బిల్లు కట్టమన్నందుకు... | man attack on electrical line man | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టమన్నందుకు...

Published Fri, Mar 27 2015 6:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

man attack on electrical line man

హైదరాబాద్ : విద్యుత్ బిల్లు కట్టమన్నందుకు అధికారిపై దాడి చేసిన సంఘటన చైతన్యపురి పరిధిలోని ఎస్‌ఆర్కే పురం రోడ్ నెంబర్ 5లో శుక్రవారం చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న ఓ కళాశాల వైస్ ప్రిన్సిపల్ వినయ్‌కుమార్ గత రెండు నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించడం లేదు. దీంతో విద్యుత్ అధికారులు బిల్లు కట్టాల్సిందిగా పలుసార్లు చెప్పారు. తాజాగా.. ఈ రోజు ఎలక్ట్రికల్ జూనియర్ లైన్‌మెన్ నాగేశ్వర్ రెడ్డి బిల్లు విషయమై అడగగా ఆగ్రహించిన వినయ్ కుమార్ దాడికి దిగాడు. గాయాలపాలైన లైన్‌మెన్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement