చెట్టుపై నుంచి జారిపడియువకుడికి గాయాలు
డుంబ్రిగుడ: కట్టెల కోసం చెట్టెక్కిన ఓ గిరిజన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి గాయాలు పాలైన సంఘటన మండలంలోని లైగండ పంచాయతీ ఇసుకగరువలో చోటు చేసుకుంది. గ్రామనికి చెందిన తాంగుల ప్రశాంత్కుమార్ ఉదయం వంట చెసుకునేందుకు కట్టెలు సేకరణకు చెట్టెక్కాడు. కట్టెలు కొట్టె క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడ్డాడు. ప్రమాదంలో కుడి కాలు విరిగి తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టడుతుండగా కుటుంబీకులు హుటాహుటిన 108కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి సిబ్బంది అర్జున్, శ్యామ్ ప్రథమచికిత్స అందించిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment