ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట | - | Sakshi
Sakshi News home page

ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట

Published Sat, Apr 19 2025 5:07 AM | Last Updated on Sat, Apr 19 2025 5:07 AM

ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట

ముత్యాలమ్మ ఉత్సవానికి ముహూర్తపు రాట

చింతపల్లి: మండల కేంద్రంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకూ ముత్యాలమ్మ తల్లి జాతర జరగనుంది. జాతరకు సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీ అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జాతర ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయం వద్ద ముహుర్తపు రాట వేశారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్థలతో జరిగింది. ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దురియా హేమంత్‌కుమార్‌, పసుపులేటి వినాయకరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనూషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు బాలయ్య, భక్తులు పాల్గొన్నారు. జాతర విజయవంతానికి అందరూ అన్ని విధాలుగా సహకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. బేతాళుడు, జోగేశ్వరరావు, రమణమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement