేటి మ్యాచ్లో పంజాబ్ తుది జట్టు (అంచనా)..ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (WK), శ్రేయస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, అర్ష్దీప్ సింగ్, వైషాక్ విజయ్కుమార్/యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రాన్ సింగ్
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.70 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 81,633.02 వద్ద, నిఫ్టీ 128.35 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 24,880.80 వద్ద నిలిచింది.మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంటీసీ), వీటో స్విచ్గేర్స్ అండ్ కేబుల్స్, ఎన్టీఎల్ గ్లోబల్, నేచురల్ క్యాప్సూల్స్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్, సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరస్, ఆల్పా లాబొరేటరీస్, లాసా సూపర్జెనరిక్స్, డీసీ ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

‘కంటెంట్ను లాగేస్తున్న గూగుల్’.. సీఈఓ ఏమన్నారంటే..
ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లో దూసుకుపోతున్న గూగుల్ ఉపయోగిస్తున్న ఏఐ ఫీచర్లకు సంబంధించి కొన్ని సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొన్ని కంటెంట్ పబ్లిషర్ సంస్థలు నేరుగా యూజర్లు తమ వెబ్సైట్లోకి రాకుండా గూగుల్ అనైతికంగా ట్రాఫిక్ను మళ్లిస్తుందని వాదిస్తున్నాయి. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.ఏఐ జనరేటెడ్ సమాధానాలను అందించే గూగుల్ ఏఐ ఫీచర్ల ద్వారా వెబ్సైట్ ట్రాఫిక్ తగ్గుతుందని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూస్ మీడియా అలయన్స్ గూగుల్ బలవంతంగా తమ కంటెంట్ను తీసుకుంటుందని అని ఇటీవల ఆరోపించింది. అనైతికంగా గూగుల్ తమ కంటెంట్ను దొంగలిస్తుందని వాదిస్తోంది.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంగూగుల్ పనితీరును సమర్థించిన సుందర్ పిచాయ్.. ‘మేము ఇప్పటికీ యూజర్లను వెబ్లో సెర్చ్ చేసేందుకు చాలా డబ్బు వెచ్చిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మరింత మెరుగ్గా వెబ్సైట్లకు ట్రాఫిక్ను అందించేందుకు రూపొందించారు. వినియోగదారులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు కృత్రిమ మేధ ద్వారా నేరుగా సమాధానాలు లభించినప్పటికీ, వారికి విస్తృతమైన వనరులుగా వెబ్సైట్లు నిలుస్తున్నాయి. అయితే వ్యక్తిగత ప్రచురణకర్తలు తమ వెబ్సైట్ ట్రాఫిక్లో తేడాలను చూసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ వృద్ధి ధోరణి క్రమంగా పెరుగుతోంది. వెబ్సైట్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏఐ ఓవర్వ్యూలను మెరుగుపరిచేందుకు గూగుల్ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.

టాటా గ్రూప్లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా
దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ 'ఎన్ చంద్రశేఖరన్' టాటా కెమికల్స్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పకున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్లో కంపెనీ వెల్లడించింది."నా ప్రస్తుత.. భవిష్యత్తు నిబద్ధతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, నేను బోర్డు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా ఉంది. అంతే కాకుండా నా పదవీకాలంలో నాకు మద్దతు.. సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ.. టాటా సన్స్ చైర్మన్ మే 28న కంపెనీ డైరెక్టర్ల బోర్డును ఉద్దేశించి ప్రసంగించారు.ఎన్ చంద్రశేఖరన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత.. 2025 మే 30 నుంచి 'ఎస్. పద్మనాభన్' కొత్త చైర్మన్ బాధ్యతలను తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుల ఆధారంగా, మే 28, 2025 నుంచి అమలులోకి వచ్చేలా 'మోదన్ సాహా'ను అదనపు డైరెక్టర్ (నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్)గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.ఎవరీ ఎన్ చంద్రశేఖరన్?తమిళనాడులోని నామక్కల్లోని మోహనూర్లోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్ చంద్రశేఖరన్.. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తరువాత కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) డిగ్రీని పూర్తిచేశారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిటాటా గ్రూప్తో ఆయన ప్రయాణం 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్గా చేరడంతో ప్రారంభమైంది. సెప్టెంబర్ 2007లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) స్థాయికి త్వరగా ఎదిగారు. అక్టోబర్ 2009లో, కేవలం 46 సంవత్సరాల వయసులో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు.

టెలిగ్రామ్లో గ్రోక్ఏఐ పాగా
కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్లు ఏఐను తమ ప్లాట్ఫామ్ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ ఎక్స్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ఏఐ గ్రోక్ చాట్బాట్ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.టెలిగ్రామ్కు ఉన్న యూజర్ బేస్ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్బాట్ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.🔥 This summer, Telegram users will gain access to the best AI technology on the market. @elonmusk and I have agreed to a 1-year partnership to bring xAI’s @grok to our billion+ users and integrate it across all Telegram apps 🤝💪 This also strengthens Telegram’s financial… pic.twitter.com/ZPK550AyRV— Pavel Durov (@durov) May 28, 2025ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంమార్కెట్లో ఇప్పటికే వాట్సప్, గూగుల్చాట్ వంటి మేసేజింగ్ యాప్ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్ఫామ్లో ఏఐ టూల్ వాడేందుకు ఎక్స్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి.
ఫ్యామిలీ

Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం : త్రిపురాంతకేశ్వరాలయం
శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం (Tripuranthakam). త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువు దీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు పుట్టినిల్లుగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంత కేశ్వరస్వామి వారి ఆలయం. శ్రీశైల ద్వారాలలో ప్రథమం, ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా విరాజిల్లుతోంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్ఠాన దేవత అయిన బాలాత్రిపురసుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది.కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతోపాటు ఘాట్రోడ్డు సదుపాయం ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో వందలకొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది.పురాణగాథ: విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలతచెంది కైలాసం వీడాడని, అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపం లో గల కొండపై తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థలపురాణ కథనం. దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది.త్రిపురాసుర సంహారం జరిగిన క్షేత్రంత్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడంవల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు, సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం. అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయని, త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అనిపార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడని అంటారు. ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వరస్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు. అణువణువు శివ నామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు.నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలుఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీ చక్రం శివ యోర్వపుః’’అంటే శివపార్వతుల శరీరమే శ్రీ చక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పుగ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారిగుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు పార్వతీమాత. ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి, చంద్రమౌళీశ్వరస్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. ఆలయంలో ఒకపక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది. దీనిని చీకటిగుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గంగుండానే వెళ్లేవారని ప్రతీతి. ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది. దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరుడితోపాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి.బాలా త్రిపుర సుందరీ ఆలయంత్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాలాత్రిపురసుందరి మాత ఆలయం ఉంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వరాలయం, ΄ాపనాశనం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది. ఉజ్జయిని, కోల్కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబవనం ఉందని భక్తులు చెబుతారు.త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికి (విల్లు) త్రిపురసుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండంలో, బాలత్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది.శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రంఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు, నూటికి పైగా జలాశయాలున్నాయని చెబుతారు. ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు శ్రావణ మాసంలోప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి.ఎక్కడ ఉంది: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును. – డి.వి.ఆర్

సాధుత్వానిదే పైచేయి
సత్వ రజ స్తమో గుణాలు సృష్టిలో ప్రధానంగా కనబడుతుంటాయి. సాధుత్వం సత్వగుణా నికీ, రాజసం రజోగుణానికీ, అజ్ఞానం తమో గుణానికీ ప్రతీకలు. అయితే సాధుత్వమే అన్నింటి కన్నా ఉత్తమం. అందుకు ఈ కథ ప్రతీక: ఉత్తర భారత దేశంలో ఒక సాధువు నదీతీరంలో ఆకులూ, అలములూ తింటూ తిరుగుతూ ఉంటాడు. విదేశీయుడైన ఒక రాజు ఆయన్ని చూసి జాలితో తన దేశం వస్తే కూడు, గూడు, గుడ్డతో పాటు సకల సౌకర్యాలూ సమకూర్చుతానని చెబు తాడు. దానికి సాధువు ఏమాత్రం ప్రలోభపడ కుండా ప్రశాంతంగా చిరునవ్వుతో ఆ ప్రతిపా దనను తిరస్కరించాడు. దీంతో రాజు అహం దెబ్బతిన్నది. అధికారం, ధనం, దర్పం ఉన్నవాడు కనుక క్రోధాంధుడయ్యాడు. తనకు తీరని అవమానం, తిరస్కారం కలిగినట్టు భావించి కోపంతో ‘ఇదిగో చంపేస్తా’నంటూ కత్తి పైకెత్తాడు. సాధువు ప్రసన్న వదనంతో ‘రాజా! అలాగే చంపుదువులే! కాని ఈ శరీరం నేను కాదే! దీనికి భిన్నంగా ఉన్న ఆత్మను చంపలేవు. అది ఆనంద స్వరూపం, నిత్యం, సత్యం. దాన్ని నేనెప్పుడూ అనుభవిస్తూ అదే నేనుగా అభేదంగా ఉంటున్నా. ఆత్మశక్తి నీవెరుగవు. దాన్ని నీవు జయించలేవు. ఈ శక్తి నీలోను, నీ కత్తిలోను, కనబడే ప్రతి వస్తువులోను అంతటా వ్యాపించి ఉంది. నీవు కూడా అదే అయి నప్పుడు, వేరే మరొకటి లేనప్పుడు, నీవు చంపగలిగింది ఏది?’ అని ప్రశ్నించాడు. రాజు పశ్చాత్తాపంతో క్షమించవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. సాధువు వెంటనే అనుగ్రహించాడు. చూచారా! జ్ఞానసంపన్నులయిన సాధువుల ముందు కామక్రోధాల రాజసం ఏమైపోయిందో!

నైవేద్య ఫలాలు: దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించడం మంచిదంటే..
భగవంతుడికి ప్రతిఒక్కరూ తమ శక్తిమేర నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే సత్వరం మన కోరికలు తీరుతాయో సవివరంగా తెలుసుకుందామా..!.కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) – భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.అరటి పండు – భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండుని గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.నేరేడు పండు – శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.ద్రాక్ష పండు – భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.మామిడి పండు – దేవుడికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి ఆ తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.అంజూర పండు – భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.సపోటా పండు – సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.యాపిల్ పండు – భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్య్రం తొలగి ధనవంతులు అవుతారు.కమలా పండు – భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచి΄ోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి.పనసపండు – పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనం, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. (చదవండి: Rohini Karte 2025: ఈ సమ్మర్లో రోహిణి కార్తె లేనట్టేనా..? ఆ టైంలోనే రోళ్లు పగిలేలా ఎండలు పెరగడానికి రీజన్)

అందాల తారలు.. అందమైన హృదయాలు..
అందాన్ని దాటి అద్భుతమైన హృదయాన్ని చూడగలిగితే స్ఫూర్తినిచ్చే మనసులెన్నో, మనుషులెందరో..! దీనికి నిదర్శనంగా నిలిచింది నగరంలో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ వేదిక. రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నిర్వహించిన హార్ట్ ఆఫ్ గోల్డ్ చారిటీ ఈవెంట్ దీనికి నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ బాలసదన్ అనాథ పిల్లలకు సహకారం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఈ అనాథ చిన్నారులకు మేమున్నామంటూ పలకరించారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ చిన్నారుల చిట్టి పొట్టి పలుకులను ఆస్వాదించారు. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)వారితో ఆడారు, పాడారు, గుండెకు హత్తుకుని ఆతీ్మయత పంచారు. తారలు దిగివచ్చిన వేళ అంటూ సాగిన ఈ కార్యక్రమంలో దృష్టి లోపం ఉన్న, హెచ్ఐవీతో జీవిస్తున్న పలువురు చిన్నారులు కష్టాలను మర్చిపోయి మధుర స్మృతులను పొందారు. సిస్టర్ సిస్టర్ ఈ తెలుగు పాటకు అలా స్టెప్ వేయొద్దు, నన్ను చూడు ఇలా వెయ్యు అంటూ పసితనాన్ని, స్వచ్ఛతను మిస్ తారలకు చూపించారు. కార్యక్రమంలో మాజీ మిస్ వరల్డ్ క్రిస్టీనాతో పాటు మిస్ ఇండియా నందిని గుప్తా, వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. (చదవండి: నందిని గెలిస్తే..నంబర్ వన్ మనమే..! అత్యధిక టైటిల్స్ గెలిచిన ఏకైక దేశంగా..)
ఫొటోలు


జోగి రమేష్ తనయుడి వివాహ రిసెప్షన్.. నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం (ఫొటోలు)


అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)


వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్ జగన్ (ఫొటోలు)


కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)


#GaddarAwards2024 : గద్దర్ అవార్డులు-2024 (ఫొటోలు)


Miss world 2025 : ఆల్ ది బెస్ట్ మిస్ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)


ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్కు మండింది (చిత్రాలు)


విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)


'సీతా పయనం' మూవీ టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)


అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్పై మస్క్ అసమ్మతి గళం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన పన్నులు, వ్యయాల బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు చేయకుండా నిలిపివేయడం, రక్షణ రంగంపై వ్యయాన్ని భారీగా పెంచాలని ట్రంప్ నిర్ణయించడం సరైంది కాదని కుండబద్ధలు కొట్టారు. మంగళవారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్మాట్లాడారు. ‘బిగ్, బ్యూటిఫుల్’అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్ప బిల్లుగా తాను భావించడం లేదన్నారు. అది చాలా పెద్దది లేదా అందమైనది అని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీగా ఆర్థిక సాయం సైతం అందజేశారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్్కకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన డో జ్ చీఫ్ పదవిని కట్టబెట్టారు. అలాంటి తన మిత్రు డు ట్రంప్పై ఎలాన్ మస్క్ అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. పన్నుల్లో కోతలకు, రక్షణ వ్యయం పెంపునకు తాను వ్యతిరేకం అని పరోక్షంగా ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు.

కాటుక రంగులోకి కడలి!
ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్ చేంజ్ బయోలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్ మెరైన్ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ డెవిస్ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్ మెరైన్ లే»ొరేటరీలో ప్రొఫెసర్ టిమ్ స్మిత్ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్

హమాస్ నేత సిన్వార్ హతం
డెయిర్ అల్ బాలాహ్ (గాజా స్ట్రిప్): గాజాలో హమాస్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బుధవారం పార్లమెంట్లో ఈ మేరకు ప్రకటించారు. హమాస్కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మొహమ్మద్. యాహ్యా గతేడాది ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు. 🚨 | JUST IN: Israeli PM Benjamin Netanyahu CONFIRMS the elimination of 3 top Hamas leaders -- Mohammed Deif, Yahya Sinwar, and Mohammed Sinwar.Terrorism isn't managed it’s erased.This is what real leadership looks like when evil shows its face. 🇮🇱🔥 pic.twitter.com/h1PsuLBarY— Hank™ (@HANKonX) May 28, 20252023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై హమాస్ మెరుపుదాడి ఘటన సూత్రధారుల్లో యాహ్యా ఒకరని ఇజ్రాయెల్ ఆరోపించడం తెల్సిందే. యాహ్యా అనంతరం ఆయన బాధ్యతలను మొహమ్మదే చూసుకుంటున్నారు. సిన్వార్ సొంతపట్టణమైన ఖాన్ యూనిస్పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేసింది. ‘‘వాటి ధాటికి స్థానిక యూరోపియన్ ఆస్పత్రి భూగర్భంలోని హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడు’’ అని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధ్రువీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది.

Rachel Gupta: అందాల రాణికి బిగ్ షాక్
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 రాచెల్ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె తన టైటిల్ను వదులుకుంటున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈలోపు నిర్వాహకులే ఆమెను టైటిల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.న్యూఢిల్లీ/బ్యాంకాక్: ఇండియన్ మోడల్ రాచెల్ గుప్తా(Rachel Gupta) ఇన్స్టాగ్రామ్లో సంచలన పోస్ట్ చేశారు. విషపూరితమైన వాతావరణంలో తాను ఇంతకాలం ఉన్నానని, ఇక మౌనంగా భరించడం తన వల్ల కాదని, రాజీనామా నిర్ణయం కష్టమే అయినా తప్పట్లేదని, ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచిన వాళ్లను నిరుత్సాహపరుస్తున్నందుకు క్షమించాలని ఓ పోస్ట్ చేశారు. ‘‘‘వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయి’’ అంటూ త్వరలో ఓ వీడియో ద్వారా పూర్తి వివరాలను వెల్లడిస్తానని అన్నారామె.అయితే ఈలోపు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) నిర్వాహకులు ఆమె పోస్టునకు పూర్తి విరుద్ధంగా స్పందించారు. గుప్తాను అధికారికంగా తొలగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆమె తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, సొంత వ్యవహారాలకు ప్రాధాన్యం ఇచ్చారని, గ్వాటెమాలా అధికారిక పర్యటనకు నిరాకరించార’’ని పేర్కొంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ను తొలగిస్తున్నామని, 30 రోజుల్లో కిరీటం తమ కార్యాలయంలో అప్పగించాలని ఆమెను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. ఫిలిప్పీన్స్కి చెందిన సీజే ఓపియాజాకు కిరీటం వెళ్లే అవకాశాలు ఉన్నాయిపంజాబ్ జలంధర్కు చెందిన 21 ఏళ్ల రాచెల్ గుప్తా కిందటి ఏడాది ఆగష్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ దక్కించుకుంది. ఆపై అక్టోబర్ 25వ తేదీ బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 70 దేశాలకు చెందిన అందెగత్తెలను వెనక్కినెట్టి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ను గెల్చుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సుందరిగా ఘనతకెక్కింది. ఇదీ చదవండి: తప్పతాగాడు.. టేబుల్ ఎక్కి నన్ను డ్యాన్స్ చేయమన్నాడు
జాతీయం

31న వేలల్లోఉద్యోగుల రిటైర్మెంట్.. కేరళలో ప్రతీయేటా ఎందుకిలా?
తిరువనంతపురం: ఈ ఏడాది మే 31న కేరళలో మరో ఆసక్తికర రికార్డు నమోదు కానుంది. ఏకంగా 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒకే రోజున (మే 31) పదవీ విరమణ(Retirement) చేయనున్నారు. గత ఏడాది(2024)లో ఇదే రోజున 10వేల 560మంది రిటైర్ అయ్యారు. 2023లోనూ మే 31న 11 వేల 800 మంది పదవీ విరమణ చేశారు. దీనివెనుక ప్రత్యేక కారణముంది.దేశంలోని పర్యాటక ప్రాంతాల పరంగా కేరళ ముందుంటుంది. ఆకట్టుకునే ప్రదేశాలు, అలరించే కళలు కేరళ సొంతం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వీటితో పాటు కేరళ అనగానే ఒక అంశం చర్చల్లోకి వస్తుంది. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ. కేరళలో ప్రతీయేటా మే 31న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేస్తుంటారు. ఇదే కోవలో ఈ ఏడాది(2025) మే 31న 10 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు.ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో వైద్యులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, డ్రైవర్లు, అటెండర్లు ఉన్నారు. వీరంతా రాష్ట్ర సచివాలయం(State Secretariat)తో సహా పలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేరళలోని ప్రభుత్వ ఉద్యోగులు 56 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. మే నెలలో పుట్టిన తేదీ కలిగినవారు, 56 సంవత్సరాల వయస్సు వచ్చిన వారంతా మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఏటా మే నెలలో ఇంత పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేయడం వెనుక ప్రత్యేక కారణముంది.గతంలో తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టిన తేదీని వారు పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి వెళ్లిన రోజున నమోదు చేసేవారు. సాధారణంగా పాఠశాలల్లో అడ్మిషన్లు జూన్లో ప్రారంభమవుతాయి. గతంలో పాఠశాలల్లో ప్రవేశాలకు ఎటువంటి అధికారిక జనన ధృవీకరణ పత్రాన్ని అడిగేవారు కాదు. దీంతో పలువురు విద్యార్థుల పుట్టిన తేదీ జూన్ నెలలోనే ఉండేది. ఈ కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నవారి పదవీ విరమణ మే నెలలోనే జరుగుతుంది. మరోవైపు గతంలో పుట్టిన తేదీని సరిచేయాల్సిన అవసరం ఉండేదికాదు. అయితే ఇప్పుడు నిబంధనలు మారాయి. ప్రతీ ఆస్పత్రిలో శిశువు జననాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని సంబంధిత అధికారిక కార్యాలయం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
కన్నడ భాష వివాదం నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనని, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోనంటూ స్పష్టం చేశారాయన. బుధవారం థగ్ లైఫ్ ఈవెంట్లో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో తనను విమర్శించిన నేతలకూ ఆయన చురకలంటించారు. ‘‘ఈ ఇష్యూపై గందరగోళం నెలకొంది. అందుకే స్పష్టత ఇవ్వదల్చుకున్నా. చాలామంది చరిత్రకారులు(రాజకీయ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేస్తూ..) నాకు భాష చరిత్ర గురించి పాఠాలు బోధిస్తున్నారు. కానీ, నాతో సహా రాజకీయ నాయకులెవరికీ భాష వ్యవహారంపై మాట్లాడే అర్హత లేదు. తమిళనాడు అరుదైన రాష్ట్రం. తమిళంతో పాటు మీనన్, రెడ్డి, అయ్యంగార్ ముఖ్యమంత్రులయ్యారు. చాలా కాలం కిందట కర్ణాటక నుంచి వచ్చి తమిళనాడుకు సీఎం అయిన వ్యక్తి నుంచి నాకు సమస్య ఎదురైంది. ఆ సమయంలో కర్ణాటక నాకు మద్దతు ఇచ్చింది. ఎక్కడికీ వెళ్లొద్దు.. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోండి అంటూ కన్నడ ప్రజలు ప్రేమ చూపించారు. కాబట్టి ఇప్పుడు కూడా థగ్ లైఫ్, కమల్ హాసన్ను ప్రజలే చూసుకుంటారు.#WATCH | Thiruvananthapuram, Kerala: On his recent remarks where he said, 'Kannada was born out of Tamil', MNM President and actor Kamal Haasan says, "... What I said was said out of love and a lot of historians have taught me language history. I didn't mean anything. Tamil Nadu… pic.twitter.com/YjW8qAUIB3— ANI (@ANI) May 28, 2025భాషా వ్యవహారం చాలా లోతైన అంశం. నాతో సహా ఏ రాజకీయ నాయకుడికి దాని గురించి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్లకు వదిలేయండి. శివన్న, ఆయన తండ్రి మీద ప్రేమతో ఒక కుటుంబ సభ్యుడిగా మాట్లాడిందే తప్ప అందులో మరే ఉద్దేశం లేదు. ప్రేమతోనే మాట్లాడినప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ పని చేయను’’ అని కమల్ అన్నారు. ఇటీవల చెన్నైలో తన చిత్రం థగ్ లైఫ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందని శివరాజ్ కుమార్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కన్నడ సంఘాల నాయకులు ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. ‘కన్నడ- కస్తూరి’ అనే విషయాన్ని ఆ నటుడు మర్చిపోయినట్లు ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. రెండున్నర వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భాషను కమల్ మర్చిపోయినట్లు ఉందని సీనియరు నటుడు జగ్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనను కర్ణాటకలో అడ్డుకుంటామని వివిధ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆయనపై నిషేధం విధిస్తామని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బి.వై.విజయేంద్ర, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తదితరులు కమల్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు.

Shashi Tharoor: లక్ష్మణ రేఖ దాటినా.. అనూహ్య మద్దతు
గత కొంత కాలంగా బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor).. ఎల్వోసీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. సొంత పార్టీ నేతలు ఆయన్ని తిట్టిపోస్తుంటే.. అనూహ్యంగా బీజేపీ నేతల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.పార్టీ వైఖరికి భిన్నంగా శశి థరూర్(Shashi Tharoor) మాట్లాడుతున్నారని, ఒకరకంగా ఆయన ‘లక్ష్మణరేఖ’ను దాటారని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ తాజాగా పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ వివాదంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశి థరూర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రియమైన శశి థరూర్.. మిమ్మల్ని బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా ప్రధాని మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేది. మీరు భారత్కు తిరిగి వచ్చేలోగానే మిమ్మల్ని విదేశాంగ మంత్రిగా ప్రకటించగలిగితే ఇంకా బాగుండేది. మోదీ ప్రధానమంత్రి కాక పూర్వం భారత్ ఆధీనరేఖను దాటిపోలేదని మీరన్నారు. తద్వారా కాంగ్రెస్ భవ్యచరిత్రను అప్రతిష్ఠపాలు చేశారు’’ అని ఉదిత్రాజ్ అన్నారు. ‘‘1965లో భారత్ పాకిస్థాన్లోని లాహోర్ సెక్టారులో పలుప్రాంతాల్లోకి చొచ్చుకుపోయింది. 1971లో భారత్ పాకిస్థాన్ను రెండుగా విడగొట్టింది. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా అనేక సర్జికల్ స్ట్రైక్లు(Surgical Strikes) నిర్వహించారు. అయితే ఆ విజయాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అప్పట్లో డప్పు వాయించుకోలేదు’’ అని ఉదిత్రాజ్ పోస్ట్ చేశారు.My dear @ShashiTharoor Alas ! I could prevail upon PM Modi to declare you as super spokesperson of BJP , even declaring as foreign minister before landing in India . How could you denigrate the golden history of Congress by saying that before PM Modi , India never crossed LOC… https://t.co/c88b8rX2bq— Dr. Udit Raj (@Dr_Uditraj) May 28, 2025కాంగ్రెస్ నేత పవన్ఖేరా స్పందిస్తూ.. యూపీఏ హ యాంలో పాకిస్థాన్ మీద పలుమార్లు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా చెప్పిన వీడియోను శశి థరూర్కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి మోదీ ప్రధాని అయిన తర్వాతనే ప్రారంభం కాలేదని, గతంలోనూ అనేకసార్లు జరిగాయని, అయితే, దేశభద్రతకు సంబంధించిన అటువంటి సున్నిత సమాచారాన్ని తాము ఎన్నడూ రాజకీయ ప్రచారానికి వాడుకోలేదని అన్నారాయన.థరూర్ ఏమన్నారంటే.. ఐదు దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ పనామాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ గతంలో ఉగ్రదాడులను భారత్ భరిస్తూ వచ్చిందని, కానీ, ఇటీవలి కాలంలో మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు. మోదీ హయాంలో జరిగిన ఉరీ(2016), పుల్వా మా, పహల్గాం ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ.. ఈ దాడుల అనంతరం పాకిస్థాన్లోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని ప్రసంగించారు. బీజేపీ మద్దతుగా.. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్పై భారత వైఖరిని వివిధ దేశాలకు స్పష్టం చేసేందుకు కేంద్రం పంపిన అఖిలపక్ష పార్టీల ప్రతినిధి బృందంలో శశి థరూర్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ఆయన్ని పక్కనపెట్టినప్పటికీ.. కేంద్రం ఆయనకు అందులో చోటు ఇవ్వడం గమనార్హం. అయితే.. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే థరూర్పై దాడి జరుగుతోందని, దేశం కన్నా గాంధీ కుటుంబమే కాంగ్రెస్కు ముఖ్యమని బీజేపీ విమర్శించింది. అసలు కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తోంది? దేశం కోసం మాట్లాడటం ఆ పార్టీలో నిషేధమా? అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి. వారికి దేశం పట్ల నిజంగా ఎంత శ్రద్ధ ఉంది?. భారత ఎంపీలు విదేశాలకు వెళ్లి భారత్కు, ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటోందా?. రాజకీయ వైరాగ్యానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది’’ అని కిరణ్ రిజిజు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. మరోవైపు.. What does the Congress party want & How much they really care for the country? Should the Indian MPs go to foreign nation and speak against India and its Prime Minister? There’s limit to political desperation! https://t.co/JiuYqpW2tN— Kiren Rijiju (@KirenRijiju) May 28, 2025బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా థరూర్కు మద్దతు పలికారు. "శశి థరూర్ గాంధీ కుటుంబానికి కాకుండా, దేశానికి ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టే ఆయనపై కాంగ్రెస్ దాడి చేస్తోంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాల గురించి, ఓటు బ్యాంకు రాజకీయాల కంటే జాతీయ విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన లక్ష్యంగా మారారు" అని పూనావాలా పేర్కొన్నారు. "పాకిస్థాన్కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోంది. నేడు కాంగ్రెస్, పాకిస్థాన్ డీజీలా మాట్లాడుతూ సొంత నేతపైనే విమర్శలు చేస్తోంది" అని పూనావాలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: చీకటి ఆ కుటుంబాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టేసింది!

‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ
ఎన్ఆర్ఐ

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్లోని ఆస్టిన్లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.

డాక్టర్ సతీష్కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తులకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు-2025 వరించింది. అమెరికాలో గ్లోబల్ హెల్త్కేర్ లీడర్స్ ఫౌండేషన్ వార్షిక లీడర్షిప్ గాలా 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన గ్లోబల్ హెల్త్కేర్ లీడర్స్ ఫౌండేషన్ ఆయనకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ 2025 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల డాక్టర్ సతీష్ కత్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ సతీష్ కత్తుల తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. 30 ఏళ్లుగా ఆయన అమెరికాలో వైద్య సేవలందిస్తున్నారు. డేటన్, ఒహియోలో నివసిస్తున్న డాక్టర్ సతీష్ కత్తుల ప్రఖ్యాత హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్. 2024- 2025 సంవత్సరానికి గాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- AAPI కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 2024లో AAPI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన భారత్లో మూడు ప్రధాన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సమావేశాలకు నాయకత్వం వహించారు. AAPI నిర్వహించిన అనేక అంతర్జాతీయ ఆరోగ్య శిఖరాగ్ర సమావేశాలలో ఆంకాలజీ ట్రాక్స్కు అధ్యక్షత వహించారు.డాక్టర్ సతీష్ కత్తుల ఇటీవల జీవనశైలి మార్పులు, టీకాల ద్వారా క్యాన్సర్ నివారణపై దృష్టి సారించిన “స్టాప్ 3 అండ్ స్టార్ట్ 3” అనే పరివర్తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో, AAPI విద్య, స్క్రీనింగ్ మరియు రోగనిరోధకతలో సమగ్ర ప్రయత్నాల ద్వారా గర్భాశయ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ -GAIMS తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
క్రైమ్

అప్పులు తీర్చేందుకు సూడో నక్సల్ అవతారమెత్తి..
హైదరాబాద్: పారిశ్రామిక వేత్త కూన రవీందర్ గౌడ్ను బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేసిన కేసులో జీడిమెట్ల పోలీసులు ఇద్దరు సూడో నక్సలైట్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాడు. బుధవారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో బాలానగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ డీఐ కనకయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. విజయవాడ, గన్నవరానికి చెందిన యర్రంశెట్టి రాజు అక్కడ చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. వ్యసనాలకు బానిసైన అతను అప్పులు చేసి జల్సా చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో షాపూర్నగర్లో తాను నివాసం ఉంటున్న ఇంటి యజమాని కూన రవీందర్గౌడ్ను బెదిరించి డబ్బు లాగాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా గన్నవరానికి చెందిన తన స్నేహితుడు కందురెల్లి రాజు(24)ను నగరానికి రప్పించుకున్నాడు. ఈనెల 21న రాత్రి పథకం ప్రకారం కందురెల్లి రాజును కూన రవీందర్గౌడ్ ఇంటికి పంపించాడు. స్నేహితుడు చెప్పినట్లుగానే అతను మెయిన్ గేట్లోనుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి కిందికి వచ్చాడు. అక్కడ ఉన్న తులసి మొక్కను పీకేశాడు. అనంతరం ఎర్రరంగు టవల్లో ఓ లేఖను ఉంచి కారుపై పెట్టి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం రవీందర్గౌడ్ కారుపై ఉన్న లేఖను చదివిన రవీందర్ గౌడ్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును సవాల్ తీసుకున్న పోలీసులు ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్ రంగంలోకి దిగారు. దాదాపు 500 సీసీ కెమరాలను పరిశీలించి రవాందర్గౌడ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యర్రంశెట్టి రాజును నిందితుడిగా గుర్తించారు.దీంతో యర్రంశెట్టి రాజు, అతని స్నేహితుడు కందురెల్లి రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి 13నాటు బాంబులు, 4 సెల్ఫోన్లు, ఒక బెదిరింపు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసును చేదించిన ఇన్స్పెక్టర్ మల్లే‹Ù, డీఐ కనకయ్య, ఎస్సై ప్రేమ్సాగర్, పీసీలు నరేష్, రవినాయక్, వెంకటే‹Ùలను ఏసీపీ అభినందించి రివార్డులు అందజేశారు. కాగా నాటు బాంబులు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

దత్తత పేరుతో శిశువుల విక్రయం
సూర్యాపేట టౌన్: ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేటకు చెందిన భార్యాభర్తలు నక్క యాదగిరి, ఉమారాణితోపాటు మరో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బుధవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ మీడియాకు వెల్లడించారు. ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి కొన్ని ముఠాల ద్వారా శిశువులను తీసుకొచ్చి ఒక్కో శిశువును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటివరకు టేకుమట్లలో ముగ్గురు మగశిశువులను, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు ఆడ శిశువులను, పెన్పహాడ్లో ఒక మగ శిశువు, ఉప్పలపహాడ్లో ఇద్దరు మగ శిశువులు, తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలో ఒక ఆడశిశువు, హైదరాబాద్లో ఒక మగ శిశువును విక్రయించినట్టు గుర్తించారు. పిల్లలందరినీ రక్షించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అరెస్టయినవారిలో నక్క యాదగిరి, ఉమారాణి, కోరె నాగేంద్రకుమార్, కొట్టె రామలక్ష్మి, పిల్ల పావని, గరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగర్కర్నూల్కు చెందిన ముడావత్ రాజు, హైదరాబాద్కు చెందిన ఎండి.షాహానా, ఇస్తా శోభారాణి, సబావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత, రాజస్తాన్కు చెందిన ఖాన్ షాహీనా ఉన్నారు. ఈ ముఠాపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగామ, ముంబైలో కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్పారు. శిశువుల విక్రయం ఇలా.. యాదగిరి, ఉమారాణి దంపతులు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి విజయవాడకు చెందిన కోరె నాగేంద్రకుమార్ మధ్యవర్తిత్వంతో దత్తత పేరుతో విక్రయిస్తున్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య పిల్లల కోసం నక్క యాదగిరిని సంప్రదించారు. వారికి 15 రోజుల మగ శిశువును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరిపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు శిశువును అప్పగించే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో మరో 11 మంది ముఠా ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. కొనుగోలుచేసిన వారినుంచి శిశువులను పోలీసులు తీసుకురావటంతో వారంతా సూర్యాపేట పట్టణ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పిల్లలను ఇవ్వకపోతే స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

అమ్మా లే అమ్మా.. ఎందుకిలా చేశావ్ అనుప్రియా..
తిరువళ్లూరు: ప్రిడ్జి నుంచి ఐస్క్రీమ్ కిందపడిందన్న కారణంతో అత్త మందలించింది. దీంతో, మనస్తాపానికి గురైన కోడలు.. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పుళల్ సమీపంలో జరిగింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా సెంగుడ్రం సమీపంలోని మెండియమ్మన్ నగర్ ప్రాంతానికి చెందిన అశ్విన్రాజ్ అదే ప్రాంతానికి చెందిన అనుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండున్నరేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం జరిగింది. వీరికి ఏడాది వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉన్న ప్రిడ్జిని అనుప్రియ తెరవగా, అందులో నుంచి ఐస్క్రీమ్ కిందపడింది. దీంతో అనుప్రియను ఆమె అత్త చిత్ర మందలించింది.అత్త మందలింపుతో మనస్తాపం చెందిన అనుప్రియ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న వివాహితను కిందకు దింపి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, మహిళను పరిశీలించిన వైద్యులు అప్పటికే అనుప్రియ మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రాణం తీసిన మైక్రో ఫైనాన్స్ అప్పులు!
పలమనేరు: కేవలం ఆధార్ కార్డుతో అప్పులిచ్చి అధిక వడ్డీలతో జనం రక్తాన్ని తాగుతున్న మైక్రోఫైనాన్స్ దాష్టీకానికి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బలయ్యాడు. వాటిని కట్టేందుకు మరిన్ని అప్పులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో తండ్రి సమాధి సాక్షిగా చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ మాదిగబండ గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. తలారి గంగప్ప కుమారుడు తలారి మోహన్ (43) ఉన్న 40 సెంట్ల స్థలంలో వ్యవసాయం, ఖాళీ సమయంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అవసరాల నిమిత్తం కొన్ని ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ కంపెనీలనుంచి రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీలతో వీటిని చెల్లించలేకపోవడం, పైగా వారినుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో మంగళవారం పొలానికెళ్లి తండ్రి సమాధి వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, డిగ్రీ, ఇంటర్ చదివే ఇద్దరు కొడుకులున్నారు.
వీడియోలు


మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్


వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు


తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు


మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి


రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!


వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..


వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు


మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు


శ్రేయాస్ ఎవరో నాకు తెలీదు.. గంభీర్ నోటి దురద


7 సార్లు పాకిస్తాన్ కు.. కాంగ్రెస్ మాజీ మంత్రి PA అరెస్ట్