ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు కొన్ని... | - | Sakshi
Sakshi News home page

ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు కొన్ని...

Published Wed, Feb 19 2025 1:03 AM | Last Updated on Wed, Feb 19 2025 1:03 AM

-

జిల్లా అంతటా మంగళవారం చలి వాతావరణం కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

● అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న నారాయణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి చరణ్‌ మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ●

● గార్లదిన్నె సమీపంలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాల ఆవరణలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● అనంతపురం బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

● ఇటీవల సోములదొడ్డి సమీపంలో శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడు. వారం తర్వాత తిరుమలలో ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

● రెండేళ్ల క్రితం భవ్యశ్రీ అనే ఇంటర్‌ విద్యార్థిని అనంతపురం నగరంలోని నారాయణ క్యాంపస్‌ బిల్డింగ్‌ పై నుంచి దూకింది. సుదీర్ఘకాలం చికిత్స పొంది అదృష్టవశాత్తూ మృత్యువు నుంచి బయటపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement