
సీఎస్ డా.కెఎస్.జవహర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు మహ్మద్ అలీ గురువారం సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించిన విషయం విదితమే.