current bill
-
ఓ నెల విద్యుత్ బిల్లు.. రూ.30,758
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సీఎం అయ్యాక కరెంట్ బిల్లుల మోతకు ఇదో నిదర్శనం. కర్నూలులోని అజీముద్దీన్నగర్కు చెందిన ఉస్మాన్ బాషా ఇంటికి మూడు నెలలుగా వస్తున్న విద్యుత్ బిల్లులను పరిశీలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆయన ఇంటికి అక్టోబర్ మాసం వినియోగానికి సంబంధించి రూ.3,380, నవంబర్కు సంబంధించి రూ.7,723, డిసెంబర్కు సంబంధించి ఏకంగా 30,758 బిల్లు రావడంతో బెంబెలెత్తిపోతున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. -
అనకాపల్లి: జిమ్ కు కోటి రూపాయల కరెంటు బిల్లు
-
పెంకుటింటికి విద్యుత్ అధికారుల పరుగులు
సాక్షి, పాడేరు: ‘పెంకుటింటికి భారీగా బిల్లు’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో విద్యుత్ అధికారులు పాత పాడేరు గ్రామానికి శనివారం ఉదయాన్నే పరుగులు పెట్టారు. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటిలోని మీటరుతో పాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి గత నెల, ఈ నెల వచి్చన విద్యుత్ బిల్లులను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత మీటరును సీజ్ చేసి.. అనకాపల్లిలోని ట్రాన్స్కో ల్యాబ్కు పంపించారు. ఆ వెంటనే కొత్తగా మరో మీటరును అమర్చారు. ఈ విషయంపై పాడేరు ఏఈఈ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. గత నెలలో మైనస్ రూ.1,496 బిల్లు వచ్చి.. ఈనెలలో ప్లస్లో రూ.69,314.91 బిల్లు రావడంపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పారు. పాత విద్యుత్ మీటరును అనకాపల్లిలోని ల్యాబ్కు పంపించామని తెలిపారు. అక్కడి పరిశీలన అనంతరం విద్యుత్ బిల్లు తగ్గింపు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. -
పట్టపగలే చుక్కలు లెక్కపెట్టించిన చంద్రబాబు
-
పెంకుటింటికి భారీగా బిల్లు
సాక్షి, పాడేరు: అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది. కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. -
బిల్లులు భగభగ! ఇదేం బాదుడు బాబూ!
ఎవరిదీ అపరాధం?శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో నివసించే గృహిణి విజయ ఇంటికి ఈసారి రూ.4,950 కరెంట్ బిల్లు రావడంతో ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. జనరల్ కేటగిరీకి చెందిన ఆమె ఇంటికి గతంలో బిల్లు ఎప్పుడూ రూ.150 నుంచి రూ.250 దాటలేదు. 3 నెలలుగా బిల్లు ఇవ్వకుండా డిసెంబర్లో షాక్ కొట్టేలా బిల్లు ఇచ్చారు. దీనిపై ఆమె పలుమార్లు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లినా ఫలితం శూన్యం. దీంతో గత్యంతరం లేక అపరాధ రుసుముతో సహా రూ.5 వేలు బిల్లు చెల్లించినట్లు బాధితురాలు తెలిపారు.ఇంతలో ఎంత భారం!పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడెంలో నివసించే వెలిశెట్టి అచ్చుత గణేష్ వ్యవసాయదారుడు. ఆయన ఇంటికి సెపె్టంబర్లో 139 యూనిట్లు విద్యుత్ వినియోగించగా రూ.684.53 బిల్లు వచ్చింది. ఇప్పుడు శీతాకాలం కావడంతో వాడకం తగ్గింది. నవంబర్లో కేవలం 115 యూనిట్లు మాత్రమే వాడినా బిల్లు మాత్రం రూ.756.97 వచ్చింది. 24 యూనిట్లు తక్కువ వాడినప్పటికీ బిల్లు రూ.72.44 పెరిగింది. పైగా ఇందులో గణేష్ వినియోగించిన విద్యుత్కు చెల్లించాల్సిన చార్జీ రూ.464.97 మాత్రమే. అంటే కూటమి ప్రభుత్వం ఆయనపై అదనంగా రూ.292 భారం వేసింది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందక.. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో సతమతవుతున్న తమపై ఇలా అదనపు భారం మోపడం అన్యాయమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బోణం గణేష్, ‘సాక్షి’ ప్రతినిధి: రాష్ట్రంలో చలితోపాటు కరెంట్ బిల్లులు పొగలు కక్కుతున్నాయి! ప్రతి నెలా పెరిగిపోతున్న విద్యుత్తు చార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతకాలంలో వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పైపైకి వెళుతూనే ఉన్నాయి. గతంలో నెలకు రూ.రెండు మూడొందలు దాటని వారికి సైతం రూ.వేలల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్కు గురవుతున్నారు. రైతన్నలు, మహిళలు ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. విద్యుత్తు శాఖ సిబ్బంది అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేస్తున్నారు. రూ.6,000 కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడుకే బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో రూ.9 వేల కోట్లకుపైగా భారం పడనుండటంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మొత్తంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల పిడుగును టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీవినీ ఎరుగని రీతిలో హై ఓల్టేజీ షాకులిస్తున్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. సబ్సిడీలు లేవ్.. చార్జీల బాదుడేగతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు రూ.20 వేల కోట్ల సర్దుబాటు చార్జీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటగట్టి దిగిపోయింది. అయినా సరే ఆ భారాన్నంతా ప్రజలపై మోపకుండా గత ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ.47,800.92 కోట్లను అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. తాజాగా కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించకుండా వినియోగదారులపైనే చార్జీల భారాన్ని మోపుతోంది.ఇదేం బాదుడు బాబూ! విద్యుత్ చార్జీలు పెంచి మధ్య తరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం పెను భారం మోపుతోంది. అకో్టబర్ నెలలో 140 యూనిట్లు వాడితే రూ.694 బిల్లు వచ్చింది. నవంబర్లో 114 యూనిట్లే వాడినా రూ.741 బిల్లు వచ్చింది. ఇదేం బాదుడు బాబూ! తక్కువ వినియోగించినా అదనంగా మాపై భారం మోపడం సరికాదు. – సుబ్బ రత్తమ్మ, మార్కాపురం, ప్రకాశం జిల్లా ⇒ విశాఖలోని ఆరిలోవలో ఓ ఇంటికి నవంబర్లో 150 యూనిట్లకు రూ.705.69 బిల్లు వచ్చింది. డిసెంబర్ 10న తీసిన రీడింగ్లో 131 యూనిట్లకు రూ.816.79 బిల్లు జారీ అయింది. ⇒ కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మహమ్మద్ రఫీ వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన దుకాణానికి 55 యూనిట్లు విద్యుత్ వినియోగించినందుకు నవంబర్లో రూ.599 బిల్లు వచ్చింది. ఈ నెల 58 యూనిట్లు వాడగా రూ.794 బిల్లు జారీ చేశారు. కేవలం మూడు యూనిట్లు అదనంగా వాడినందుకు రూ.195 ఎక్కువగా బిల్లు వచ్చింది.ఇలా బాదేస్తున్నారు..విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి. గత నెల కంటే ఈ నెల వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు తగ్గలేదు. అదనపు చార్జీలంటూ వేశారు. వ్యవసాయం చేసుకుని బతికేవాళ్లం. ఇంతంత బిల్లులు మేమెలా కట్టగలం? కరెంటు చార్జీలు పెంచబోమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడేమో ఇలా బాదేస్తున్నారు. – చిగురుపాటి మహేష్, కొమ్ముగూడెం.మా డబ్బులతో సంపద సృష్టి! శీతాకాలం కావడంతో ఇంట్లో ఫ్యాను కూడా సరిగ్గా వాడటం లేదు. పగలంతా పొలాల్లోనే పనులు చేసుకుంటూ ఉంటాం. సాయంత్రానికి ఇంటికొస్తాం. విద్యుత్ వాడకం బాగా తక్కువ. బిల్లులు మాత్రం బాగా పెరిగిపోయాయి. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెబితే నిజమనుకున్నాం. కానీ ఇలా మాపై భారం వేసి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెంచుతారనుకోలేదు. – సూర్పని గోపీకృష్ణ, రైతు, కొమ్ముగూడెం.ఫెర్రో అల్లాయిస్పై పెను భారం ఫెర్రో అల్లాయిస్ కంపెనీల్లో విద్యుత్ చాలా కీలక అంశం. ఇప్పటికే పరిశ్రమ తీవ్ర కష్టాల్లో ఉంది. ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపు మరింత కుంగదీస్తోంది. దీంతో చాలా ఫెర్రో అల్లాయిస్ కంపెనీలు క్యాపిటివ్ పవర్ వైపు మళ్లుతున్నాయి. మేం రాష్ట్రం నుంచి ఒక్క యూనిట్ కూడా కొనుగోలు చేయడం లేదు. పూర్తిగా సొంత విద్యుత్ యూనిట్ నుంచే సమకూర్చుకుంటున్నాం. కానీ గ్రిడ్ సపోర్ట్ చార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. వీటిని తగ్గించాలని సుప్రీం కోర్టు దాకా వెళ్లి పోరాడుతున్నాం. – నీరజ్ శర్దా, డీఎండీ, శర్దా మెటల్స్ అండ్ అల్లాయిస్ మన రాష్ట్రంలో అధికం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అధికంగా ఉండటం పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రతికూలంగా ఉంది. విద్యుత్ చార్జీలను రేషనలైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పొట్లూరి భాస్కరరావు, ప్రెసిడెంట్, ఏపీ చాంబర్స్⇒ కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సత్యనారాయణ శెట్టి ఇంటికి నవంబర్లో 98 యూనిట్లకు రూ.482 బిల్లు వచ్చింది. డిసెంబర్లో 92 యూనిట్లకు రూ.574 బిల్లు జారీ అయింది.⇒ కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబళం ప్రాంతానికి చెందిన బల్లెకల్ నరసయ్య ఇంటికి నవంబర్లో రూ.189 బిల్లు రాగా ఈ నెల కరెంట్ బిల్లు రూ.335 వచ్చింది. వీరు కేవలం రాత్రి పూట మాత్రమే విద్యుత్ వాడతారు. అయినా సరే రూ.146 అదనపు భారం పడింది.తగ్గించమని కోరాం విద్యుత్ చార్జీల పెంపు ఎంఎస్ఎంఈలకు భారంగా మారింది. పెంచిన చార్జీలను తగ్గించాలని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. – వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా భారంగా కొత్త కనెక్షన్లు ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ నెలకొల్పి కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం చాలా భారంగా ఉంది. కనెక్షన్ తీసుకోవాలంటే కనీసం రూ.ఐదారు లక్షలకు పైనే ఖర్చు అవుతోంది. ఈ భారాన్ని సబ్సిడీ రూపంలో భరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి చార్జీల పెంపు మరింత భారంగా మారింది. – మామిడి సుదర్శన్, అధ్యక్షుడు, దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్. -
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై కరెంట్ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై కొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది. ఈ మేరకు డిస్కంలు ఇంటింటికి పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు పంపిణీ చేస్తున్నాయి. దీంతో ప్రజలపైవిద్యుత్ చార్జీల భారం మోపి 6,072 కోట్లు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు చూసి వినియోగదారులు గొల్లు మంటున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు రోజు వారి వేతన జీవులు, రైతులు, చిరు వ్యాపారులు పాలిట శాపంగా మారాయి. అద్దె గృహాల్లో చాలీచాలని జీతాలతో కుటుంబాలు నడిపే వారిపై విద్యుత్ చార్జీల పెను భారంగా తయారయ్యాయి. విద్యుత్ చార్జీల భారంతో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు 5 నెలల్లోనే 15,500 కోట్ల విద్యుత్ భారం మోపి వసూళ్లు చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఈ విద్యుత్ చార్జీలు మరింత పెరగనున్నాయి. ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు పూనుకుంది.ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. -
ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్’ ఉచిత విద్యుత్ కట్
నెల రోజులుగా చీకట్లోనే.. 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది. – కొల్లి విమల, రెడ్డిగణపవరంఅన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్ బిల్లు రావడంతో షాక్ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్ నెలాఖరున అధికారులు వారి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభుత్వం ఉచితంగా అందించిన విద్యుత్ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు. మీటర్ల తొలగింపు... దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచిత విద్యుత్ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు వినియోగించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్ మీటర్లు తొలగించి తీసుకుపోతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉచిత విద్యుత్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు. గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – డోలా కాశమ్మ, రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా గత ఐదేళ్లు అడగలేదు.. గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ బిల్లు కట్టాలంటూ విద్యుత్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. – కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా బకాయిలు కడితేనే కనెక్షన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్ నెలాఖరున విద్యుత్ కనెక్షన్ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్ ఇస్తామంటూ మీటర్ తీసుకెళ్లిపోయారు. – బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. అంధకారంలో అవస్థలు.. పాత బకాయిల పేరుతో కరెంట్ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం, మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు. – అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ను కట్ చేసింది. దీనిపై విద్యుత్శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం. – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘ఉచితాలు అమెరికా దాకా వెళ్లాయి’.. ట్రంప్ పోస్టుపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఉచిత పథకాల ప్రకటన అమెరికా వరకు వెళ్లాయంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రావాల్ పేర్కొన్నారు. ఈమేరకు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ చేసిన పోస్టును కేజ్రావాల్ రీట్వీట్ చేశారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైతే కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లా’ అని తెలిపారు.కాగా దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం.. ప్రజలకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఉచితాల పేరుతో ఆప్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడుతోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ ఉచితాలు ప్రకటిస్తున్నారని విమర్శిస్తోంది. అయితే, పేదల సంక్షేమం కోసమే తాను వాటిని అమలు చేస్తున్నానంటూ కేజ్రీవాల్ సమర్థించుకోవడమూ తెలిసిందే.తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తా. మన విద్యుత్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఈ చర్యల వల్ల అమెరికా మరీ ముఖ్యంగా మిచిగాన్లో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి’ అని ఎక్స్ వేదికగా వెల్లడించారుఅంతేగాక ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లోగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటిస్తే బీజేపీ తరపున ఢిల్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని ప్రధాని మోదీకివాల్ విసిరారు. నవంబర్లో జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకు ఆప్ సిద్ధంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలంటే రెట్టింపు అవినీతి, రెట్టింపు దోపిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగమని విమర్శించారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే తమ సర్కారు ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, నీళ్లు, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు, ఆరోగ్యం, విద్య అదృశ్యమైపోతాయని అన్నారు. -
వామ్మో.. రూ.21.47 కోట్ల కరెంట్ బిల్లు..
బిజినేపల్లి: గ్రామజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఓ వైపు వినియోగదారులకు జీరో బిల్లు ఇస్తుంటే.. మరోవైపు నాగర్కర్నూల్ జిల్లాలో ఓ సాధారణ వ్యక్తికి విద్యుత్ సిబ్బంది రూ.కోట్లలో బిల్లు ఇచ్చి షాకిచ్చారు. సాధారణంగా ఓ వినియోగదారునికి కరెంట్ బిల్లు నెలకు రూ.500 వరకు వస్తుంది. ఏసీ, ఫ్రిడ్జ్, గీజర్ వంటి వస్తువులు వాడితే.. రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వస్తుంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్కు చెందిన వేమారెడ్డికి ప్రతీ నెల రూ.వందల్లో బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాల్సిందిగా బిల్లు ఇచ్చి వెళ్లారు.ఆలస్యంగా ఆ బిల్లు చూసుకున్న వేమారెడ్డికి ఒక్కసారి షాక్ కొట్టిన ట్లు అయింది. తమకు సాధా రణంగా రూ.వందల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో రావడం ఏమిటని ఆందోళన చెందుతూ ఆయన విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించారు. దీనిపై ఏఈ మహేశ్ను వివరణ కోరగా జీరో బిల్లు చేసే సమయంలో అలా వచ్చిందని.. తిరిగి రీఎంట్రీ చేయడం ద్వారా మళ్లీ సాధారణంగా వచ్చి0దని తెలిపారు. -
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్!
పటాన్చెరు: సైబర్ వలలో పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.4.52 లక్షలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ పరిధిలోని గ్రీన్విలాస్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ డిసెంబర్ 18వ తేదీన వాట్సాప్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆ ఉద్యోగి వివరాలను నమోదు చేశాడు. సైట్ నిర్వాహకులు అతడికి ఒక వ్యాలెట్ ఐడీ క్రియేట్ చేసి ఇచ్చారు. ఉద్యోగి ముందుగా రూ.3 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్లు చేయడం మొదలు పెట్టాడు. తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తూ వచ్చారు. ఈ మేరకు బాధితుడు మొత్తం రూ. 4.52 లక్షలు చెల్లించాడు. చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించలేదు. బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం అమీన్పూర్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ బిల్లు లింక్ క్లిక్ చేసి.. అదే విధంగా అమీన్పూర్ పరిధిలోని ఉసుకే బాయికి చెందిన ఓ వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీన విద్యుత్ బిల్ కట్టలేదని ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా టీం వివర్ లింక్ను క్లిక్ చేశాడు. వెంటనే బాధితుడి ఫోన్ అపరిచిత వ్యక్తి ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడు ఖాతాలో ఉన్న రూ.1.51 లక్షల నగదును మాయం చేశారు. ముందుగా సదరు వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి, బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పర్సనల్ లోన్ ఇప్పిస్తానని.. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్గూడా సిద్ధార్థ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి గతేడాది మార్చి 24వ తేదీన పర్సనల్లోన్ ఇస్తామంటూ ఫోన్కాల్ వచ్చింది. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా బాధితుడు ముందుగా రూ.16 వేలు, తర్వాత రూ.40 వేలు వేశాడు. అపరిచిత వ్యక్తిని లోన్ ఇప్పించకపోవడంతో బాధితుడు తాను మోసం పోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్లో స్కూటీ కొందామని.. హత్నూర( సంగారెడ్డి): ఆల్లైన్ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర మండలం కోన్యాల గ్రామానికి చెందిన చిలిపిచెడ్ నవీన్ మంగళవారం ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన స్కూటీ వాహనాన్ని చూశాడు. అక్కడ ఉన్న నంబర్కు ఫోన్ చేయగా స్కూటీ ధర రూ.18,000 అని తెలిపాడు. వాట్సాప్కు ఆర్సీ పంపగా, అన్ని సరిగానే ఉన్నాయని నవీన్ అమ్మకందారుడి ఫోన్ పే నంబర్కు డబ్బులు పంపాడు. అయితే, ఆ డబ్బులు అకౌంట్లో కనిపించడం లేదని మరో రూ.13,000 పంపితే కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ డబ్బులు వేశాడు. ఇలా నాలుగు దఫాలుగా రూ.75 వేల వరకు పంపాడు. స్కూటీ కోసం ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానట్లు భావించిన యువకుడు వెంటనే 1903కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: జులాయిగా తిరుగొద్దని మందలించడంతో యువకుడి విషాదం! వాట్సాప్ స్టేటస్లో -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా !
-
కరెంట్ బిల్లుల పెంపును వ్యతిరేకించింది కేసీఆరే: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: రైతులకు 3 గంటల కరెంట్ చాలు అనుకుంటూ కుడితిలో పడ్డ ఎలుక మాదిరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొని ప్రజాగ్రహానికి గురవుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసిన హరీష్ రావు.. ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అందరికి తెలుసని అన్నారు. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంత కంటే పెద్ద జోక్ ఉండదు. నాటి సీఎం చంద్రబాబు కరెంట్ బిల్లులు పెంచితే తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్యే. ఉద్యమం పుట్టిందే విద్యుత్లో నుంచి అయితే.. కాల్పులకు కేసీఆర్ కారణం అనడం సరికాదు. విద్యుత్ విషయంలో కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. 2000 ఆగష్టు 28న బషీర్ బాగ్లో కాల్పులు జరిగితే కేసీఆర్ రైతు హృదయంతో స్పందించారు. అధికార పార్టీలో కొనసాగుతూ.. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరారు. అదే రోజు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి చంద్రబాబుకు లేఖ రాశారు. విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే తెలంగాణ జెండా ఎత్తి పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. నాడు చంద్రబాబు రైతులను కాల్చి చంపితే.. కడుపు రగిలి మా రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, బిల్లులు తగ్గించాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని లేఖలో పేర్కొన్నారు. కరెంట్ కోసం పోరాడింది కేసీఆర్ కాదా. ఆయన మీద అభాండాలు వేస్తున్నారు( ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి పదవి, ఎంపీ పదవులను కేసీఆర్ గడ్డిపోచల్లా మాదిరిగా కేసీఆర్ వదిలేశారు. మీరేమో పదవుల కోసం చొక్కాలను మార్చినట్టు పార్టీలను మారుతున్నారు. కానీ కేసీఆర్ ప్రజల కోసం పదవులను వదులుకున్నారు. ఇవాళ కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరు. కరెంట్ వస్తలేదని అంటున్నారు కదా.. డైరెక్ట్ వెళ్లి కరెంట్ తీగలను పట్టుకుంటే, కరెంట్ స్వీచ్ బోర్డులో వేలు పెడ్తే తెలుస్తుంది’ అని హరీష్ రావు చురకలంటించారు. -
ఓ చిన్న రేకుల షెడ్కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు
ఓ చిన్న రేకుల షెడ్కి అది కూడా రెండు ఎల్ఈడీ బల్బులకు ఏకంగా లక్ష రూపాయాల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలో చోటు చోసుకుంది. కర్ణాకలోని దారిద్య రేఖకు దిగువునన ఉన్న ప్రజలకు విద్యుత్్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం భాగ్యజ్యోతి పథకం కింద మహిళలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ అందిచింది. ఆ పథకం కిందే కరెంట్ పొందింది 90 ఏళ్ల వృద్ధురాలు. ఐతే ఆమెకు ఉన్న చిన్న రేకుల షెడ్డులాంటి ఇంటిలో రెండు ఎల్ఈడీ బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. వాటికి నెలకు మహా అయితే రూ. 70 లేదా రూ. 80ల కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఆమెకు మే నెలలో మాములుగా రాలేదు కరెంట్ బిల్లు. దాన్ని చూసి ఆ వద్ధురాలికి కళ్లు తిరిగినంత పనయ్యింది. వందో వెయ్యో కాదు ఏకంగా రూ. 1,03,315 బిల్లు వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్కి గురైంది. ఈ విషయం తెలుసుక్నున విద్యుత్ శాఖ అధికారులు ఆ వృద్ధురాలి ఇంటికి చేరకుని విచారించారు. మీటర్లో లోపం ఉందని, రీడింగ్ తీసిన వ్యక్తి కూడా తప్పుగా చూసినట్లు తేలింది. అంతేగాదు అధికారులు ఆమెను ఆ బిల్లును చెల్లించవద్దని, తాము దీన్ని సరిచేస్తామని ఆ వృద్ధురాలికి హామీ ఇచ్చారు. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
గుండె గు‘బిల్లు’!.. ఖాళీగా ఉన్న ఇంటికి రూ. 7,97,576 కరెంట్ బిల్లు
సాక్షి, ఉప్పల్: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్ను చెక్ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ పోర్షన్కు ఉన్న విద్యుత్ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్లో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చెక్ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్కు డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్ చెక్ చేయించారు. మీటరు డిఫెక్ట్ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్ సర్కిల్ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్ -
హంపీ వర్సిటీ కరెంట్ బిల్లు రూ. 85 లక్షలు
హొసపేటె: కర్ణాటక రాష్ట్ర ప్రతిష్టిత కన్నడ విశ్వవిద్యాలయానికి ఈసారి రూ.85 లక్షలు వరకు విద్యుత్ బిల్లు రావడంతో వీసీ డాక్టర్.డీవీ.పరమశివమూర్తి కంగుతిన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వర్సిటీ ఇంత పెద్ద మొత్తంలో బిల్లు చెల్లించడం అసాధ్యమని, బిల్లు మాఫీ చేయాలని కోరుతూ వీసీ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
కాంగ్రెస్ చెప్పింది కరెంట్ బిల్లులు కట్టం.. విద్యుత్ శాఖ అధికారిపై దాడి
కర్ణాటకలో కరెంట్ బిల్లు పంచాయితీ చినికి చినికి గాలివానలా తయారైంది. ‘మేం కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’ అంటూ పలు గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. కరెంటు బిల్లులు కట్టాలన్న అధికారులకు ఎదురు తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు చెప్పారు కాబట్టి విద్యుత్ బిల్లులు కట్టేది లేదని చిత్రదుర్గ జిల్లా జాలికట్టెలో ఇటీవల గ్రామస్తులు మొండికేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గ్రామంలో మీటర్ రీడింగ్ కోసం వచ్చిన విద్యుత్ అధికారిపై ఓ వ్యక్తి రెచ్చిపోయి ప్రవర్తించాడు. అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చేయిచేసుకున్నాడు. అంతటితో ఆగకుండా చెప్పుతో దాడి చేశాడు. దీన్నంతటిని మరొకరు వీడియో తీయగా.. అతనిపై సైతం ఆవేశంతో అరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. Electricity officials are attacked by local residents in Karnataka when they came for meter reading. Residents says that they won’t pay from electricity now onwards as per Congress Guarantee pic.twitter.com/T0sVUjD2Ux — Rishi Bagree (@rishibagree) May 24, 2023 కాగా, అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. జూన్ 1 నుంచి ఎవరూ కరెంటు బిల్లు చెల్లించరాదని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రకటించారు. మరోవైపు తమకు ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు వస్తే మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం, అప్పటివరకు బిల్లులుకట్టాలని విద్యుత్ అధికారులు తెలిపారు. దీనికి ఒప్పుకోని గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఫ్రీ అని చెప్పారు. కాబట్టి మేం బిల్లులు చెల్లించేది లేదు. దీనిపై మీరు ప్రభుత్వానికి చెప్పండి అని కరాఖండిగా చెబుతున్నారు. చదవండి: రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్పీస్లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో -
కర్ణాటక ఫలితాలు: కరెంటు బిల్లులు కాంగ్రెస్ నుంచి వసూలు చేసుకోండి!
సాక్షి, బెంగళూరు: ‘‘మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని కర్ణాటకలో ఓ గ్రామస్థులు తెగేసి చెప్పారు. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. బకాయిలతో సహా కరెంటు బిల్లులన్నీ కట్టాలన్న బిల్లు కలెక్టర్ గోపిని గ్రామస్థులు ఎదురు తిరిగారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది గనక గ్రామస్తులు తమ కరెంటు బిల్లు చెల్లించేందుకు నిరాకరించారు. ఎన్నికల బిల్లులను ఆ పార్టీ నుంచే వసూలు చేసుకోవాలని స్పష్టం చేశారు. దాంతో చేసేది లేక ఆయన వెనుదిరిగాడు. కాగా అధికారం చేపట్టిన తొలిరోజు తొలి కేబినెట్ సమావేశంలో ప్రతీ ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే హామీకి ఆమోద ముద్ర వేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమర్ కీలక వ్యాఖ్యలు.. Villagers in Chitradurga refuse to pay electricity bill. Exhort others also not to pay! They tell the bill collector that Congress had promised them free electricity, as soon as they came to power… Go take it from them (Congress), they say… If Congress doesn’t give a CM soon,… pic.twitter.com/FNgGtwdPHM — Amit Malviya (@amitmalviya) May 15, 2023 -
‘కొత్తపల్లె’ కరెంటు బిల్లు.. రూ. 11.41 కోట్లు!
మాచారెడ్డి: ఇటీవల పంచాయతీల పునర్విభజనలో కొత్త పంచాయతీగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె పంచాయతి భవనానికి రూ. కోట్లలో వచ్చిన కరెంటు బిల్లును చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. పంచాయతీ వాటర్ వర్క్స్కు సంబంధించిన సర్వీస్ నంబర్ 3801–02321పై ఈనెల 3న ట్రాన్స్కో బిల్లింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ నమోదు చేశారు. జనవరి 2 నుంచి ఫిబ్రవరి 3 వరకు 1,88,15,257 యూనిట్లు వాడినట్టు పేర్కొన్నారు. దీనికి ఏకంగా రూ. 11,41,63,672 బిల్లు విధించారు. ఏసీడీ డ్యూ కింద మరో రూ.8,716 వడ్డించారు. ఈనెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది షాక్కు గురయ్యారు. గతనెల విద్యుత్ బిల్లు రూ.3,257 వచ్చిందని సర్పంచ్ తెలిపారు. ఈ విషయాన్ని ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా సాంకేతిక సమస్యతో బిల్లు ఇలా వచ్చిందని చెప్పారు. -
‘విద్యుత్’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్మార్గ్ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రతినిధులు సాగర్, మోహన్శర్మ, జేఏసీ కన్వీనర్ రత్నాకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
22 రోజులకు రూ.1,17,694 కరెంట్ బిల్లు.. యాజమాని షాక్
సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్నగర్ మున్సిపల్ పరిధి చటాన్పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు. ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ ఏఈ రాకేశ్ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. -
ఆ మరుక్షణమే విధుల బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి ప్రయత్నిస్తే.. ఆ మరుక్షణమే ఎక్కడికక్కడ విధుల బహిష్కరణ (స్టాప్ ది వర్క్) చేపడతామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు విద్యుత్ ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మనుగడ ప్రమాదంలో పడనుందని, తమ ఉద్యోగాలకు ముప్పువాటిల్లుతుందని.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఇటీవల కేంద్ర విద్యుత్మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా గురువారం ఇక్కడ సమావేశమై.. బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. సీఎండీకి వినతిపత్రం.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయాల మేరకు రాష్ట్రంలో సైతం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు తెలిపారు. ‘విద్యుత్ రంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి’ పేరుతో ఈ నెల 10 నుంచి ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు. విద్యుత్ సంస్థల కార్యాలయాలు, ప్లాంట్ల ఎదుట నిరసనలు చేపడతామన్నారు. సెప్టెంబర్లో దేశం నలుమూలల నుంచి విద్యుత్ విప్లవయాత్ర(బిజ్లీ క్రాంతి యాత్ర)ను ప్రారంభించి డిసెంబర్ తొలివారం నాటికి ఢిల్లీకి చేరుకుంటామని చెప్పారు. తర్వాత ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావుకు జేఏసీనేతలు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర విద్యుత్ మంత్రి వీకే సింగ్కు సైతం లేఖ పంపించారు. -
తమిళనాడులో ఇకపై ఏటా పవర్ షాక్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ దారులకు ఇకపై ఏటా వడ్డన తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇకపై ప్రతి జూలై నెలలో 6శాతం మేరకు విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ఓ నివేదిక విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు మంగళవారం బోర్డు అందజేశాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచారు. ఆ తర్వాత కొత్తగా ఎలాంటి చార్జీలు విధించలేదు. ఫలితంగా కాల క్రమేనా విద్యుత్ బోర్డుకు కష్టాలు పెరిగాయి. అప్పులు అమాంతంగా పెరిగాయి. అయినా, గత పాలకులు విద్యుత్ చార్జీల పెంపుపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి. దీంతో చార్జీల వడ్డనకు విద్యుత్ బోర్డు కసరత్తు చేస్తోంది. కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చే ముందుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేవిధంగా గత నెల విద్యుత్శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పెంపు ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటాలు సైతం సాగుతున్నాయి. దీంతో ప్రజా అభిప్రాయాన్ని సేకరించే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ బోర్డు వినియోగదారుల నెత్తి మరోబాంబును పేలి్చంది. పెంపునకు ప్రణాళిక.. ప్రస్తుతం ఉన్న అప్పులు, మున్ముందు ఎదురయ్యే నష్టాలు, కష్టాలను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు ముందస్తు ప్రణాళిక సిద్ధ్దం చేసింది. భారం మరింత బరువెక్కకుండా ఏటా చార్జీల వడ్డనకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందుకు తగ్గ నివేదికను రూపొందించి, ఆమోదం కోసం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు పంపించింది. తొలివిడతగా.. ఏటా 6 శాతం పెరుగుదలతో నాలుగేళ్లపాటు దీన్ని కొనసాగించాలని అందులో సిఫార్సు చేసింది. చదవండి: శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు -
Telangana Electricity Bill: ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్ కట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఎడాపెడా విద్యుత్ కనెక్షన్ను కట్ చేస్తున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎడాపెడా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో బిజీగా ఉండడం, ఇంకా సమయముంది కదా.. తర్వాత చెల్లిద్దామనుకుని మరిచిపోవడం వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోతున్నారు. ఇంతకుముందు నెల, రెండు నెలలు ఆలస్యమైతే క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఇతర సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి బిల్లు కట్టమని గుర్తు చేసేవారు. గత రెండు మూడు నెలలుగా ఒక్కరోజు ఆలస్యమైనా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బిల్లు చెల్లిస్తాం.. గంటసేపు ఆగమని కోరినా ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్సీ మార్గదర్శకాల వక్రీకరణ గడువులోగా బిల్లు చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల గడువుతో నోటీసు జారీ చేసి, ఆ తర్వాత కూడా చెల్లించకపోతేనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఈఆర్సీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్ బిల్లుల చెల్లింపు, గడువులోగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపునకు మార్గదర్శకాలు’ పేరుతో ఈఆర్సీ 2002 అక్టోబర్ 16న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కనెక్షన్ తొలగింపునకు ముందు వినియోగదారులకు ఏడు రోజుల సమయం ఇవ్వడమే నోటీసు ఉద్దేశం. ఒకవేళ బిల్లు చెల్లించినా సాంకేతిక/సిబ్బంది తప్పిదాలతో చెల్లించలేదని రికార్డుల్లో నమోదైతే సంజాయిషీ ఇచ్చుకోవడానికి వినియోగదారులకు తగిన సమయం లభిస్తుంది. అత్యవసర సేవల కింద వచ్చే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నోటీసు ఇవ్వకుండా కనెక్షన్ తొలగించడం సరైంది కాదని ఈ నిబంధనలను ఈఆర్సీ పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రం ఈ మార్గదర్శకాలను వక్రీకరించి వినియోగదారులకు ‘బిల్ కమ్ నోటీసు’పేరుతో ప్రతి నెలా జారీ చేసే బిల్లులోనే ముందస్తుగా నోటీసును సైతం పొందుపరుస్తున్నాయి. బిల్లులోనే నోటీసు ఉందన్న విషయం సాధారణ వినియోగదారులకు అర్థం కాదు. కేవలం ఈఆర్సీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు చూపడానికే డిస్కంలు ‘బిల్ కమ్ నోటీసు’పద్ధతిని అవలంబిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లు బకాయిలు, డిస్కనెక్షన్, రీకనెక్షన్ చార్జీలను చెల్లించిన తర్వాత పట్టణాల్లో 4 గంటల్లోగా, గ్రామాల్లో 12 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే, బిల్లు కట్టిన తర్వాత సకాలంలో సరఫరాను పునరుద్ధరించడం లేదని అంటున్నారు. అయితే, కనెక్షన్ తొలగించడంపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఓ అధికారి తెలిపారు. స్థానికంగా కొందరు సిబ్బందికి, వినియోగదారులతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఎదురైతే తొందరపాటుతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిల్లుల వసూళ్ల కోసం తీవ్ర ఒత్తిడి భారీగా విద్యుత్ చార్జీలను పెంచినా డిస్కంలు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగు నెలలుగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. 100శాతం కనెక్షన్లకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలని, 100శాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో డీఈలకు లక్ష్యాలను నిర్దేశించాయి. ప్రతి నెలా 100శాతం బిల్లులు జారీచేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే జీతాలు చెల్లిస్తామని లింకు పెట్టాయి. దీంతో ఒత్తిడి పెరగడంతో వసూళ్లను పెంచేందుకు ఎడాపెడా కనెక్షన్లను తొలగిస్తున్నారని విమర్శలున్నాయి. బిల్లు వసూళ్ల కోసం ఇళ్లకు వస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహార తీరు అవమానకరంగా ఉంటోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్.. తీరా ఓపెన్ చేసి చూస్తే..
సాక్షి, చెన్నై: విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరిట ఎస్ఎంఎస్లు పంపుతూ, ఫోన్ కాల్స్ చేస్తూ ఓ ముఠా కొత్తరకం మోసానికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కమిషనర్ శంకర్ జివాల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారులకు ఇటీవల కాలంలో ఎస్ఎంఎస్ రూపంలో, ఫోన్ కాల్ రూపంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం సమాచారం వస్తోందని ఇందులో వివరించారు. వీటిలో గత నెల బిల్లులు అప్ డేట్ చేయలేదని, గడవు తేదీ ముగిసిన దృష్ట్యా, త్వరితగతిన చెల్లించాలని లేని పక్షంలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామన్న హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారంతో విద్యుత్ బోర్డు పేరిట లింక్లు పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింక్లు తెరవగానే, వినియోగ దారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు మాయం అవుతోందని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి విద్యుత్ బోర్డు ఎలాంటి ఎస్ఎంఎస్లు పంపించడం లేదని, ఫోన్ కాల్ చేయడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. చదవండి: ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై గొడవ.. స్నేహితుడితో కలిసి.. -
రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే!
సాక్షి, కొత్తగూడెం రూరల్: అదొక సాధారణ డాబా ఇల్లు. ఆ ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక కూలర్, ఐదు బల్బులు మాత్ర మే ఉన్నాయి.. ఆ కుటుంబం నెల రోజులకు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. కానీ బిల్లు మాత్రం రూ.7,02,825 వచ్చింది. దీం తో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ ఇంటికి ప్రతినెలా రూ.500 నుంచి రూ.700 విద్యుత్ బిల్లు వచ్చేది. కానీ బుధవారం తీసిన రీడింగ్లో మాత్రం రూ.7 లక్షలకు పైగా బిల్లు రావడంతో ఆయన బెంబేలెత్తిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో లేదా మెషీన్లో లోపం వల్లే బిల్లు వచ్చిందని, నెల రోజు లకు తాము వినియోగించింది 117 యూనిట్లేనని సంపత్ వాపోతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ మాట్లాడుతూ.. సంపత్ ఇంటికి వచ్చిన బిల్లు రూ.625 మాత్రమేనని, రీడింగ్ మిషన్లో లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. చదవండి: పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని.. -
గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే!
ఇల్లు గుల్లవుతోంది. నానాటికీ పెరుగుతున్న చార్జీల భారం సామాన్యుడి ఇంటి బడ్జెట్ను అమాంతం పెంచేసింది. కోవిడ్ ఆంక్షలకు తోడు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేడు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం రెండు నెలల్లోనే గ్రేటర్వాసిపై పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, ఆయిల్ ఛార్జీలు దండెత్తాయి. దీంతో నగరంలోని సామాన్యుల పరిస్థితి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా తయారైంది. స్థూలంగా లెక్కకడితే నెలకు ఒక్కో మనిషిపై ఈ చార్జీల భారం రూ.500 పెరిగిందని అంచనా వేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ గ్యాస్ బండపై తాజాగా రూ.50 పెరగడంతో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 26 లక్షల గ్యాస్ కనెక్షన్లకు గాను గ్రేటర్పై నెలకు సగటున రూ.13 కోట్ల అదనపు భారం పడింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలో సుమారు 65 లక్షల వాహనాలు ఉండగా, రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల డీజిల్ వినియోగం ఉంటుంది. తాజాగా ధరతో పెట్రోల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.95 లక్షల చొప్పున నెలకు రూ.2850 కోట్లు భారం మోపగా, డీజిల్ వాహనదారులపై రోజుకు సగటున రూ.52 లక్షల చొప్పున నెలకు రూ. 1560 కోట్ల అధనపు భారం పడింది. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’ విద్యుత్ భారం రూ.165 కోట్లు గృహ విద్యుత్పై యూనిట్కు 50 పైసలు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్పై యూనిట్కు రూ.ఒకటి చొప్పున పెంచారు. గ్రేటర్లో 55 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉండగా, నెలకు సగటున 1900 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగమవుతుంది. గృహ వినియోగ దారులపై నెలకు రూ.25 కోట్లు, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై రూ.140 కోట్ల భారం మోపింది. ఏడాదికి రూ.1980 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. మధ్య తరగతి, ఉద్యోగ, వ్యాపార, ఇతర వర్గాలకు చెందిన సుమారు 16 లక్షల మందికిపైగా ప్రయాణికులు సిటీబస్సుల్లో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ప్రతి ప్రయాణికునిపై రోజుకు సగటున రూ.10 అదనపు భారం పడుతోంది. ఛార్జీల రూపంలో గ్రేటర్ వాసులపై నెలకు రూ.6 కోట్లకు పైగా భారం మోపింది. వంట నూనెల భారం నెలకు రూ.54–60 కోట్లు జనవరిలో కిలో వేరుశనగ నూనె రూ.135 ఉండగా, ప్రçస్తుతం రూ.185 చేరింది. అదే విధంగా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ రూ.155 ఉండగా, ప్రస్తుతం రూ.190 ఎగబాకింది. అదే విధంగా పామాయిల్ కేజీ రూ.125 ఉండగా, ప్రస్తుతం రూ.150 పెరిగింది. ఒక్కో కుటుంబం నెలకు మూడు కేజీల ఆయిల్ వినియోస్తోందని అంచనా. గ్రేటర్లో సుమారు 45 లక్షల గృహాలు ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన ప్రతి ఇంటికి నెలకు రూ.120–150 అదనపు భారం పడనుంది. ఇలా నెలకు సగటున రూ.54–60 కోట్ల భారం గ్రేటర్ వాసులపై పడుతోంది. ముట్టుకుంటే షాక్ కోవిడ్ కారణంగా ఉపాధి లేకుండా పోయింది. కానీ అన్ని ఛార్జీలు మాత్రం ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ఇప్పటి వరకు నెలవారీ గృహ విద్యుత్ బిల్లు రూ.500లోపే వచ్చేది. ప్రస్తుతం డిస్కం యూనిట్కు రూ.50 పైసల చొప్పున పెంచడంతో ఏప్రిల్ బిల్లులో భారీ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. – నేమాల బెనర్జీ, డిఫెన్స్ కాలనీ వంటింటికి గుదిబండ గత ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర రూ.890 ఉండగా, అక్టోబర్ ఐదో తేదీ నాటికి రూ.915కి చేరింది. ఆ తర్వాతి రోజే అనూహ్యంగా రూ.930 కి చేరింది. మార్చి రెండో వారంలో రూ.962 ఉండగా, నాలుగు రోజుల క్రితం ఏకంగా రూ.50 పెరిగింది. ప్రస్తుతం రూ.1002కు చేరింది. ఏదైనా వంట చేయలన్నా.. వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తోంది. – గుర్రం అన్నపూర్ణ, బడంగ్పేట్ బైక్ ప్రయాణం భారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో పని చేస్తున్నా. బైక్లో గతంలో రూ.500 పెట్రోల్ కొట్టిస్తే..వారం రోజులు వచ్చేది. ప్రస్తుతం నాలుగైదు రోజులే వస్తుంది. జీతం పెరగలేదు కానీ..పెట్రోల్ వాత మాత్రం తప్ప లేదు. – టి.తిరుమలేష్, కర్మన్ఘాట్ -
ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే..
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తప్పులతడకగా మారడంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. మధిరలోని వర్తక సంఘం సమీపాన నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తమ్మారపు నాగమణి ఇంట్లో సోమవారం విద్యుత్శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. స్కానింగ్ మిషన్ ద్వారా రీడింగ్ తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో మీటర్ రీడింగ్ కూడా చేరడంతో 3090110116 సర్వీస్కు రూ.76,46,657గా బిల్లు వచ్చింది. రెండు మీటర్లు కలిసినా 76 లక్షలకు పైగా బిల్లు రావడమేమిటని బాధితులు ఆందోళన చెం దారు. దీంతో సిబ్బం ది మరో స్కా నింగ్ మిషన్ తీసుకొచ్చి రీడింగ్ తీస్తే బిల్లు రూ.58 మాత్రమే వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. స్కానింగ్మిషన్లలో అవకతవకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సెలూన్ షాప్నకు ‘కరెంట్ షాక్’.. అమ్మో ఇంత బిల్లా!
సాక్షి,మధిర(ఖమ్మం): నాయీబ్రాహ్మణులు, రజకులు సెలూన్, ల్యాండ్రీ షాపుల్లో నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉచితంగానే మీటర్లు కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఆయా వర్గాలతో పాటు ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మధిర పట్టణంలోని సీపీఎస్ రోడ్డులో గల ఒక సెలూన్ షాపునకు విద్యుత్ బిల్లు ఏకంగా రూ.19,671 వచ్చింది. దీంతో షాపు నిర్వాహకుడు అవాక్కయ్యాడు. తాను నెలకు కనీసం 100 యూనిట్లు కూడా వాడడం లేదని, ఇంత బిల్లు రావడమేంటని లబోదిబోమంటున్నాడు. మధిరకు చెందిన నాగులవంచ అప్పారావు అనే నాయీ బ్రాహ్మణుడు సీపీఎస్ రోడ్డులో ఆరేళ్లుగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకం కింద మీటర్ మంజూరు చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించడంతో మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అంతకు ముందే బడ్డీకొట్టులో వీరయ్య అనే వ్యక్తి పేరున ఉన్న సర్వీస్ నంబర్ 75ను ఉచిత విద్యుత్ మీటర్గా మార్చి అప్పారావుకు అందించారు. ఈ పథకం కింద నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే అప్పారావు నెలకు కనీసం 100 యూనిట్ల విద్యుత్ కూడా వాడలేదు. (చదవండి: సెక్యూరిటీ గార్డు గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా.. ) 2021 నవంబర్లో కరెంట్ బిల్లు జీరోగా వచ్చింది. డిసెంబర్లో మాత్రం రూ.19,671.92 బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోక పోగా, ఆదివారం ఆ శాఖ సిబ్బంది వచ్చి బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పారు. దీంతో ఈ విషయాన్ని ఆయన ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చాడు. తాను రోజంతా కష్టపడినా రూ.300 కూడా రావడం లేదని, కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంత బిల్లు ఎలా చెల్లించాలని మనోవేదనకు గురువుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. ఈ విషయమై విద్యుత్ శాఖ ఏఈ, లైన్మెన్లను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
టిఫిన్ హోటల్కు రూ.21 కోట్ల కరెంటు బిల్లు
చింతలపూడి/ఏలూరు (ఆర్ఆర్ పేట): పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని ఒక చిన్న హోటల్ యజమానికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. పట్టణానికి చెందిన సాయి నాగమణి కొత్త బస్టాండ్ సమీపంలో టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతిలో పెట్టడంతో నివ్వెరపోయారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బుధవారం అధికారులు రంగంలోకి దిగి బిల్లును సరిచేశారు. సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని సరిచేసినట్లు ట్రాన్స్కో ఏఈ శంకర్రావు తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినియోగదారునికి కొత్త బిల్లు అందజేస్తామన్నారు. నిర్లక్ష్యంపై చర్యలు.. విద్యుత్ మీటర్లకు రీడింగ్ సమయంలో అప్పుడప్పుడు మీటర్లలో గానీ, మీటర్ రీడింగ్ మెషీన్లో గానీ సాంకేతిక లోపాల కారణంగా బిల్లులో సమస్యలు వస్తాయని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.జనార్ధనరావు స్పష్టం చేశారు. ఈనెల 7న చింతలపూడి సెక్షన్లో గత నెలలో మార్చిన మీటర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల వినియోగదారుని బిల్లులో భారీ మొత్తం నమోదైందన్నారు. ఈ విషయం అక్కడి ఏఈ దృష్టికి రాగా బుధవారం తిరిగి రీడింగ్ తీసి బిల్లును సరిదిద్దినట్లు వెల్లడించారు. బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్ రీడర్ ప్రభాకర్ను విధుల నుంచి తొలగించామని, చింతలపూడి ఏఈని సస్పెండ్ చేశామని వివరించారు. ఇవీ చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ -
కూలీ ఇంటికి రూ.లక్షల్లో కరెంట్ బిల్లు
సాక్షి, ఉరవకొండ: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య రైతు, కూలీ కుటుంబాలకు లక్షల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో బాధితులు షాక్కు గురవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సాధారణ కూలీ పర్వతప్పకు ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 బిల్లు వచ్చేది. కానీ జూన్కు సంబంధించిన బిల్లు ఏకంగా రూ.1,48,371 రావడంతో అవాక్కయ్యాడు. విద్యుత్శాఖ అధికారుల వద్దకు వెళ్ళి తనకు వచ్చిన కరెంట్ బిల్లు చూపించాడు. తాను కూలీ పనులకు వెళ్ళే వాడినని తన ఇంటోŠల్ రెండు బల్పులు, ఒక ఫ్యాను, టీవీ మాత్రమే ఉందని, ఇంత బిల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. పర్వతప్పపై అధికారులు చివరికి కనికరం చూపి రూ.56,399 తగ్గించి మిగతా బిల్లు మొత్తం కట్టాలని అధికారులు సూచించారు. తాను కూలీ పనులకు వెళ్ళేవాడినని తాను ఇంత డబ్బు ఎలా కట్టగలలని కూలీ లబోదిబోమంటున్నాడు. అలాగే గ్రామానికి చెందిన బండయ్య అనే మరో కూలీకి చెందిన ఇంటికి కూడా రూ 16,251 రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నాడు. వీరిద్దరికే కాదు ఇలా గ్రామంలో 15 మంది కూలీ కుటుంబాలకు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమేర బిల్లు తగ్గించాం పాల్తూరు గ్రామంలో సాంకేతిక సమస్య కారణంగానే కరెంటు బిల్లులు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయి. దీంతో పాటు మీటర్లో ఏదైనా సమస్య ఉన్నా ఇలా జరుగుతుంది. అధిక సంఖ్యలో బిల్లు వచ్చిన వారికి కొంతమేర బిల్లులు తగ్గించాము. మిగతాది వారు చెల్లిస్తే సరిపోతుంది. – శ్రీనివాసరెడ్డి, ఏఈ, విద్యుత్శాఖ చదవండి: కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు -
పంజాబ్లో పవర్ రచ్చ,ముందు మీ 8 లక్షల బిల్లు చెల్లించండి సిద్ధూ...
చండీగడ్: ప్రస్తుతం విద్యుత్త్ కొరత సమస్యతో పంజాబ్ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఇక ఈ అంశంపై అమరీందర్ పాలన సరిగా లేదని అదే పార్టీకి చెందిన నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఫైర్ అయిన సంగతి తెలిసిందే. విద్యుత్త్ సమస్యలపై అంతలా విరుచుకుపడ్డ సిద్ధూ తన ఇంటి కరెంట్ బకాయిలు చెల్లించడం మారిచారన్న విమర్శలు వస్తున్నాయి. అమృత్సర్లో ఉన్న సిద్ధూ ఇంటికి కరెంటు బిల్లు బాకీ ఉన్నట్లు తెలియడంతో ఈ అంశం ఇప్పుడు విపక్షాలకు అస్త్రంలా దొరికింది. ఈ కాంగ్రెస్ నేత మొత్తం రూ.8,67,540 కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్ పేమెంట్కు జూన్ 2 చివరి రోజు కాగా ఇంతవరకు ఆయన చెల్లించలేదు. దీని గురించి ఇప్పటి వరకు సిద్ధూ ఏమీ మాట్లాడలేదు. ఇదిలా ఉండగా ఆప్ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల కరెంటును ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం విశేషం. 2019లో రాజీనామ చేసిన సమయంలో ఆ శాఖను సిద్దూకే కేటాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారం.. అమృత్సర్లోని సిద్ధూ ఇంటికి రూ. 8,67,540 విద్యుత్త్ బకాయిలు ఉండగా ఇంకా చెల్లించలేదని తెలిపింది. అసలు ఈ కరెంట్ కథేంటంటే.. గత సంవత్సరం నుంచి సిద్దూ ఇంటి కరెంట్ బిల్లు విషయంలో 17 లక్షలకు పైగా బాకీ పడ్డాడు. కాగా అతను మార్చిలో 10 లక్షలు చెల్లించగా, ప్రస్తుతం అతని బకాయిలు దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయని వారు తెలిపారు. Punjab | Congress' Navjot Singh Sidhu allegedly owes Rs 8.67 lakh in pending bill to state power utility I'm not aware of the issue. Sub Divisional Officers must have known. No special relaxation was given to him. We'll investigate the issue: Chief engineer, Power Dept, Amritsar pic.twitter.com/y8xdMmsfNb — ANI (@ANI) July 3, 2021 -
ఒక బల్బు, టేబుల్ ఫ్యాన్; ఇంత బిల్లు ఎలా కట్టేది?
భోపాల్: మీటర్లో సాంకేతిక కారణాల వల్ల ఒక్కోసారి కరెంట్బిల్లులు షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి చిత్రమైన అనుభవాలను ఇప్పటికే చాలాసార్లు చూశాం. వాటికి సంబంధించిన బిల్లులు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన ఒక నిరుపేద వృద్ధురాలికి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఇళ్లల్లో పనిచేసే ఆ వృద్ధురాలు ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటుంది. కేవలం ఒక లైటు, టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ .2.5 లక్షల బిల్లు రావడాన్ని చూసి ఆశ్చర్యపోయింది. వివరాలు.. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాకు చెందిన 65 ఏళ్ల రాంబాయి ప్రజాపతి స్థానికంగా ఉన్న ఇళ్లలో పనిచేసుకుంటూ ఒక పూరి గుడిసెలో నివసిస్తుంది.ఆమెకు ఇంట్లో ఒక లైట్, టేబుల్ ఫ్యాన్ తప్ప మరే వస్తువు లేదు. ప్రతీనెల ఆమెకు రూ. 300 నుంచి రూ. 500కు మించి కరెంట్ బిల్లు వచ్చేది. కానీ గత నెలలో ఏకంగా రూ .2.5 లక్షల కరెంట్ బిల్లు రావడం చూసి షాకైంది. విద్యుత్ అధికారుల ముందు తన గోడు వెల్లబోసుకునేందుకు స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లింది. కానీ అక్కడ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఎవరైనా అధికారి కలిస్తే తన గోడు వెల్లబోసుకోవచ్చని అప్పటినుంచి ప్రతిరోజు విద్యుత్ కార్యాలయం చుట్టు ప్రదర్శనలు చేస్తుంది. ఈ సందర్భంగా రాంబాయి ప్రజాపతి మాట్లాడుతూ.. '' నేను చాలా సంవత్సరాల నుంచి షాన్టీ ప్రాంతాలోని ఒక గుడిసెలో నివసిస్తున్నాను.ఇంత చిన్న పూరి గుడిసెలో నివసించే నాకు లక్షల్లో బిల్లు ఎలా వచ్చిందో తెలియడం లేదు. దీనిపై అధికారును సంప్రదిస్తే వారు అస్సలు పట్టించుకోవడం లేదు. నా సమస్య పరిష్కారం కోసం కేవలం విద్యుత్ అధికారులనే కాదు స్థానిక ప్రజా ప్రతినిధులను, గుణ కలెక్టర్ కూడా కలిశాను. కానీ ఎవరూ నా సమస్యను పరిష్కరించలేదు” అని వాపోయింది. -
ఏసీ 26 డిగ్రీల కన్నా తగ్గితే ఇల్లు గుల్లే
సాక్షి, అమరావతి: ఎండాకాలం.. 24 గంటలూ ఏసీ వేయడం మామూలే. దీనివల్ల కరెంట్ బిల్లు పెరగడమే కాదు.. ప్రజలకూ హాని కలుగుతోంది. 8నుంచి 10 గంటల పాటు ఏసీ వేస్తే ఏకంగా 10 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విపత్కర పరిస్థితిని చక్కబెట్టేందుకు ఏసీల వినియోగంపై రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ అవగాహన కార్యక్రమం చేపట్టింది. ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ వివరాలను ఆ సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ఏసీల వార్షిక విద్యుత్ డిమాండ్ 2,800 మిలియన్ యూనిట్లు. వీటిని 26 డిగ్రీల స్థాయిలో వాడుకుంటే ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా మేలని ఇంధనశాఖ చెబుతోంది. దీనివల్ల తక్కువ విద్యుత్తు వినియోగమవుతుంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ఆరోగ్యంపైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెబుతోంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయంటోంది. గదిలో ఏసీ ఉష్ణోగ్రతలు 19 నుంచి 21 డిగ్రీల వద్ద ఉంటే.. అవి సాధారణ శరీర ఉష్ణోగ్రతల కంటే చాలా తక్కువని, తద్వారా అల్పోష్ణస్థితి, ఆర్థరైటిస్, చర్మ అలర్జీలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తేందుకు అవకాశముందని పేర్కొంది. ఇలా చేస్తే మేలు ఏసీలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నడుస్తున్నప్పుడు కంప్రెషర్ నిరంతరాయంగా పనిచేయాలని, అందుకు అధిక విద్యుత్ అవసరమవుతుందని.. ఫలితంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను ఎప్పుడూ 26, ఆ పైన ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం, ఫ్యాన్ స్పీడును తక్కువగా ఉంచడం ఉత్తమమని.. తద్వారా తక్కువ కరెంటు అవసరమవుతుందని పేర్కొంటున్నారు. 26 డిగ్రీల మీద నడపడం ద్వారా ఒక్కో ఏసీకి ఒక్క రాత్రికి కనీసం 5 యూనిట్లు ఆదా చేస్తే.. 10 లక్షల ఇళ్లల్లో రోజుకు 5 మిలియన్ యూనిట్లు పొదుపు చేయవచ్చని అంచనా. దీనివల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు జరుగుతుందని ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. స్టార్ రేటెడ్ బెస్ట్ 5 స్టార్ ఏసీ వినియోగం వల్ల రోజుకు 4.5 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. 1 స్టార్ స్లి్పట్ ఏసీ (1.5 టన్)తో ఏడాదికి రూ.665 ఆదా అయితే.. 5 స్టార్ ఏసీతో రూ.2,500 వరకు పొదుపు చేయవచ్చు. ఇళ్లల్లో స్టార్ రేటెడ్ విద్యుత్తు ఉపకరణాల వినియోగం, కరెంటు బిల్లులపై వాటి ప్రభావం అనే అంశంపై రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఏపీఎస్ఈసీఎం అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఏసీ ఉష్ణోగ్రతల సెట్టింగుల్లో 1 డిగ్రీ తగ్గితే, విద్యుత్తు వినియోగం 6% తగ్గుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్తుశాఖ సూచన మేరకు స్టార్ రేటెడ్ ఏసీలను కొనేలా, 26 డిగ్రీల ఉష్ణోగ్రతతో నడిపేలా వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలో ప్రస్తుతం మొత్తం ఏసీల స్థాపిత సామర్థ్యం 80 మిలియన్ టీఆర్ (టన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ (74,234 మెగావాట్లు)). పదేళ్లలోపే ఇది 250 మిలియన్ టీఆర్ (2,31,982 మెగావాట్లు)కు పెరుగుతుందని.. ఫలితంగా 2030 కల్లా దేశంలో ఏసీల వల్లే కనెక్టెడ్ లోడ్ 200 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా. దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. -
80 ఏళ్ల వృద్ధుడికి.. రూ.80 కోట్ల కరెంట్ బిల్లు
ముంబై: సామాన్యంగా కరెంట్ బిల్లు వందల్లో వస్తుంది. వేసవికాలంలో ఏసీలు, కూలర్లు వినియోగించడంతో వేలల్లో వస్తుంది. సామాన్యులు వందల్లోపు ఉండే కరెంట్ బిల్లు కట్టడానికే ఇబ్బంది పడతారు. అలాంటిది ఏకంగా కోట్లలో కరెంట్ బిల్లు వస్తే.. గుండె ఆగిపోతుంది. తాజగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. కరెంట్ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్ తగిలింది. బీపీ పెరిగి పడిపోయాడు. దాంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గణ్పత్ నాయక్(80) అనే వృద్ధుడు నలసోపార్ టౌన్లోని నిర్మల్ గ్రామంలో రైస్ మిల్లు నడుపుతున్నాడు. ఈ క్రమంలో వచ్చిన కరెంట్ బిల్లు చూసి అతడికి నిజంగానే షాక్ తగిలింది. వేలల్లో కాదు ఏకంగా కోట్లల్లో కరెంట్ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎంఎస్ఈడీసీఎల్) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరి చేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది అని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్ బోర్డు అధికారి సురేంద్ర మోనెరే మాట్లాడుతూ.. ‘‘ఏజెన్సీ ఆరు అంకెలకు బదులుగా తొమ్మిది అంకెల బిల్లును తయారు చేసింది. మేము అతడి విద్యుత్ మీటర్ను అధ్యయనం చేసి వారికి ఆరు అంకెల కొత్త బిల్లును ఇచ్చాము’’ అని తెలిపారు. ఈ సందర్భంగా గణ్పత్ నాయక్ మనవడు నీరజ్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు అక్కడ పని చేస్తున్న వారు దాన్ని చూసి షాక్ అయ్యారు అని తెలిపాడు. ‘‘ఈ బిల్లు చూసిన వెంటనే మొత్తం జిల్లాకు సంబంధించిన కరెంట్ బిల్లును మాకే పంపించారేమో అనుకున్నాం. దీని గురించి చెక్ చేయడంతో అది మా ఒక్కరి కరెంట్ బిల్లే అని తెలిసింది. విద్యుత్ బోర్టు లాక్డౌన్ కాలానికి సంబంధించి ప్రతి ఒక్కరి నుంచి బకాయిలు వసూలు చేయడం ప్రారంభించింది. మా దగ్గర నుంచి ఈ మొత్తం వసూలు చేస్తుందా ఏంటి అని భయపడ్డాం" అన్నాడు నీరజ్. చదవండి: షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు.. ఏంది సార్ ఆ కరెంటు బిల్లు?: హీరో -
షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..
సాక్షి, కణేకల్లు: కూలి పనులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న నిరుపేద మహిళకు కరెంట్ బిల్లు షాకిచ్చింది. ప్రతి నెలా రూ.100 బిల్లు వస్తుండగా.. ఈ నెల ఏకంగా రూ.1,49,034 రావడంతో ఆమె నోటి నుంచి మాట రాలేదు. కణేకల్లులోని మోడల్ స్కూల్ పక్కనే నివాసముంటున్న కురుబ కామాక్షమ్మ పరిస్థితి ఇది. ఇంత బిల్లు తానెప్పుడు చెల్లించాలో అర్థం కాక లబోదిబోమంటూ, తనకు న్యాయం చేయాలని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఏఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య కారణంగా చోటు చేసుకున్న ఈ తప్పిదాన్ని సరిచేసి, వినియోగించిన యూనిట్ల మేరకే బిల్లు వసూలు చేస్తామని భరోసానిచ్చారు. చదవండి: (కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!) -
కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి!
సాక్షి, అమరావతి : మన ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాలను సరైన విధానంలో వాడితే జేబుకు చిల్లు పెట్టే కరెంటు బిల్లులను కొంత తగ్గించుకోవచ్చని విద్యుత్ అధికారులు అంటున్నారు. గత నెలలో వచ్చిన కరెంటు బిల్లు కంటే ఈ నెల ఎక్కువ ఎందుకు వచ్చిందని తలపట్టుకునే ముందు ఇంట్లో ఉన్న ఏసీ, రిఫ్రిజ్రేటర్, గీజర్, ఒవెన్ తదితర విద్యుత్ ఉపకరణాలను మనం వాడే తీరుపై ఒకసారి దృష్టి సారించాలని సూచిస్తున్నారు. వాడకం పెరిగి యూనిట్లు పెరిగేకొద్దీ శ్లాబు మారి బిల్లు పెరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే విద్యుత్ మీటర్లను గిరగిరా తిప్పే వస్తువులను క్రమపద్దతిలో వాడితే అధిక బిల్లులను నివారించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు చేసిన కొన్ని సూచనలను మీడియాకు వివరించారు. గీజర్తో జాగ్రత్త ఇంట్లో గీజర్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఆన్ చెయ్యకుండా.. కుటుంబ సభ్యులంతా ఒకరి తర్వాత మరొకరు స్నానాలు చేస్తే మంచిది. థెర్మోస్టాట్ 50–60 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్ నీటిని వాడేలా పైపులు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే బిల్లులో నెలకు కనీసం రూ.400 వరకూ ఆదా చెయ్యొచ్చు. ఏసీని అదుపు చెయ్యాల్సిందే ఏసీ ఎలా వాడాలో చాలామందికి తెలియదు. ముందుగా గదిలో చల్లదనాన్ని గ్రహించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. గాలి బయటకు వెళ్లే అవకాశం లేకుండా గది త్వరగా చల్లబడుతుంది. వెంటనే చల్లబడాలని 18 డిగ్రీలు పెట్టేస్తుంటారు. కానీ ఎప్పుడు ఆన్ చేసినా 24 నుంచి 26 మధ్య ఉంచితే రూ.300 వరకు బిల్లు తగ్గుతుంది. పాత ఫ్రిజ్తో జేబుకు చిల్లు ఫ్రిజ్ ఉంచే ప్రదేశానికి, గోడకు మధ్య వేడి తగ్గించేలా కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు వాడే ఫ్రిజ్ పాతదైతే నెలకు 160 యూనిట్లకు పైనే కరెంట్ కాలుతుంది. అదే స్మార్ట్ ఫ్రిజ్ అయితే అవసరమైనప్పుడే ఆన్ అవుతాయి. లేకుంటే ఆగిపోతాయి. వీటివల్ల మీ బిల్లు రూ.300 వరకు తగ్గే వీలుంది. తడవకో జత ఉతక్కూడదు ఎప్పుడూ లోడ్కు తగ్గట్టుగా దుస్తులు వేయాలి. లోడ్కు మించి వేయకూడదు. అలాగని తడవకో జత దుస్తులను ఉతక కూడదు. ఏంచేసినా విద్యుత్ వినియోగం పెరుగుతుంది. అన్నింటికీ మించి మిషన్ పని విధానాన్ని కనీసం మూడు నెలలకోసారైనా మెకానిక్ చేత పరీక్షించాలి. మోటర్ స్లో అయితే విద్యుత్ వాడకం ఎక్కువవుతుంది. జాగ్రత్తలు పాటిస్తే రూ.60 ఆదా చెయ్యొచ్చు. ఒవెన్ ఊరికే తెరిచి చూడొద్దు వంటకానికి వాడే పదార్థాన్ని బట్టి టైం సెట్ చేయాలి. ఒకసారి ఆన్ చేశాక తరచూ తెరిచి చూస్తే టెంపరేచర్ పడిపోతుంది. అది మళ్ళీ వేడెక్కాలంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది. చిన్నా చితక వంటలకు ఓవెన్ వాడకపోవడమే మంచిది. ఇలాచేస్తే రూ.150 వరకు బిల్లు ఆదా అవుతుంది. -
అందరికీ కరెంటు బిల్లు మాఫీ: నిజమేనా?
న్యూఢిల్లీ: లాక్డౌన్ పుణ్యమాని అందరూ ఇళ్లలోనే ఉండటంతో కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. వాటిని కట్టలేక చాలామంది తల ప్రాణం తోకకొస్తుంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ కరెంటు బిల్లులు షాకిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇక నుంచి కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం "విద్యుత్ బిల్లు మాఫీ 2020" స్కీమ్ తెచ్చిందని.. ఆ పథకం ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ విద్యుత్ బిల్లు కట్టాల్సిన పని లేదన్నది సదరు వార్త సారాంశం. (‘కరోనా బ్యాక్టీరియా.. అస్పిరిన్తో తగ్గుతుంది’) ఇది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందంటూ ఓ యూట్యూబ్ వీడియోను కూడా జోడించి చాటింపు చేస్తున్నారు. ఇది నిజమని నమ్మిన కొందరు జనాలు శుభవార్త అంటూ దీన్ని ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధమేనని కేంద్ర దర్యాప్తు సంస్థ విభాగం పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) తేల్చి చెప్పింది. అసలు కేంద్రం అలాంటి పథకాన్నే తీసుకురాలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఎవరూ ఈ తప్పుడు వార్తను నమ్మవద్దని సూచించింది. (ఉచితంగా స్మార్ట్ఫోన్లు ఇవ్వనున్న ప్రభుత్వం?) -
ఏంది సార్ ఆ కరెంటు బిల్లు?: హీరో
గత కొద్ది రోజులుగా చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలకు కరెంట్ బిల్లులు చూసి కరెంట్ షాక్ కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మొన్న కార్తీ, నిన్న తాప్సీ, నేడు హీరో సందీప్ కిషన్ కూడా వాచిపోతున్న కరెంటు బిల్లుల బాధితుల లిస్టులో చేరిపోయాడు. ఈ విషయాన్ని సందీప్ స్వయంగా వెల్లడించాడు. కానీ బిల్లు ఎంత వచ్చిందన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఇక ఎంతైనా సినిమా హీరో కాబట్టి సినిమా స్టైల్లోనే ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి మాట్లాడుతూ సెటైరికల్ పంచ్ ఇచ్చాడు. కరెంటు బిల్లులు కొత్త సినిమా వీకెండ్ కలెక్షన్లలా ఉన్నాయన్నాడు. () "ఎలక్ట్రిసిటీ బోర్డ్ మీటర్ చూస్తుంటే నా చిన్నతనంలో గిర్రున తిరిగే ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తుంది. ఏంది సార్ ఆ బిల్లు.. నెక్స్ట్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్లైన్ వార్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్లులు కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్లలా ఉన్నాయి" అంటూ సందీప్ ట్వీట్ చేశాడు. కాగా ఇప్పటికే హీరోయిన్ కార్తీకా నాయర్కు లక్ష రూపాయల బిల్లు రాగా తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చిన విషయం తెలిసిందే. (తాప్సీకి కరెంట్ బిల్లు షాక్) -
మొన్న కార్తీక.. ఇవాళ తాప్సీ
ముంబై : కరోనావైరస్ నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలకు కరెంట్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి.లాక్డౌన్ కారణంగా అన్ని చోట్లా మూడు నెలల కరెంట్ వాడకాన్ని కలిపి ఒకటే బిల్లును ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో శ్లాబ్లు మారి ప్రతి ఒక్కరికీ భారీగా చార్జీలు పడ్డాయి. వందలలో వచ్చే వారికి వేలల్లో, అలాగే వేలల్లో వచ్చేవారికి లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. చిన్న చిన్న గుడిసెలకు సైతం ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యులకే కాదు ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా ఈ షాక్లు తగులుతున్నాయి. (కరెంటు బిల్లు చూసి గుడ్లు తేలేసిన హీరోయిన్) ఇటీవల అలనాటి అందాల భామ రాధ కుమార్తె, హీరోయిన్ కార్తీక ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు రాగా, తాజాగా మరో హీరోయిన్ తాప్సీకి 36,000 రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. సాధారణ రోజుల్లో వచ్చే బిల్లు కంటే ఈ నెలలో (జూన్) దాదాపు 10 రెట్లు బిల్లు ఎక్కువ రావడంతో తాప్సీ షాక్కు గురైంది. ట్వీటర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. వారానికో రోజు వెళ్లి వచ్చే ఇంటికి పెద్దమొత్తం కరెంట్ బిల్లు రావడం ఏంటని వ్యంగ్యంగా తన అసంతృప్తిని వెలిబుచ్చింది. ‘ఇది మా అపార్ట్మెంట్ బిల్లు. క్లీనింగ్ కోసమని వారంలో ఒక రోజు ఈ ఆపార్ట్మెంట్కు వెళ్తుంటాం. మాములు రోజుల్లో ఎవరూ ఉండరు. ఈ బిల్లు చూస్తుంటే మాకు తెలియకుండానే ఎవరో ఈ ఆపార్ట్మెంట్ను వినియోగిస్తున్నారనే భయం కలుగుతోంది. నిజాన్ని వెలికితీసేందుకు నాకు సహాయం చేయడంటూఎలక్ట్రిసిటీ అధికారిక ట్విట్టర్ అకౌంట్కు ట్యాగ్ చేస్తూ తాప్సీ ట్వీట్ చేసింది. మూడు నెలల వ్యవధిలోనే పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు పెరగడానికి కారణం ఏంటి? ఏ రకమైన బిల్లును వసూలు చేస్తున్నారని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆమె ప్రశ్నించారు. కాగా తాప్సీ ట్వీట్పై స్పందించిన ఎలక్ట్రిసిటీ అధికారులు.. మీటర్ రీడింగ్ ఆధారంగా తాము బిల్లు కొట్టామని వివరణ ఇచ్చారు. 3 months of lockdown and I wonder what appliance(s) I have newly used or bought in the apartment only last month to have such an insane rise in my electricity bill. @Adani_Elec_Mum what kind of POWER r u charging us for? pic.twitter.com/jZMMoxDMgj — taapsee pannu (@taapsee) June 28, 2020 -
కరెంటు బిల్లు చూసి గుడ్లు తేలేసిన హీరోయిన్
లాక్డౌన్తో నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ప్రభుత్వాలు కరెంటు బిల్లుతో దోపిడీకి దిగుతున్నాయంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందేరు. అయితే ఈ కష్టాలు సామాన్యులకేనా? సెలబ్రిటీలకు తప్పడం లేదని హీరోయిన్ కార్తీక నాయర్ రుజువు చేసింది. ఆమె ఇంటికి కరెంటు బిల్లు అక్షరాలా లక్ష రూపాయలు వచ్చింది. ఇది చూసి గుడ్లు తేలేసిన కార్తీక ట్విటర్లో తన కోపాన్నంతటినీ కక్కేసింది. 'ముంబైలో ఏం కుంభకోణం జరుగుతోంది?' అంటూ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. (సింగిల్ ఫ్యాన్.. 128 కోట్ల కరెంట్ బిల్లు) 'లాక్డౌన్లో కరెంటు మీటర్ రీడింగ్ తీయలేదు. లాక్డౌన్ సడలింపుల తర్వాత 3 నెలల రీడింగ్ ఒకేసారి తీశారు. దీంతో ఒక్క జూన్ నెలలోనే తనకు లక్ష బిల్లు వచ్చింద'ని వాపోయింది. చాలామంది ముంబైవాసులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని ఆమె ప్రస్తావించింది. ఇక ఇప్పటికే నటి ప్రసన్న కూడా వాచిపోతున్న కరెంటు బిల్లుపై ప్రభుత్వాన్ని ఎండగట్టిన విషయం తెలిసిందే. మరి అధికారులు ఈమె ట్వీట్కు స్పందిస్తారో లేదో చూడాలి. కాగా కార్తీక చివరిసారిగా "అరంభ్: కహానీ దేవసేన కీ" అనే టీవీ సిరీస్లో నటించింది. అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్గా నటించి తగిన గుర్తింపు సంపాదించుకుంది. (తెలుగు హీరో- డైరెక్టర్ లిప్లాక్ ఫోటో వైరల్!) -
రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు
సాక్షి, చిట్యాల : నీడ కోసం నిర్మించుకున్న రేకుల ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన శీలం సదయ్య పశువుల కాపరీగా పని చేస్తున్నాడు. ఆయనకు రెండు గదుల రేకుల ఇల్లు ఉంది. అందులో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉంది. ఇటీవల విద్యుత్ శాఖ సిబ్బంది రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. ఏకంగా రూ.1.80 లక్షల బిల్లును చూసి హడలెత్తిపోయిన సదయ్య.. నాలుగు రోజులుగా కరెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. అయినా తనను పట్టించుకున్నవారే లేరని, విద్యుత్ ఏఈకి ఫోన్ చేస్తే స్పందించడం లేదని బాధితుడు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాడు. -
‘డైనమిక్ విధానంతో ప్రజలకు లాభం’
సాక్షి, గుంటూరు: పవర్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే కరెంట్ రీడింగ్ తీస్తున్నామనిహోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయనేది అపోహ అని తెలిపారు. ఏప్రిల్ నెల బిల్లులను డైనమిక్ విధానం ద్వారా తీస్తున్నామని ఆమె తెలిపారు. డైనమిక్ విధానం ప్రకారం ఎంత విద్యుత్ను వినియోగించుకున్నారో అంతే బిల్లు వస్తుందని ఆమె వివరించాచరు. స్లాబ్ విధానం కాకుండా డైనమిక్ విధానంతో ప్రజలకు లాభమని మంత్రి సుచరిత తెలిపారు. ఇక లాక్డౌన్ వల్ల విద్యుత్ వినియోగం అధికంగా పెరిగిందని ఆమె చెప్పారు. జూన్ 30వ తేదీ నాటికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా బిల్లులు చెల్లించవచ్చని హోం మంత్రి సుచరిత అన్నారు. -
మీటర్ రీడింగ్ లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల విద్యుత్ వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను మీటర్ రీడింగ్ ఆధారంగా కాకుండా కొత్త పద్ధతిలో జారీ చేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందు తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మీటర్ రీడింగ్ తీయకుం డానే ప్రత్యామ్నాయ పద్ధతిలో గత నెల వినియోగానికి సంబంధించిన బిల్లులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వినియోగ దారులు సగటున నెలకు ఎంత విద్యుత్ వినియో గిస్తున్నారన్న విషయాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంచనా వేసి మార్చి నెలకు సంబంధిం చిన విద్యుత్ బిల్లులు జారీ చేయాలని భావిస్తు న్నాయి. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రా వు.. డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్ రావుతో గురువారం విద్యుత్ సౌధలో సమావేశం నిర్వహించి ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మీటర్ రీడింగ్కు బదులు వినియోగదారుల సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా మార్చి నెలకు సంబంధించిన బిల్లులు వసూలు చేయాలని ఈ సమావేశంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కచ్చితత్వంతో జారీ..! సగటున ఒక నెల విద్యుత్ వినియోగాన్ని అంచనా వేస్తే విద్యుత్ టారిఫ్లోని శ్లాబులు తారుమారై వినియోగదారులపై అధిక భారం పడటమో, లేకుంటే డిస్కంలు ఆర్థికంగా నష్ట పోవడమో జరిగే అవకాశాలున్నాయి. ఈ నేప థ్యంలో ఇటు వినియోగదారులు అటు డిస్కంలు నష్టపోకుండా సాధ్యమైనంత వరకు కచ్చితమైన అంచనాలతో బిల్లులు జారీ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు అధికా రవర్గాలు తెలిపాయి. శుక్రవారం మరోసారి సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశ ముం దని, ఆ వెంటనే డిస్కంలు ఈ మేరకు సగటు వినియోగం ఆధారంగా విద్యుత్ బిల్లుల జారీకి అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాయనున్నాయి. ఈఆర్సీ అనుమతించిన వెంటనే విని యోగదా రులకు ప్రత్యామ్నాయ పద్ధతిలో బిల్లు లు జారీ చేయనున్నారు. మార్చి నెలకు సంబం ధించి వచ్చిన బిల్లు.. చెల్లించాల్సిన గడువు వివరాలతో వినియోగదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ సైతం పంపించనున్నారు. దీనిపై శుక్రవారం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశముంది. ఆన్లైన్లో చెల్లించండి.. విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా పాత బకాయిలు చెల్లించాలని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు కోరారు. లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వినియోగదారులు నేరుగా నగదు రూపంలో బిల్లులు చెల్లించడం సాధ్యం కానందువల్ల ఈ సౌకర్యం వినియోగించుకోవాలని కోరారు. లాక్డౌన్ ప్రకటించిన సమయంలోని బిల్లులే కాకుండా గతంలో వినియోగించిన విద్యుత్ బకాయిలు కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ బకాయిలను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు. లాక్డౌన్ అమలవుతున్నా విద్యుత్ సంస్థలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నాయని చెప్పారు. ఈ సదుపాయం నిరాటంకంగా కొనసాగడానికి వినియోగదారులు బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు. -
పేదల ఇళ్లకు స్విస్ టెక్నాలజీ
సాక్షి, అమరావతి: పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇండో–స్విస్ సాంకేతికతతోపాటు ఇంధన సామర్థ్య టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు కొత్తగా నిర్మించే ఇళ్లల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 8 డిగ్రీల వరకు తగ్గుతాయని గుర్తించారు. ఈ ప్రాజెక్టు గురించి వివరించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అధికారులు ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్తో భేటీ అయ్యారు. రాష్టంలో బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ (బీప్) అమలు చేసేందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు. దేశంలో తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ రెసిడెన్షియల్ (ఈసీబీసీఆర్) ప్రకారం.. ఇండో స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీనవర్గాల గృహాలకు అందజేస్తామని తెలిపారు. హౌసింగ్, రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ, బీప్ అధికారులతో అజయ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో మీడియాకు వెల్లడించారు. గృహ నిర్మాణ వ్యయం తగ్గుతుంది: బీఈఈ ఈసీబీసీఆర్ వినియోగించడం వల్ల గృహ నిర్మాణ వ్యయం కూడా కొంత వరకు తగ్గుతుందని బీఈఈ పేర్కొంది. 30 లక్షల ఇళ్లలో ఎల్ఈడీ లైట్లు, అత్యుత్తమ ఇంధన సామర్థ్యం కలిగిన ఫ్యాన్లు, ఇతర ఎనర్జీ సామర్థ్య ఉపకరణాలను అమర్చేందుకు సహకరించాల్సిందిగా ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషిఎన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో) కోరినట్టు చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఈసీబీసీ రెసిడెన్షియల్ కోసం కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలను నామినేట్ చేయగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అసలేంటీ ప్రాజెక్ట్? - పేదలు, బలహీనవర్గాలకు 14,097 జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఈ గృహ నిర్మాణ పథకం దేశంలోనే అతిపెద్దది. - నిర్మించే ఇళ్లల్లో పెద్ద హాల్, బెడ్ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉంటాయి. ఇంటి మొత్తం విస్తీర్ణంలో 16.66 శాతం ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇంటి నిర్మాణంలో కొన్ని రకాల మెటీరియల్స్ వాడటం, సాంకేతిక చర్యలు చేపట్టడం ద్వారా ఇంట్లోని ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతాయి. సీలింగ్ దగ్గరలో గ్లాస్ ఫిట్టింగ్ ఉండే కిటికీలు, ఇంటి పైకప్పు, గోడలను పర్యావరణహితంగా నిర్మించడం ఇండో–స్విస్ టెక్నాలజీలో ముఖ్యాంశాలు. - ఇండో–స్విస్ టెక్నాలజీతో ఇళ్లు కట్టడం వల్ల పగటిపూట ఇంటి లోపల సహజసిద్ధమైన వెలుతురు పెరుగుతుంది. కానీ చల్లదనం మాత్రం ఉంటుంది. - అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంధన ఆదా చేయగల విద్యుత్ ఉపకరణాలనే అమరుస్తారు. ఇల్లు చల్లగా ఉండటం, ఇంకోవైపు వాడే ఉపకరణాలు విద్యుత్ను ఆదా చేయడం వల్ల తక్కువ విద్యుత్ బిల్లులు వచ్చే వీలుంది. - స్విట్జర్లాండ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ సాంకేతికతను ఆంధ్రప్రదేశ్కు అందిస్తుంది. ఏంటీ స్విస్ టెక్నాలజీ? స్విస్ టెక్నాలజీలో భాగంగా ప్రకృతిసిద్ధమైన గాలి, వెలుతురు విస్తారంగా లోనికి ప్రవేశించేలా ఇళ్లను డిజైన్ చేస్తారు. పై కప్పు, గోడల నిర్మాణంలో చల్లదనం ఎక్కువగా ఉండేలా, వేడిని లోనికి రానివ్వకుండా ప్రత్యేక పదార్థాలు వాడతారు. కిటికీలకు వాడే అద్దాలను కూడా ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీంతో కాంతి మరింత ఎక్కువగా ప్రసరిÜ్తుంది. మరోవైపు ఇంధన సామర్థ్యం గల పరికరాలు, అతి తక్కువ కరెంట్ను వినియోగించుకునే ఉపకరణాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎల్ఈడీ బల్బులు, స్టార్ రేటెడ్ ఫ్యాన్లు వంటివి వాడటం వల్ల 20 శాతం కరెంట్ ఆదా అవుతుంది. స్విస్ టెక్నాలజీ వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత 4 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గుతుంది. కాబట్టి ఏసీలు, కూలర్లు అంతగా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు స్విట్జర్లాండ్ కంపెనీలు అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందిస్తాయి. -
రెండు నెలలు..11 వేల కరెంట్ బిల్లు
సాక్షి, చొప్పదండి(కరీంనగర్) : ప్రతి రెండు నెలలకు ఐదు వందల నుంచి వేయి లోపు రావాల్సిన కరెంట్ బిల్లు ఒకేసారి పదకొండు వేలు రావడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరపు సంతోష్కుమార్కు సర్వీస్ నంబర్ 722పై విద్యుత్ కనెక్షన్ ఉంది. ప్రతీ రెండునెలలకోసారి బిల్లు ఐదు వందల రూపాయల నుంచి వేయి వచ్చేది. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు మీటర్ రీడింగ్ 1285 యూనిట్లు తిరిగినట్లు రూ.11 వేల 2 రూపాయలు చెల్లించాలని బిల్లు తీసి అందించారు. మీటర్ తీసుకున్నప్పటి నుంచి ఏనాడు వేయి దాటని బిల్లు ఇంతపెద్దమొత్తంలో రావడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. -
సింగిల్ ఫ్యాన్.. 128 కోట్ల కరెంట్ బిల్లు
లక్నో: ఓ సాధారణ, పేదవాడికి వచ్చే కరెంట్ బిల్లు మహా అంటే వంద, లేక వేలల్లో వస్తుంది. కానీ ఆ ఇంటి వాళ్లకు మాత్రం అక్షరాలా నూటా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్ పడింది. ఉత్తరప్రదేశ్లోని హపూర్లో ఓవ్యక్తి ఇంటికి ఏకంగా రూ.128, 84, 59, 544.00. బిల్లు వచ్చింది. దీనిని చూసిన ఇంటి యజమాని షమీమ్, అతని భార్య షాక్కి గురయ్యారు. తాము వాడే సింగిల్ ఫ్యాన్, లైటుకే ఇంత బిల్లు రావడం ఏంటని ఆశ్చర్యపోయారు. వారికి అంత స్థోమత లేకపోవడంతో బిల్లు కట్టలేకపోయారు. అయితే ఒక రోజు కరెంట్ వాళ్లు వచ్చి.. కనెక్షన్ కట్ చేస్తుంటే ఎందుకని షమీమ్ ప్రశ్నించాడు. బిల్లు మొత్తం కట్టే వరకు కనెక్షన్ ఇచ్చేది లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏంటా అని ఆరాతీస్తే.. కోట్లలో బిల్లు ఉంది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే... ఎవ్వరూ పట్టించుకోకపోగా.. బిల్లు కట్టాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆయన ప్రభుత్వ కార్యాలయాలు చూట్టూ తిరగడం ప్రారంభించాడు. చివరకు విషయం మీడియాకు చేరడంతో అసలు విషయం బయటపడింది. అదంతా సాంకేతిక సమస్య కారణంతో జరిగిందని అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అధికారుల తీరుపై షమీమ్ మండిపడ్డాడు. కరెంట్ వాళ్లు తమ ఇంటికేగాక.. మొత్తం హపూర్ నగరం బిల్లంతా తనకే ఇచ్చారని షమీమ్ ఎద్దేవా చేస్తున్నాడు. విద్యుత్ శాఖ తప్పిదాల కారణంగా ఇప్పటికే అనేకసార్లు భారీ ఎత్తున బిల్లులు వచ్చిన విషయం తెలిసిందే. -
కరెంట్ బిల్లుపై రాయ్లక్ష్మీ గగ్గోలు!
కోలీవుడ్, టాలీవుడ్ దాటి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంచలన నటి రాయ్లక్ష్మీ కరెంట్ బిల్లుపై గగ్గోలు పెడుతున్నారు. గత కొన్నినెలలుగా తన కరెంట్ బిల్లు తడిసి మోపడైతుందని, ఎంత కడితే అంతకు డబుల్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆరా తీద్దామని ఆదాని ఎలక్ట్రీసిటీ సంస్థకు చెందిన టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే ఎంతకు కలవడం లేదన్నారు. తనకే ఇలా ఉంటే సామన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ట్విటర్ వేదికగా తన సమస్యను రాయ్ లక్ష్మీ అభిమానులతో పంచుకున్నారు. ‘గత కొన్ని నెలలుగా నా కరెంట్ బిల్లులను పరిశీలిస్తే.. నేను ఎంత బిల్ పే చేస్తున్నానో అంతకు డబుల్ మరుసటి నెల వస్తోంది. ఇలా బిల్ డబుల్ అవ్వడం గత మూడు నెలలుగా చూస్తున్నాను. ఈ విషయం గురించి తెలుసుకుందామని ఆదాని ఎలక్ట్రిసిటీ టోల్ఫ్రీ నెంబర్కు ఎన్ని సార్లు చేసినా కలవడం లేదు. ఎంత మంది ప్రజలు నా తరహా సమస్యతో బాధపడుతున్నారో? ఎవరైనా నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కించండి. కష్టపడి సంపాదించిన సొమ్ము ఇలా ఉచితంగా కట్టాలంటే బాధగా ఉంది’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ట్విటర్ వేదికగా ఆదాని ఎలక్ట్రిసిటీ స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. దయచేసి మీ వివరాలను తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తాం’ పేర్కొంది. Observing my electricity bill cycle since months .. its almost double than what i have been paying every month..& i have barely been home past 3 months to see my bill shoot up.. Repeated attempts of contacting ADANI ELECTRICITY on toll free number has failed. @Adani_Elec_Mum pic.twitter.com/jqh0xG6idc — RAAI LAXMI (@iamlakshmirai) 16 July 2019 సౌత్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాయ్లక్ష్మీ ఈ మ్యాజిక్ను బాలీవుడ్లో మాత్రం రిపీట్ చేయలేకపోయారు. అందుకే వీలైనప్పుడల్లా హిందీ సినిమాల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్నారు. ఇది వరకు ‘అకీరా’ (2016), ‘జూలీ 2’ (2017) చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ‘టిస్ఫై’ అనే హిందీ చిత్రానికి సైన్ చేశారు. ఈ చిత్రానికి దీపక్ తిజోరీ దర్శకత్వం వహించనున్నారు. నాజియా హుస్సే నామి, షామా సికందర్, అలంకృత సహై, కైనత్ అరోరా కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో లండన్లో ప్రారంభం కానుంది. -
కరెంటోళ్ల ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అమరావతి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా నెలవారీ విద్యుత్ బిల్లులపై సీఎం చంద్రబాబు ఫొటోను ముద్రించారు. రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం దేనిపైనా ముఖ్యమంత్రి ఫోటోను ప్రచురించకూడదు. కానీ ఈ నెల 17వ తేదీన ఏలూరు 3 పరిధిలో ఇచ్చిన విద్యుత్ బిల్లులు వెనుక వైపు జగజ్జీవన్ జ్యోతి పథకం ప్రచురించారు. ఇందులో ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మను ముద్రించారు. దీనిపై ఈపీడీసీఎల్ సీఎండీ రాజబాపయ్యను వివరణను కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయితే, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం గతంలోనే ముద్రించి సిద్ధం చేసిన బిల్లు పేపర్లపై చంద్రబాబు బొమ్మ ఉందని చెప్పామని, ఆయన పట్టించుకోలేదని చెబుతున్నారు. వాస్తవానికి రాజబాపయ్యను రాత్రికి రాత్రే ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించారు. దీనివెనుక రాజకీయ కారణాలున్నాయని, తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే నోటిఫికేషన్ ఇవ్వాలనే నిబంధనలు సైతం పక్కనపెట్టి నియామకం చేశారనే చర్చ విద్యుత్వర్గాల్లో జరుగుతోంది. -
కరెంట్ బిల్లు నుంచి పిల్లికి ఉపశమనం
చిన్నప్పుడు ‘హోంవర్క్ ఎందుకు చేయలేదురా?’ అని టీచర్ అడిగితే ‘అంటే..మేడం నేను హోం వర్క్ చేశాను..కానీ ఆ పుస్తకాన్ని మా కుక్క మాంసం ముక్క అనుకుని నమిలేసింది’వంటి టింగరి సమాధానాలు మనమో.. మన ఫ్రెండ్సో చెప్పే ఉంటారు..ఇప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూనే ఉంటాం! నేరం చేసి కోర్టు బోనెక్కినప్పుడు కూడా తప్పును పెంపుడు జంతువుపై నెట్టేస్తామా? రష్యాలోని బర్నల్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాత్రం నెట్టేశాడు. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ డిపార్ట్మెంట్ అతన్ని కోర్టుకీడ్చింది. ఎందుకు కట్టలేదని జడ్జి అడగ్గా..‘రూ. 90,200 (80వేల రుబెల్స్) బిల్లు! ఇంత మొత్తం మేం కాల్చం. మా పిల్లే ఎనర్జీ మీటర్ను ట్యాంపర్ చేసింది’అని సమాధానం ఇచ్చాడు. ఎలా అని ప్రశ్నించారు జడ్జి.. ఆ పిల్లి ఎప్పుడూ తమ ఇంటిపైనే గంతులేస్తుందని, ఎనర్జీమీటర్ పైనుంచే అది పైకి పాకుతుందని, అలా ఎప్పుడో దాని పదునైన గోళ్లతో సీల్ ట్యాంపరింగ్కు పాల్పడిందని వివరణ ఇచ్చాడు. దీన్ని విద్యుత్శాఖ తరఫు న్యాయవాది ఖండించాడు. ఎనర్జీ మీటర్ సీల్ను పిల్లి గోళ్లతో తీయలేదని, దాని పళ్లతో కూడా కొరకడం సాధ్యం కాదని వాదించాడు. సీల్ను కట్ చేయాలంటే ఎలక్ట్రీషియన్లకే బలమైన కటింగ్ ప్లయర్లు అవసరమయ్యాయని ఆధారాలను కోర్టు ముందుంచాడు. దీంతో జడ్జి అతగాడిని మందలించి, మొత్తం బిల్లు చెల్లించడంతో పాటు రూ.2,800 (2,500 రుబెల్స్) జరిమానా కట్టాలని తీర్పునిచ్చాడు. -
గుండె గు‘బిల్లు’
కమలాపూర్ : కూలీ ఇంటికి మోయలేని కరెంట్ బిల్లు వచ్చింది. నెలకు సగటున రూ.150 నుంచి రూ.250 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ.41,279 రావడంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. బాధితుడి బాధితుడి కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కూలీ వెల్దండి లక్ష్మీనారాయణ తన పేరిట 2217 సర్వీసు నంబరపై కొన్నేళ్ల క్రితం విద్యుత్ మీటరు తీసుకుని వినియోగించుకుంటున్నాడు. అయితే ఆయన కరెంట్ కనెక్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి నెలా రూ.150 నుంచి రూ.250 వరకే బిల్లు వచ్చేది. అలాంటిది జూన్ నెలకు సంబంధించి రూ.41,279 బిల్లు వచ్చింది. దీంతో కంగుతిన్న లక్ష్మీనారాయణ వెంటనే బిల్లులు చెల్లించే కౌంటర్ వద్దకు శనివారం వెళ్లారు. అయితే రంజాన్ పర్వదినం కావడంతో అక్కడ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ను వినియోగించలేదని, నెలనెలా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి బిల్లు వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై విద్యుత్శాఖ ఏఈ లక్ష్మణ్నాయక్ను వివరణ కోరగా.. లక్ష్మీ నారాయణ ఇంటికి బిల్లు ఎక్కువ వచ్చేందుకు కారణాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు బిల్లు తగ్గింపుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
బిల్లు చూసి షాక్.. ఆపై ఆత్మహత్య..!
సాక్షి, ముంబై : కరెంట్ బిల్లు ఓ వ్యాపారి ప్రాణాన్ని బలితీసుకుంది. రూ. 8లక్షల బిల్లు చూసిన ఆ చిరువ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఔరంగాబాద్లోని భరత్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలివి.. జగన్నాథ్ సెల్కే(40) కూరగాయాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ వ్యాపారి గత 20 సంవత్సరాలుగా రెండు గదుల షెడ్ తీసుకుని ఫ్యామిలీతో జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ కుటుంబం 55,519 యూనిట్ల విద్యుత్ వినియోగించారని రూ. 8,64,781 బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన అతను తీవ్ర మనస్తాపనకు గురయ్యాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాక కరెంట్ బిల్లు అధికంగా రావడం వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్ఈడీసీఎల్) స్పందించింది. దీనికి ఓ సెక్షన్ ఇంజినీర్ నిర్లక్ష్యం కారణమని ఎంఎస్ఈడీసీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అతను మీటర్ రీడింగ్ను 6, 117.8 కేడబ్యూహెచ్ కాగా 61, 178 కేడబ్యూహెచ్గా కొట్టాడని తెలిపింది. అందుచేతనే రూ. 8, 64,781 బిల్లు వచ్చిందని ఓ ప్రకటనలో ఎంఎస్ఈడీసీఎల్ పేర్కొంది. ఈ ఘటనపై ఓ బిల్లింగ్ క్లర్కును సస్సెండ్ చేసినట్లు సమాచారం. జగన్నాథ్ ఇంట్లో మీటర్ పనిచేయనందుకు జనవరి 10న దాని స్థానంలో కొత్తమీటరు అమర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. -
బిల్లు కట్టలేదని ఫీజు పీకేశారు
చేవెళ్ల : చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి రెండు నెలల విద్యుత్ బకాయిలు కట్టలేదని అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. రెండు నెలలకు సంబంధించి రూ. 14వేల విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉంది. దీంతో మంగళవారం రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే... చేవెళ్ల మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విద్యుత్ బిల్లును కార్యాలయమే చెల్లించాల్సి ఉంది. ప్రతినెలా విద్యుత్బిల్లుకు సంబంధించి బిల్లు చేసి ఎస్టీఓకు పంపిస్తారు. అక్కడ బిల్లుకు సంబంధించిన నిధులు విడుదలైతే డీడీని విద్యుత్ అధికారులకు ఇస్తారు. అయితే రెండు నెలలుగా ఎస్టీఓ నుంచి డీడీ రాకపోవటంతో వేచి చూసిన విద్యుత్ అధికారులు మంగళవారం కనెక్షన్ తొలగించారు. దీంతో కార్యాలయంలో జరగాల్సిన రోజువారీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అసలే వరుసగా మూడు రోజులు (శని, ఆది, సోమ) సెలవులు రావటంతో రిజిస్ట్రేషన్లు జరగలేదు. మంగళవారమైనా చేయించుకుందామని వచ్చిన వారికి నిరాశే మిగిలింది. కొంతమంది పనులు మానుకొని వచ్చామని సబ్రిజిస్ట్రార్తో వాగ్వివాదం పెట్టుకున్నారు. ఆన్లైన్ లేకపోతే మాన్యూవల్గానైనా చేయాలని కోరారు. అయితే తనకు అలాంటి అధికారం లేదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉంటేనే చేస్తానని సబ్ రిజిస్ట్రార్ వారితో చెప్పారు. రెండు రోజులు గడువిచ్చాం: విద్యుత్ ఏఈ మురళీధీర్ విద్యుత్ ఏఈ మురళీధీర్ను ఈ విషయంపై ప్రశ్నించగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయం భవనం ప్రైవేటుదని తప్పనిసరిగా ప్రతినెలా బిల్లు చెల్లించాల్సిందేనని అన్నారు. ఇప్పటికే రెండు నెలలు వేచి చూశామని రూ. 14వేల బిల్లు పెండింగ్లో ఉందని తెలిపారు. ఇప్పటికీ బిల్లు రాకపోవటంతోనే తొలగించినట్లు చెప్పారు. అయితే సబ్రిజిస్ట్రార్ రెండురోజుల కోసం అనుమతి కోరటంతో సాయంత్రం విద్యుత్ కనెక్షన్ను ఇచ్చినట్లు చెప్పారు. రెండు రోజులు చూసి బిల్లు రాకపోతే మళ్లీ తొలగిస్తామని తెలిపారు. సాయంత్రం కనెక్షన్ ఇచ్చినా అప్పటికే సమయం అయిపోవటంతో అందరూ వెళ్లిపోయారు. బిల్లు చేసి పంపించాం.. బకాయిలకు సంబంధించి బిల్లు చేసి మా కార్యాలయం నుంచి ఎస్టీఓకు పంపించాం. అక్కడి నుంచి నేరుగా విద్యుత్ అధికారులకు డీడీ రూపంలో బిల్లు వెళ్లాలి. కానీ ఎస్టీఓ నుంచి డీడీ వెళ్లలేదన్నారు. పైనుంచి నిధులు రాలేదని అందుకు డీడీ పంపలేదని చెప్పారు. విద్యుత్ అధికారులు అడిగితే రెండురోజుల్లో వస్తుందని నాలుగైదు రోజులుగా చెబుతున్నారు. – రాజేంద్రకుమార్, సబ్రిజిస్ట్రార్, చేవెళ్ల -
విద్యుత్ బకాయిలు..రూ.167.42 కోట్లు..!
నల్లగొండ : విద్యుత్ బిల్లుల బకాయిల భారం విద్యుత్శాఖకు పెద్ద గుదిబండలా మారింది. ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించడం మానేశారు. నిధుల సమస్యను కారణంగా చూపించి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా మొండికేశారు. దీంతో ఏటికేడు పెరిగిపోతున్న బకాయిలను వసూలు చేయడం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. విద్యుత్ శాఖ నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. ప్రతి నెలా విద్యుత్ శాఖ నిర్వహించే నెలవారీ విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ బకాయిల పైన ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్నా బిల్లులు మాత్రం వసూలు కావడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్, మైనర్ పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు మొత్తం రూ.167.42 కోట్లు అని తేలింది. దీంట్లో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చెల్లించాల్సిన బకాయిలు రూ.44 కోట్లు. కాగా పాత బకాయిలతో కలుపుకుని మొత్తం రూ.167.42 కోట్లు. వీటిల్లో ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.3.21 కోట్లు కాగా, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3.74 కోట్లు, మేజర్, మైనర్ పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. పేరుకుపోయిన బకాయిలు.. జిల్లా కేంద్రంలోని 26 ప్రభుత్వ శాఖల్లో బిల్లులు చెల్లించకుండా మొండికేసిన శాఖల్లో విద్యాశాఖ రూ.కోటి 32 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పాఠశాలల హెచ్ఎంల నుంచి స్పందన ఉండటం లేదన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారని విద్యాశాఖ చెప్తోంది. కానీ హెచ్ఎంలు మాత్రం వచ్చిన కొద్దిపాటి నిధులు పాఠశాలల నిర్వహణకే సరిపోతున్నాయని, దాంతో బిల్లులు చెల్లించడం కష్టం మారిందని అంటున్నారు. పోలీస్ క్వార్టర్స్కు సంబంధించి కోటి రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ హెడ్క్వార్టర్స్లో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ బకాయిలు ఇవి. నెలవారీ బిల్లుల చెల్లింపులో పోలీస్ శాఖ మొదటి స్థానంలో ఉంది. కానీ క్వార్టర్స్ బకాయిలను సెటిల్ చేసుకోకపోవడంతో ఏళ్ల తరబడి పెండింగ్లో పడిపోయాయి. వ్యవసాయ శాఖ రూ.3.08 లక్షలు, పశుసంవర్థక శాఖ రూ.లక్షా 92 వేలు, ఉన్నత విద్య రూ.లక్షా 94 వేలు, సాగునీటి పారుదల శాఖ రూ.57.41 లక్షలు, రెవిన్యూ శాఖ రూ.7 లక్షలు, రవాణా శాఖ రూ.5.97 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ శాఖలకు సంబంధించి నిధులు సర్దుబాటుకాకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, వచ్చిన కొద్దిపాటి నిధులు కూడా ఫ్రీజింగ్ల పేరుతో ట్రెజరీ శాఖ నిలిపేస్తుందని అంటున్నారు. ప్రతి నెలా క్రమతప్పకుండా బిల్లులు చెల్లి స్తున్న శాఖల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, వైద్య ఆరోగ్యం, పోలీస్ శాఖలు ఉన్నాయి. బిల్లులు చెల్లించక రెండేళ్లు...! మున్సిపాలిటీలు, మేజర్, మైనర్ పంచాయతీలు బిల్లులు చెల్లించక రెండేళ్లు దాటింది. పంచాయతీలు చివరిసారిగా జనవరి 2016లో చెల్లించారు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. మున్సిపాలిటీల బకాయిలు రూ.3.74 కోట్లు ఉండగా, పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్న నాటి నుంచి సర్పంచ్లు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల్లో 30 శాతం విద్యుత్ బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు పాటించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో వీధిలైట్ల విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. తాగునీటి బోర్లకు విద్యుత్ కట్ చేయడం సాధ్యం కానందున చర్యలు తీసుకులేకపోతున్నామని అంటున్నారు. మున్సిపల్ కార్యాలయాలకు విద్యుత్ సర ఫరా నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ మేరకు కమిషనర్లకు నోటీసులకు కూడా జారీ చేశామని చెప్పారు. సర్చార్జీల భారం... విద్యుత్ బకాయిల పైన సర్చార్జీల పేరుతో 18 శాతం అదనపు భారాన్ని వసూలు చేయడం జరుగుతోంది. ఈ తరహా చార్జీలు అన్ని రకాల కేటగిరీలకు చెందిన బిల్లులకు వర్తిస్తుంది. ప్రతిఏడాది 18 శాతం సర్చార్జీల పేరుతో వినియోగదారులు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు అదనపు భారాన్ని మోయాల్సిందే. ఎంతకాలం పాటు బిల్లులు చెల్లించకుండా ఉంటే అన్నేళ్ల పాటు పెండింగ్లో ఉన్న బిల్లులపైన 18 శాతం సర్చార్జీ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్ బకాయిల పైన ఎస్ఈ కృష్ణయ్య మాట్లాడుతూ...అన్ని శాఖలకు నోటీసులు జారీ చేశామని, ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని చెప్పారు. -
సెలూన్కు రూ.1.27 లక్షల కరెంట్ బిల్లు
పటాన్చెరు: చిన్న హెయిర్ కటింగ్ సెలూన్కు వచ్చిన కరెంటు బిల్లు అక్షరాలా రూ.1.27లక్షలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగికి చెందిన శ్రీనివాస్ స్థానికంగా హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. ప్రతీనెల (విద్యుత్ మీటర్ నంబర్ 0558 02239) రూ.200 నుంచి ఎక్కువలో ఎక్కువ రూ.1,000 వరకు కరెంటు బిల్లు వచ్చేది. అంతకుమందు నెల రూ.971 బిల్లు రాగా జూన్ 28న చెల్లించాడు. ఇక జూలైకి సంబంధించిన బిల్లు ఈ నెల 10న వచ్చింది. బిల్లు చూసిన శ్రీనివాస్కు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. రూ.1,27,751 అంకె చూడగానే అతని గుండె గు‘బిల్లు’మంది. బిల్లుపై జూన్ 14 నుంచి ఆగస్టు 10 వరకు అని, 12,782 యూనిట్లు వినియోగించినట్లు చూపుతోంది. స్థానిక విద్యుత్ అధికారులను సంప్రదిస్తే సంగారెడ్డిలో లోక్ అదాలత్ నిర్వహిస్తారని అప్పుడు నీ సమస్య చెప్పుకోమని ఉచిత సలహా ఇచ్చారు. -
ఎన్నెస్పీకి విద్యుత్ షాక్!
స్థలాలు, భవనాలు లేకున్నా భారం మిగిలింది.. రూ.2 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇరిగేషన్ మంత్రి హరీష్రావు ఆరా.. ఖమ్మం అర్బన్: ఎన్నెస్పీ అధికారులకు విద్యుత్ బిల్లుల భారం చుట్టుకుంది. ఏకంగా రూ. 2 కోట్లకు పైగానే విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ సదరు శాఖ నోటీసులు జారీ చేసింది. నగరంలో ఒకప్పుడు ఎవరికి భూమి కావాలన్నా ఎన్నెస్పీ మిగులు భూములు గుర్తుకొచ్చేవి. సుమారు 40 ఏళ్లకుపైగా ఓ వెలుగు వెలిగిన శాఖ ఇప్పుడు సొంత భవనాలు కోల్పోయి.. ప్రభుత్వం చూపించిన తాత్కాలిక ఇరుకు గదుల్లో నెట్టుకొస్తోంది. నగరంలోని గట్టయ్య సెంటర్కు ఆనుకొని ఎన్నెస్పీ క్యాంప్ ఉంది. దానికోసం సాగర్ కాల్వల సమయంలో భూ సేకరణ చేశారు. సుమారు 94 ఎకరాలకుపైగా సేకరించి.. అందులో ఎన్నెస్పీ అధికారులు, సిబ్బంది నివాసం ఉండేందుకు సుమారు 800 వివిధ రకాల క్వార్టర్లు నిర్మించారు. అప్పుడు క్యాంప్ అంతటికీ ఒకే టాన్స్ఫార్మర్ అమర్చి.. దాని ద్వారా విద్యుత్ శాఖ అధికారులు రీడింగ్ తీసి ఎన్నెస్పీ శాఖ నుంచి వసూలు చేశారు. క్వార్టర్లలో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం చిన్న క్యార్టర్కు రూ.300, పెద్ద వాటికి రూ.500 వసూలు చేసేవారు. అయితే విద్యుత్ ఎంత వాడుకున్నా క్వార్టర్లలో ఉండే వారి వద్ద మాత్రం ఖరారు చేసిన పై మొత్తాన్ని వసూలు చేసేవారు. అది పోగా.. మిగిలిన మొత్తం బిల్లు ఎన్నెస్పీ ఖాతా నుంచి చెల్లించేవారు. తర్వాత ఆ క్వార్టర్లపై రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల దృష్టి పడింది. దీంతో ఎవరికి వారే తమ అధికారాన్ని ప్రదర్శించి.. క్వార్టర్లు కేటాయించుకుని నివాసం ఉన్నారు. వారికి తోడు ఉద్యోగుల పేరుతో ప్రైవేటు వ్యక్తులు కూడా దర్జాగా నివాసం ఉన్నారు. వారంతా నెలనెలా విద్యుత్ను అవసరం ఉన్న మేరకు దర్జాగానే వాడుకొని మినిమమ్ బిల్లు చెల్లిస్తూ వచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఎన్నెస్పీ అధికారులు ఇన్నేళ్లుగా చెల్లించారు. క్వార్టర్లలో కొన్ని భవనాలు శిథిలం కావడంతో వాటిని ఖాళీ చేశారు. మరికొన్నింటిని అధికారులు గత ఏడాది బలవంతంగానే ఖాళీ చేయించచి.. మొత్తం క్వార్టర్లను కూల్చివేశారు. భవనాలు కూల్చివేసిన తర్వాత కూడా విద్యుత్ వాడకం, వాటికి సంబంధించిన బిల్లులు కూడా యథివిధిగానే వస్తున్నాయి. ఈ క్రమంలో కూల్చిన క్వార్టర్లను అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. దీంతో అవి రూ.2కోట్లకుపైగా పేరుకుపోయాయి. తక్షణమే ఆ బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు తరచు లేఖలు పంపుతున్నారు. మంత్రి హరీష్రావు ఆరా.. ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్నకు ఉపయోగించిన విద్యుత్ బిల్లుల భారంపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఆరా తీసినట్లు తెలిసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విద్యుత్ బిల్లులపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నెస్పీ పేరుతో కేటాయించిన విద్యుత్ కనెక్షన్లు వినియోగించే వాటిని ఉంచి.. మిగతా వాటిని విద్యుత్ శాఖకు తిరిగి ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం బకాయి ఉన్న రూ.2కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు తనకు నివేదిక పంపించాలని ఆదేశించినట్లు సంబంధిత ఓ అధికారి తెలిపారు. -
కరెంట్ బిల్లులకు 10 వేల కోట్లు
⇔ ఎత్తిపోతల పథకాల విద్యుత్పై ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ⇔ దాదాపు 9 నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ కావాలి ⇔ ధర్నాచౌక్ తరలింపుపై నిర్ణయం మాది కాదు.. ⇔ కోర్టు నోటీసులతోనే ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తింపు ⇔ కోర్టులు చెప్పినా వినమంటే మేమేం చేయాలి? ⇔ ఛత్తీస్గఢ్ కరెంట్ యూనిట్కు రూ.3.70 లేదా రూ.3.90 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్రంలోని కాళేశ్వరం, పాలమూరు, కల్వకుర్తి, బీమా, నెట్టెం పాడు, డిండి ఎత్తిపోతల పథకాలకు దాదాపు 9 వేల నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని తెలిపారు. బుధవారం కేబినెట్ భేటీ అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. ‘‘కృష్ణా బేసిన్లో నీటి లభ్యత ఉన్నప్పుడే అప్పటికప్పుడే నీళ్లను తరలించుకోవాలి. ఇక్కడి ప్రాజెక్టులకు రాత్రింబవళ్లు విద్యుత్ సరఫరా అవసరం. గోదావరిలో ఆర్నెల్ల పాటు నిల్వ ఉంటాయి. దీనిపై ఉన్న ఎత్తిపోతలకు రాత్రి వేళల్లో ఎక్సే్ఛంజీల నుంచి చౌక విద్యుత్ సరఫరా చేస్తాం. విద్యుత్ ఎక్సే్ఛంజీల్లో రాత్రి పూట యూనిట్కు రూ.1.50 నుంచి రూ.2కే విద్యుత్ లభ్యత ఉంది’’ అని వివరించారు. ధర్నాచౌక్ తరలింపు అంశాన్ని కొందరు విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఈ మధ్య జరిగే చిల్లర వ్యవహారాలు చూస్తున్నం. కోర్టులు చెప్పుతున్నా మేం వినం. బేఖాతరు చేస్తం. ధర్నాల తేదీలు, స్థలం మేమే ప్రకటిస్తాం... రక్తాలు కారినా సరే ధర్నాలు చేస్తం.. అని కొందరు అంటుంటే ఏం చేయాలి. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యానికి అందం. మేం కూడా ఈ వెసులుబాటు ఉండాలనే కోరుకుంటున్నాం. అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మేం ఇంకా ధర్నాచౌక్ను రద్దు చేయలేదు. ధర్నాచౌక్తో ఇబ్బందు లు వస్తున్నాయని స్థానికులు కోర్టుకు ఆశ్రయించడం తో ప్రభుత్వానికి నోటీసులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వం చేసిందేమీ లేదు. ధర్నాచౌక్ తరలింపు కోసం ప్రత్యామ్నాయ స్థలాలు ఎంపిక చేయాలని పోలీ సులను కోరాం. 5 వేల మందికి పైగా జనం పాల్గొనే బహిరంగ సభలు నిజాం కళాశాల మైదానంలో కాకుం డా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని ఆదేశించాం’’ అని వివరించారు. గతంలో లుంబినీ పార్కు వద్ద ధర్నా చౌక్ ఉండేదని, ఆ తర్వాత ఇందిరా పార్కు వద్దకు తరలిందని సీఎం చెప్పారు. సచివాలయం, శాసనసభకు సమీపంలో ధర్నాలు చేయరాదని ఇప్పటికే జీవోలు కూడా ఉన్నాయని తెలిపారు. ధర్నా ఎక్కడ చేసినా ఒక్కటేనని, మీడియాలో ప్రసారం జరుగుతుందని, ప్రభుత్వం దృష్టికి వస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రభావం ఓయూ శతాబ్ది ఉత్సవాలపై ఉండదన్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను తిరస్కరించాం బువ్వ లేక సచ్చిపోతున్నారంటే అధిక రాయితీలు వద్దని ఆర్థికవేత్తలు అంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్ల గుండెపై కుంపటి. పెళ్లి చేయలేక ఆత్మహత్య చేసుకుంటుంటే కల్యాణ లక్ష్మి వద్దని ఆర్థికవేత్తలు అనడం ఏమిటి? ఈ పథకం వద్దని నీతి ఆయోగ్ చేసిన సిఫారసులను తిరస్కరించి వెనక్కి పంపినం. దేశంలో నోట్ల రద్దు పాక్షికంగా విజయవంతమైంది. ఇంకా పూర్తిగా అమలు కావాల్సి ఉంది’’అని అన్నారు. వ్యవసాయ పథకాలపై సమీక్ష అవసరం జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగాన్ని పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ బీమా పథకంలో లోపాలున్నాయని సీఎం అన్నారు. మిర్చీకి దేశంలోనే అత్యధిక ధర తెలంగాణలోనే ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర భూసేకరణ చట్టానికి వారం రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ప్రక్రియ మొదలైనట్టు తమకు సమాచారం ఉందన్నారు. కేంద్రం మద్దతిస్తుందని భావిస్తున్నాం రాష్ట్రాల నుంచి వచ్చే సీఎంలను బికారీలాగా చూడదల్చుకోలేదని, రాష్ట్రాల సిఫారసులను గౌరవిస్తామని ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశంలో పేర్కొన్నారని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో తాము తేనున్న రిజర్వేషన్ల చట్టం విషయంలో కేంద్రం మద్దతిస్తుందని భావిస్తున్నామన్నారు. లేకుంటే ఎంత దూరమైనా ఈ విషయం తీసుకెళ్తామన్నారు. ఎన్డీఏలో లేకపోయినా ఎలాంటి ఘర్షణ లేకుండా కేంద్రానికి వంద శాతం మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. ‘ఛత్తీస్’ ధర ఖరారవుతుంది.. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఖరారు కాబోతోందని, యూనిట్కు రూ.3.70 లేదా రూ.3.90 ధరతో రాష్ట్రానికి రానుందని ముఖ్యమంత్రి తెలిపారు. 1000 మెగావాట్ల విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి కొంటుండగా, వార్ధా–డిచ్పల్లి కారిడార్లో 2000 మెగావాట్ల స్లాట్ను బుక్ చేసుకున్నామన్నారు. ఇప్పటికే మూడు విద్యుత్ కారిడార్లు ఉండగా, త్వరలో అందుబాటులోకి వరంగల్–వరోరా, రాయగడ–ఉంగనూరు కారిడార్లు అందుబాటులోకి వస్తే దేశంలోని ఏ మూల నుంచైనా ఏ రాష్ట్రమైనా విద్యుత్ కొనవచ్చని చెప్పారు. -
పంచాయతీలకు షాక్
– విద్యుత్ బిల్లులు మీరే కట్టుకోండి – 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోండి – పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు – తగదంటున్న సర్పంచ్లు ఏలూరు (ఆర్ఆర్ పేట) : గ్రామ పంచాయతీల్లో వీధి లైట్లు, మంచినీటి సరఫరా తదితర అవసరాలకు వినియోగించే విద్యుత్కు సంబంధించిన బిల్లులను చెల్లించే విషయంలో సర్కారు చేతులెత్తేసింది. ఆ బిల్లు బకాయిలను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సర్ధుబాటు చేసుకోవాలంటూ షాకిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీలకు ఉత్తర్వులు అందాయి. పన్నుల రూపంలో వస్తున్న కొద్దిపాటి ఆదాయం పంచాయతీల నిర్వహణకే సరిపోక సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో రెండున్నరేళ్లుగా పెండింగ్లో ఉన్న కొద్దోగొప్పో అభివద్ధి పనులు చేసుకోవచ్చని సర్పంచ్లంతా ఆశించారు. అయితే, ఏడాదికి పైగా బకాయి ఉన్న విద్యుత్ బిల్లులను 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేషీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధుల్లో 12 శాతం వరకు సొమ్మును విద్యుత్ బిల్లులకు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో షాక్ తినడం పంచాయతీ పాలకుల వంతయ్యింది. పంచాయతీలపైనే భారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తరువాత పాలకులు ఆ భారాన్ని పంచాయతీలపై నెట్టేశాయి. ప్రస్తుత ప్రభుత్వమైనా కనికరిస్తుందని పంచాయతీ పాలకవర్గాలు ఆశించాయి. ఈ మేరకు ప్రభుత్వానికి వినతులు సైతం పంపించాయి. అయినా.. ప్రభుత్వం కనికరించలేదు. ఆ భారాన్ని పంచాయతీలు మోయాల్సిందేనంటూ.. 12వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ శాఖకు చెల్లించాలని ఆదేశాలందాయి. రాకరాక వచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 12 శాతాన్ని విద్యుత్ బకాయిలు తీర్చడానికి వెచ్చిస్తే గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాలకు ఏం ఖర్చు చేయగలమని పాలకవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రూ.7.53 కోట్ల బకాయిలు జిల్లాలోని అన్ని పంచాయతీలు విద్యుత్ శాఖకు రూ.7.53 కోట్ల బిల్లులను బకాయిపడ్డాయి. సెప్టెంబర్ నెల బిల్లులతో కలిపితే బకాయిల మొత్తం మరింత పెరుగుతుంది. ఆర్థిక సంఘం నిధులు 57 కోట్లు 14వ ఆర్థిక సంఘం నుంచి జిల్లాలోని 909 పంచాయతీలకు రూ.57 కోట్లు›విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు పంచాయతీలు తమకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి 12 శాతం విద్యుత్ శాఖకు చెల్లిస్తే రూ.6.84 కోట్లు కరిగిపోతాయి. విద్యుత్ బిల్లుల బకాయి దాదాపు 95 శాతం వరకూ తీరుతుంది. డీపీవోతో చర్చిస్తాం పంచాయతీల బకాయిపడిన విద్యుత్ బిల్లుల వసూలుకు సంబంధించి మార్గదర్శకాలు అందాయి. దీనిపై జిల్లా పంచాయతీ అధికారితో చర్చించి పంచాయతీ పాలకవర్గాలు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరతాం. అనంతరం పంచాయతీలకు కొంత గడువు ఇస్తాం. అప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీలపై చర్యలు చేపడతాం. – సీహెచ్.సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఈపీడీసీఎల్ -
బిల్లు చూస్తే షాక్
రెండు బల్బులకు రూ.32 వేలు బిల్లు లబోదిబోమంటున్న గిరిజనులు చిల్లకూరు : మండలంలోని తిప్పగుంటపాళెం గిరిజన కాలనీలోని ఓ పక్కాఇంటికి విద్యుత్ శాఖ రూ.32వేలు బిల్లు మంజూరు చేసింది. కేవలం రెండు బల్బులు, ఓ టీవీకి భారీగా బిల్లు ఇవ్వడంతో గిరిజనులు షాక్కు గురయ్యారు. జీవితాంతం కూడా చెల్లించని మొత్తాన్ని బిల్లుగా ఇవ్వడంతో ఎలా కట్టాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిప్పగుంటపాళెం గిరిజన కాలనీకి చెందిన వెంకటరమణయ్య పక్కాఇంటికి(సర్వీసు నంబర్ 3111147000452) ప్రతి నెలా రూ.80నుంచి రూ.130లోగా బిల్లు చెల్లిస్తుండగా, రెండు నెలల క్రితం ఒక్కసారిగా రూ.24 వేలు బకాయి ఉన్నట్లుగా బిల్లు ఇచ్చారు. మరుసటి నెలలో రూ.32,620 బిల్లును చేతిలో పెట్టారు. వెంకటరమణయ్య రూ.32లే కదాని బిల్లు చెల్లించేందకు వెళ్లగా, రూ.32 వేలు బిల్లు అని అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా బిత్తరపోయాడు. విద్యుత్శాఖాధికారులను కలుసుకోగా అందులో సగమైనా చెల్లిస్తేనే మిగిలిన బిల్లును సర్దుబాటు చేస్తామని చెప్పారని వెంకటరమణయ్య భార్య పద్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ చినస్వామినాయక్ను వివరణ కోరగా బిల్లును పరిశీలించి సవరిస్తామన్నారు. -
బ్రీఫ్స్
దైచీ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కొత్త ఎండోమెంట్ ప్లాన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జపాన్కు చెందిన దైచీ లైఫ్ల జాయింట్ వెంచర్ సుద్ లైఫ్ (స్టార్ యూనియన్ దైచీ లైఫ్ ఇన్సూరెన్స్) తాజాగా ‘సుద్ లైఫ్ ఆదర్శ్’ పేరిట కొత్త ఎండోమెంట్ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువ చ్చింది. సుద్ లైఫ్ ఆదర్శ్ అనేది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ జీవిత బీమా పాలసీ. ఇక్కడ పాలసీదారులు పరిమిత కాల ప్రీమియం చెల్లింపుతో కచ్చితమైన మెచ్యూరిటీ బెనిఫిట్స్ను పొందొచ్చు. అలాగే ఈ పాలసీ కస్టమర్లకు అదనపు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్స్ను ఆఫర్ చేస్తోంది. 8-65 ఏళ్ల వ యసున్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. మహీంద్రా ఏఎంసీ ‘కర్ బచత్ యోజన’ ఫండ్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, మహీంద్రా ఫైనాన్స్ పూర్తి అనుబంధ సంస్థ అయిన మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా ‘మహీంద్రా మ్యూచువల్ ఫండ్ కర్ బచత్ యోజన’ ఫండ్ను ఆవిష్కరించింది. మూడు సంవత్సరాలు లాకిన్ పీరియడ్ కలిగిన ఓపెన్ ఎండెడ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ఇది. ఈ ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7తో ముగుస్తుంది. అలాగే 19న తిరిగి ప్రారంభమౌతుంది. ఈ ఫండ్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. ‘కేవలం పన్ను ఆదా కోసం మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక భద్రతకు ఇది అనువుగా ఉంటుంది’ అని మహీంద్రా ఏఎంసీ సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్ అశుతోష్ వివరించారు. వొడాఫోన్ ఎం-పెసాతో కరెంట్ బిల్లుల చెల్లింపు వొడాఫోన్కు చెందిన డిజిటల్ వాలెట్ సర్వీస్ ‘ఎం-పెసా’ తాజాగా కరెంట్ బిల్లుల చెల్లింపు సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు రాష్ట్రాల ప్రజలు వొడాఫోన్ ఎం-పెసాతో వారి విద్యుత్ బిల్లులను సులభంగా, తక్షణం చెల్లించొచ్చని పేర్కొంది. ఎం-పెసా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వొడాఫోన్ సొంత స్టోర్లు, ఫ్రాంచైజీలు, మల్టీబ్రాండ్ ఔట్లెట్స్, క్యాష్ ఇన్ పాయింట్లలో కూడా బిల్లులను చెల్లించొచ్చు. పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ పేరు మారింది పరాగ్ పారీఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ (పీపీఎఫ్ఏఎస్)తాజాగా తన పీపీఎఫ్ఏఎస్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ పేరును మార్చింది. ఇకపై ఈ ఫండ్ పేరు పరాగ్ పారీఖ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్గా వ్యవహరిస్తారు. ‘మా వ్యవస్థాపకులు దివంగత పరాగ్ పారీఖ్కి నివాళిగా మేం పథకం పేరును మారుస్తున్నాం. ఆయన దార్శనికత, చేపట్టిన చర్యల వల్లే మేం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. కొత్త పేరును కస్టమర్లు సులభంగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాం’ అని పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ , సీఈవో నీల్ పారీఖ్ తెలిపారు. పరాగ్ పారీఖ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ అనేది ఒక ఈక్విటీ ఫండ్. హైదరాబాద్లో విస్తరణ దిశగా హోమ్ క్రెడిట్ హైదరాబాద్: దేశీ ప్రముఖ కన్జ్యూమర్ ఫైనాన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ‘హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్’ తాజాగా హైదరాబాద్లో కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి పాయింట్ ఆఫ్ సేల్స్ సంఖ్యను ఈ ఏడాది చివరకు నాలుగింతలు పెంచుకోవాలని భావిస్తోం ది. దీనికి అనువుగా కొత్తగా 700 మంది ఉద్యోగులను నియమించుకోనుంది. కాగా దేశవ్యాప్తంగా సంస్థకు 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణలో వృద్ధికి హైదరాబాద్లో కార్యకలాపాల విస్తరణ వ్యూహం తమకు ప్రధానమైనదని సంస్థ సీఎంవో థామస్ హర్డ్లికా పేర్కొన్నారు. సాధ్యమైనంతమంది కస్టమర్లకు చేరువకావడమే తమ లక్ష్యమని తెలిపారు. -
రేకులషెడ్కు రూ. లక్షల విద్యుత్ బిల్లు
నరసరావుపేట: తప్పుడు తడకలుగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. నరసరావుపేటలో రేకులషెడ్డులో నివాసం ఉంటున్న ఓ సామాన్య మెకానిక్కు రూ.6 లక్షలకుపైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. వివరాలు... పట్టణంలోని పెద్దచెరువు 9వ లైనులో పార్కు పక్క వీధిలో షేక్.మొహిద్దీన్సాహెబ్కు స్వగహం ఉంది. దీని పైభాగంలో ఉన్న రేకులషెడ్డులో షేక్.జాన్సైదా గత రెండేళ్ళ నుంచి భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో అద్దెకు ఉంటున్నారు. అతడు పలనాడు రోడ్డులోని ఓ ద్విచక్రవాహనాల షోరూమ్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా జాన్సైదాకు రూ.450లు నుంచి రూ.550లవరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈనెలలో జూన్–జూలైకు చెందిన బిల్లు రూ.6,78,858లు వచ్చింది. ఆ బిల్లును చూడగానే అతడు షాక్కు గురయ్యాడు. ఆ ప్రాంత లైన్మెన్కు తెలియచేయగా బిల్లును సరిచేయిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలాఖరు గడుస్తున్నా ఇప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోలేదు. దీంతో అతను ఆందోళన చెందుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసేందుకు సిద్ధమయ్యాడు. -
రేకులషెడ్కు రూ. లక్షల విద్యుత్ బిల్లు
నరసరావుపేట: తప్పుడు తడకలుగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. నరసరావుపేటలో రేకులషెడ్డులో నివాసం ఉంటున్న ఓ సామాన్య మెకానిక్కు రూ.6 లక్షలకుపైగా బిల్లు రావడంతో ఆందోళనకు గురయ్యాడు. వివరాలు... పట్టణంలోని పెద్దచెరువు 9వ లైనులో పార్కు పక్క వీధిలో షేక్.మొహిద్దీన్సాహెబ్కు స్వగహం ఉంది. దీని పైభాగంలో ఉన్న రేకులషెడ్డులో షేక్.జాన్సైదా గత రెండేళ్ళ నుంచి భార్య, ఇద్దరు చిన్నపిల్లలతో అద్దెకు ఉంటున్నారు. అతడు పలనాడు రోడ్డులోని ఓ ద్విచక్రవాహనాల షోరూమ్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ప్రతి నెలా జాన్సైదాకు రూ.450లు నుంచి రూ.550లవరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈనెలలో జూన్–జూలైకు చెందిన బిల్లు రూ.6,78,858లు వచ్చింది. ఆ బిల్లును చూడగానే అతడు షాక్కు గురయ్యాడు. ఆ ప్రాంత లైన్మెన్కు తెలియచేయగా బిల్లును సరిచేయిస్తామని హామీ ఇచ్చారు. -
పాలనకు మానవీయతను అద్దిన జననేత
ఒక పాలకుడు భౌతికంగా దూరమై ఆరేళ్ళు గడిచినా ప్రజల గుండెల్లో ఆయన సజీవంగా ఉండడం ఇటీవల కాలంలో సాధ్యమేనా? ఆ పాలకుని పాలన ముగిసినా... ఆయ నను ఇంకా గుర్తుంచుకో వడం ఈ రోజుల్లో జరిగే పనేనా? ప్రజలు ఎందుకు ఆయనను మరిచిపో కుండా నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రజల జీవితాలతో మమేకమైన ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రజాకంటక పాలనకు విరుగు డుగా జనరంజక పాలనను అందించి, పేదలు, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన జననేత వైఎస్. ఆయనకు ముందు వెనుక పాలనను చూస్తే తప్ప డాక్టర్ వైఎస్ తెలుగు ప్రజలపై వేసిన ప్రభా వం ఏమిటో స్పష్టం కాదు. పేదోడికి గూడు కావాలంటే అధికార పార్టీకి నిరంతరం కొమ్ముకాస్తే తప్ప ఇంటికి గతిలేని దిక్కు మాలిన పాలన అది. రోగం వచ్చినా, మంచి చదు వులు చదువుకోవాలన్నా పేదలకు ఎటువంటి భరోసా ఇవ్వలేని పాలకులున్న రోజులవి. చేతి వృత్తులు కునారిల్లి, వ్యవసాయం దండుగ మారిగా మారిన రోజులవి. అంతెందుకు కరెంట్ బిల్లులే షాక్ కొట్టే ‘స్వర్ణాంధ్ర’ పాలన అది. పేదలపై కనికరం లేని ‘పారదర్శక’ పాల నది. రైతులు, నేతన్నలు, కూలీలు వలసబాట పట్టి తమ ప్రాణాలు మిగుల్చుకున్న రోజులవి. ఒక సామాజిక పింఛను, తెల్ల రేషన్ కార్డు, బలహీన వర్గాల ఇల్లు.. ఇదీ అప్పట్లో పేదల కోర్కెల చిట్టా. నిరుపేదల జీవితాలలో నిరంతరం దోబూచులాడే ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బం దులు విని చలించిపోయిన కరుణామూర్తి డాక్టర్ వైఎస్. పేదల నోటికి ‘ఐదేళ్ళు’ అందివచ్చిన పాలనను అందించి, మళ్ళీ మరో ఐదేళ్ళు అధికారంలో కొనసాగే నైతిక తను సొంతం చేసుకున్న పాలకుడాయన. నూటికి ఎనభైశాతం మంది ఆధారపడిన వ్యవసాయాన్ని గాడిలో పెడితే తప్ప గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదని నమ్మి అక్కడ నుంచే చికిత్సను ప్రారంభించారు. రైతాంగానికి ఉచిత విద్యుత్, మహిళలకు పావలావడ్డీకే రుణాలు, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్, రెండు రూపాయలకే కిలో బియ్యం, బలహీనవర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళు, వికలాంగులకు, వృద్ధులకు వృద్ధాప్యపు పింఛన్లు తదితర సంక్షేమ పథకాలతో పాటు జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి దీర్ఘకాలిక పథకాలన్నింటికి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా వైఎస్ జరిపిన పాదయాత్ర సమయంలో వెలుగులోకి వచ్చిన పేదల కష్టాలు కన్నీళ్ళే కారణం. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నా పై చదువులకు ఆర్థికస్తోమత లేనందున నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన ఒక విద్యార్థి రైల్వే కూలిపను లకు వెళ్తున్న విషయం వైఎస్ను కదిలించిన ఫలితమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. అలాగే మైక్రోఫై నాన్స్ కంపెనీల ఆగడాలనుంచి తమను కాపాడా లని గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామ మహిళలు మొరపెట్టుకున్నప్పుడు వైఎస్ మదిలో మెదిలిన పథకమే డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీతో రుణ కల్పన. ఏవిధంగా నిరుపేదలకూ ఖరీదైన వైద్యాన్ని అందించగలమనే ఆలోచన నుంచి పుట్టిందే రాజీవ్ ఆరోగ్యశ్రీ. తెల్ల రేషన్ కార్డున్న ప్రతి నిరుపేదా నయాపైసా ఖర్చుపెట్టకుండా తమను తాము రక్షిం చుకునే భరోసాను కల్గించారాయన. ప్రపంచ బ్యాంక్ షరతుల నడుమ ప్రజలకు ఆమోదయో గ్యమైన పాలన అందించడం, అందులోనూ మాన వీయతతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక్క డాక్టర్ వైఎస్కే చెల్లింది. అందుకే ఆయన లేని లోటును జీర్ణించుకోలేని పేద గుండెలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ప్రాంతాలతో పనిలేకుండా, కాలంతో నిమిత్తం లేకుండా, ఎప్పటికీ డాక్టర్ వైఎస్ ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న పాలకుడే. (జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా) వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు 9553750001 - బుర్రా విజయశేఖర్ -
ఉప్పునీటి దీపం... ఊరంతా వెలుగు!
ప్రయత్నం కరెంట్... ఇది లేకుండా ఇవాళ మనం జీవితాన్నే ఊహించలేం. కరెంట్ బిల్లులు ఎంత తడిసి మోపెడవుతున్నా, విద్యుచ్ఛక్తి లేకుండా రోజు గడవని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే, విద్యుచ్ఛక్తితో సంబంధం లేకుండా కారు చౌకగా వెలుతురునిచ్చే దీపం ఒకటి ఈ మధ్య తయారైంది. కిరోసిన్, గ్యాస్ లాంటివి ఏవీ అవసరం లేని ఈ దీపం ఫిలిప్పైన్స్లో చాలామంది ఇళ్ళలో వెలుగు పంచుతోంది. ఫిలిప్పైన్స్కు చెందిన టీనేజ్ అక్కా తమ్ముళ్ళు ఐసా మిజెనో, రాఫెల్ మిజెనోలు ఈ కారుచౌక దీపాన్ని తయారుచేశారు. ఇంధనంతో పని లేని ఈ దీపాన్ని కేవలం కొన్ని లోహపు పలకలు, కాస్తంత ఉప్పు నీటితో వారు రూపొందించారు. చేతితో ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళే వీలుండడం ఈ ల్యాంప్కు ఉన్న మరో వెసులుబాటు. ఈ ప్రయోగానికి ప్రేరణ ఏంటి? అసలు ఈ దీపం తయారు చేయాలనే ఆలోచన రావడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఫిలిప్పైన్స్లో ఇప్పటికీ అనేక గ్రామీణ ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సౌకర్యం లేదు. ఆ కొరతే ఈ అక్కాతముళ్ళను ఈ నూతన ఆవిష్కరణకు పురిగొల్పింది. కంప్యూటర్ ఇంజనీర్ అయిన ఐసా మిజెనో కొంతకాలం క్రితం ‘గ్రీన్పీస్’ అనే సంస్థ తరఫున ఒక గ్రామీణ ప్రాంతంలో బుట్బుట్ అనే తెగ వారితో కలసి పనిచేశారు. ఆ సమయంలో అక్కడి మారుమూల కలింగా పర్వతశ్రేణుల్లో జనం విద్యుచ్ఛక్తి లేక పడుతున్న అవస్థలు ఆ అమ్మాయిని కదిలించాయి. విద్యుచ్ఛక్తి లేకపోవడంతో అక్కడి జనం వెలుగు కోసం ఎక్కువగా కిరోసిన్ దీపాలను ఆశ్రయించేవారు. అయితే, రవాణా సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. ఒక్క సీసా కిరోసిన్ కొనుక్కోవడానికి వాళ్ళు కనీసం 12 గంటలు నడిచి వెళ్ళాల్సిన దుఃస్థితి. అలా కిరోసిన్ తెచ్చుకోవడం కూడా అక్కడ పెను సవాలే. అంతే! ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనీ, అది వ్యాపా రాత్మకంగా కూడా ఉండాలనీ ఆమె భావించారు. విద్యుత్ సమస్యకు ప్రత్యామ్నాయంగా సోదరుడు రాఫెల్తో కలసి చౌకరకం దీపం రూపకల్పనకు ఐసా నడుం బిగించారు. బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టభద్రుడైన ఆ కుర్రాడు కూడా అక్కతో కలసి అడుగేశారు. అక్కాతమ్ముళ్ళ అనుబంధం ఈ అక్కాతమ్ముళ్ళ బంధం ఈ స్టార్టప్ ప్రయోగానికి విజయం తెచ్చిపెట్టింది. ‘‘‘సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్’ (ఎస్.ఎ.ఎల్టి - ‘సాల్ట్’) అనే ఈ ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం వెనుక మా తమ్ముడి సహకారం చాలా ఉంది. ‘ఐడియాస్పేస్ ఫౌండేషన్’లో ఈ కొత్త ఆవిష్కరణ తాలూకు ప్రయోగం చేస్తున్నప్పుడు ఒకానొక దశలో నేను చేతులు ఎత్తేశాను. మానసిక ఒత్తిడి, డెడ్లైన్స్, అంచనాలను అందుకోవాలనేవి నేను మోయలేని బరువయ్యాయి. ఆ సమయంలో తమ్ముడు నాకు అండగా నిలిచి, మానసికంగా నాకు ధైర్యం చెప్పాడు’’ అని ఐసా వివరించారు. నిజానికి, ఈ అక్కాతమ్ముళ్ళది చిన్నప్పటి నుంచి విడదీయరాని బంధం. తమ్ముడు రాఫెల్ మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్. పుస్తకాలు బాగా చదువుతాడు. పుస్తకాలు చదవడంతో వచ్చిన విజ్ఞానం, వినయం, పెరిగిన ఆలోచన కూడా ఈ ఉప్పునీటి దీపం రూపకల్పనకు దోహదపడ్డాయి. మరోపక్క ఐసా ప్రశ్నల పుట్ట. ఏదైనా సరే క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకొనే రకం. ప్రతి విషయంలోనూ అమితమైన ఆసక్తి. ఇలా ఒకరికొకరి భిన్నమైన నైపుణ్యాలు తోడవడంతో ఈ సాల్ట్వాటర్ ల్యాంప్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అద్భుతమన్న అమెరికా విశేషం ఏమిటంటే, ఈ దీపాల తయారీ, వీటి వినియోగం గురించి ఇప్పుడు మన భారతదేశంలోనూ, ఆగ్నేయాసియాలోనూ ఎంతో ఆసక్తి వ్యక్తమవుతోంది. ఆసియా ప్రాంతంలో ‘సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్’ (ఎస్.ఎ.ఎల్టి - ‘సాల్ట్’) పేరిట ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువెళుతున్నారు. రాగల రోజుల్లో ఇంటి మొత్తానికీ విద్యుత్ను సమకూర్చేలా ఉప్పునీటితోనే పనిచేసే జనరేటర్ను రూపొందించాలని ఈ టీనేజ్ సోదర సోదరీమణులు భావిస్తున్నారు. అటుపైన ఏకంగా ఉప్పునీటి విద్యుత్కేంద్రాన్నే నెలకొల్పినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికైతే, ఈ ఉప్పునీటి దీపాల్ని పెద్ద సంఖ్యలో తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం తూర్పు ఆసియా ప్రాంతంలోని వివిధ సంస్థల సహాయ సహకారాల్ని తీసుకుంటున్నారు. మరో విశేషం ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఈ ప్రయత్నాన్ని ‘‘మహత్తరమైన ఆలోచన’’ అని పేర్కొన్నారు. ఇటీవల అనేక దేశాల్లో సరికొత్త సాంకేతిక విజ్ఞానంతో ముందుకొస్తున్న యువ వ్యాపారవేత్తలకు ఐసా లాంటి అమ్మాయిలు సరైన ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి, ఈ సాల్ట్వాటర్ ల్యాంప్లు పెద్దయెత్తున మన దేశానికి కూడా విస్తరిస్తే, ప్రతి మారుమూల పల్లె కాంతులీనుతుంది కదూ! ఈ ‘ఉప్పునీటి దీపం’ కథేంటి? ఫిలిప్పైన్స్లో దిగువ ఆదాయ వర్గానికి చెందిన ఇళ్ళలో కూడా నీళ్ళు, బియ్యం, ఉప్పు కనిపిస్తాయి. ముఖ్యంగా ఉప్పు నీళ్ళు పుష్కలం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఈ సోదర సోదరీమణుల జంట అడుగు ముందుకేసింది. వారు రెండు వేర్వేరు రకాలైన లోహపు పలకల్ని తీసుకొని, ఉప్పునీటిలో మునిగేలా చేశారు. ఈ క్రమంలో అదనపు ఎలక్ట్రాన్లు ఒక లోహపు పలక నుంచి మరొకదానికి తీగ గుండా ప్రయాణిస్తాయి. ఆ రకంగా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయి, ‘ఎల్.ఇ.డి’ దీపాన్ని వెలిగేలా చేస్తుంది. విశేషం ఏమిటంటే, ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని, దానిలో రెండు టీ స్పూన్ల ఉప్పు కలిపి, ఆ ద్రావణాన్ని లోహపు పలకలతో వినియోగిస్తే చాలు. ఆ దీపం ఏకంగా 8 గంటల పాటు నిర్విరామంగా వెలుగుతుంది. కాంతిని ప్రసాదిస్తుంది. మరో విశేషం ఏమిటంటే, కిరోసిన్ దీపాల లాగా ఈ ఉప్పునీటి దీపాలు ప్రమాదభరితమైనవి కావు. హాయిగా ఇంట్లో వీటిని తగిలించి, ఉంచుకోవచ్చు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్ళలో తయారు చేసిన ఉప్పునీటి ద్రావణంతో కూడా ఈ దీపాల్ని మళ్ళీ నింపుకోవచ్చు. సముద్రతీరంలో నివసించేవారైతే, సింపుల్గా సముద్రపు నీటిని వాడుకోవచ్చు. అయితే, ఈ ల్యాంప్లలోని ఎలక్ట్రోడ్ పలకల్ని మాత్రం దాదాపు ఏటా రెండుసార్లు మార్చాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూసినప్పటికీ, ఫిలిప్పైన్స్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ దీపాలు తక్కువ ఖర్చుతో, వెసులుబాటుగా మారాయి. -
గుండె గు‘బిల్లు’
గాజులరామారం: బిల్లు చూడగానే వారి గుండె గుబేలుమంది. రెండు గదులు ఉన్న మధ్య తరగతి కుటుంబానికి కరెంట్ బిల్లు ఏకంగా రూ.5 లక్షలకు పైగా రావడమే ఇందుకు కారణం. వివరాల్లోకి వెళితే కారు డ్రైవర్గా పని చేస్తున్న గంగిరెడ్డి కుటుంబంతో కలిసి గాజులరామారం డివిజన్ శ్రీరాంనగర్లో ఇంటి నంబరు 5-25-602/1లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం విద్యుత్ సిబ్బంది వచ్చి కరెంట్ మీటర్ సర్వీస్ నంబరు 0908-01218కు రీడింగ్ తీసుకుని డిమాండ్ నోటీసును (బిల్లు) గంగిరెడ్డి భార్య హేమలతకు ఇవ్వడంతో బిల్లు చూసుకున్న ఆమె బిల్లు రూ .5,06,499 రావడం చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. రెండు గదుల్లో 2 లైట్లు, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, 1 ఫ్యాన్ మాత్రమే వాడుతున్నామని, అలాంటప్పుడు ఇంత బిల్లు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి నెల రూ.300 బిల్లు వస్తున్నట్లు తెలిపారు. దీనిపై గాజులరామారం ఏఈ విజయ్కుమార్ను వివరణ కోరగా మీటర్ రీడింగ్ మిషన్ సమస్య ఉంటుందని, వెంటనే పరిశీలించి బిల్లు సరి చేస్తామని తెలిపారు. -
దోపిడీకి గురవుతున్న 'ఉండవల్లి' సంపద
-
విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి
జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి మోమిన్పేట : పంచాయతీలలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపొయిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి వీధిదీపాలు, తాగు నీటి బోరు బావుల మోటార్లకు మీటర్లు లేవని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బిల్లులు ఇవ్వకుండా ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేసి చెల్లించాల్సిందేనని పట్టుపట్టటడం ఎంతవరకు సమంజసమన్నారు. పంచాయతీలకు వచ్చిన కేంద్ర 13వ అర్థిక సంఘం నిధుల నుంచి 80శాతం విద్యుత్ బిల్లుల కింద చెల్లిచాలని అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. 13వ అర్థిక సంఘం నిధులతో కేవలం తాగు నీటి వనరుల మరమ్మతుల కోరకు మాత్రమే వినియోగించాలని స్పష్టంగా చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించాలని పేర్కొనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లిస్తే మరి తాగు నీటి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రభుత్వమే తెలపాలని ఆయన డిమాండు చేశారు. బకాయిలను ప్రభుత్వమే చెల్లించి ఇప్పటి నుంచి తాగు నీటి బోరు బావులు, వీధి దీపాలకు మీటర్లు బిగించాలని ఆయన కోరారు. ప్రతి కనెక్షన్కు డీడీ రూపంలో విద్యుత్ శాఖకు చెల్లించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ.50వేల నుంచి రూ.లక్షకుపైగా అవసరమవుతాయన్నారు. ఈ డబ్బును పంచాయతీలు ఏ నిధుల నుంచి చెల్లించాలో ప్రభుత్వమే తెలపాలన్నారు. చాలీచాలని నిధులతో పంచాయతీలు ఇప్పటికే కోట్టుమిట్టాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
బిల్లు కట్టమన్నందుకు...
హైదరాబాద్ : విద్యుత్ బిల్లు కట్టమన్నందుకు అధికారిపై దాడి చేసిన సంఘటన చైతన్యపురి పరిధిలోని ఎస్ఆర్కే పురం రోడ్ నెంబర్ 5లో శుక్రవారం చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ఓ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వినయ్కుమార్ గత రెండు నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించడం లేదు. దీంతో విద్యుత్ అధికారులు బిల్లు కట్టాల్సిందిగా పలుసార్లు చెప్పారు. తాజాగా.. ఈ రోజు ఎలక్ట్రికల్ జూనియర్ లైన్మెన్ నాగేశ్వర్ రెడ్డి బిల్లు విషయమై అడగగా ఆగ్రహించిన వినయ్ కుమార్ దాడికి దిగాడు. గాయాలపాలైన లైన్మెన్ పోలీసులను ఆశ్రయించారు. -
ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించండిలా...
కరెంట్ బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వెళ్తే అక్కడ చాంతాడంత క్యూ.. అంత సమయం మనకు లేదు.. బిల్లు చెల్లించి తీరాల్సిందే.. మరెలా..? ఇపుడు క్యూ లైన్లో నిలబడి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఆన్లైన్లోనే.. మీ బ్యాంకు ఖాతాలో డబ్బుంటే ఎంచక్కా కంప్యూటర్ ముందు కూర్చోని నెట్ ఓపెన్ చేసి బిల్లు చెల్లించండి. అదెలాగో తెలుసుకోండి మరి.. - హస్తినాపురం ఆన్లైన్లో విద్యుత్ బిల్లు చెల్లించే విధానం.. ముందుగా గూగుల్లో ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఆ వెంటనే తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పే యువర్ బిల్పై నొక్కండి బిల్ డెస్క్ అని వస్తుంది ఆ తరువాత ఆన్లైన్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఈఆర్ఓ, సర్వీస్ నెంబర్ అడుగుతుంది. వాటిని ఎంటర్ చేయాలి. ఉదాహరణకు: బిల్పై 6146 02194 నంబర్లు ఉంటాయి. అందులో 6146 ఏరియా కోడ్, 194 సర్వీస్ నంబర్ అన్నమాట. వివరాలు నమోదు చేసిన తరువాత మేక్ పేమెంట్పై నొక్కండి గో టూ ఇంటర్నెట్ బ్యాంకింగ్(ఇంటర్నెట్ బ్యాంకు సేవలోకి వెళ్లండి) సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని వస్తుంది. అప్పుడు మీ బ్యాంకును ఎంపిక చేసుకోండి. క్లిక్ ఆన్ సబ్మిట్పై నొక్కండి ఇట్ విల్ టేక్ యువర్ బ్యాంక్ అకౌంట్ (అది బ్యాంకు ఖాతాను తీసుకుంటుంది) ఎంటర్ బ్యాంక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్లిక్ ఆన్ కన్ఫార్మ్ వెరిఫైయింగ్ అమౌంట్ అండ్ కరెంట్ మీటర్ నంబర్ అని అడుగుంది. ఆ తరువాత మీ మొబైల్ నంబర్కు ఎనిమిది అంకెలతో కూడిన ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేయాలి క్లిక్ ఆన్ కన్ఫార్మ్ అని అడుగుతుంది.(దాన్ని క్లిక్ చేయండి) రిక్వెస్ట్ కంప్లీటెడ్ మీ బిల్లు చెల్లింపు పూర్తయినట్టు. తరువాత ప్రింట్ తీసుకోండి -
కరెంట్ బిల్లు..బైర్లు కమ్ము!
మెదక్, న్యూస్లైన్: కరెంట్ బిల్లులు.. వినియోగదారులను ‘షాక్’కు గురిచేస్తున్నాయి. ఇన్ఫ్రారెడ్(ఐఆర్) మీటరింగ్ విధానంతో నివాస గృహాలకు రూ. వేలల్లో బిల్లులు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. విద్యుత్ సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని రీడింగ్ తీయడం వల్లే రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అయితే.. గతంలో వినియోగదారుల విజ్ఞప్తుల వల్ల మీటర్ రీడింగ్ తక్కువ వేశామని, ఇప్పుడు ఐఆర్ విధానంలో పాత యూనిట్లు బయటపడుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. కాగా ఒకేసారి ఎక్కువ యూనిట్లకు బిల్లులు చేయడంతో యూనిట్ రేట్లు చుక్కలన ంటాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాపన్నపేట మండలం మిన్పూర్, ఎల్లాపూర్ గ్రామాల్లో మే నెలకు వచ్చిన కరెంట్ బిల్లులను చూసి వినియోగదారులు గుండెలు బాదుకుంటున్నారు. ఒక ఫ్యాన్, మూడు బల్బులున్న ఇళ్లకు కూడా రూ.వేలలో బిల్లు వస్తే.. గుడ్డి లాంతర్ల వెలుతురులోనే బతకడం నయమని వినియోగదారులు వాపోతున్నారు. మిన్పూర్ గ్రామానికి చెందిన చిన్నం మల్లయ్యకు రూ. 34,829, ఎల్లంపల్లి లింగమ్మకు రూ. 20,426, జంగం శంకరయ్యకు రూ.17,993, బోయిని పర్వయ్యకు రూ.10,072, బత్తిని పోచయ్యకు రూ.8,888, ఎ.నాగవ్వకు రూ.6,143, జంగం బాలకిష్టయ్యకు రూ.4,734, హన్మంతు గోపాల్కు రూ.4,186, ఎల్లంపల్లి లక్ష్మయ్యకు రూ.2,718, నాయికోటి బాగమ్మకు రూ.2,543, నాయికోటి వెంకమ్మకు రూ.1,273, ఎల్లాపూర్ గ్రామానికి చెందిన వెంకట్రావ్ ఇంటికి రూ.23 వేలు, పాపన్నపేటకు చెందిన బసి బాగయ్యకు రూ.15 వేలు, బాచారం బాలయ్యకు రూ.1,600 బిల్లులు వచ్చాయి. ఆ బిల్లులను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బంది తమ ఇళ్లకు రాకుండానే, మీటర్లు చూడకుండానే నె లనెలా రీడింగ్ నమోదు చేస్తున్నారని, అందువల్లే ఇలా కళ్లు బైర్లు కమ్మేలా బిల్లులు వచ్చాయని వినియోగదారులు వాపోతున్నారు. కాగా తాము నెల నెలా ఇళ్లకు వెళ్లి రీడింగ్ తీస్తున్నామని, వినియోగదారులు బతిమాలడం వల్లే కాస్తా రీడింగ్ అటు ఇటుగా వేస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు. బిల్లుల మోతకు కారణమేంటి? బిల్లింగ్ విధానంలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఇన్ఫ్రారెడ్(ఐఆర్) మీటరింగ్ విధానం వల్లే రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. ఐఆర్ మీటరింగ్ మిషన్లను మీటర్ ముందు ఉంచితే చాలు రీడింగ్ పూర్తిగా న మోదవుతుందని తెలుస్తోంది. అయితే గతంలో తక్కువగా వేసిన రీడింగ్ ఒకేసారి రావడం వల్లే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కాని ఒకేసారి ఎక్కువ యూనిట్లకు బిల్లు చేయడం వల్ల టారిఫ్ రేట్ మారి వినియోగదారుడు నిండా మునుగుతున్నాడు. 1 నుంచి 50 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్కు రూ.1.45పైసలు, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు, 101 నుంచి 200 యూనిట్ల వరకు 3,60పైసలు, 201 నుండి 250 యూనిట్ల వరకు రూ.6.38 ఇలా రేట్లు పెరుగుతుంటాయి. దీంతో ఒకేసారి ఎక్కువ యూనిట్లకు బిల్లు చేయడం వల్ల అధిక మొత్తంలో బిల్లులు వస్తున్నాయి. అందువల్ల ఒక సంవత్సర కాలానికి సంబంధించిన మొత్తం యూనిట్లను నెలవారి సరాసరిగా విభజించి బిల్లులు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. లేనిపక్షంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
చొక్కా రంగును బట్టి లైటింగ్!
సాక్షి, హైదరాబాద్: గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్.. బయటికి వెళ్లిపోగానే ఆఫ్ అవుతాయి! రోజును, మన మూడ్ను బట్టి గదిలోని లైట్ రంగును మార్చుకోవచ్చు! మనం ఏ రంగు చొక్కా వేసుకుంటే లైట్ కూడా అదే రంగు కాంతిని వెదజల్లుతుంది! ఇంట్లో వేసి ఉన్న లైట్లను సెల్ఫోన్ల నుంచి ఆపరేట్ చేయవచ్చు! టీవీ సౌండ్ పెంచినట్టుగా లైటింగ్ను కూడా ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు! .. అరే ఏంటివి అనుకుంటున్నారా? లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ) లైట్ల వింతలండి. రోజుకో కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదలవుతున్న ఎల్ఈడీ లైట్ల విశేషాలపై ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్ (ఐఎస్ఎల్ఈ) ఏపీ చాప్టర్ చైర్మన్, లైటింగ్ కన్సల్టెంట్ డీ కృష్ణశాస్త్రితో ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేకంగా మాట్లాడింది. మరిన్ని ఆసక్తికర విషయాలివిగో.. రోజును బట్టి ఇంట్లో లైట్ రంగును మార్చుకోవాలనే అభిరుచి నగరవాసుల్లో బాగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే ఒకే ఎల్ఈడీ లైట్తో రోజుకో రంగును వెదజల్లేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బల్బు, ట్యూబ్లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు. సెల్ఫోన్ నుంచే ఆపరేటింగ్.. ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యూషన్స్ ఎల్ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, షామింగ్ మాల్స్లో వినియోగిస్తుంటారు. ధర ఎక్కువైనా.. బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్ఈడీ లైట్ ధర రూ. 1,500-1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాల్కు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది. నెలకు రూ.7 కరెంట్ బిల్లు.. ఎల్ఈడీ లైట్లు విద్యుత్ను చాలా తక్కువగా తీసుకుంటాయి. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో యూనిట్ విద్యుత్కు రూ. 1.45 పైసలుగా ఉంది) ట్యూబ్లైట్ విషయానికొస్తే.. నెలకు 21 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్ఈడీ లైట్కు అయితే నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసలు మాత్రమే కరెంట్ బిల్లు వస్తుందన్నమాట. లాభాలెన్నో.. ఎల్ఈడీ లైట్కు 5 ఏళ్ల పాటు గ్యారెంటీ ఉంటుంది. బల్బును నిరంతరాయంగా 500 గంటల పాటు వేసి ఉంచితే పాడవుతుంది. ట్యూబ్లైట్ అయితే వెయ్యి గంటలు, కానీ ఎల్ఈడీ లైట్ను నిరంతరాయంగా 25 - 50 వేల గంటల పాటు వేసి ఉంచినా ఏం కాదు. అవసరానికి తగ్గట్టుగా ఎల్ఈడీ లైట్ల వెలుతురు (లుమిన్స్)ను తగ్గించుకోవచ్చు. ఒకే ఎల్ఈడీ లైట్ను మనకు కావాల్సిన రంగు ఎల్ఈడీ లైట్గా మార్చుకోవచ్చు. యూనిట్ విద్యుత్ వినియోగం వస్తువు ఓల్టులు విద్యుత్ బల్బు 100 11 గంటలు ట్యూబ్లైట్ 52(ట్యూబ్+చౌక్) 21 గంటలు ఎల్ఈడీ 18 60 గంటలు -
మనవారేనని వదిలేస్తారా..!
సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయలు బకాయి పడితే సామాన్యుడికి షాకిస్తున్న సీపీడీసీఎల్... పెద్దల బకాయిలపై నోరు మెదపడంలేదు. బడా వ్యక్తులు, ఉద్యోగ సంఘాల బకాయిలు లక్షల్లో పేరుకుపోయినా మిన్నకుడం గమనార్హం. సీపీడీసీఎల్కు చెందిన ఉద్యోగ సంఘాల్లో ఒక్కో సంఘం చెల్లించాల్సిన బకాయి లు రూ.లక్షకు పైగా ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిని వదిలేసి అల్పాదాయ వర్గాలపై ప్రతాపం చూపుతున్న విద్యుత్శాఖ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పైనే ప్రతాపం ఎలక్ట్రిసిటీ రెవెన్యూ చట్టం ప్రకారం విద్యుత్ను వినియోగిస్తున్న వారెవరైనా సంస్థకు బిల్లు చెల్లించాల్సిందే. కానీ ఈ బిల్లు వసూళ్లలో అధికారులు మాత్రం స్థానిబట్టి వివక్ష చూపుతున్నారు. సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుడి విద్యుత్ కనెక్షన్ తొలగించే అధికారం ఉన్నా, అధికారులు మాత్రం ఈ చట్టాన్ని నిరుపేదలకే వర్తింపజేసి కనెక్షన్లు తొలగించడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, పార్టీ ఆఫీసులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఏళ్లకు యేళ్లుగా కరెంట్ బిల్లు కట్టకపోయినా పట్టించుకోని డిస్కం నెలసరి బిల్లుల పేరుతో సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బడా బకాయిదారులందరికీ విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా..ఆయా వ్యక్తుల ఇళ్లల్లో మాత్రం వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాయి. ఇంటి దొంగలను పట్టించుకోని సీఎండీ బిల్లు కట్టలేదనే నెపంతో వారం రోజుల క్రితం గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేయగా, రెండు నెలలుగా బిల్లు చెల్లించడ ం లేదంటూ ఈనెల 26న బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయానికి సరఫరా నిలిపివేసింది. రెండు రోజుల క్రితం బిల్లు చెల్లించలేదని బేగంబజార్లోని ఓ వస్త్రవ్యాపారికి సంబంధించిన కనెక్షన్ కట్ చేయడంతో వ్యాపారులంతా ఆందోళనకు దిగిన విష యం విధితమే. తాజాగా శనివారం టోలీచౌకీ బల్దియా వార్డు కార్యాలయానికి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సామాన్యులు, ప్రభుత్వ కార్యాలయాల క నెక్షన్లు కట్ చేస్తున్న సీపీడీసీఎల్ సీఎండీ తమ ఇంటి దొంగలను మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాభై రూపాయలు బకాయి పడినా కనెక్షన్ తొలగిస్తామని చెప్పే అధికారులు లక్షల్లో బకాయి పడినవాని ఏ విధంగా వదిలేస్తున్నారో వారికే తెలియాలి.