Top Stories
ప్రధాన వార్తలు

మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్ జగన్
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతిభద్రతపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్తో దాడిచేయిస్తారా? , చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది‘రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు.. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. .@ncbn గారి పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి.… pic.twitter.com/9w3zBRhTub— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2025చంద్రబాబుగారి ఏడాదిపాలనలో రెడ్బుక్ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది?, అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?, ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు.ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?’ అని నిలదీశారు వైఎస్ జగన్. మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరుఅలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా? , శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది. ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు.చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబుగారూ మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది.’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.

‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలకు చెక్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి, ఈ సదస్సుకు ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్లో జరిగే జీ7 సమ్మిట్కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ 15-17 తేదీలలో ఆల్బెర్టాలోని కననాస్కిస్ రిసార్ట్లో నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్నాథ్కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్

రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని సృష్టిస్తోంది. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణి నిలిపివేత,కరువు నేపథ్యంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఇటీవలి ఆహార పంపిణీలో కనిపించిన దృశ్యాలే ఇందుకు నిదర్శనం. మరోవైపుఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్మార్కెట్ దందా జోరందుకుంది. ఏ వస్తువును కొందామన్నా ధర వింటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. అతి చవకగా దొరికే పార్లే-జి బిస్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అసలు ధర కంటే దాదాపు 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. గాజా నుండి ఇటీవల వైరల్ అయిన పోస్ట్ ప్రకారం ముంబైతె తయారయ్యే పార్లే జి బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడవుతున్నాయి. భారత మార్కెట్లో కేవలం 5 రూపాయలకు లభించే ఈ బిస్కెట్ల ధర చూసి సోషల్ మీడియా యూజర్లు దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. ఈ ధరలు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుండి ఎగుమతి అవుతున్న ఒక్క పార్లే-జికే పరిమితం కాదు, అన్ని వస్తువులు పరిస్థితి అలాగే ఉంది.After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025 "మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడం వల్ల 2 మిలియన్ల మంది ప్రజల అవసరాలను తీర్చలేని చాలా తక్కువ మొత్తంలో ప్రాథమిక అవసరాలు మాత్రమే అనుమతి ఉందనీ, . కాబట్టి కొంతమందిమాత్రమే ఆహారం లభించినపుడు, ఈ ఆహారాలు చాలా ఎక్కువ, భరించలేని ధరలకు అమ్ముడవుతున్నాయని స్థానిక డాక్టర్ అల్షావా చెప్పారని ఎన్డీటీవీ తన స్పెషల్ రిపోర్ట్లో తెలిపింది. సమస్య అసలు సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు" "ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయంగా ఉచితంగా గాజాలోకి వస్తాయి. కానీ అవికొంతమందికి లభ్యమవుతున్నాయి. మిగతావి బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బాలీవుడ్ నటి పెళ్లి, ఐవరీ కలర్ లెహంగాలో బ్రైడల్ లుక్!జూన్ 6 నాటికి ఉత్తర గాజాలో మార్కెట్ ధరలుకిలోల చక్కెర: రూ. 4,914వంట నూనె: రూ. 4,177కిలో బంగాళాదుంపలు: రూ. 1,965కిలో ఉల్లిపాయలు : రూ. 4,423కాఫీ కప్పు: రూ. 1,800 గత గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన తరువాత, గాజాకు ఆహార లభ్యత క్రమంగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మార్చి 2 -మే 19 మధ్య, పాలస్తీనాలో ఆధీన ప్రాంతం దాదాపు మొత్తం దిగ్బంధనను ఎదుర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడి తరువాత కేవలం పరిమిత సంఖ్యలో మానవతా ట్రక్కులను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 54,510 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: రూ. 5 కోట్ల ఎఫ్డీలు కొట్టేసింది..మునిగింది : ఐసీఐసీఐ అధికారి నిర్వాకం

ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
తాడేపల్లి : ముస్లిం సోదర, సోదరీమణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండగ బక్రిద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

కొడుకా.. లేవరా, 100 కోట్ల ఆస్తి పెట్టాను
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోస్టుమార్టం చేయొద్దుఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని తండ్రి రోదించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అని ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.కన్నీటి మధ్య అంత్యక్రియలుతుమకూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మనోజ్ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రియశవంతపుర: తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది.సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్ ఎక్స్లో పోస్టు చేసింది.చదవండి: పెళ్లి చేసి పంపాలనుకున్నాం.. పాడె కట్టి సాగనంపారు

కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగార్జున
టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) శుక్రవారం తెల్లవారుజామున వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నాగార్జున ఒక పోస్ట్ షేర్ చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జూన్ 8న రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.అఖిల్ వివాహ వేడుక ఫొటోలను అభిమానులతో నాగార్జున పంచుకున్నారు. తన ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు. 'మా ప్రియమైన కుమారుడు తనకు ఇష్టమైన జైనాబ్ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు. అమలతో పాటు నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రదేశం మా హృదయాలకు ఎంతో దగ్గరైంది. ఇక్కడ వారు కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ప్రేమ, కృతజ్ఞతతో అంటూ..' నాగార్జున పోస్ట్ చేశారు.అఖిల్ సతీమణి జైనబ్ రవ్జీ హైదరాబాద్కు చెందిన అమ్మాయినే.. అయితే, ముంబయిలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్లో అఖిల్-జైనబ్ కలుసుకున్నారని తెలుస్తోంది. అలా వీళ్లిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025

కలసి నడిస్తే... కట్టడి చేయొచ్చు!
మానవాళి ఎదుర్కొంటున్న పెను విపత్తు ఉగ్రవాదం. ఇది నాగరిక సమాజపు అత్యు న్నత విలువలకు మాయని మచ్చ. విప్లవం, బలిదానం, హింసను గొప్పగా చేసి చెప్పడం లాంటి తప్పుడు భావనలు ఉగ్రవాదం పెచ్చ రిల్లడానికి ప్రాతిపదికలవుతున్నాయి. ‘ఒక రికి స్వాతంత్య్ర యోధుడైనవాడు మరొకరికి ఉగ్రవాది’ అన్న వాదన అతి ప్రమాదకర మైన అపోహ. భయమూ, రక్తపాతాలపై నిజమైన స్వతంత్రాన్ని ఎన్నటికీ నిర్మించలేం.ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచుతున్నది భయమే. కానీ, ఆ భయాన్ని వ్యాపింపజేయడంలోనూ ఉగ్రవాదులు విఫలురయ్యారు. 26/11 దాడి, 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఇటీవలి పహల్ గామ్ దాడి... ఘటన ఏదయినా, భారత్ దృఢంగా నిలబడింది. ఉగ్రవాదుల దుష్ట పన్నాగంపాకిస్తాన్ నుంచి ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదా నికి దశాబ్దాలుగా మనం బాధితులం. పర్యాటకులను వారి మతమే మిటో అడిగి మరీ చంపేయడాన్ని బట్టి ఉగ్రవాదుల పన్నాగం స్పష్టమవుతోంది. దేశ ఐక్యతకు ముప్పు కలిగించాలన్న దురుద్దేశంతో, వివిధ విశ్వాసాలకు చెందిన పలు ఆధ్యాత్మిక ప్రదేశాలపై పాక్ దాడికి తెగబడటం కూడా ఇలాంటి చర్యే. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ఏ మతమూ ఆమోదించదు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా మతాన్ని దుర్వినియోగం చేస్తూ, తమ ఆటవిక చర్యలకు సమర్థింపుగా దాన్ని వాడుకుంటున్నారు. ఈ మత దుర్వినియోగం ప్రమాదవశాత్తు జరిగినదో, లేదా హఠాత్పరిణా మమో కాదు, ఇది ఉద్దేశపూర్వక పన్నాగం. దురాగతాలకు తప్పుడు సమర్థనలను చెప్పుకునే కుటిల వ్యూహం.ఉగ్రవాదాన్ని ఎంతమాత్రమూ సహించబోమన్న విధానాన్ని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాద చర్యలూ, చర్చలూ ఒకేసారి సాధ్యం కావు. భవిష్యత్తులో పాకిస్తాన్ తో జరిగే ఏ చర్చలయినా ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పైనే ప్రధానంగా దృష్టి పెడ తాయి. పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తే ఐక్యరాజ్యసమితి గుర్తించిన హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలి.పాక్ మూల్యం చెల్లించాలి!మనం చాలాకాలంగా దీర్ఘకాలిక దృక్పథంతో, సమర్థమైన వ్యూహాలను అన్వేషిస్తూనే ఉగ్రవాద చర్యలపై ప్రతిస్పందించాం. మన సాయుధ దళాలకు గతంలో రక్షణాత్మక చర్యలకు మాత్రమే అనుమతి ఉండేది. సర్జికల్ స్ట్రైక్స్ (2016), బాలాకోట్ దాడులు (2019), ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ (2025)లతో పాక్లోని ఉగ్ర వాదులు, ఉగ్రవాద సూత్రధారుల పట్ల తన వైఖరిలో భారత్ సమూల మార్పులు చేసింది. నైతిక, రాజకీయ అసమ్మతితోపాటు కేవలం రక్షణాత్మక వైఖరి ఇక సరిపోదని ఇప్పుడు తేటతెల్లమైంది. ఏ ఉగ్ర వాద చర్యనైనా ఇకపై యుద్ధ చర్యగానే పరిగణిస్తాం. భారత్పై ఏ ఉగ్రవాద దాడి జరిగినా... ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదానికీ ఉగ్రవాదులకూ తేడా లేదనే భావిస్తూ దీటుగా బదులిస్తాం. పాక్ తన గడ్డపై ఉగ్రవాదులను నిలువరించలేకపోతే, ఆ అసమర్థతకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఉగ్రవాదానికి ఆర్థిక చేయూతను నిరోధించడంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ‘నో మనీ ఫర్ టెర్రర్’ మూడో మంత్రివర్గ సదస్సులో ప్రధాని మోదీ, ‘‘ఒక్క దాడినీ తేలిగ్గా తీసుకోం, ఒక్క ప్రాణం పోయినా తీవ్రంగా పరిగణిస్తాం. కాబట్టి, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించే వరకు మేము విశ్రమించబోం’’ అని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మనం కట్టుబడి ఉన్నామని ఆప రేషన్ సిందూర్ ద్వారా భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ప్రపంచానికి చాటాయి. స్పష్టమైన, కచ్చితమైన, తీవ్రతరం కాని ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ–కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను మనం లక్ష్యంగా చేసుకున్నాం. ఉగ్రవాదులపై సైనిక చర్య ఆవశ్యకమనీ, కానీ అదొక్కటే సరి పోదనీ మనకు తెలుసు. పాక్ ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయో గిస్తుండటంతో... ఆ దేశాన్ని దౌత్యపరంగానూ, ఆర్థికంగానూ ఏకాకిని చేయడంలో భారత్ విజయం సాధించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతివ్వడాన్ని పూర్తిగా మానేసే వరకూ, ఆ దిశగా విశ్వసనీయతను పొందే వరకూ సింధూ జలాల ఒప్పందాన్ని మనం ‘నిలిపివేశాం’. ఈ నిర్ణయం పాక్పై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఆ దేశం తన 1.6 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమికి 80%, మొత్తం నీటి వినియోగంలో 93% సింధూనది వ్యవస్థపైనే ఆధారపడుతుంది. అలాగే 23.7 కోట్ల మంది దీనిపై ఆధారపడి ఉండగా, పాక్ జీడీపీలో నాలుగో వంతుకు ఇదే దోహదపడుతోంది.ఐదు కీలక చర్యలు!ఉగ్రవాదం కేవలం భారత్ సమస్యే కాదు, ఇది ప్రపంచ సమస్య. అంతర్జాతీయ ఉగ్రవాద సూచీ (జీటీఐ) ప్రకారం– ఉగ్ర వాద సంఘటనలను ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య కొన్నేళ్లుగా పెరిగింది. ఉగ్రవాద వ్యవస్థలను సమర్థంగా నిర్వీర్యం చేయడానికీ, రాబోయే తరాలకు భద్రమైన భవిష్యత్తును అందించడానికీ మనం సమష్టిగా ముందుకు సాగాలి. సూత్రప్రాయమైన, సమగ్రమైన, స్థిరమైన, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ వ్యూహాన్ని మనం అవలంబించాలి. ఈ దిశగా అయిదు కీలక చర్యలు తీసుకోవాలి.మొదటిది: ‘ఉగ్రవాదం’ పదాన్ని నిర్వచించడం. ఉగ్రవాదమంటే ఏమిటన్న దానిపై ఏకాభిప్రాయం లేదు. భారత్ ప్రతిపాదన ఆధారంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ‘అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్ర ఒడంబడిక’లో ఉగ్రవాద నిర్వచనం విషయంలో అతి సమీపంగా వచ్చాం. అర్థపరమైన అంశాలు ఉగ్రవాదంపై పోరా టాన్ని పరిమితం చేయకూడదు. ఉగ్రవాద చర్యల దర్యాప్తునకు లేదా విచారణకు లేదా విదేశాల నుంచి వారిని అప్పగించేందుకు విస్తృతంగా ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.రెండోది: ఉగ్రవాద సంస్థలవే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్స హిస్తున్న దేశాల ఆర్థిక వనరులను కూడా స్తంభింపజేయాలి. పాక్కు ఇచ్చే నిధులు సైనిక–ఉగ్రవాద చర్యలు రెండింటితో ప్రపంచాన్ని అస్థిరపరచడానికే దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, పాకిస్తాన్ను ఎఫ్ఏటీఎఫ్ తిరిగి గ్రే లిస్టులో చేర్చాల్సిన అవసరముంది. మూడోది: పాకిస్తాన్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని తెలిసిన విషయమే. ఉగ్రవాదు లకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం, సైనికాధి కారులు యూనిఫామ్లో హాజరు కావడం దీన్ని మరింతగా తేట తెల్లం చేస్తోంది. పాకిస్తాన్ లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర సంస్థల చేతికి చేరే ప్రమాదం ఎప్పటికైనా ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ తీవ్రమైన ప్రమాదాన్ని గుర్తించి, పాక్ అణ్వాయుధాలను అంతర్జా తీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో ఉంచాలి.నాలుగోది: తమ సౌలభ్యం లేదా ప్రయోజనాల ప్రాతిపదికన మాత్రమే ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు నిర్ణయించుకుంటే– అది సమష్టి బాధ్యతను బలహీనపరుస్తుంది. అటువంటి చర్యలకు అది వ్యూహాత్మకమైన సమర్థింపునూ అందిస్తుంది.అయిదోది: కృత్రిమ మేధ, అటానమస్ సిస్టమ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ వంటి అధునాతనసాంకేతికతలను కూడా స్వీకరిస్తున్న పాక్లోని ఉగ్రవాద స్థావరాలు ప్రపంచమంతటికీ ప్రమాదకరమే. ఈ ముప్పులను అధిగమించడం కోసం అంతర్జాతీయ సహకారం అత్యావశ్యం. 9/11 దాడుల అనంతరం, ‘‘ఉగ్రవాదానికి సంబంధించి ఏ సైద్ధాంతిక, రాజకీయ లేదా మతపరమైన సమర్థననైనా మనందృఢంగా ఖండించాలి’’ అని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా సరే, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్న సంకల్పానికి భారత్ స్థిరంగా కట్టుబడి ఉంది. శాంతికాముక దేశాలన్నీ మాతో కలిసి రావాలని కోరుతున్నాం. - వ్యాసకర్త భారత రక్షణ మంత్రి-రాజ్నాథ్ సింగ్

ఎట్టకేలకు జనగణన
దేశంలో జనగణన నిర్వహించబోతున్నట్టు ఆరేళ్ల సుదీర్ఘ జాప్యం అనంతరం బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 16న విడుదల చేస్తామని, 2027 మార్చి 1తో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అందులో తెలియజేశారు. అంటే ఆ ఏడాది ఫిబ్రవరి 28తో జనగణనను ముగిస్తారన్నమాట. మంచు కురిసే లద్దాఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వచ్చే ఏడాది అక్టోబర్ 1కల్లా జనగణన ప్రక్రియ ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ నెలాఖరుకు జనగణన పూర్తవుతుంది. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఆ తర్వాతగానీ మెథడాలజీ తదితర వివరాలపై స్పష్టత రాదు. ప్రక్రియ ముగించదల్చుకున్న తేదీని గమనిస్తే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి తుది గణాంకాలు వెల్లడికావొచ్చని తెలుస్తోంది. కనుక ప్రస్తుత లోక్సభ గడువు ముగిసేలోగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉండకపోవచ్చు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి జనగణనతోపాటు కులగణన కూడా వుండబోతోంది. రాజకీ యంగా, సామాజికంగా సంచలనం కలిగించగల కులగణన స్వరూప స్వభావాలేమిటో తెలియా లన్నా నోటిఫికేషన్ వచ్చేవరకూ ఆగాల్సిందే. జనగణన రెండు దశల్లో వుంటుంది. మంచుకురిసే ప్రాంతాలు మినహా దేశంలో మిగిలినచోట్ల వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో తొలి దశఉంటుంది. అందులో నివాస గృహాలు, వాటి యాజమాన్య వివరాలు, నివాసం వుండేవారి సంఖ్య, వారికి ఎలాంటి సౌకర్యాలున్నాయో, ఏయే వాహనాలున్నాయో లెక్కేస్తారు. రెండో దశలో ఇంటి యజమాని పేరు, ఆయన భార్యాపిల్లలు, విద్యార్హతలు, ఉద్యోగ వ్యాపార వివరాలు, ఆదాయ వనరులు, కులమతాలు వగైరాలు తెలుసుకుంటారు. ప్రభుత్వాలకు డేటా ప్రాణప్రదమైనది. ఏ విధానం రూపొందించాలన్నా, ఏ పథకం ప్రవేశ పెట్టాలన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటి లబ్ధిదారులెందరు, ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఎందరిపై పడుతుంది వగైరా అంశాలన్నీ అవసరమవుతాయి. దేశంలో పట్టణీకరణ విస్తృతి, స్త్రీ పురుష నిష్పత్తి, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, వలసలు, నివాసగృహాల తీరుతెన్నులు వగైరాలన్నీ జనగణనలోనే వెల్లడవుతాయి. మహిళలకు అవసరమైన పథకాలకూ, దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పనకూ, గృహనిర్మాణం, ఉపాధి హామీ పథకం వంటివి ఎక్కడెక్కడ అవసరమో తేల్చడానికి జనగణనే ఆధారం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ సంపూర్ణ ముఖచిత్రం ఈ జనగణన ద్వారా ఆవిష్కృతమవుతుంది. ఆఖరుగా 2011లో జనగణన జరిగింది గనుక 2021లో వాస్తవంగా తదుపరి జనగణన వుండాలి. అది మొదలుకాబోతోందని 2019 డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది కూడా. ఆ ప్రక్రియ తొలి దశ 2020లో మొదలయ్యేలోగానే కరోనా మహ మ్మారి విరుచుకుపడటంతో జనగణన కాస్తా మూలనబడింది. ఆ తర్వాతైనా దాన్ని ప్రారంభించా లన్న ఆసక్తి కేంద్రంలో ఎందుకనో కనబడలేదు. కారణాలేమిటో కూడా చెప్పలేదు. కరోనా ప్రభావం తగ్గాక ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి 143 దేశాలు యుద్ధప్రాతిపదికన జనగణన పూర్తిచేశాయి. మనతోసహా 44 దేశాలు మాత్రమే దానికి దూరంగా వున్నాయి. కేంద్ర హోంశాఖ ప్రతినిధి చెప్పినట్టు అప్పుడు జనగణన పూర్తయిన దేశాల్లో లభ్యమైన డేటా నాణ్యమైనది, సమగ్రమైనదీ కాదని తేలివుండొచ్చు. కానీ విధాన నిర్ణయాల రూప కల్పనలో అక్కడి ప్రభుత్వాలకు ఎంతో కొంత పనికొచ్చింది. అసలు లేనిదానికన్నా ఇది మేలే. మన వరకూ చూస్తే జనగణన ఆలస్యం వల్ల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు వంటి 15 అతి కీలకమైన సర్వేలు నిలిచిపోయాయి. ఫలితంగా పథకాల అమలు చీకట్లో తడుములాటగా మిగిలింది.దేశంలో చాలామంది, ముఖ్యంగా రాజకీయంగా చురుగ్గా ఉండదల్చుకున్నవారు ఎదురు చూసేది నియోజకవర్గాల పునర్విభజన గురించే. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో లోక్ సభ స్థానాల సంఖ్యను 543గా నిర్ధారించారు. ఆ తర్వాత పునర్విభజన జోలికెళ్తే సమస్య లెదురవు తాయన్న భయంతో రెండు రాజ్యాంగ సవరణల ద్వారా దాన్నే కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రా ల్లోనూ, తూర్పునున్న హిందీయేతర రాష్ట్రాల్లోనూ, దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుకావటంతో జనాభా రేటు నియంత్రణలో వుంది. కానీ హిందీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ విషయంలో చొరవచూపలేదు. దాంతో అక్కడ జనాభా పెరిగింది. జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన ప్రక్రియవుంటుంది కనుక తమ ప్రాంతాల్లో లోక్సభ స్థానాలు గణనీయంగా తగ్గుతాయని హిందీయేతర రాష్ట్రాలు వాదిస్తున్నాయి. 2011నాటి జనగణన తుది ఫలితాలు 2013లో వెల్లడయ్యాయి. ఇప్పుడు కూడా అదే సమయంపడితే 2029లోగానీ పూర్తి ఫలితాలు రావు. ఆ తర్వాతే పునర్విభజన ప్రక్రియ ఉంటుందని భావించాలి. జాప్యం మాటెలావున్నా జనగణన ప్రారంభం కాబోతోందన్న ప్రకటన హర్షించదగ్గది. సాధా రణ ప్రజానీకానికి జనగణనపై పెద్దగా ఆసక్తివుండదు. కానీ విధాన నిర్ణేతలూ, విశ్లేషకులూ దీన్ని ప్రాణప్రదంగా భావిస్తారు. ఎందుకంటే అన్ని రకాల సర్వేలకూ ఇదే ప్రాతిపదిక. నేతలూ, పార్టీలూ సరేసరి. ఎవరినుద్దేశించి ఎలాంటి పథకాలు రూపొందించాలో, ఏ సమస్యల్ని ప్రధానంగా ప్రస్తావించాలో నిర్ణయించుకోవటానికి జనగణన తోడ్పడుతుంది. ఈ ప్రక్రియకు అధునాతన సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం, పారదర్శకతకు చోటీయటం అవసరం. ఇక 1931 తర్వాత తొలిసారి కులగణన జరుగుతున్నందువల్ల వివాదాలు తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాలి.

‘ఆఖరి’ అంచెకు భారత్ ‘సై’
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ హాకీ ఆఖరి అంచె పోటీలకు భారత జట్లు సిద్ధమయ్యాయి. ఈ యూరో అంచె పోటీల్లో అంచనాలకు మించి రాణించాలని, గరిష్ట పాయింట్లతో నేరుగా ప్రపంచకప్ బెర్తు సాధించాలని పురుషుల, మహిళల జట్లు పట్టుదలతో ఉన్నాయి. ముందుగా భారత పురుషుల జట్టు నేడు ఆతిథ్య నెదర్లాండ్స్తో తలపడుతుంది. భువనేశ్వర్ అంచె పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత్ వచ్చే ప్రపంచకప్కు వేదికైన నెదర్లాండ్స్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. నేడు, 9వ తేదీన డచ్ టీమ్తో జరిగే రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం ద్వారా యూరో అంచెకు శుభారంభం పలకాలని హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్లతో ఇంగ్లండ్ (16), బెల్జియం (16)ల తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్మన్ బృందం ఈ ఆఖరి అంచె పోటీలతో మెరుగైన స్థానంలో నిలవాలని ఆశిస్తోంది. డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్, మిడ్ఫీల్డ్లో హార్దిక్ సింగ్లతో పాటు రక్షణ శ్రేణిలో అమిత్ రోహిదాస్, హర్మన్, జుగ్రాజ్, జర్మన్ప్రీత్లు స్థాయికి తగిన ఆటతీరును కనబరిస్తే గెలుపు ఏమంత కష్టం కాదు. భారత చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ తమ జట్టు అన్ని రంగాల్లోనూ మెరుగైందని, యువ ఆటగాళ్లు సైతం అనుభవం సంపాదించారని తప్పకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారని అన్నాడు. నెదర్లాండ్స్తో పోరు ముగిశాక భారత్ 11, 12 తేదీల్లో అర్జెంటీనాతో, 14, 15 తేదీల్లో ఆ్రస్టేలియాతో, 21, 22 తేదీల్లో బెల్జియంతో తలపడుతుంది. మరోవైపు మహిళల జట్టు యూరో అంచె పోటీలను లండన్లో ఆడనుంది. ఈ నెల 14 నుంచి భారత మహిళల జట్టు పోరు ప్రారంభం అవుతుంది. భారత జట్టు తొమ్మిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచింది.

పదేళ్లు పగ్గాలివ్వండి
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పాలించే అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన చెప్పారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతానని ఆనాడు తొడగొట్టి చెప్పి పట్టు పట్టినం.. పడగొట్టినం. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో రూ. 1,051.45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధానంగా రూ. 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం, రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ. 183 కోట్లతో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన తిర్మలాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.దేశంలో ఎవరూ చేయని విధంగా కులగణన ద్వారా బీసీల లెక్క తేల్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కులగణన చేసే అనివార్యతను కల్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి దశాబ్దాల కలను నెరవేర్చామని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు లాంటీ సీనియర్ నేత ఎస్సీ వర్గీకరణపై తనను అభినందించారని సీఎం చెప్పారు.గత ప్రభుత్వం గంధమల్ల, మూసీ కాలువల ఆధునీకరణ, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ఉమ్మడి నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ నిలదీశారు. గంధమల్లకు నీళ్లు ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారని.. నిధులిచి్చన తమకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? అని సీఎం బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. గోదావరి జలాలను అందించడానికి ఎస్సారెస్పీ, మిడ్ మానేరు కట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాదా అని ఆయన అడిగారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలను కోటీశ్వరులను చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల మేర బ్యాంకు లింకేజీ రుణాలతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణను ఆడబిడ్డల చేతిలో పెట్టామన్నారు. ప్రజాపాలనలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాసంక్షేమమే «ధ్యేయంగా పనిచేస్తున్నామని రేవంత్ వివరించారు. తిరుమల తరహాలో త్వరలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? ‘బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. గతేడాది నవంబర్ 8న పాదయాత్ర చేసి మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరతామని మాట ఇచ్చా. ఎవరు అడ్డుపడినా మూసీ నదిని పునరుజ్జీవం చేసి తీరుతాం. ప్రధాని మోదీ సబర్మతి, యమునా నదుల ప్రక్షాళన, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గంగానది ప్రక్షాళన చేసుకోవచ్చుగానీ మేం మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా?’అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వాసాలమర్రిని బాగుచేస్తా.. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్కు రోడ్డు వేసుకోవడానికి వాసాలమర్రి ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఆనాడు వాసాలమర్రికి వచ్చి ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు పండు ఇచ్చి ఆసుపత్రిపాలు చేసిండు. వాసాలమర్రిలో ఇళ్లు కూలగొట్టి శ్మశానంగా మార్చిండు. ఆయన ఆగం చేసినా వాసాలమర్రి గ్రామ పరిస్థితిని బాగు చేస్తా’అని సీఎం రేవంత్ చెప్పారు. ఇందుకోసం గ్రామ పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డికి సూచించారు. ఆలేరును అభివృద్ధి చేస్తా.. బలహీనవర్గాల బిడ్డ బీర్ల ఐలయ్యను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు ప్రజలకు అండగా ఉంటానని సీఎం రేవంత్ అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తామని అందరికీ మాట ఇస్తున్నా అని చెప్పారు. అడగకున్నా ఐలయ్యకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చానని సీఎం చెప్పారు. దెయ్యాల రాష్ట్ర సమితిగా పిలవండి బీఆర్ఎస్ను ఇకపై దెయ్యాల రాష్ట్ర సమితి (డీఆర్ఎస్)గా పిలవాలని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ ఇంటి బిడ్డనే బయటపెట్టినా ఆ దెయ్యాల నాయకుడు సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కొరివి దెయ్యాలను తెలంగాణ రాష్ట్రం పొలిమేరల వరకు తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఒక్క నోటీసు ఇస్తేనే ఆయన ఆగమాగం అయితుండు. కోర్టుకు వచ్చి జవాబు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తుండు’అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వ్యక్తులే కోర్టుకు హాజరయ్యారని రేవంత్ గుర్తుచేశారు. ఉద్యోగులకు అండగా ఉంటాం.. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం విడతలవారీగా వేతనాలు ఇచి్చందని.. కానీ ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచన్గా జీతాలు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు ఇచి్చన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు రూ. వెయ్యి కోట్లకు శంకుస్థాపన చరిత్రాత్మకం: మంత్రి ఉత్తమ్ ఆలేరు నియోజకవర్గానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 80 శాతం జనానికి సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గత ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసి దొడ్డు బియ్యం ఇచి్చందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న గంధమల్ల చెరువుకు జీవం పోసేందుకు రూ. 574.56 కోట్లతో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎవరు అడ్డుపడినా గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేసి 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి కోమటిరెడ్డి పేదలందరికీ రూ. 5 లక్షల చొప్పున ఖర్చు చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ. 210 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చేలా పైపాప్లైన్ పనులను ప్రారంభించామన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఈ పైప్లైన్లను మూడు నెలల్లో పూర్తి చేసి భగీరథ నీళ్లు అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, సోనియా గాంధీ కలలు కన్న తెలంగాణాను, రాహుల్ గాంధీ ఆలోచనలను నిజం చేస్తున్న నాయకుడు రేవంత్రెడ్డి అని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు నియోజకవర్గానికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, శంకర్నాయక్, శ్రీపాల్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
నాటి కేబినెట్ ఆమోదంతోనే
జోసాలో సీట్ల జోష్
రైతుపై సర్కారు పగాకు
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
ఆళ్లగడ్డలో ఆగని చికెన్ దందా!
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
కాకినాడలో సైబర్ స్కామర్లు
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ధోకా బాబూ..!
కుప్పకూలిన శాంతిభద్రతలు
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
బతికి ఉన్నంత వరకు అలా మాట్లాడను'.. నటుడు రాజేంద్రప్రసాద్
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
దాచటం దేశభక్తిని చాటడమా?
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
ఈ రాశి వారికి శుభవర్తమానాలు.. ఆస్తిలాభం
ఖైదీలు పరారయ్యారని చెప్పా!..భూకంపం వచ్చినట్లు ఫీలయ్యారు!
నీ మంచితనం నాకు తెలుసు.. తీవ్ర దుఃఖంలో లావణ్య త్రిపాఠి
ఇది వరకు మూడు నాలుగు రోజులు తీసుకునేవాళ్లం... ఇప్పుడు ఓ పదిరోజులు తీసుకుందామా సార్!!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
'హరిహర వీరమల్లు' బడ్జెట్ ఎంతో చెప్పిన నిర్మాత
నాటి కేబినెట్ ఆమోదంతోనే
జోసాలో సీట్ల జోష్
రైతుపై సర్కారు పగాకు
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
ఆళ్లగడ్డలో ఆగని చికెన్ దందా!
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
కాకినాడలో సైబర్ స్కామర్లు
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ధోకా బాబూ..!
కుప్పకూలిన శాంతిభద్రతలు
'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే చాలనుకున్నా!
దాచటం దేశభక్తిని చాటడమా?
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
పలు దేశాల పౌరుల రాకపై అమెరికా నిషేధం
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
మరి నువ్వు బతికున్నావని ప్రూఫ్ ఏదమ్మా!!
బెంగళూరు దుర్ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
ఈ రాశి వారికి శుభవర్తమానాలు.. ఆస్తిలాభం
ఖైదీలు పరారయ్యారని చెప్పా!..భూకంపం వచ్చినట్లు ఫీలయ్యారు!
నీ మంచితనం నాకు తెలుసు.. తీవ్ర దుఃఖంలో లావణ్య త్రిపాఠి
ఇది వరకు మూడు నాలుగు రోజులు తీసుకునేవాళ్లం... ఇప్పుడు ఓ పదిరోజులు తీసుకుందామా సార్!!
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
'హరిహర వీరమల్లు' బడ్జెట్ ఎంతో చెప్పిన నిర్మాత
30 శాతం వడ్డీతో డబ్బు చెల్లించండి.. విశాల్కు కోర్టు హెచ్చరిక
‘గారె’ వాసనకు పడిపోయారు!
సినిమా

నార్నే నితిన్ ఫస్ట్ సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' రివ్యూ
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో ఆయనకంటూ గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru). జూన్ 6న థియేటర్స్లోకి వచ్చేసింది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. అయితే, తాజాగా విడుదలైన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే..మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల వరకు తన కుమారుడు సిగరెట్ ముట్టడని, ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమాకు ప్రధాన బలం నార్నే నితిన్, దర్శకుడు సతీశ్ వేగేశ్న అని చెప్పవచ్చు. నార్నే నితిన్ కెరీర్లో మొదటి చిత్రంగా విడుదల కావాల్సిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు తన నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 'తీవండి' మూవీనే దర్శకుడు తెలుగులో రీమేక్ చేశారు. కథలో హీరో పుట్టగానే సిగరెట్ పొగ వల్ల ప్రాణాలు పోసుకున్నట్లు చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆత్రేయపురం బ్యాక్డ్రాప్ అదిరిపోతుంది. కానీ, దానిని తెరపై చూపించడంలో దర్శకుడు అక్కడక్కడ కాస్త ఇబ్బందిపడ్డాడు అని చెప్పవచ్చు. ఈ కథలో హీరో పాత్ర చాలా బలంగా రాసుకున్న దర్శకుడు.. మిగిలిన పాత్రలపై అంతగా శ్రద్ద పెట్టలేదని తెలుస్తోంది. అయితే, కేవలం హీరో పాత్రకే ఎక్కువ సమయం ఇవ్వడంతో కాస్త బోర్గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ కథ కూడా చాలా రొటీన్గానే ఉంటుంది. ఈ కథ చాలా సినిమాలలో చూసిందే కూడా.. అయితే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది. దీంతో సెకండాఫ్ అదిరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ, అంతగా మెప్పించలేదని చెప్పవచ్చు. ఇరు కుటుంబాలతో పాటు హీరో, హీరోయిన్ పడే సంఘర్షణ ఫర్వాలేదనిపించినప్పటికీ... ప్రతి సీన్ మనం ముందే అంచనా వేయవచ్చు. ప్రీక్లైమాక్స్లో ఫ్యామిలీ ట్రాక్లోకి కథ వెళ్తుంది. తండ్రి సవాల్ కోసం హీరో తీసుకున్న నిర్ణయం.. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకూడదని కృష్ణమూర్తి పడే పాట్లు కొన్ని మెప్పిస్తాయి. ఫనల్గా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేని సినిమాగా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మిగిలిపోతుంది.ఎవరెలా చేశారంటే..నార్నే నితిన్కు ఇదే మొదటి సినిమా.. ఆపై కథలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయినప్పటికీ రాజా పాత్రలో బాగానే మెప్పించాడు. గత మూడు సినిమాల్లో అతనిలోని కామెడీ యాంగిల్ చూసి ఉంటారు. ఇందులో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను సులువుగా పండించాడు. హీరోయిన్గా సంపద చాలా అందంగా కనిపిస్తుంది. తన పాత్రమేరకు పెద్దగా స్కోప్ లేకున్నా ఉన్నంతలో న్యాయం చేసింది. రావు రమేశ్, నరేశ్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరూ అదరగొట్టేశారు. కైలాస్ మేనన్ అందించిన సంగీతం అక్కడక్కడ సౌండ్ చేస్తుంది. పెద్దగా ప్రభావం చూపించలేదు. కెమెరామెన్ పల్లెటూరి అందాల్ని తెరపై బాగానే చూపించారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

హిందీ హీరో చేసిన తెలుగు ఫ్లేవర్ సినిమా.. ఓటీటీ రివ్యూ
తెలుగులో లెక్కలేనన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా నడుస్తోంది. అలా తెలుగు దర్శకులు.. ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీసిన హిందీ సినిమా 'జాట్'. ఏప్రిల్లో హిందీ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'.. తెలుగు రివ్యూ)కథేంటి?శ్రీలంక నుంచి అక్రమంగా ఇక్కడికి వలసొచ్చిన రణతుంగ(రణదీప్ హుడా).. ప్రకాశం జిల్లాలోని మోటుపల్లితో పాటు చుట్టుపక్కన 30 గ్రామాల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు. మరోవైపు అయోధ్య వెళ్తున్న జాట్(సన్నీ డియోల్).. ట్రైన్లో సాంకేతిక లోపం కారణంగా మోటుపల్లిలో దిగుతాడు. ఆకలేసి ఓ షాపులో ఇడ్లీ తినబోతుంటే.. కొందరు రౌడీలు జాట్ ప్లేట్ని తోసేస్తారు. దీంతో వాళ్లని సారీ చెప్పమంటాడు. వాళ్లు చెప్పరు. ఫలితంగా ఈ పంచాయతీ.. రణతుంగ దగ్గరకు చేరుతుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ జాట్, రణతుంగ గతమేంటి అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?జాట్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు సినిమాల్లో అరిగిపోయిన పాత చింతకాయ పచ్చడి లాంటి స్టోరీ ఇది. కొన్ని గ్రామాల ప్రజల్ని ఇబ్బంది పెట్టే కరుడుగట్టిన విలన్.. అనుకోకుండా హీరో ఆ ఊరికి రావడం, సమస్య తెలుసుకుని విలన్తో తలపడటం.. చివరకు కథ సుఖాంతం. ఎన్నిసార్లో తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్ని చూసి చూసి విసుగెత్తిపోయారు. బహుశా అందువల్లనేమో మన దగ్గర థియేటర్లలో నేరుగా రిలీజ్ చేయలేదు. హిందీలో రిలీజ్ చేస్తే ఓ మాదిరి రెస్పాన్స్ దక్కించుకుంది.ట్రైన్లో వెళ్తుండే హీరో.. అనుకోకుండా విలన్ ఉండే ఊరిలో దిగడం, తర్వాత కొందరు రౌడీలతో ఇడ్లీ పంచాయతీ. అది కాస్త మెయిన్ విలన్ దగ్గరకు వెళ్లడం.. ఇలా ఫస్టాప్ ముగుస్తుంది. ఊహించినట్లే సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మోటుపల్లి గ్రామస్థులని విలన్, అతడి తమ్ముడు హింసించడానికి కారణం ఏంటి? లాంటి సీన్స్ ఓకే ఓకే అనిపిస్తాయి. హీరో బ్యాక్ గ్రౌండ్ రివీల్ చేసి, విలన్ని చంపే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ని రొటీన్గా ముగిస్తారు.రెండున్నర గంటల సినిమానే గానీ చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించేలా సాగుతుంది. యాక్షన్ సీన్లలో డోస్ ఎక్కువైపోయింది. హీరో అడుగేస్తే భూమి బద్దలవడం, కొట్టగానే రౌడీలు గాల్లో అంతెత్తున ఎగరడం లాంటి సీన్స్ యాక్షన్ ప్రియులకు నచ్చుతాయేమో గానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పిస్తాయి.ఎవరెలా చేశారు?హీరోగా చేసిన సన్నీ డియోల్.. కొందరు తెలుగు ప్రేక్షకులకు తెలుసంతే. సినిమాలో ఆయన పాత్రని చూస్తున్నప్పుడు ఇది బాలకృష్ణ చేయాల్సిన రోల్ కదా అనిపిస్తుంది. విలన్గా రణదీప్ హుడా బాగానే చేశాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడు. మిగిలిన వాళ్లలో రెజీనా, సయామీ ఖేర్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.సినిమాని చాలా రిచ్గా తీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు బాగోలేవు. యాక్షన్ సీన్స్ హిందీ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో గానీ తెలుగు ప్రేక్షకులు అయితే ఇదివరకే ఇలాంటి చాలా చూసేశాం కదా అని కచ్చితంగా అనుకుంటారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రొటీన్ రెగ్యులర్ మసాలా మూవీనే హిందీ హీరోతో తీసేశాడు. ఒకవేళ మీకు టైమ్ ఉండి, ఏదైనా రొటీన్ మాస్ మసాలా మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ రివ్యూ)

‘బద్మాషులు’ మూవీ రివ్యూ
టైటిల్ : బద్మాషులునటీనటులు: మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ రెడ్డి, కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్, అన్షుమన్ తదితరులుదర్శకత్వం-శంకర్ చేగూరినిర్మాతలు- B. బాలకృష్ణ, C.రామ శంకర్సంగీతం- తేజ కూనూరుసినిమాటోగ్రఫీ- వినీత్ పబ్బతిఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాలు నేడు(జూన్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. తెలంగాణలోని కోతులగూడెం గ్రామానికి చెందిన ట్రైలర్ తిరుపతి(మహేశ్ చింతల), బార్బర్ ముత్యాలు(విద్యాసాగర్ కారంపురి) స్నేహితులు. ఇద్దరు పని దొంగలు...మందు తాగనిదే ఉండలేరు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా.. నిత్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వీరిద్దరిని ఊరంతా ‘బద్మాషులు’ అని తిట్టినా పట్టించుకోరు. డబ్బుల కోసం తిరుపతి తన కస్టమర్ల డ్రెస్లను అమ్ముకుంటే.. ముత్యాలు ఇంటింటికెల్లి హెయిర్ కటింగ్ చేస్తూ వచ్చిన డబ్బులతో తాగుతుంటారు. ఓ సారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్లో పెన్షిన్ వైర్ని దొంగిలించి పోలీసులకు దొరికిపోతారు. స్టేషన్లో కూడా వీరి బుద్ది మారదు. పోలీసుల పేరు చెప్పి స్టేషన్కు వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసి తాగుతుంటారు. చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజుల తర్వాత వారిని వదిలేస్తారు. అదే సమయంలో స్కూల్లో కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల డేటా అంతా ఉంటుంది. ఆ కేసు వీరిద్దరిపైకే వస్తుంది. అసలు ఆ కంప్యూటర్ దొంగిలించిదెవరు? అది ఎక్కడ ఉంది? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్(మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు చేసిన సహాయం ఏంటి? అసలు తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి గల కారణం ఏంటి? చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్లి సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమిది. పల్లెటూరికి చెందిన ఇద్దరి తాగుబోతుల చుట్టూ కథనం సాగుతుంది. తిరుపతి, ముత్యాలుతో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజజీవితంతో మన ఊరిలో వారిలాగే ఉంటూ నవ్విస్తుంటాయి. చివరితో ఓ మంచి సందేశం కూడా ఇచ్చారు. అయితే దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కొన్ని చోట్ల ‘జాతి రత్నాలు’ ఛాయలు కనిపిస్తుంటాయి. అయితే ఒకే పాయింట్ చుట్టూ కథ తిరగుతుండడంతో నిడివి తక్కువ అయినా.. సాగదీతగా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది. డ్రెస్ కుట్టమని వస్త్రం ఇస్తే..దాన్నే అమ్ముకొని తాగే ట్రైలర్ ఒకవైపు.. సగం సగం షేవింగ్ చేస్తూ.. మధ్యలోనే బార్ కెళ్లే బార్బర్ మరోవైపు.. వీరిద్దరి పాత్రల పరిచయ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే అలాంటి పాత్రలతో మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా..దర్శకుడు రోటీన్ సన్నివేశాలనే రాసుకున్నాడు. అవి కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లేవరకు కథనం సోసోగానే సాగుతుంది. స్టేషన్లో వీరిద్దరు చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ సీన్ రొటీన్గానే ఉంటుంది. ఇక సెకండాఫ్ కూడా మళ్లీ దొంగతనం చుట్టే తిరగడంతో బోరింగ్గా అనిపిస్తుంది. దొంగను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్ తదితర సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్ ఈ చిత్రంతో హీరోగా మారి.. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వులు పూయించాడు. నటుడిగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక ట్రైలర్ తిరుపతిగా మహేష్ చింతల కూడా నేచులర్ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఆయన వేసే సింపుల్ పంచులు బాగా పేలాయి. విద్యా సాగర్, మహేశ్ ఇద్దరు తెరపై నిజమైన తాగుబోతుల్లాగే కనిపించారు. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రల పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించారు. మురళీ ధర్, బలగం సుధాకర్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత?
కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. జకార్తాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి ఓటమి ఎదురైంది. ప్రపంచ ఏడో ర్యాంక్ ద్వయం మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ జోడీ సాత్విక్–చిరాగ్ 19–21, 16–21తో ఓటమి పాలైంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్ జోడీకి 9,062 డాలర్ల (రూ. 7 లక్షల 77 వేలు) ప్రైజ్మనీతోపాటు 6,600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో మాన్ వె చోంగ్–టీ కాయ్ వున్లతో పోటీపడ్డ నాలుగుసార్లూ విజయం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఐదో ప్రయత్నంలో మాత్రం ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం.

ఫైనల్లో అల్కరాజ్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 4–6, 7–6 (7/3), 6–0, 2–0తో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. నాలుగో సెట్లో అల్కరాజ్ 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా ముసెట్టి వైదొలిగాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో అల్కరాజ్కు తొలి రెండు సెట్లలో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్ను కోల్పోయిన అల్కరాజ్ రెండో సెట్ను టైబ్రేక్లో గెలిచి పుంజుకున్నాడు. మూడో సెట్లో ముసెట్టి ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయాడు. నాలుగో సెట్లో రెండు గేమ్లు ముగిశాక ముసెట్టి తొడ కండరాల గాయంతో ఆటను కొనసాగించలేనని చైర్ అంపైర్కు తెలపడంతో మ్యాచ్ను నిలిపివేసి అల్కరాజ్ను విజేతగా ప్రకటించారు. దాంతో 22 ఏళ్ల అల్కరాజ్ తన కెరీర్లో ఐదోసారి గ్రాండ్స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఆడిన నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల ఫైనల్స్లో (2022 యూఎస్ ఓపెన్; 2023, 2024 వింబుల్డన్; 2024 ఫ్రెంచ్ ఓపెన్) అల్కరాజే గెలుపొందడం విశేషం. సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. సబలెంకా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో ఫైనల్కు చేరుకోగా ... 2022లో రన్నరప్గా నిలిచిన కోకో గాఫ్ రెండోసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది.

పట్టాలపై విషాదం.. రన్నింగ్ ట్రైన్లో ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగ క్రికెటర్
రైలు పట్టాలపై ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఓ దివ్యాంగ క్రికెటర్ ఛాతీ నొప్పితో మరణించాడు. అత్యవసర సాయం కోసం రైల్వే వైద్య సిబ్బంది కోసం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చనిపోయిన క్రికెటర్ సహచరులు వాపోతున్నారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్ ఎక్స్ప్రెస్లో జరిగింది. పంజాబ్కు చెందిన 38 ఏళ్ల దివ్యాంగ క్రికెటర్ విక్రమ్ సింగ్.. ఓ వీల్చైర్ టోర్నమెంట్ కోసం సహచరులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి గ్వాలియర్కు బయల్దేరాడు. ప్రయాణంలో విక్రమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. విక్రమ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. రైల్వే వైద్య సిబ్బందికి అనేక అత్యవసర కాల్స్ చేసినప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. రైలు ఢిల్లీ నుంచి మధుర స్టేషన్కు చేరుకునేలోపే విక్రమ్ మరణించాడు.కళ్ల ముందే సహచరుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి క్రికటర్ల బాధ వర్ణణాతీతంగా ఉంది. విక్రమ్ నొప్పితో విలవిలలాడిపోయాడని ఓ క్రికెటర్ చెప్పాడు. అత్యవసర వైద్య సాయం కోసం ఎంత సేపు ప్రయత్నించినా రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ మిత్రుడు మరణించాడని మరో క్రికెటర్ వాపోయాడు. మధుర రైల్వే స్టేషన్లో విక్రమ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. అక్కడే పోస్ట్మార్టమ్ పూర్తి చేశారు. రైల్వే ఉన్నతాధికారులు తమ వైద్య సిబ్బంది ఆలసత్వంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై దివ్యాంగ హక్కుల సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓ దివ్యాంగ క్రీడాకారుడు ఛాతి నొప్పితో విలవిలలాడుతుంటే వైద్య సాయం అందించడానికి ఓ రైల్వే అధికారి కూడా లేకపోవడం సిగ్గు చేటని క్రీడా సమాజం దుమ్మెత్తిపోస్తుంది.

శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాణించిన కరుణ్ నాయర్, జురెల్
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్లో ల్యాండైన కేఎల్ రాహుల్ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్కు జతగా బరిలోకి దిగిన రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్ను నిర్మించాడు.మరో ఎండ్లో జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సహకారంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్ ఫామ్నే కొనసాగించిన కరుణ్ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేల క్రిస్ వోక్స్ అతనికి అడ్డుకట్ట వేశాడు. వోక్స్ ఓ అద్భుతమైన బంతితో కరుణ్ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్ ఔటయ్యాక రాహుల్ ధృవ్ జురెల్తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్.. రాహుల్తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 55 ఓవర్ల అనంతరం భారత్-ఏ స్కోర్ 234/3గా ఉంది. భారత్-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్ వోక్స్ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాపం సర్ఫరాజ్ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ను తప్పించారు. సర్ఫరాజ్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 92 పరుగులు చేశాడు. రాహుల్ ఓపెనర్గా రావడంతో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ను బరిలోకి దించారు. అలాగే హర్ష్ దూబే స్థానంలో తనుశ్ కోటియన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్
బిజినెస్

ఆర్బీఐ ఒక్క నిర్ణయం.. హోమ్లోన్ ఈఎంఐ తగ్గింపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. తర్వాత మరోసారి ఏప్రిల్లో మరో 25 పాయింట్లు కోత విధించింది. తాజాగా శుక్రవారం 50 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.5 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.21,696 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ అర శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.20,911కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.785 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.1,88,299 మిగులుతుంది. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యారెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.

జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక అంశాలు పంచుకున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంకు సంబంధించి మాల్యా 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి ప్రస్తావించారు. 2008 వరకు కంపెనీ సమర్థంగా పనిచేసిందని చెప్పారు.పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ‘2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఇది భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో ప్రతి రంగం దెబ్బతింది. డబ్బు సరఫరా నిలిచిపోయింది. రూపాయి విలువ దారుణంగా దెబ్బతింది. 2005లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అనతికాలంలోనే లగ్జరీ సేవలకు పేరు తెచ్చుకున్నప్పటికీ పరిస్థితులు క్షీణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కార్యకలాపాలను పెంచే ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించాం. సమస్యలు వివరించాం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించే ప్రణాళికలతో, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఈ ఆర్థిక పరిస్థితుల్లో పని చేయలేకపోతున్నానని చెప్పాను. బ్యాంకుల మద్దతు ఉంటుందని ముఖర్జీ చెప్పారు. కానీ అలా ఏం జరగలేదు’ అని అన్నారు.గొప్పగా పని చేయలేదన్నారు..‘కొంతకాలానికి పరిస్థితులు మరింత దిగజారడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను నిలిపివేసింది. కంపెనీ కష్టాల్లో పడింది. మళ్లీ రుణం కోసం బ్యాంకుల వద్దకు వెళితే కంపెనీ అంత గొప్పగా పని చేయలేదని అన్నారు’ అని చెప్పారు. 2016లో భారత్ను విడిచి పారిపోయిన మాల్యా అప్పటి నుంచి యూకేలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనను భారత్కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.దొంగను కాదు..మాల్యాను ‘చోర్(దొంగ)’ అని పిలవడంపై.. పాడ్కాస్ట్లో స్పందించారు. ‘పారిపోయిన వ్యక్తి’ అనే అంశంపై కూడా మాట్లాడారు. తనను దొంగగా ప్రజలు భావించడాన్ని ఖండించారు. ‘మార్చి 2016 తర్వాత భారత్కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవండి. నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటన కోసం భారతదేశం నుంచి బయలుదేరాను. సరైన కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే మీ ఇష్టం. కానీ ‘చోర్’ అనే ముద్ర వేస్తున్నారు. దొంగతనం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.అప్పు పలుమార్లు రికవరీభారతీయ బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.6,200 కోట్లను పలుమార్లు రికవరీ చేశారని మాల్యా కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. తన నుంచి యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్- ప్రస్తుతం లిక్విడేషన్ దశలో ఉంది), ఇతర అనుబంధ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని పూర్తిగా లెక్కించాలని కోరారు.భారత్కు తిరిగి వస్తారా..?భారత్కు తిరిగి రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు విజయ్ మాల్యా సమాధానమిస్తూ..‘భారత్ లో నిష్పాక్షిక విచారణ, గౌరవప్రదమైన హామీ ఉంటే మీరు చెప్పిన దానిపై మరోసారి ఆలోచిస్తాను’ అని చెప్పారు. మాల్యాతో పాటు ఇతర వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం యూకే నుంచి భారత్ రప్పించే ప్రయత్నం చేస్తోంది. కానీ, భారత నిర్బంధ షరతులు ఈసీహెచ్ఆర్ (యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్)లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని, అందువల్ల వారిని వెనక్కి పంపలేమని అప్పీల్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!స్టేట్మెంట్ ఇవ్వాలి..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా రుణదాతలకు రూ.11,101 కోట్లకు పైగా రుణానికి సంబంధించిన కేసులో విజయ్ మాల్యా ఈ ఏడాది ఏప్రిల్ 9న లండన్ హైకోర్టులో దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి బ్యాంకులు వసూలు చేసిన రుణాల రికవరీ వివరాలను కోరారు. వాస్తవానికి రూ.6,200 కోట్లు బకాయి ఉండగా, బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని మాల్యా తరఫు న్యాయవాది వాదించారు. రుణం పూర్తిగా క్లియర్ అయిందని, ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, రికవరీ మొత్తాన్ని వివరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.

వడ్డీరేట్లు తగ్గిస్తే మంచిదే.. మరి నష్టం ఏంటి?
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి తాజాగా 50 బేసిస్ పాయింట్లు రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు మళ్లీ కీలక వడ్డీ రేట్లను కుదించే వీలుంది. ప్రపంచ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహంతక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.పొదుపుపై ప్రభావంమరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!ఏం చేయాలంటే..ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది.

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్థిరంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,300 (22 క్యారెట్స్), రూ.99,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేవు. చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.91,300, రూ.99,600గా ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధరలో నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.91,450గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.99,750గా ఉంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్ బాత్. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్ పరిచయమైంది. ఐస్ బాత్ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్నెస్ ప్రియులకు నూతన ట్రెండ్గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ, అనమ్ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్ బాత్ తో వారి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్బాత్ను ఒక ఈవెంట్లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. స్నాన విశేషాలివీ.. ఐస్ బాత్ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్–వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలివీ.. ఈ ఐస్బాత్ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. ‘మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్పై ఆసక్తితో థాయిలాండ్లోని ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్ బాత్ థెరపీ గురించి తెలిసింది. నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్తో పాటు మొబైల్ ఐస్ బాత్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్ బాత్ చేయగలను. జాగ్రత్తలు తప్పనిసరి.. ఐస్బాత్ ఈవెంట్లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. ఐస్ బాత్ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్లు సరిపోతాయి. శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. ప్రస్తుతం సెషన్ సెటప్ ఫెసిలిటేటర్ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది. (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..)

ఎంబ్రాయిడరీ నగలు..! ఇట్టే కట్టిపడేసే ఫ్యాషన్ ట్రెండ్..
చెవులకు జూకాలు, మెడలో హారాలు చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలునడుముకు వడ్డాణాలు, వేళ్లకు ఉంగరాలు రంగులుగా, అల్లికలుగా..సంప్రదాయ కళ, ఆధునిక శైలి కలయికతో అభివృద్ధి చెందినవి ఎంబ్రాయిడరీ నగలు. సిల్క్ దారాలు, అద్దాలు, పూసలు, మెరిసే రాళ్లు, ప్యాచ్వర్క్తో రూపు కట్టిన ఈ నగలు అందరి చూపులను ఇట్టే కట్టడి చేస్తాయి. తేలికగా.. అందంగా!లైట్ వెయిట్: సాధారణ గోల్డ్/ సిల్వర్ జ్యూవెలరీలతో పోలిస్తే ఈ ఆభరణాలు చాలా తేలికగా ఉంటాయి. వీటిలోనూ నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, మాంగ్ టిక్కా, రింగ్స్,... వివిధ రకాల మోడల్స్లో ఎంచుకోవచ్చు. కస్టమైజ్డ్ : డిజైన్, రంగులు, శైలి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా మార్చుకోవడానికి వీలుంటుంది. డ్రెస్ని బట్టి మోడల్ని, కలర్స్ని ఎంపిక చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ డిజైన్స్: మొఘల్, జర్దోసి, మిర్రర్ వర్క్, గుజరాతీ వర్క్... లాంటి అనేక శైలులను ఈ ఎంబ్రాయిడరీలో చూపవచ్చు. పూర్తి ఎకో–ఫ్రెండ్లీ: సహజమైన వస్తువులతో తయారవడం వల్ల పర్యావరణానికి ఏ మాత్రం హానికరం కాదు.వేడుకలకి అనుకూలం: సంప్రదాయ, ఇండో – వెస్ట్రన్ స్టైల్ డ్రెస్లకి ఇది సరైన ఎంపిక.సొంతంగా తయారీ!ఎంబ్రాయిడరీ హూప్ను కొనుగోలు చేసి, మల్టీ కలర్ దారాలు, ఫ్యాబ్రిక్ గ్లూతో నచ్చిన విధంగా తయారుచేసుకోవచ్చు. పర్యావరణహితమైన ఉత్పత్తులు కావడం, రీసైక్లింగ్ చేసే సదుపాయం కూడా ఈ ఆభరణాల తయారీలో చూపించవచ్చు.వేడుకకు తగిన ఆభరణంఉపయోగించే మెటీరియల్స్ని బట్టి ఆభరణం ఉంటుంది కాబట్టి వేడుకను బట్టి డిజైన్ని ఎంచుకోవచ్చు.సిల్వర్, జరీ దారాలతో జర్దోజి, మొఘల్ వర్క్ని గ్రాండ్గా తీర్చిదిద్దవచ్చు. ఈ ఎంబ్రాయిడరీ చేసిన ఆభరణాలను సంప్రదాయ వేడుకలలో లెహంగాలు, శారీలకు ఎంచుకోవచ్చు. కాథా అనే వర్క్ బెంగాలీ ఫోక్ ఎంబ్రాయిడరీ ఆర్ట్. రంగుల దారాలతో లైట్ వెయిట్ జ్యూవెలరీని రూపొదించవచ్చు. ఇవి ప్లెయిన్, ఇండోవెస్ట్రన్ డ్రెస్సులకు, కాటన్ చీరలకు బాగా నప్పుతాయి. గుజరాత్ కచ్ వర్క్, రాజస్థాన్ కళా శైలిని ప్రతిబింబించేలా పూలు, అద్దాలతో చేసిన ఎంబ్రాయిడరీ ఆభరణాలు సంప్రదాయ పండుగలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, కాలేజీ ఫంక్షన్లు.. వంటి వాటిలో స్టైల్గా కనిపిస్తాయి. లేస్ మెటీరియల్తోనూ రంగు దారాలతో పూలు, ఆకులు కుట్టి, ఆభరణంగా ధరించవచ్చు. ఇవి ఎక్కువగా వెస్ట్రన్ డ్రెస్సులకు బాగా నప్పుతాయి

డాక్టర్ కాబోయి.. మేకప్ ఆర్టిస్ట్గా నం.1 స్థానం..
26 ఏళ్ల మృణాల్ పంచల్ను దేశంలో అత్యధికమంది ఇన్స్టాలో ఫాలో అవుతున్నారట. కారణం? ఆమె రోజూ మేకప్ టిప్స్ చెబుతుంది. తన మీద మేకప్ అప్లయ్ చేసి క్షణాల్లో రీల్స్ తయారు చేసి ఆకట్టుకుంటుంది. ముఖాలను మార్చే ఈ కళతో తాజాగా వెలువడ్డ ‘కాండిరి హూరూన్ ఇండియాస్ లిస్ట్ ఆఫ్ లీడింగ్ ఉమన్ ఇన్ఫ్లూయెన్సర్’లో అగ్రస్థానంలో నిలుచుంది.మనిషికి అత్యంత ఇష్టమైన వస్తువు తన ఖ్యాతికి కారణమవుతుందని మృణాల్ పంచల్ ఊహించి ఉండదు. మనిషికి ఇష్టమైనది ఏది? అద్దం. అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు మనిషి ఏమనుకుంటాడు? కాస్త బాగా కనిపిస్తే బాగుండు అనుకుంటాడు.అలంకార ప్రియులైన స్త్రీలు ఈ మాటను ఇంకా ఎక్కువగా అనుకుంటారు. ఇక్కడే మృణాల్ పంచల్ గెలిచింది. ఏదో కాలక్షేపంగా తాను వేసుకునే మేకప్ను చూపుతూ చేసిన వీడియోలు ఆమెకు భారీగా మహిళా ఫాలోయెర్స్ను సంపాదించి పెట్టాయి. ఇన్స్టాలో ఆమెకు 55 లక్షల మంది ఫాలోయెర్లు ఉన్నారు. ఆమె వీడియోలు క్షణాల్లో వైరల్గా మారతాయి. ఇంతకీ కంటెంట్ కేవలం మేకప్పే. అందుకే ఆమె ‘కాండిరి హూరూన్ ఇండియా విమెన్ లీడర్స్ లిస్ట్ 2025’లో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకు ఎవరు ఈ మృణాల్ పంచల్.డాక్టర్ కాబోయి...చాలామంది సినిమా హీరోయిన్లు డాక్టరు కాబోయి యాక్టర్ అయ్యాను అంటుంటారు. మృణాల్ పంచల్ కూడా అంతే. గుజరాత్లో పుట్టి పెరిగిన మృణాల్ ఎం.బి.బి.ఎస్. చేసేందుకు అవసరమైన చదువు/శిక్షణ కోసం పూణె వచ్చింది. ‘మా అమ్మతో శపథం చేసి మరీ వచ్చాను. అయితే నేను ఒకటి తలిస్తే మేకప్ మరొకటి తలిచింది’ అంటుంది మృణాల్. చిన్నప్పుడు తల్లి నిద్రపోతుంటే మేకప్ కిట్ తీసుకుని ఆమె ముఖానికి మేకప్ వేసి ఆశ్చర్యపరిచిన మృణాల్ స్కూల్లో చదివేప్పుడు కూడా రకరకాల పద్ధతుల్లో మేకప్ వేసుకుని కాలక్షేపం చేసేది. అయితే అందులో సహజమైన ప్రతిభ చాలామందిని ఆకర్షించింది.చదవలేక...అయితే పూణె వచ్చాక భాష సమస్య ఆ తర్వాత చదువు తలకు ఎక్కక పోవడంతో మృణాల్ ఒక దశలో కుదేల్ అయ్యింది. ఇక ఇంటికి పోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నప్పుడు టిక్టాక్లో కాలక్షేపానికి మేకప్ ట్యుటోరియల్ అంటూ ఒక వీడియో చేసింది. అది వైరల్గా మారింది. స్త్రీలు కింద కామెంట్లు పెట్టి ఇలాంటివే చేయండి అనసాగారు. మేకప్ను వేగంగా, సులువుగా, మనిషిని బట్టి, చర్మాన్ని బట్టి, కన్ను ముక్కును బట్టి, వయసును బట్టి ఎలా వేసుకోవాలో రకరకాల టిప్స్ చెబుతూ సొంతంగా ఆ మేకప్ను వేసుకుని చూపుతూ మృణాల్ అతి త్వరలో ఖ్యాతి గడించింది.వెంటబడ్డ కంపెనీలుమృణాల్ ఇన్ఫ్లూయెన్స్ టిక్టాక్ తర్వాత ఇన్స్టాలో పెరగడంతో బ్యూటీ సామాగ్రి అమ్మే బడాబడా కంపెనీలు ఆమెను తమ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయమని కోరాయి. ‘అతి త్వరగా నేను ముంబైకి మారాల్సి వచ్చింది. నేను కలలో కూడా ఊహించని పెద్ద కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కోసం నన్ను అంబాసిడర్గా పెట్టుకున్నాయి. నా ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది’ అని చెప్పుకొస్తుంది మృణాల్.సరళంగా, అట్టహాసంగా: మృణాల్ భారతీయ మహిళల మనస్థితిని బట్టి మేకప్ టిప్స్ చూపుతుంది. ‘మన మహిళలు గ్లామర్గా మేకప్ వేసుకోవాలనుకుంటారు. కాని జంకుతారు. సరళమైన మేకప్ చూపిస్తే ఇంకొంచెం గ్లామర్ యాడ్ చేయమని కోరుతారు. రెండు విధాలుగా సంతృప్తి పరుస్తూ వారికి టిప్స్ అందిస్తుంటాను’ అంటుంది మృణాల్. ఆమె చూపే టిప్స్లో కేశాలంకరణ, వాటి షేడ్స్, కనురెప్పలు, ముక్కును సన్నగా చూపించడం, పెదాలను అందంగా చూపించడం, ముఖంలో ఏదైనా ఒక భాగం మోతాదుకు మించి ఉన్నా, కురచగా ఉన్నా దానిని మేకప్లో సరి చేసి చూపించడం చాలా ప్రతిభావంతంగా చేస్తుంది. అందుకే మృణాల్కు యాభై లక్షల మంది ఫ్యాన్స్.సోషల్ మీడియా వచ్చాక చాలామంది విజేతలు మనకు కనిపిస్తున్నారు. అయితే వారంతా తొలిసారిగా ఎవరూ నడవని దారిని నడిచిన వారే. మేకప్ రంగంలో ఎందరో నిష్ణాతులు ఉండగా మృణాల్ దానినో ట్యూషన్గా భావించడం వల్లే ఘన విజయం సాధించింది. నేడు భారతదేశంలో అత్యంత ఇన్ఫ్లూయెన్షల్ లీడర్గా నిలిచింది. మృణాల్ నిజంగా గ్రేట్.(చదవండి: శభాష్ మహిరమ..! జస్ట్ 13 ఏళ్లకే రికార్డు సృష్టించింది)

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం ఏదో తెలుసా..!
ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. గానీ కొన్ని గమ్మత్తైన విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎలా తెలుసుకోలేకపోయాం అనిపిస్తుంది. అలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్నింటి గురించి తెలుసుకుందామా..!ఇరవైనాలుగు ఏళ్ల వయసులో రోమ్ సామ్రాజ్య పాలకుడైన కలిగ్యులా తన గుర్రానికి సెనెటర్ హోదా ఇచ్చాడు.అబ్రహం లింకన్ టాప్ హ్యాట్ ఫేమస్. ఫ్యాషన్ యాక్సెసరీగా మాత్రమే కాదు... వేరే రకంగా కూడా టాప్ హ్యాట్ను వినియోగించేవారట లింకన్.. ముఖ్యమైన నోట్స్, పేపర్లను టాప్ హ్యాట్లో స్టోర్ చేసేవారట.ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో చివరగా చేర్చిన అక్షరం... జెబ్లాక్బర్డ్ వయోలిన్ గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏమిటంటే... ఈ వాయిద్య పరికరాన్ని కలప నుంచి కాకుండా రాయితో తయారుచేస్తారు.‘ది మ్యాట్రిక్స్’ సినిమాలోని ‘గ్రీన్ కోడ్’కు మూలం... జపనీస్ సుషి కుక్ బుక్.ప్రపంచంలోనే అతి పెద్ద టీ–షర్ట్ను ప్లాస్టిండియా ఫౌండేషన్ తయారుచేసింది. రీసైకిల్ చేసిన 2,100,000 ప్లాస్టిక్ బాటిల్స్తో దీన్ని తయారుచేశారు. ఈ టీ–షర్ట్ పొడవు 96.86 మీటర్లు.‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంగ్’ పుస్తకం 1558లో విడుదలైంది. ఇప్పటికీ ప్రింట్లో ఉంది. ఈ పుస్తకం రాసిన లూయిజీ కార్నరో వంద సంవత్సరాలు బతికాడు.
ఫొటోలు
అంతర్జాతీయం

దేశ సేవ నేరమా?
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్పై భారత్కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్కు లేదు. పాక్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు.

సముద్రాలకు ఎండదెబ్బ
‘ఎండ దెబ్బ’కు మహాసముద్రాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలతో కూడిన వాయవ్య పసిఫిక్ ప్రాంత సముద్ర జలాల్లో 2024లో రికార్డు స్థాయిలో ఏకంగా అర డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పసిఫక్ మహాసముద్ర జలాలు ఏకంగా 4 కోట్ల చదరపు కి.మీ. మేరకు కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కిపోయాయి. ఆ పరిధిలోని జీవజాలాన్ని కూడా ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేసింది. అరుదైన కోరల్ రీఫ్స్ వంటివాటి ఉనికే ప్రమాదంలో పడింది. అంతేగాక ఇండొనేసియాలోని న్యూ గినియా దీవుల్లో ఉన్న ఆ ప్రాంతపు ఏకైక గ్లేసియర్ ఏడాదిలోనే సగం మేరకు కరిగిపోయింది. ఎండలు ఇలాగే పెరిగిపోతే మరో ఏడాదికల్లా అది పూర్తిగా మాయం కావడం ఖాయమని ఐరాస వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జోస్యం చెప్పింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ల్లో గతేడాది ఎండలు సరికొత్త రికార్డులు సృష్టించాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రపంచమైన ఎండల నడుమ వాయవ్య పసిఫిక్ ప్రాంత దేశమైన ఫిలిప్పీన్స్పై గత అక్టోబర్, నవంబర్ నెలల్లో లెక్కలేనన్ని తుపాన్లు విరుచుకుపడ్డాయి! ఈ విపరిణామాలన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం’’ అంటూ వాపోయింది. మొత్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా 2024లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అధ్యయనకర్తల్లో ఒకరైన బ్లెయిర్ ట్రెవిన్ వివరించారు. ‘‘మొత్తం పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతను చూసుకున్నా 2022 తర్వాత రెండో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది! అక్కడి సముద్రమట్టాలు ప్రపంచ సగటుతో పోలిస్తే శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకర పరిణామాలే. ఎందుకంటే వాయవ్య పసిఫిక్ ప్రాంత జనాభాలో ఏకంగా సగానికి పైగా తీరానికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే నివసిస్తున్నారు’’ అని హెచ్చరించారు. సముద్రమట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే వారంతా అతి త్వరలో నిర్వాసితులుగా మారి పొట్ట చేత పట్టుకుని వలస పోవడం తప్ప మరో మార్గం ఉండదని అధ్యయన బృంద సభ్యుడు థియా తుర్కింగ్టన్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్

డొనాల్డ్ ట్రంప్ ట్రాప్లో జిన్పింగ్!
వాషింగ్టన్: అమెరికా-చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా. జిన్పింగ్కు ట్రంప్ ఫోన్..అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. జిన్పింగ్తో ట్రంప్ ఫోన్లో సంభాషించిన విషయాన్ని ఈరోజు(గురువారం) ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’లో వెల్లడించారు. “నాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం” అని ట్రంప్ పోస్ట్ చేశారు. సంకాల ‘వార్’సుంకాల ఆంక్షలతో చైనాను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశారు ట్రంప్. అయితే చైనా కూడా ట్రంప్ చర్యలకు ప్రతీ చర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘ భయపెడితే భయపోతాం అనుకుంటున్నారా.. చర్యకు ప్రతిచర్య సిద్ధం’ అంటూ సవాల్ చేశారు. అక్కడ నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. చైనా వస్తువులపై 145 సుంకాన్ని ట్రంప్ విధించగా, అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని చైనా విధించింది. అయితే ఆ తర్వాత 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించగా, 125 శాతం సుంకాన్ని 10కి పరిమితం చేసింది చైనా . ఇలా ఇరు దేశాలు ఒక రాజీకి రావడంతో సమస్య తెరపడినట్లయ్యింది.

అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్!
సాక్షి, హైదరాబాద్: ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’’ ఎన్నికల సందర్భంగా ట్రంప్ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి.. అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తూండగా.. కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటునానయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనా విషయంలోనైతే ఏకంగా 155 శాతం పన్నులకు సిద్ధపడ్డాడు కూడా. పన్నుల విషయంలో భారతీయులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ హెచ్1-బీ వీసాలపై నిబంధనలు, గ్రీన్కార్డులున్నా హద్దుమీరితే పంపేస్తామన్న హెచ్చరికలు, స్వదేశానికి పంపే డబ్బులపై ఐదు శాతం వరకూ పన్నులు వంటి చర్యలు భారతీయులు, భారతీయ సంతతి అమెరికన్లకు ఇబ్బందికరంగానే మారాయి. అయితే ఈ వైఖరి ట్రంప్కు... అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.టూరిజం విషయాన్ని చూద్దాం... ట్రంప్ అధ్యక్షుడు కాకమునుపు అంటే 2024లో అమెరికా సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్శించింది. రవాణా, షాపింగ్, ఆహార పానీయాల వంటి వాటికి వీరు ఖర్చు పెట్టిన మొత్తం ఎకాఎకి 155 బిలియన్ డాలర్లు. హోటళ్లు, దుకాణాలు కళకళలాడుతూండేవి. కానీ.. అధ్యక్షడైన తరువాత ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, చేస్తున్న ప్రకటనల పుణ్యమా అని ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.మార్చి నాటికి ఈ తగ్గుదల 14 శాతం వరకూ ఉందని అంచనా. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పొరుగున ఉన్న కెనెడా నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఐదో వంతు పడిపోయిందట. ఫలితంగా ఇప్పటివరకూ పర్యాటకులు పెట్టే ఖర్చు 900 కోట్ల డాలర్ల వరకూ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రభావం కాస్తా హోటళ్లు, దుకాణాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.వెనకడుగు వేస్తున్న కంపెనీలు..అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో తాము ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నట్లు డెల్టా ఎయిర్లైన్స్ ప్రకటించగా... వైద్య పరికరాల తయారీ సంస్థ బెల్లూస్కూరా కూడా దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.బ్రిటన్ బొమ్మల కంపెనీ క్యారెక్టర్ గ్రూప్, మద్యం తయారీ దిగ్గజం డియాగోలు కూడా మెక్సికో, కెనెడాలపై అమెరికా విధించిన పన్నుల నేపథ్యంలో తమ వ్యాపారల ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. ఫలితంగా ఒక్క డియాగో సంస్థకు 200 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.భారత్లో తయారీ చేపడితే భారీ సుంకాలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఐఫోన్ సీఈవో టిమ్ కుక్ పట్టించుకోని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అమెరికాలో వినియోగించే ఐఫోన్లో అత్యధికం భారత్లోనే తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా అమెరికాలో బాగా పాపులర్ అయిన ట్రాక్టర్ తయారీ సంస్థ ‘జాన్ డీర్’ కూడా టారిఫ్ల హెచ్చరికలను తోసిరాజంటూ... తయారీ రంగాన్ని కెనెడాకు తరలించే ఆలోచనలో ఉంది. ఏతావాతా... ట్రంప్ ధోరణి కాస్తా అమెరికాకు చేటు చేసేట్టే కనిపిస్తోంది!- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
జాతీయం

అసోంలో తగ్గని వరద తీవ్రత
గువాహటి: అసోంలో వరదల తీవ్రత గురువారం కూడా కొనసాగింది. మొత్తం ఏడు లక్షలమంది వరదలతో ప్రభావితులు కాగా, 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. బ్రహ్మపుత్ర సహా మొత్తం తొమ్మిది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బరాక్, ఉపనదులు చచార్ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.60 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. రాష్ట్రంలో వరదలతో మొత్తం 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇలా ఉండగా, సిక్కింలోని చటెన్లో వరదల్లో చిక్కుకున్న 63 మంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం గమనార్హం. చెటెన్లో చిక్కుకున్న మరో 64 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు.

అదానీ, చైనాలకు ‘నరేందర్–సరెండర్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. పారిశ్రామికవేత్త అదానీతోపాటు చైనాకు సైతం నరేందర్– సరెండర్ అంటూ వ్యాఖ్యానించింది. షోలే సినిమాలో జై–వీరూల జోడీని అదానీ, మోదీల ధ్వయం మించిపోయిందని కాంగ్రెస్ నేత అజొయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లొంగిపోవడమనే ప్రక్రియ పూర్తయింది. నరేంద్ర మోదీ ఎక్కడికెళ్లిన, అదానీ కోరిన విధంగా ఒక కాంట్రాక్ట్ మాత్రం గ్యారెంటీ. భారత ప్రధాని దౌత్య సంబంధాలు అంతర్జాతీయంగా పోర్టులు, ఎయిర్పోర్టులు, విద్యుత్, బొగ్గు గనులు, ఆయుధాలు వంటి రంగాల్లో పారిశ్రామిక వేత్త అదానీకి అనుకూలంగా ఉంటాయి’అని పేర్కొంటూ ఆయన కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. మోదీ చైనాకు సైతం మోకరిల్లారన్న అజొయ్ కుమార్.. 2020లో భారత భూభాగాన్ని ఆక్రమించినా కూడా ఆ దేశానికి క్లీన్చిట్ ఇచ్చిన ‘నరేందర్– సరెండర్’దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కొలువైన రాజారామ్ దర్బార్
అయోధ్య: ఆధ్యాత్మిక నగరి అయోధ్య మరోసారి ప్రాణప్రతిష్ట క్రతువులతో పండుగ శోభను సంతరించుకుంది. భవ్య రామమందిరంగా ఖ్యాతికెక్కిన బాలరామాలయంలో తొలి అంతస్తులో నూతనంగా ఏర్పాటుచేసిన ‘రాజదర్బార్’కు వందలాది మంది పండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రాణప్రతిష్టచేశారు. లక్ష్మణ, హనుమ సమేత సీతారాములు రాజసింహాసనంపై ఆసీనులైనట్లు చెక్కిన మహాద్భుతమైన విగ్రహాల ప్రాణప్రతిష్టాపనోత్సవ క్రతువును పండితులు గురువారం దిగ్నిజయంగా జరిపించారు. కృష్ణశిలతో చెక్కిన రామ్లల్లా విగ్రహప్రతిష్టాపన కార్యక్రమంలో గత ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతులమీదుగా జరగ్గా గురువారం నాటి కార్యక్రమం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో జరిగింది. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠం ప్రధానార్చకుని హోదాలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం అత్యంత శుభప్రదంగా భావించే ‘అభిజిత్’ ముహూర్తంలోనే గురువారం ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. యజ్ఞమండపంలో పూజలతో మొదలు.. ఉదయం 6.30 గంటలకు యజ్ఞ మండపంలో ప్రత్యేక పూజలతో ప్రాణప్రతిష్టాపనోత్సవానికి నాంది పలికారు. 9 గంటలకు హోమం మొదలుపెట్టారు. ఏకధాటిగా గంటలపాటు హోమం చేశారు. తొలుత బాలరామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్ విగ్రహాలను ఏర్పాటుచేశారు. సీతారాములు సింహాసనం ఆసీనులై ఉండగా వారికి ఇరువైపులా నిల్చున్న భరత, శతఘ్నులు తన్మయత్వంతో చూస్తున్నట్లు, హనుమ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు, లక్ష్మణుడు మోకరిల్లి ఆరాధిస్తున్నట్లు విగ్రహాలను కొలువుతీర్చారు. కిరీటం, స్వర్ణాభరణాలతోపాటు మత్సా్యకృతిలో కర్ణాభరణాలతో మందహాసంతో ఆశీర్వదిస్తున్నట్లు రాజులా రాముని విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహాల ప్రాణప్రతిష్ట క్రతువులో సీఎం యోగి స్వయంగా పాల్గొని తొలి పూజలుచేశారు. అన్ని ఉపఆలయాల్లోనూ పూజలు అదే సమయానికి ఆరంభించారు. శేషావతార్, శివుడు, గణపతి, హనుమాన్, సూర్య, భగవతి, అన్నపూర్ణ ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా నాలుగు ప్రధాన ఘట్టాల్లో సీఎం యోగి పాల్గొన్నారు. అన్ని ఉప ఆలయాల్లో ఒకే ముహూర్తానికి కార్యక్రమం జరిగేలా ఖచ్చితమైన సమయపాలన పాటించారు. అన్ని ఉపాలయాల్లో కెమెరాలు, పెద్ద తెరలను ఏర్పాటుచేసి ప్రధాన పండితులు యావత్ కార్యక్రమం ఏకధాటిగా కొనసాగేలా పర్యవేక్షించారు. ప్రధాన ఆలయ తొలి అంతస్తులో శ్రీరామదర్బార్, మందిర కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈశాన్య దిశలో శివాలయం, ఆగ్నేయ దిశలో గణపతి ఆలయం, దక్షిణ దిశలో హనుమాన్ దేవాలయం, నైరుతి దిశలో సూర్యదేవాలయం, వాయవ్య దిశలో భగవతి దేవీ ఆలయం, ఉత్తర దిశలో అన్నపూర్ణదేవీ ఆలయాలను ప్రారంభించారు.దేశవ్యాప్తంగా విచ్చేసిన రుత్వికులు ‘‘వేద సంప్రదాయాలను పాటిస్తూ కార్యక్రమాన్ని సవ్యంగా పూర్తిచేశాం. దేశవ్యాప్తంగా ప్రముఖులైన రుత్వికులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. గంగా దసరా జరుపుకుంటున్న రోజే ఉపాలయాల ప్రాణప్రతిష్ట జరగడం కొత్త ఆరంభానికి సంకేతం. శతాబ్దాల పోరాటం, ప్రయాసలు, విశ్వాసాలు ఇలా ఫలవంతమవుతున్నాయి’’ అని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా అన్నారు. ‘‘ రామదర్బార్ ప్రాణప్రతిష్టతో మరో చరిత్రాత్మకమైన ఘటనకు అయోధ్య సాక్షీభూతంగా నిలిచింది. రామదర్బార్ ఇకపై భక్తుల హృదయాల్లో భక్తిభావనను, ఆనందాన్ని మరింత పెంచుతుంది. ప్రజల ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును కాంక్షిస్తూ రాముడి ఆశీస్సులు సదా దేశ ప్రజలపై ఉంటాయి’’ అని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ శ్రీరామదర్బార్సహా ఎనిమిది ఆలయాల ఆరంభోత్సవంలో తొలి పూజలుచేసే భాగ్యం దక్కడం నిజంగా నా అదృష్టం. ఈ కార్యక్రమం ఏక్భారత్–శ్రేష్ట భారత్కు ప్రతీక. రామచంద్రస్వామి విజయానికి గుర్తు’’ అని కార్యక్రమం తర్వాత సీఎం యోగి తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్చేశారు. ‘‘ ప్రాణప్రతిష్టాపన పూర్తయింది. రామరాజ్యానికి మరో ముందడుగు పడింది’’ అని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘‘ గంగా దసరా రోజు ఏదైనా కార్యం ఆరంభిస్తే మహాద్భుతమైన ఫలితాలనిస్తుంది. అందుకే రామాలయ ట్రస్ట్ ఈ రోజునే కార్యక్రమానికి ఎంపికచేసింది’’ అని అయోధ్యలోని జ్యోతిష్యుడు పండిట్ కల్కిరామ్ చెప్పారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఒకేసారి పలు ఉపఆలయాల ప్రారంభోత్సవాన్ని కళ్లారా తిలకించేందుకు పెద్ద సంఖ్యల భక్తులు తరలివచ్చారు. ప్రాణప్రతిష్ట సమయంలో భక్తులు ఆనందతాండవం చేశారు. భక్తుల జైశ్రీరామ్ నినాదాలు, కీర్తనలు, పాటలు, నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. భక్తజనసందోహంతో అయోధ్య పరిసరాలన్నీ ఒక్కసారిగా పండగ కళను సంతరించుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి ఘటనల తర్వాత అయోధ్యలో జరుగుతున్న అత్యంత కీలకమైన కార్యక్రమం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. అయోధ్యకు వచ్చే వాహనాలను తనిఖీలుచేశారు. అయితే నూతన ఆలయాల్లోకి భక్తులను ఇంకా అనుమతించలేదు. భక్తుల సందర్శనలపై శనివారం తుది నిర్ణయం తీసుకునే వీలుంది. వీఐపీలకు సైతం అనుమతి లేదని జిల్లా మేజి్రస్టేట్ నిఖిల్ తుకారామ్ పాండే చెప్పారు. తొలుత ప్రధానాలయం తొలి అంతస్తులోని రాజదర్బార్లోకి మాత్రమే భక్తులను అనుమతించే అవకాశం ఉంది.

180 మీటర్ల రైడ్కు ఓలా!
రద్దీ ట్రాఫిక్లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్ను బుక్ చేసుకుని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్కు ఊహించని ఘటన ఎదురైంది. నవ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ‘రోహిత్ వ్లోగ్స్టర్’లో పొందుపరిచారు. ఒక టీనేజీ అమ్మాయి బుక్ చేసిన ఆ రైడ్ తాలూకు పూర్తి వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్ నుంచి ఓలా బైక్ రైడ్ బుక్ అవడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్కు చేరుకున్నాడు. ట్రాఫిక్ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్ ఎందుకు బుక్చేసుకుందా అని ఒకింత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్లో సరిచూశాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్లదూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ అవసరమా? అని నేరుగా అడిగేశాడు. ‘‘ దూరం తక్కువే. కానీ కుక్కలే ఎక్కువ’’ అని అమ్మాయి చెప్పిన సమాధానంతో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం రూ.19 బిల్లు అయ్యింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్లిపోవడం చూసి అవాక్కవడం అబ్బాయి వంతయింది. ‘ View this post on Instagram A post shared by ROHIT VLOGSTER (@rohitvlogster) 180 మీటర్లకు కూడా బైక్ బుక్ చేయొచ్చని నాకూ ఇప్పుడే అర్థమైంది. రైడ్ స్టార్ట్ చేసి అమ్మాయిని కారణం అడిగి, ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్ వచ్చేసింది’’ అని రైడర్ ఒక పోస్ట్లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్ డాగ్కు డాగేశ్ అనే పేరు పెట్టి.. ‘డాగేశ్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. డాగేశ్ అంటే మజాకానా!! అని మరొకరు స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ

పెళ్లి బరాత్తో దద్దరిల్లిన వాల్స్ట్రీట్
మన దేశంలో ఏం రేంజ్లో వివాహ వేడుకలు జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. అందుకోసం పెట్టే డీజేలు, బరాత్ల సందడితో ఊరు ఊరే హోరెత్తిపోతుంది. పైగా పెళ్లి వేడుక కావడంతో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పారు. ఓ వీధిలో పెళ్లి ఊరేగింపుతో కోలాహాలంగా ఉంటే..ఆటోమేటిగ్గా ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోతుంది..వాహనదారులు, బాటసార్లు మరోదార్లో వెళ్తారు. అది సర్వసాధారణం. మరీ దేశం కానీ దేశంలో అదే రేంజ్లో ఆర్భాటంగా పెళ్లి చేయాలంటే.. కష్టమనే చెప్పాలి. (చదవండి: క'రెంట్' ట్రెండ్..అద్దెకు అ'డ్రెస్'..! ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి రీల్స్ వరకు..)ఎందుకంటే ఎన్నో పర్మిషన్లు కావలి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం, ట్రాఫిక్కి అంతరాయం కలుగకుండా ఆయా అధికారుల నుంచి అనుమతి వంటివి ఎన్నో కావాలి. మరీ ఈ పెళ్లి సముహం అనుమతి తెచ్చుకుని మరీ ఏకంగా వాల్స్ట్రీట్లో వివాహ వేడుక ధూం ధాంగా నిర్వహించింది. అచ్చం మన దేశంలో నిర్వహించినట్లుగా పెళ్లి బరాత్ నిర్వహించి..ఓ లెవెల్లో ఆడిపాడి ఎంజాయ్ చేశారు వారంతా. ఈ వేడుక కోసం అత్యంత రద్దీగా ఉండే వాల్స్ట్రీట్ మూసేశారు. ఆ వాల్స్ట్రీట్ వీధుల్లో దాదాపు 400 మంది పెళ్లి సముహంతో కోలాహాలంగా ఉంది. అందుకోసం పెళ్లి వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఉంటారో కదూ..!. ఎందుకంటే మన కరెన్సీ ప్రకారం..లక్షలకు పైగానే ఛార్జ్ చేస్తారు. అక్కడ ఓ పక్క డీజే మ్యూజిక్ సందడి..మరోవైపు ఆ బీట్లకు అనుగుణంగా డ్యాన్స్లతో కన్నులపండుగ ఉంది. ఈ వేడుక జరిగేలా సహకరిస్తుందా అన్నట్లు వాల్స్ట్రీట్ వీధులు వాహానాల రద్దీ లేకుండా నిర్మానుష్యంగా ఉన్నాయి. నెటిజన్లు మాత్రం మన వివాహ సంప్రదాయాలు న్యూయార్క్ వీధుల్లోకి వచ్చేశాయి. పైగా అక్కడ ఉండే స్థానికులు ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి వేడుకలో భాగమవ్వడం చూస్తుంటే.. మన సంస్కృతికి ఉన్న గొప్పదనం మరోసారి తేటతెల్లమైంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఇంకెందు ఆలస్యం అందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by DJ AJ (@djajmumbai) (చదవండి: పచ్చి క్యాబేజ్ సలాడ్లు తింటున్నారా..? నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్)

FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు
ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలో ఘనంగా జరిగాయి. మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు , స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు. పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగుఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయములో మలేషియ లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడు కోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించామని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్లో అమరులైన జవాన్లకు, పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు . ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి శ్రీమతి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణ మూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్ ,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార మాధ్యమాలలో దీని గురించి తెలియ జేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను info@fnca.com.my or website www.fnca.com.my సంప్రదించాలని బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు. ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్)

అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు)
క్రైమ్

వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు రమేష్నాయుడు (45) దారుణహత్యకు గురయ్యారు. స్వగ్రామం నుంచి రాత్రి ఏడు గంటలకు మినరల్ వాటర్ కోసం నన్నూర్ నుంచి బైక్పై వస్తుండగా మీదివేముల సమీపంలోని దిగువయ్య దర్గా మలుపు వద్ద కాపుకాసిన గుర్తుతెలియని దుండగులు బైక్ను ఆపి రమేష్నాయుడుపై దాడిచేశారు. ఆయన బైక్ దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, వెంబడించి పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. దీంతో రమేష్నాయుడు కిందపడిపోవడంతో ఆయన ముఖంపై బండరాయితో విచక్షణారహితంగా.. గుర్తుపట్టలేని విధంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకు‡్ష్యలు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని రమేష్నాయుడు హత్య తీరును పరిశీలించి సీఐ చంద్రబాబునాయుడుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రబాబునాయుడు తెలిపారు. రమేష్నాయుడికి భార్య లక్ష్మీదేవితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. తమ పార్టీ బుధవారం నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని, గ్రామంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందునే టీడీపీ వర్గీయులు ఓర్వలేక ఆయనను హత్యచేశారని నంద్యాల వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా ఈయన ఇంటిపై దాడిచేశారన్నారు.రాజకీయ నేపథ్యం..రమేష్నాయుడు మొదటి నుంచి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డికి సన్నిహితంగా మెలిగేవారు. ఇతని కుటుంబం మీద నాయకులకు అపారమైన నమ్మకం ఉండడంతో 2014 స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆయన మంచితనం కారణంగా ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత 2019లో విశేషమైన సేవలు అందించారు. రమేష్నాయుడు హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు.

మావోయిస్టు సుధాకర్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చర్ల: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విప్లవ రాజకీయ పాఠశాల ఇన్చార్జ్ తెంటు లక్ష్మీ నరసింహాచలం (67) మరణించాడు. ఆయనకు గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి అలియాస్ రామరాజు అలియాస్ బాలకృష్ణ అలియాస్ అరవింద్ అనే పేర్లు కూడా ఉన్నాయి.సుధాకర్ పేరుతో పార్టీలో ఆయన సుప్రసిద్ధుడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించి నెల తిరక్కముందే మరో కీలక నేతను కోల్పోవటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయ్యింది. కీలక నేతలున్నారన్న సమాచారంతో..: ఇంద్రావతి అటవీ ప్రాంతంలో సుధాకర్తోపాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, మరికొంతమంది కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసు బలగాలు బుధవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని, అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా సుధాకర్ మృతదేహం లభించిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47 తుపాకీ, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. సుధాకర్పై రూ.40 లక్షల రివార్డు ఉంది. శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నక్సలైట్లతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ తండ్రి రామకృష్ణుడు, తల్లి సరస్వతి. వీరికి సుధాకర్ 6వ సంతానం. సత్యవోలులో సుధాకర్ సోదరుడు తెంటు ఆనందరావు నివసిస్తున్నారు. సుధాకర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన చింతలపూడి మండలం ప్రగడవరంలో 10వ తరగతి, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 1972లో చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. చివరిసారిగా 1983లో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడ్డానికి వచ్చి నపుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో 2013లో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించాడు. సుధాకర్ 43 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. 2024–25 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 403 మంది మావోయిస్టులు మృతి చెందారని సుందర్రాజ్ వెల్లడించారు.