పెంకుటింటికి భారీగా బిల్లు | 69 thousand electricity bill to a house | Sakshi

పెంకుటింటికి భారీగా బిల్లు

Jan 11 2025 4:55 AM | Updated on Jan 11 2025 4:55 AM

69 thousand electricity bill to a house

ఏకంగా రూ.69 వేల కరెంటు బిల్లు 

రెండు బల్బులు వాడే గిరిజన కుటుంబం బెంబేలు 

గత నెల 113 యూనిట్లకు మైనస్‌ రూ.1,496

ఈ నెల 349 యూనిట్లతో ప్లస్‌ రూ.69,314.91 బిల్లు

సాక్షి, పాడేరు: అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్‌ బిల్లు షాక్‌ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్‌ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్‌ రూ.1,496 విద్యుత్‌ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్‌ విద్యుత్‌ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. 

అప్పుడప్పుడు టేబుల్‌ ఫ్యాన్‌ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్‌ బిల్లు వస్తోంది. కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్‌ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్‌ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్‌ వినియోగం చూపి రూ.1,496 మైనస్‌ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్‌ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్‌ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్‌ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్‌ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement