పరమేశ్వరా.. పరంధామ పాహిమాం.. అంటూ భక్తుల నామస్మరణతో శైవాలయాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శివాలయాల్లో మహా శివరాత్రి శోభ నెలకొంది. అనంతపురం మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
గురువారం రాత్రి పార్వతీ పరమేశ్వరులు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కళాకారుల భక్తి గీతాలాపన, కోలాట ప్రదర్శనలతో సందడి నెలకొంది.
తాడిపత్రి మండలంలోని బుగ్గ
రామలింగేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు గురువారం భక్తిశ్రద్ధలతో శ్రీకారం చుట్టారు. ఆలయంలో పార్వతీ సమేత స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
–అనంతపురం కల్చరల్/ తాడిపత్రి రూరల్
Comments
Please login to add a commentAdd a comment