ali
-
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
‘నిన్ను నన్ను కన్న ఆడది..రా!’ సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆగ్రాకి స్వాగతం
అలీ ప్రధాన పాత్రలో ‘వెల్కమ్ టు ఆగ్రా’ అనే హిందీ సినిమా రూపొందుతోంది. ఆశిష్ కుమార్ దూబే రచించి, దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ‘వెల్కమ్ టు ఆగ్రా’ సినిమాప్రారంభోత్సవంలో భాగంగా ముహూర్తపు సన్నివేశాన్ని ముంబైలో చిత్రీకరించారు.ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– ‘‘ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కేంద్రంగా జరిగే ప్రేమకథే ఈ సినిమా. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు. గతంలో సల్మాన్ ఖాన్ వంటి పలువురు హీరోల కాంబినేషన్లో హిందీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. ‘వెల్కమ్ టు ఆగ్రా’లో పూర్తి నిడివి ఉన్న పాత్ర చేయనుండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ మూవీలో అన్షుమాన్ ఝా, సారా అంజలి, ఆకాశ్ ధబాడే, రౌనక్ ఖాన్, ఫైజల్ మాలిక్, అంచల్ గాంధీ, కైరా చౌదరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
సినీ నటుడు అలీకి నోటీసులు
-
సల్మాన్ కంటే అతనే బెటర్.. నాకైతే నరకం చూపించాడు: మాజీ గర్ల్ఫ్రెండ్
బాలీవుడ్ సల్మాన్ ఖాన్పై ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అతన్ని ప్రముఖ గ్యాంగ్స్టార్ లారెన్స్ బిష్ణోయ్తో పోల్చింది. అతనికంటే సల్మాన్ ఖాన్ చాలా ప్రమాదమని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో తన ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలను పంచుకుంది. గతంలో సోమీ అలీ.. సల్మాన్తో దాదాపు ఎనిమిదేళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు.సల్మాన్ ఖాన్ కంటే గ్యాంగ్స్టార్ బిష్ణోయ్ చాలా బెటర్ అని సోమీ అలీ అన్నారు. సల్మాన్ నాతో వ్యవహరించిన విధంగా.. మరెవరితోనూ ప్రవర్తించలేదని తెలిపింది. సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్తో మంచిగా వ్యవహరించినట్లు.. నాతో అలా ఉండలేదని పేర్కొంది. గతంలో ఒకసారి ఐశ్వర్యరాయ్తోనూ అసభ్యకరంగా ప్రవర్తించాడని.. అతని వల్లే ఆమె భుజానికి గాయం కూడా అయిందని వెల్లడించింది. కానీ కత్రినాతో ఎలా వ్యవహరించాడో తనకు తెలియదని సోమీ చెప్పింది. ఒకసారి సల్మాన్ నన్ను కొడుతుంటే పనిమనిషి తలుపులు వేసి కాపాడిందని గుర్తు చేసుకుంది. అందుకే సల్మాన్ కంటే లారెన్స్ బిష్ణోయ్ బెటర్ అని సోమీ అలీ చెప్పింది.గతంలో నటి టబు తన పరిస్థితిని చూసి బాధపడిన సందర్భాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. నన్ను చూసి టబు ఏడ్చిందని.. కానీ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో కనీసం చూడటానికి కూడా సల్మాన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సల్మాన్ ఖాన్తో తాను పడిన కష్టాలు పూర్తిగా తన తల్లికి, కొంతమంది సన్నిహితులకు మాత్రమే తెలుసని సోమీ వెల్లడించింది. ప్రస్తుతం ఒక పుస్తకాన్ని రాసే పనిలో ఉన్నానని.. అందులో ప్రతి విషయాన్ని వివరిస్తానని సోమీ తెలిపింది. -
సాజిద్ మాయాజాలం
రావల్పిండి: ఇంగ్లండ్ బ్యాటర్ల బలహీనతపై పాకిస్తాన్ దెబ్బ కొట్టింది. స్పిన్కు అనుకూలమైన పిచ్ను రూపొందించి మూడో టెస్టులో శుభారంభం చేసింది. గురువారం మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 68.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. ముల్తాన్లో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్లు సాజిద్ అలీ, నోమన్ అలీ తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. రావల్పిండిలోనూ ఈ ఇద్దరు మరోసారి ఇంగ్లండ్ను ఇబ్బంది పెట్టారు. ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ 128 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ నోమన్ అలీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మరో వికెట్ లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్కు లభించింది. ఒకదశలో ఇంగ్లండ్ జట్టు 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో జేమీ స్మిత్ (119 బంతుల్లో 89; 5 ఫోర్లు, 6 సిక్స్లు) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగ చకచకా పరుగులు చేశాడు.గుస్ అట్కిన్సన్ (39; 5 ఫోర్లు)తో కలిసి జేమీ స్మిత్ ఏడో వికెట్కు 105 పరుగులు జోడించి ఇంగ్లండ్కు గౌరవప్రద స్కోరు అందించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (29; 3 ఫోర్లు) తొలి వికెట్కు 56 పరుగులు జత చేశారు. క్రాలీని నోమన్ అలీ అవుట్ చేశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అబ్దుల్లా షఫీఖ్ (14; 1 ఫోర్), సయీమ్ అయూబ్ (19; 1 ఫోర్), కమ్రాన్ గులామ్ (3) అవుటయ్యారు. షాన్ మసూద్ (16 బ్యాటింగ్), సౌద్ షకీల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఇజ్రాయెల్కు మూడింది
టెహ్రాన్: బద్ధ శత్రువైన ఇజ్రాయెల్కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంపై ఇటీవల తాము చేసిన క్షిపణి దాడుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. యూదు పాలకుల నేరాలకు ఇది కనిష్ట శిక్ష అని పేర్కొన్నారు. తమ సైనిక దళాలు అద్భుతమైన కార్యం నిర్వర్తించాయని కొనియాడారు. అవసరమైతే హెజ్పోల్లా, హమాస్ తదితర గ్రూపులతో కలిసి ఇజ్రాయెల్పై మరోసారి దాడులు చేస్తామని తేల్చిచెప్పారు. ‘‘ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా, లెబనాన్లో జరుగుతున్న పోరాటాలకు మద్దతిస్తున్నాం. శత్రువును ఓడించి తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘అఫ్గానిస్తాన్ నుంచి యెమన్ దాకా, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ దాకా ముస్లిం దేశాలన్నీ ఈ ప్రయత్నంలో ఒక్కటి కావాలి.ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్కు మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి’’ అంటూ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉనికిలో ఉండబోదని జోస్యం చెప్పారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ఇటీవలి క్షిపణి దాడుల తర్వాత తొలిసారిగా ఆయన ప్రజలకు దర్శనమిచ్చారు. శుక్రవారం టెహ్రాన్లోని మొసల్లా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ జన సందోహాన్నిఉద్దేశించి చరిత్రాత్మక ప్రసంగం చేశారు. రైఫిల్ చేబూని ఆద్యంతం భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఖమేనీ బహిరంగంగా మాట్లాడడం నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హెజ్పోల్లా చీఫ్ నస్రల్లాను బంకర్ బాంబులతో ఇజ్రాయెల్ హతమార్చిన వెంటనే ఆయనను హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు వార్తలు రావడం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇలా జనం మధ్యలోకి రావడమే గాక చరిత్రాత్మక మసీదును వేదికగా చేసుకుని ప్రసంగించడానికి చాలా ప్రాధాన్యత ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపడంతో పాటు ఆ దేశంపై పోరులో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని పశ్చిమాసియాలోని హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి సాయుధ గ్రూపులకు భరోసా ఇవ్వడం ఖమేనీ ఉద్దేశమని విశ్లేíÙస్తున్నారు. పశ్చిమాసియాలో భీకర యుద్ధం తప్పదని కూడా ఖమేనీ ప్రసంగం సంకేతాలిచి్చందంటున్నారు. ప్రధానంగా ఫార్సీలోనూ, పాలస్తీనా, లెబనాన్ మద్దతుదారు కోసం మధ్యలో అరబిక్లోనూ ఆయన 40 నిమిషాలపాటు మాట్లాడారు. ‘‘గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ నేతృత్వంలో పాలస్తీనా ప్రజలు చేసిన దాడిలో న్యాయముంది. పాలస్తీనా పౌరుల చర్య చట్టబద్ధమే. ఇజ్రాయెల్పై మా దాడులు కూడా చట్టబద్ధమే’’అని ఉద్ఘాటించారు. నస్రల్లా మార్గం స్ఫూర్తిదాయకం ఖమేనీ ప్రసంగానికి ముందు టెహ్రాన్లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తోపాటు ఇరాన్ ఉన్నతాధికారులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్స్ హాజరయ్యారు.చేతిలో రైఫిల్ వెనక...ఖమేనీ తన ప్రసంగం సందర్భంగా రైఫిల్ చేతబట్టడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అది రష్యాలో తయారైన డ్రాగనోవ్ రైఫిల్. ఇజ్రాయెల్ విషయంలో వెనుకడుగు వేసే సమస్యే లేదని, తీవ్ర ప్రతిఘటన తప్పదని తన చర్య ద్వారా ఆయన స్పష్టమైన సంకేతాలిచి్చనట్టు భావిస్తున్నారు. శత్రువుపై పోరాడాలని, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రజలకు ఖమేనీ పిలుపునివ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో డీలా పడ్డట్టు కని్పస్తున్న సైన్యంతో పాటు దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయన ప్రయత్నించారంటున్నారు.ఆ మసీదే ఎందుకు?ఖమేనీ దేశ ప్రజలకు సందేశం ఇచ్చేందుకు రాజధాని టెహ్రాన్లోని చరిత్రాత్మక ఇమామ్ ఖొమేనీ మసీదును ఎంచుకున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదుకు ఇరాన్లో విశేషమైన ప్రాముఖ్యముంది. దీన్ని గతంలో షా మసీదుగా పిలిచేవారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో ఈ మసీదు కీలక పాత్ర పోషించింది. నగరంలో ఇదో ల్యాండ్మార్క్. ప్రజా పోరాటాలకు, నిరసన గళానికి చిహ్నం. అప్పట్లో ఈ మసీదు కేంద్రంగానే ప్రజలు ఉద్యమించారు. ఇరాన్ పాలకుడు షా మొహమ్మద్ రెజా పహ్లావీని గద్దె దించారు. అనంతరం అయతొల్లా రుహొల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా ఆవిర్భవించింది. ఇస్లామిక్ జాతీయవాద నినాదం కింద పలు రాజకీయ పక్షాలు ఏకమవడానికి ఈ మసీదు వేదికగా ఉపయోగపడింది. -
భారత ఫుట్బాలర్ అన్వర్ అలీపై నిషేధం
కోల్కతా: ఆటగాళ్ల బదిలీకి సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన భారత ఫుట్బాల్ ప్లేయర్ అన్వర్ అలీపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చర్యలు తీసుకుంది. అతనిపై నాలుగు నెలల నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత అన్వర్ ఆ కాంట్రాక్ట్ను పాటించకుండా అనూహ్యంగా ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు మారాడు. మరోవైపు వచ్చే ఏడాది వరకు కొత్త ఆటగాళ్లను తీసుకోవడంపై నిషేధం ఉన్నా సరే... దానిని ధిక్కరించి ఢిల్లీ ఎఫ్సీ కూడా అన్వర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తించింది. దాంతో విచారణ జరిపిన ఏఐఎఫ్ఎఫ్ అన్వర్పై నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది. అన్వర్ అలీ నుంచి రూ.12 కోట్ల 90 లక్షలు నష్టపరిహారం పొందేందుకు మోహన్ బగాన్ క్లబ్ జట్టుకు అర్హత ఉందని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని ఈస్ట్ బెంగాల్ క్లబ్, ఢిల్లీ ఎఫ్సీ, అన్వర్ కలిసి చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశించింది. -
సంగీత ప్రియులను అలరించనున్న ‘జావేద్ అలీ’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ జావేద్ అలీ తన స్వరాలతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వరల్డ్ మ్యూజిక్ డే ఫెస్టివల్లో భాగంగా ఈనెల 21న నగరంలోని ప్రిజంలో జావేద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ను నిర్వహించనున్నారు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్, స్కిల్బాక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్ షో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుందని హంగామా డిజిటల్ మీడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌమిని పాల్ తెలిపారు. జోధా అక్బర్ ఫేమ్ ’జాష్్న–ఈ–బహారా’, పుష్ప...’శ్రీవల్లి’, బజరంగీ భాయిజాన్లోని ’తు జో మిలా’ వంటి హిట్ సాంగ్స్తో సంగీత ప్రియులను సమ్మోహనం పరచనున్నారని, కాన్సర్ట్ టికెట్లు స్కిల్బాక్స్లో అందుబాటులో ఉన్నాయని సౌమిని అన్నారు. ఈ కాన్సర్ట్కు సంబంధించి.. ‘ప్రత్యక్ష ప్రదర్శన ఎప్పుడూ థ్రిల్లింగ్గా ఉంటుందని, హైదరాబాదీ అభిమానులను అలరించడానికి ఇదొక మంచి అవకాశమని’ సింగర్ జావేద్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. అద్భుతమైన మ్యూజిక్ నైట్ కోసం తానూ ఎదురు చూస్తున్నానని అందులో వెల్లడించారు. -
కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి హీరో.. ఫస్ట్ లుక్ లాంచ్
డిఫరెంట్ సినిమాలు తీస్తూ కొత్త దర్శకులు ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఓ సినిమానే 'ప్రణయ గోదారి'. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'తో దగ్గర పోలిక.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?)పోస్టర్ చూస్తుంటే గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్పై ప్రయాణం చేయడం చూస్తుంటే వింటేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తోంది. మార్కండేయ సంగీతమందిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.(ఇదీ చదవండి: 12 ఏళ్లు పూర్తి.. మెగా కోడలు ఉపాసన పోస్ట్ వైరల్) -
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్ నటి బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్కట్లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్ కమెడిన్ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్ అయింది. -
విజయవంతంగా TAL జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ TAL జాతీయ బ్యాడ్మింటన్షిప్స్ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్లోని ఆస్టర్లీ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ సెంటర్లో మార్చి 16-, ఏప్రిల్ 6న పోటీలు నిర్వహించింది. లండన్తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్ డబుల్స్, మెన్స్ 40+ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, విమెన్స్ 35+ డబుల్స్, అండర్-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇందులో భాగమయ్యారు. టాలీవుడ్ ప్రముఖ హాస్య నటులు అలీ విజేతలకు బహమతులు అందజేశారు. -
యాక్టర్ ఆలీ చేతులమీదగా అతియాస్ కిచెన్ గొప్ప ప్రారంభం (ఫొటోలు)
-
టాలీవుడ్లో మరో నిర్మాణ సంస్థ.. ప్రారంభించిన అలీ!
టాలీవుడ్లో మరో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ‘శివమ్ మీడియా’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. తాజాగా శివమ్ మీడియా లోగో, బ్యానర్ను ప్రముఖ నటుడు అలీ, నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. 'శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుంచి కెరీర్ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది' అని అన్నారు. అనిల్ కడియాల మాట్లాడుతూ– 'శివమల్లాల మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. 'ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్గా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్ని పెట్టింది అనిపిస్తోంది. ఈ విషయంలో నేను ఎంతో ఫీలవుతున్నా. మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ.. 'నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్ని ప్రారంభించటం చాలా సంతోషం. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్పై మంచి సినిమాలు చేస్తా' అని అన్నారు. -
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్, ఫొటోలు: సుదర్శన్గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
మెగాస్టార్ను మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు అలీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ విభూషణ్ పొందిన చిరుకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని తర్వాత ఈ అవార్డ్ అందుకున్న నటుడిగి మెగాస్టార్ ఘనత సాధించారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ బాబీ, గోపించద్ మలినేని, నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవిశంకర్ కూడా మెగాస్టార్ను అభినందించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి. Blockbuster directors @dirbobby, @megopichand, Producers #NaveenYerneni, @mythriravi & comedian #Ali met and conveyed their best regards to #PadmaVibhushanChiranjeevi garu for being bestowed with the prestigious #PadmaVibhushan award ✨@Kchirutweets @MythriOfficial… pic.twitter.com/0z8YD9DG5U — Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024 -
పవన్ కళ్యాణ్, లోకేష్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన అలీ
-
2024 జగనన్న వన్స్ మోర్.. అలీ
-
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
నాకు ఆరు భాషలు వచ్చు..పవన్ కళ్యాణ్ కు అలీ కౌంటర్..
-
31 లక్షల ఇళ్ల పట్టాలు రెడీ..అలీ కామెంట్స్
-
వినుకొండ బహిరంగ సభలో ఆలీ పంచులే పంచులు..!
-
ఆరు నూరైనా మళ్లీ జగనే సీఎం: వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వివరించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎంతో చేశాడు. ఇవాళ ఆయా వర్గాలకు చెందినవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కారణం. వినుకొండలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు. కానీ, అధికారం ఇస్తే మాత్రం బెంజ్ కారు ఇస్తానంటారు.. రైతు రుణ మాఫీ చేస్తానంటారు. వినుకొండలో ఒక్క అభివృద్ధి పని చేశామని టీడీపీ నేతలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సామాజిక విప్లవం రావాలని విప్లవకారులు కోరుకున్నారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు దళిత హక్కులను కాలరాశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి ముళ్ళపొదల్లో చంద్రబాబు కడితే.. విజయవాడ నడిబొడ్డున జగన్ అంబేద్కర్కు భారీ విగ్రహం పెట్టారు. వైఎస్ జగన్ మరో అంబేద్కర్.. పూలే. చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. మోసకారి. ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాలు సాధికారితకు నిదర్శనం. జాషువా పుట్టి పెరిగిన గడ్డ వినుకొండ. జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడా?. బ్రహ్మన్నకు(ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడును ఉద్దేశించి..) మరోసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. మంచి చేయకపోతే ఎవరినైనా ఏట్లో వేస్తామని వినుకొండ ప్రజలు గత ఎన్నికల్లో చెప్పారు. ఈ ప్రాంతం వెనుకబడిన ఉండటానికి ప్రధాన కారణం నీళ్ళు లేకపోవడమే. వరికిపూడిసెల తీసుకొచ్చి బొల్లాపల్లి మండలానికి సాగు త్రాగు నీరు ఇస్తామని చెప్పాం. ఇందులో భాగంగానే అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 17న మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభిస్తాం. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. జగన్ అన్న కటౌట్ చూపించి సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తాం. జగన్ లేకుండానే ఇంతమంది వస్తే.. జగనన్న వస్తే జనసునామీ వచ్చేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. పదవుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు. వార్డు మెంబర్ నుండి రాజ్యసభ ఎంపీ వరకూ అవకాశం ఇచ్చారు. రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే) ద్వారా పేదలకు పంచారు. ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసి.. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తోకను బీసీలు కత్తిరించబోతున్నారు. చంద్రబాబును దళితులు ఓడించి.. ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా చేయబోతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ మాట్లాడుతూ.. బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. వైఎస్ తోనూ ఆయన కుమారుడు జగన్ తోనూ నా ప్రయాణం సాగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఎక్కడికైనా వెళ్తాను. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు. -
కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!
సాక్షి, సంగారెడ్డి/పటాన్చెరు: ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీడీఎస్ సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ గోల్కొండకు చెందిన మహమ్మద్ సయిద్(20), నుమాన్ అలీ(19), హసీం, మజిద్, ఫైజల్ ఆహారం తీసుకునేందుకు కారులో శనివారం రాత్రి సంగారెడ్డి వైపు బయలుదేరారు. పటాన్చెరు మండలం కర్ధనూర్ ఓఆర్ఆర్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సయిద్, అలీ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో మజీద్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి కూడా చదవండి: 'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం! -
కూతురు ముందే పిస్టల్తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘గోలీ కొట్టుకుంటా’.. అంటూ రెండుమూడు రోజులుగా సన్ని హితుల వద్ద చెపుతున్న రాచకొండ ఏఆర్ ఎస్సై మహ్మద్ ఫజల్ అలీ (59) పిస్టల్తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఆఫీసర్గా పని చేస్తున్న అలీ, తన చిన్న కుమార్తెతో కలసి ఆదివారం ఉదయం డ్యూటీలో చేరడానికి వచ్చి, ఆమె సమక్షంలోనే ఉసురు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్థిక కారణాల నేపథ్యంలో అలీ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఫజల్ అలీ రాచకొండ కమిషనరేట్లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినా.. భర్తలతో విడాకులు తీసుకున్న వీళ్లు ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ఓ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న కుమార్తె వివాహం చేయాలని భావించిన అలీ.. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేవలం రెండేళ్లు మాత్రమే సర్విసు ఉండటంతో బ్యాంకు అధికారులు రుణ దరఖాస్తును తిరస్కరించారు. రెండు వారాల క్రితం బ్యాంకు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఫజల్ అలీ, రుణం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. నోట్ బుక్లో రాసుకుని.. ఈ క్రమంలో రెండుమూడు రోజులుగా తన సన్నిహితులు, సహోద్యోగుల వద్ద ఆర్థిక ఇబ్బందులు, రుణం సమస్య గురించి చెప్పుకుంటున్న ఫజల్ అలీ నిరాశతో ‘గోలీ కొట్టుకుంటా’అంటూ వాపోయారు. ఓ నోట్ బుక్లోనూ తన ఆర్థిక పరిస్థితుల విషయం రాసి ఆ పేజీని తన వెంట ఉంచుకున్నారు. ఆదివారం ఉదయం చిన్న కుమార్తె ఫాతిమాను తీసుకొని శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్దకు డ్యూటీ కోసం వచ్చారు. ముందుగా ఆ సమీపంలో ఒక హోటల్ వద్ద కూతురిని దించి మంత్రి ఇంటికి వెళ్లారు. డ్యూటీ ఎక్కిన తర్వాత తన సర్వీస్ పిస్టల్ (9 ఎంఎం క్యాలిబర్) తీసుకొని కుమార్తె ఉన్న చోటుకి వచ్చారు. వీడియో తీయా ల్సిందిగా కుమార్తెకు చెప్పి తన సెల్ఫోన్ ఇచ్చారు. కొన్ని మాటలు నవ్వుతూ చెప్పిన అలీ, ఆపై ఫోన్ తీసుకుని, ఆమెను వెళ్లమని చెప్పారు. కుమార్తె వెనక్కు తిరిగిన వెంటనే ఫోన్ జేబులో పెట్టుకుని పిస్టల్తో తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకున్నారు. కుడి చెవిపై నుంచి దూసుకుపోయిన తూటా ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అలీ కుటుంబీకులకు అప్పగించారు. కాగా, ఫజల్ అలీ తండ్రి ఇబ్రహీం అలీ కూడా గతంలో హైదరాబాద్లో ఏఆర్ ఎస్ఐగా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంతో 1986లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ ఫజల్ మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫజల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బుల్లితెర నటుడు!
యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటుడు అలీ మర్చంట్. తాజాగా తన చిరకాల స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని వివాహం చేసుకున్నారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ.. ముచ్చటగా మూడోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ప్లేస్లో ఛాన్స్ కొట్టేసిన అయాలి నటి!) వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. సినీతారల కోసం ప్రత్యేకంగా నవంబర్ 15 న ముంబైలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా.. అలీ మర్చంట్ ఇంతకుముందే నటి సారా ఖాన్ను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోయారు. ఆ తరువాత అలీ 2016లో అనమ్ మర్చంట్ను వివాహామాడారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2021లో విడిపోయారు. తాజాగా మూడోసారి తన ఫ్రెండ్ ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నారు. కాగా.. అలీ 'యే రిష్తా క్యా కెహ్లతా హై', 'బాందిని', 'యే హై ఆషికి' వంటి సీరియల్స్లో నటించారు. అంతే కాకుండా లాక్అప్ -1 రియాలిటీ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆయన భార్య ఆండ్లీబ్ మోడల్గా రాణిస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో సినిమాలో విలన్గా సునీల్!) View this post on Instagram A post shared by Ali Mercchant (@alimercchant) -
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, కర్ణాటకలో సుదీప్..!
-
అమ్మాయిల అంతరాత్మ
ఎలీనా, లాస్య స్మైలీ, తన్వీ, శశిరేఖ ముఖ్య తారలుగా, జయక్రిష్, సమీర్, అర్జున్, మల్లిక్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరాత్మ’. ఎమ్. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తుమ్మల మనోజ్ యాదవ్, రావూరు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. తొలి సన్నివేశానికి ఏసీపీ బాలకృష్ణా రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నటుడు అలీ స్క్రిప్ట్ను మేకర్స్కు అందించారు. ‘‘నలుగురు అమ్మాయిల మధ్య సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు నాగ రాజశేఖర్. ఐఏఎస్ ఆఫీసర్ మురళీమోహన్ ఓ అతిథిగా పాల్గొన్న ఈ చిత్రానికి సంగీతం: జీఎమ్ సతీష్, కెమెరా: నాగరాజు. -
ఆలీ నేను మంచి ఫ్రెండ్స్ కానీ ఒకటే గొడవ..!
-
ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లో అలీ మీట్ అండ్ గ్రీట్
-
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎల్రక్టానిక్ మీడియా) అలీ అన్నారు. వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బ్రిస్బేన్లో “మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అలీ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ను గెలిపించుకునేందుకు ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తండ్రి వైఎస్సార్ చూపిన బాటలో సీఎం జగన్ నడుస్తూ ప్రజా సంక్షేమంలో నాలుగు అడుగులు ముందుకేస్తూ కొత్త ఒరవడిని సృష్టించారని ప్రశంసించారు. ప్రజలే తన బలమని విశ్వసించి వారితోనే పయనం సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా క న్వినర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, ఇరువూరి బ్రహ్మరెడ్డి, జస్వంత్రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల, గజ్జల చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
జగన్ని మళ్లీ సీఎం చేద్దాం: ఎన్నారైలకు అలీ పిలుపు
బ్రిస్బేన్: వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించుకుని.. తద్వారా జరగబోయే రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ఎన్నారైలకు పిలుపు ఇచ్చారు నటుడు, వైఎస్సార్సీపీ నేత.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు అలీ. సీఎం జగన్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిదని.. మరోసారి ఆయన్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలంతా భాగం కావాలని అలీ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. ఈ ఈవెంట్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి తోపాటు ఇరువూరి బ్రహ్మ రెడ్డి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్ రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
వాళ్లు మారితే దేశం మారుతుంది : ఆలీ (నటుడు)
-
డబ్బింగ్ పనుల్లో ‘మిస్టరీ’
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘ఇదొక థ్రిల్లర్ కామెడీ సినిమా. సాయి అనుకున్న కథని అనుకున్నట్లుగా తీశాడు. నా పాత్ర డబ్బింగ్ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది. టీమ్ అందరికి నా అభినందనలు’అని అన్నారు. -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
అమెరికాలో అలీ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
Mystery Movie: ఫోరెన్సిక్ ఆఫీసర్గా ఆలీ
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆలీ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం ఫోరెన్సిక్ ఆఫీసర్ సాయి పాత్రలో ఆలీ కనిపిస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ ‘దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం. ఆలీ డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ అన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
నేనంటే ఆయనకు చాలా ఇష్టం..
-
డాలస్ : అమెరికాలో అంగరంగ వైభవంగా నాటా వేడుకలు (ఫొటోలు)
-
అమెరికా వెళ్తున్న అలీ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్లో ‘టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
రామబాణంలో సీన్ లీక్ చేసి నవ్వులు పూయించిన అలీ
-
iBOMMAలో సినిమా చూసే వాళ్ళ పై ఆలీ సీరియస్ కామెంట్స్
-
హైదరాబాద్లో ‘నాట్స్’ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అలీ పెద్ద మనసు.. మెరిట్ స్టూడెంట్స్కు చేయూత!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ సామాజిక సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతుంటాడు. తాజాగా అలీ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యా వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యంతో మెరిట్ విద్యార్థులకు చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పించబోతున్నారు. ఈ విషయంపై తాజాగా అలీ మీడియాతో మాట్లాడుతూ..చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏమి చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికి అర్వేంసిస్ సభ్యులు సభ్యులు ముందుకు రావడం సంతోషంగా ఉంది. వీళ్లు విద్య వైద్య రంగాలలో మెరిట్ స్టూడెంట్స్ కి చేయూత తో పాటు ఉపాధి కూడా కల్పిస్తారు. ఇదేకాదు ఒకవేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరిస్తే.. ఇండియా నుంచి 20 మంది రైతులను అక్కడకు తీసుకెళ్లి ఉపాధి అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను’అని అలీ అన్నారు. -
నందమూరి తారకరత్నకు నివాళులర్పిస్తున్న కోడలి నాని, ఆలీ
-
తారకరత్న నాకు ఎంతో సన్నిహితుడు: అలీ
నందమూరి తారకరత్న మృతిపట్ల ప్రముఖ నటుడు అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలీ తమ్ముడు ఖయ్యూం కూడా తారకరత్న మరణం పట్ల సంతాపం తెలిపారు. ‘తారకరత్న నేను బావా బావా అని పిలుచుకునే వాళ్ళం. ఆయన చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం దారుణం’ అని ఖయ్యూం అన్నారు. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు. -
Pudami Sakshiga: వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ
Pudami Sakshiga 2023: రెడ్యూస్.. రీయూస్.. రీసైకిల్! వాడకం తగ్గించుకోవడం... వాడేసినవే మళ్లీ వాడటం... పడేసిన వాటితో కొత్తవి తయారు చేసుకుని వాడుకోవడం..! ఏమిటీ కర్మ! అవును కర్మే. మనిషి వల్ల పుడమికి పట్టిన కర్మ! అవసరం ఉన్నవీ లేనివి కొని, అవసరం తీరీ తీరకుండానే పడేస్తున్నాం. కొత్తవి కొంటున్నాం. కుండెడన్నం కోసం బండెడన్నం వండేస్తున్నాం. ఫ్రిజ్ని రైతుబజార్ని చేస్తున్నాం. వార్డ్రోబ్ పొట్ట పగిలేలా బట్టల్ని కుక్కేస్తున్నాం. భారీ ఫర్నీచర్తో ఇంటినంతా నింపేస్తున్నాం. బకెట్ల కొద్దీ నీళ్ల ట్యాంకుల్ని ఖాళీ చేస్తున్నాం! ఇ.ఎం.ఐ.ల కొద్దీ మన దగ్గర డబ్బుంటే ఉండొచ్చు. పుడమి దగ్గర ఇప్పుడు.. దాదాపుగా నో స్టాక్! పంచభూతాల షార్టేజ్!! తక్షణం మన వేస్టేజ్ తగ్గితేనే పుడమికి మనుగడ! ఈ కఠోర వాస్తవంపై ‘పుడమి సాక్షిగా..’ మెగా టాకథాన్తో గత మూడేళ్లుగా సమాజానికి అవగాహన కల్పిస్తూ వస్తున్న.. ‘సాక్షి మీడియా గ్రూప్’ ఈ ఏడాది ‘రెడ్యూస్..రీయూజ్.. రీసైకిల్..’ అనే థీమ్తో ఈవెంట్ని నిర్వహించింది. వాడకం తగ్గించి, వృథాను నివారించి, వ్యర్థాలను తగ్గిస్తేనే పుడమి తిరిగి జవసత్వాలు పుంజుకుంటుందని ఈ టాకథాన్ ద్వారా పర్యావరణ వేత్తలు, రాజకీయ నేతలు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు, కళాకారులు, సినీ హీరోల చేత చెప్పించింది. హైదరాబాద్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఇటీవల ఈ కార్యక్రమం జరిగింది. ∙∙ మూడో ఎడిషన్లో ధరిత్రిని కాపాడుకోవాలి, భూమిని కాలుష్య కాసారం కానీయకుండా భవిష్యత్తరాలకు అందించాలి అనే లక్ష్యంతో సాక్షి మీడియా గ్రూపు చేపట్టిన ప్రచారోద్యమమే ‘పుడమి సాక్షిగా..’ ఇప్పటివరకు రెండు ఎడిషన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మొదటి ఎడిషన్లో... ప్రమాదం అంచుకు ఎలా చేరాం? పుడమికి మనం ఏం తిరిగి ఇవ్వాలి? పర్యావరణానికి ఏం అవసరం? అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెండో ఎడిషన్లో స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సకల ప్రాణులకూ ఆవాసంగా నేల, తక్కువ కాలుష్యంతో విద్యుత్ ఉత్పాదన అనే అంశాలను ప్రధానంగా చర్చించింది. ఈ మూడో ఎడిషన్లో ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే థీమ్ను ఎంపిక చేసుకుంది. ప్రముఖుల సూచనలను, సలహాలను స్వీకరించింది. సాక్షి ‘ఫన్ డే’ ద్వారా వాటిని పాఠకులకు అందించింది. సాక్షి టీవీ ద్వారా గురువారం వీక్షకులకు అందిస్తోంది. నాకు నచ్చిన ప్రోగ్రాం సామాజిక బాధ్యతను కర్తవ్యంగా తీసుకుని సాక్షి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది, అందులో నాకు బాగా నచ్చిన ప్రోగ్రామ్.. పుడమి సాక్షిగా. భగవంతుడు మనకిచ్చిన వరం పర్యావరణం. ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళి అందరిదీ. నేటి తరాలు బాధ్యతగా జీవిస్తేనే భావితరాలకూ ఈ వరం అందుతుంది. – రోజా, పర్యాటక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది సాక్షి తీసుకున్న ‘పుడమి సాక్షిగా..’ అనే ఈ గొప్ప ఇనీషియేటివ్లో అందరం భాగస్వాములం కావాలి. పుడమి అంటే తల్లి. తల్లిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి మనిషిదీ. ఏపీ ప్రభుత్వం ఇటీవలే ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ అనే అమెరికన్ ఎన్జీవోతో ఎం.ఓ.యు. కుదుర్చుకుని విశాఖ బీచ్లో పోగయ్యే ప్లాస్టిక్ని రీయూజ్ చేయిస్తూ గొప్ప సంస్కరణకు నాంది పలికింది. పుడమి సంరక్షణకు ప్రజల్ని చైతన్యం చేస్తోంది. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి, ఏపీ రైతు.. భూమి.. పుడమి సాక్షి మీడియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తుచేస్తోంది. వ్యవసాయం విషయానికి వస్తే.. ప్రకృతి సాగు విధానాల వల్ల పుడమి కి ఎంతో మేలు జరుగుతోంది. ఏపీలో రైతు భరోసా కేంద్రాలు, రైతు సాధికార సంస్థల ఏర్పాటుతో రైతుకు, భూమికి, పుడమికి ప్రయోజనకరమైన ఫలితాలను సాధిస్తున్నాం. – కాకాని గోవర్ధన్, వ్యవసాయశాఖ మంత్రి, ఏపీ గ్రీన్ వెజిటేషన్కు ప్రాధాన్యం సాక్షి చేపట్టిన ‘పుడమి సాక్షిగా..’ ఒక మంచి ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా నేడు కలవరం కలిగిస్తున్న ప్రధాన సమస్య పర్యావరణ కాలుష్యం. అందుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రత్యేకమైన పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందిస్తోంది. కోటీ యాభై ఎకరాల వ్యవసాయ భూమి సాగు అయ్యేలా నీటి అందించి, గ్రీన్ వెజిటేషన్ని సాధిస్తోంది. – నిరంజన్ రెడ్డి, సహకార శాఖ మంత్రి, తెలంగాణ పాఠశాల స్థాయి నుంచే కలెక్టివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకుని సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. పాఠశాల నుంచే పిల్లల్లో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఇన్సెంటివ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. ఉదా.. క్లాస్ రూమ్ని శుభ్రంగా ఉంచిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి. ఇప్పుడు మనం ప్రకృతి పట్ల శ్రద్ధ వహిస్తేనే భవిష్యత్ తరాలు పచ్చగా ఉంటాయి. – అడివి శేష్, సినీ హీరో ఎకో–ఫ్రెండ్లీ స్కూల్ క్యాంపస్ ‘పుడమిసాక్షిగా..’ టాకథాన్కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. వాతావరణ మార్పులు భూతాపానికి కారణం అవుతున్నాయనే అంశంపై హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫున ఈజిప్ట్లో జరిగిన కాప్ 27 సదస్సుకు హాజరై అధ్యయన పత్రం సమర్పించాను. మా స్కూల్ క్యాంపస్ లో కూడా ఎన్విరాన్మెంట్ పిట్స్, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గించుకున్నాం. – అంకిత్ సుహాస్, కాప్–27 డెలిగేట్ వస్తు వినియమం బాగా తగ్గాలి గత దశాబ్దంగా మన దగ్గర ఉన్న గణాంకాలని బట్టి చూస్తే అర్బన్కి, రూరల్కు మధ్య వస్తు వినియోగ సంస్కృతిలో ఏ విధమైన తేడా కనిపించని పరిస్థితి. గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు రెండిటినీ స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ హ్యాండిల్ చేస్తోంది. వీటిని కంపేర్ చేసినప్పుడు.. కొనే రాశిలో తేడా ఉందేమో కానీ, ఇంటింటి నుంచీ వచ్చే రోజువారీ వ్యర్థాలు దాదాపు ఒకే మొత్తంలో ఉంటున్నాయి. వ్యర్థాలు ఎక్కువైతే పుడమికి ముప్పు కనుక రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ మన తక్షణ అవసరం. – సంపత్ కుమార్, ఐ.ఎ.ఎస్. స్వచ్ఛాంధ్ర ఎండీ పిల్లలకు క్లీన్లీనెస్ నేర్పాలి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా.. ఇదే తెలుసు మనోళ్లకి. కానీ, రాబోయే తరానికి మనం ఏం ఇస్తున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని అడగాలి. పుడమిసాక్షిగా.. నేను ప్రతి మనిషికీ చెప్పేది ఒకటే.. మనం ఇవ్వాల్సింది మన పిల్లలకి విద్య. నేర్పాల్సింది క్లీన్లీనెస్. పర్యావరణాన్ని మనం శుభ్రంగా ఉంచితే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుంది. మన దేశం శుభ్రంగా ఉంటుంది. మనం అందరికీ ఇన్సిపిరేషన్ అవుతాం. – అలీ, మీడియా అడ్వైజర్, ఏపీ మెటీరియలిజం వల్లే ఇదంతా..! మన జీవన విధానం ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. పుడమికి హితంగా మన అలవాట్లు మార్చుకోవాలి. ఆర్టీసీలో మేము రీయూజ్ అనే కాన్సెప్ట్ని అవలంబిస్తున్నాం. మెటీరియలిజంకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం కోసం సాక్షి మీడియా గత మూడేళ్లుగా ‘పుడమి సాక్షిగా..’ అనే ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూ, టాకథా¯Œ ని నిర్వహించడం అభినందనీయం. – వి.సి.సజ్జనార్, ఐపీఎస్, టి.ఎస్.ఆర్టీసీ ఎండీ త్రిబుల్ ‘ఆర్’ ప్రస్తుతావసరం ఇటువంటి ముఖ్య అంశంపై డిబేట్ ఏర్పాటు చేసిన సాక్షికి ధన్యవాదాలు. 25 ఏళ్ల క్రితం గూంజ్ సంస్థ ప్రారంభమైంది. తిండి, బట్ట, నివాసం అనే కనీస అవసరాలలో మేము దుస్తులపై దృష్టి పెట్టాం. దుస్తులను విరాళంగా సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు అందిస్తున్నాం. ఆ విధంగా సంపన్నుల దగ్గరి వేస్టేజ్ని రీయూజ్కు అందిస్తున్నాం. సంపన్నులను పరోక్షంగా రెడ్యూస్కు ప్రేరేపిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఆర్ ఆర్తోనే పుడమిని సంరక్షించుకోగలం. – మీనాక్షీ గుప్తా, ‘గూంజ్’ సంస్థ చదవండి: ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఛాయ్! పొట్ట కింద ‘టైర్లు’!.. అలారం మోగుతోంది.. వినబడుతోందా? -
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
సీఎస్ జవహర్రెడ్డిని కలిసిన అలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు మహ్మద్ అలీ గురువారం సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించిన విషయం విదితమే. చదవండి: (CM YS Jagan: ఇంటింటా మనం.. అదే మన లక్ష్యం) -
‘కథ వెనుక కథ’లో చాలా మంచి కథలు ఉన్నాయి
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాకు ‘కథ వెనుక కథ’ అనే టైటిల్ ఖరారు చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ పతాకాలపై అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా నటుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ– ‘‘కథ వెనుక కథ మంచి కథ. దండమూడి అవనింద్ర కుమార్గారిది గోల్డెన్ హ్యాండ్. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది’ అని అన్నారు. ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలున్నాయి’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం’’ అన్నారు విశ్వంత్. ‘‘ఈ సినిమాలో మంచి ట్విస్ట్లు ఉన్నాయి’’ అన్నారు అవనింద్ర కుమార్. ‘‘నిర్మాత అవనింద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిగార్ల వల్లే ఈ సినిమాను లార్జ్ స్కేల్లో చేస్తున్నాం’’ అన్నారు కృష్ణచైతన్య. -
అలీ కుమార్తె వివాహం.. మరి అల్లుడి బ్యాక్గ్రౌండ్ తెలుసా?
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం షహయాజ్లతో ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని అన్వయ కన్వెక్షన్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో పాటు చిరంజీవి, నాగార్జున లాంటి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపించాయి. సాధారణంగా నటీనటులు పెళ్లిళ్లు జరిగితే వధువు, వరుడు వివరాలపై ఆరా తీస్తుంటారు. తాజాగా అలీ అల్లుడు ఎవరా అని కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు. (చదవండి: నా కూతురిని ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు: అలీ) అలీ పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్గా నిలిచింది ఫాతిమా. ఇక అల్లుడు షెహయాజ్ కూడా డాక్టరే కావడం విశేషం. జమీలా బాబీ, జలానీ భాయ్ దంపతుల కుమారుడు షెహయాజ్. అతనికి అన్న, సోదరి ఉన్నారు. వీళ్లిద్దరితో పాటు వరుడి వదిన కూడా డాక్టరే కావడం మరో విశేషం. వీరంతా గుంటూరుకు చెందిన వారు కాగా.. ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు. అతని కుటుంబ సభ్యులు అందరూ ఉన్నత విద్యావంతులే. ఇక అలీ కూతురు డాక్టర్ చదివేసరికి.. అల్లుడు కూడా డాక్టరే కావాలని.. షెహయాజ్ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా.. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా పరిచయమైన అతడు.. ప్రస్తుతం హాస్యనటుడిగా మాత్రమే కాకుండా హీరోగా, నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నారు. టీవీ షోకు హోస్ట్ గానూ నిరూపించుకున్నారు. -
అలీ కూతురు రిసెప్షన్ కి హాజరైన సీఎం జగన్
-
అలీ కూతురి వివాహ వేడుకలో అక్కినేని దంపతులు.. ఫోటోలు వైరల్
ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం నవంబర్ 27న హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ రోజు జరిగిన అలీ కూతురు వివాహానికి నాగార్జున అక్కినేని తన భార్య అమలతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నాగార్జున దంపతులు పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (చదవండి: ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్, ఫొటోలు వైరల్) వివాహ వేడుకకు హాజరైన నాగార్జున, అమల నూతన జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి నాగార్జునతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులకు అలీ ఆహ్వానాలు అందించారు. తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి అలీ తన భార్య జుబేదా సుల్తానా బేగంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా వెళ్లి శుభలేఖలు అందించారు. కాగా.. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నారు. టాలీవుడ్లో నటుడు అలీ తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీలో కలిపి దాదాపు 1000 చిత్రాలకు పైగా నటించారు. 1979లో నిండు నూరేళ్లు చిత్రంతో అరంగేట్రం చేశారాయన. -
డేర్ అండ్ డాషింగ్ ఆయన పేరులోనే ఉంది: అలీ
-
Hyderabad: గవర్నర్ తమిళిసైను కలిసిన అలీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, టాలీవుడ్ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని కలిశారు. అలీ దంపతుల పెద్ద కుమార్తె ఫాతిమా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బుధవారం గవర్నర్ తమిళిసైని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను స్వీకరించిన తమిళిసై తప్పకుండా వివాహానికి హాజరు అవుతానని అలీకి మాటిచ్చారు. చదవండి: (కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?) -
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు.. ఆయన ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ, తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2024లో ప్రజలు మళ్లీ సీఎం జగన్కు పట్టం కట్టడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలి’’ అని అలీ అన్నారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
రాజకీయాల్లో సహనం ఎంతో అవసరం
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని, అది కోల్పోయి మాట్లాడితే జనమే రాజకీయ నేతలపై తిరగబడతారని సినీనటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా)గా నియమితులైన అలీ చెప్పారు. ఆయన బుధవారం సతీసమేతంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న తన కుమార్తె వివాహానికి సీఎం జగన్ను ఆహ్వానించేందుకు వచ్చినట్లు చెప్పారు. ఫస్ట్ కార్డు సీఎంకి అందజేశానన్నారు. సీఎం జగన్ తనకు అద్భుత అవకాశం ఇచ్చారని, ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని చెప్పారు. గతంలో రాఘవేంద్రరావు ఈ పదవిలో ఉన్నారని గుర్తుచేశారు. దీనికి అలీ అయితే కరెక్ట్ అని సీఎం తనని నియమించారన్నారు. తన వల్ల సీఎం జగన్కు ఎంతపేరు తీసుకురావాలో అంతా తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. రాజకీయాల్లో సహనం ఉన్న వారు గొప్ప నేతలు అవుతారని చెప్పారు. సీఎం జగన్ అలా ఉండి ప్రజాసమస్యలపై తిరుగులేని పోరాటాలు చేయటం వల్లే, తిరుగులేని మెజార్టీ సాధించి, సీఎం పదవి అధిరోహించారన్నారు. పదవుల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకునే వారు సీఎం జగన్లా ఉండాలని చెప్పారు. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం నేతలకు సరైంది కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని నేతలు గ్రహించాలని సూచించారు. గతంలో అలీ పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, ఇకముందు సీఎం జగన్ ఆదేశాలను శిరసావహించి ముందుకు కదులుతానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్నారు. అన్నివర్గాల్లో పేదల కోసం, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై లబ్ధిపొందారన్నారు. ప్రజలు పథకాలను ఆదరిస్తున్నారని చెప్పారు. ఈసారి 175కి 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి జగన్ 2024లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ సీఎంగా ఎన్నికవుతారని పేర్కొన్నారు. ఆ క్రతువులో తనవంతు పాత్ర పోషిస్తానన్నారు. ఇక నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా మరో అలీని చూస్తారని ఆయన చెప్పారు. -
నా కూతురి పెళ్లికి సీఎం జగన్ కానుక ఇచ్చారు : అలీ
-
సీఎం జగన్ అడుగు జాడల్లో నడుస్తా: అలీ
సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా అలీ స్పందించాడు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడంతో పాటు, పార్టీ అప్పగించిన పనులను నిబద్ధతతో పూర్తి చేశానని... తన సేవలను సీఎం జగన్ గుర్తించారని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని అన్నారు. ఈ పదవిని తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెప్పారు. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగనున్నారు. ఇతర ప్రభుత్వ సలహాదారుల మాదిరే ఆయనకు కూడా జీతభత్యాలు అందనున్నాయి. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ
టైటిల్: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నటీనటులు: అలీ, నరేశ్, పవిత్రా లోకేశ్, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ తదితరులు నిర్మాణ సంస్థ: అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : కొనతాల మోహన్ దర్శకత్వం: శ్రీపురం కిరణ్ సంగీతం: రాకేశ్ పళిడమ్ సినిమాటోగ్రఫీ: ఎస్. మురళి మోహన్రెడ్డి ఎడిటర్: సెల్వకుమార్ విడుదల తేది: అక్టోబర్ 28, 2022(ఆహా) కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 28) ప్రముఖ ఓటీటీ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీనివాసరావు(నరేశ్), పవిత్ర లోకేశ్(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్కి సెల్ఫీలు, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్ పెట్టిన ఓ పోస్ట్ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేకే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శ్రీపురం కిరణ్. సోషల్ మీడియాలో పెట్టే తప్పుడు పోస్టుల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో, దాని వల్ల కొందరి జీవితాలు ఎలా తారుమారు అవుతాయో తెరపై చక్కగా చూపించాడు. సినిమా అంతా చాలా ఎమోషనల్గా సాగుతుంది. నరేశ్, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడి హృదయాలను హత్తుకుంటాయి. ఇది ఎమోషనల్గా సాగే కథ అయినప్పటికీ.. హాస్యానికి కూడా కొదవ ఉండదు. హీరో లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథ చాలా నెమ్మదిగా సాగడం సినిమా స్థాయిని తగ్గిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకి థియేటర్స్లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు కానీ.. ఓటీటీకి మాత్రం పక్కా సెట్ అయ్యే మూవీ. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే.. అలీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఎంత నవ్వించగలడో..అంత ఏడిపించగలడు. ఈ సినిమాలో సమీర్ పాత్రకు న్యాయం చేశాడు. సోషల్ మీడియా, సెల్ఫీల పిచ్చి ఉండే పాత్ర తనది. ఇక సినిమాకు ప్రధాన బలం నరేశ్, పవిత్రా లోకేశ్. కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. తెరపై నరేశ్, పవిత్రా లోకేశ్ల ఎమోషనల్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మూగ వ్యక్తిగా నరేశ్ నటన అద్భుతంగా ఉంది. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో నటించిన లాస్య చక్కగా నటించింది. ఆమె పాత్ర కారణంగానే సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది.మనో, తనికెళ్ల భరని, మౌర్యానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రాకేశ్ పళిదం ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫర్ మురళి మోహన్రెడ్డి , ఎడిటర్ సెల్వకుమార్ పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓ మంచి సినిమాతో అలీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టాడని చెప్పొచ్చు. -
ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా నటుడు అలీ
-
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
సాక్షి, విజయవాడ:సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ మీడియా ఏపీ ప్రభు త్వ సలహాదారునిగా సినీనటుడు మహ్మద్ అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారని జీఏడీ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అందరికి నచ్చుతుంది: అలీ
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా తాజాగా హైదరాబాద్లో చిత్ర ట్రైలర్, టీజర్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శక, నిర్మాత ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ టైటిల్ వినడానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో మలయాళం లో చూసిన ‘వికృతి’ సినిమా నచ్చి తెలుగు ప్రేక్షకులకు అందించాలనే తపనతో తనే నిర్మాతగా మారి సీనియర్ నటులందరినీ తీసుకొని తీసిన ఈ సినిమాకు కొత్త దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్ను పరిచయం చేయడం గొప్ప విషయం’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘నేను, అలీ ఒకే టైమ్లో కేరీర్ స్టార్ట్ చేశాము. అలీ, నేను కలసి చూసిన మెదటి సినిమా ‘మనీ’. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గార్లు యమలీల సినిమా ద్వారా ఆలీని హీరోగా పరిచయం చేశారు. అప్పట్లో అది ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఆలా ఎదుగుతూ వచ్చిన ఆలీ ఈ రోజు మంచి సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని, చాలా మంది సీనియర్ నటులను సెలక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు. అలీ మాట్లాడుతూ.. మలయాళం లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నరేష్ గారు నేను పోటాపోటీగా నటించాం . 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి గారితో కలిసి మళ్ళీ నటించడం ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణంలో దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ నెల 28న ఆహా లో విడుదల అవుతున్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అన్నారు. ‘ఎంతో మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 28న విడుదల అవుతున్న ఈ సినిమా అందరూ ఆదరించి ఆశీర్వాదించాలని కోరుతున్నాను’అని దర్శకుడు కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, చిత్ర నిర్మాత కొణతాల మోహనన్ కుమార్ ,నటులు పృథ్వీ , శివబాలాజీ, భద్రం తదితరులు పాల్గొన్నారు. -
‘ఆహా’లో అలీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రాకేశ్ పళిదంను ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరి వల్ల అమాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆలీ హీరోగా, నరేష్ - పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా నటించగా, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Oka photo online lo sanchalanam chesthe. Ela untundi? 🤔 Daani venuka story enti? Watch the official remake of Vikruthi #AndaruBaagundaliOnAHA Premieres Oct 28#Ali pic.twitter.com/R8rA4yO6EZ — ahavideoin (@ahavideoIN) October 24, 2022 -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్గానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
అప్పుడు అందరం బాగుంటాం
కృష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి. యశోదమ్మ, టి. చేతన్ నిర్మించిన చిత్రం ‘నేచర్’. ఈ సినిమాలోని ‘నిన్నే చూడందే..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను రిలీజ్ చేసిన అలీ మాట్లాడుతూ – ‘‘నాకు ఇళయరాజాగారి పాటలంటే ఇష్టం. ఈ పాట ఆయన పాటలను గుర్తు చేసింది. యం.ఎల్. రాజా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘నేచర్’ టైటిల్ బాగుంది. ప్రకృతి బాగుంటే మనందరం బాగుంటాం’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ’’ అన్నారు అశ్విన్ కామరాజు. ‘‘ఈ సినిమాకు పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు ఎమ్ఎల్ రాజా. ‘‘సుధాకర్, రవి టీచర్స్. ఈ సినిమాకి ఇద్దరూ చక్కటి కథను రెడీ చేశారు’’ అన్నారు గౌతమ్ రాజు. -
కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె లైగర్ సినిమాలో నటించారు. ఈమధ్య సినిమాల కంటే బుల్లితెరపై హోస్ట్గా,జడ్జిగా అలరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జుబేదా అలీ సైతం సొంతంగా యూట్యూబ్ ఛానెల్తో పాపులారటీ దక్కించుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎంగేజ్మెంట్ వీడియోను జుబేదా అలీ తన ఛానెల్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్ చూశారా? అయితే అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే అలీ అల్లుడు డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్ కంప్లీట్ చేసింది. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఘనంగా కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా అలీ కూతురు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ క్రమంలో తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అలీ-జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం కాగా పెద్దకూతురు ఫాతిమా ఇటీవలే మెడిసిన్ కంప్లీట్ చేసింది. త్వరలోనే ఈమె మెట్టినింట్లో అడుగపెట్టనుంది. కాగా యూట్యూబ్ వీడియోలతో జుబేదా సెపరేట్ ఫ్యాన్బేస్ను ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే ఆమె ఛానెల్కు 5లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తాజాగా తన కూతురి ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులే కారణం: కమెడియన్ అలీ
సినీ నటుడు అలీకి జీవన సాఫల్య రజిత కిరీట జాతీయ పురస్కారాన్ని అందజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనచారి మాట్లాడుతూ.. పీవీ నరసింహరావు ప్రతికూలపరిస్థితులలో జాతీయ స్థాయికి ఎదిగారని అలీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారని కొనియాడారు. నటుడు అలీ మాట్లాడుతూ చిన్న దర్జీగా మా నాన్న పనిచేసేవారని, అలాంటి కుటుంబం నుంచి ఈ స్థాయికి రావటానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. పీవీ ప్రభాకర్రావు, గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, తదితరులు పాల్గొన్న సభకు సురేందర్ స్వాగతం పలుకగా దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు 101 జయంతిని పురస్కరించుకుని 101 మంది నృత్యకళాకారులు విభిన్న నృత్యాలు చేయగా సంస్థ అధ్యక్షురాలు పుష్ప రికార్డ్ పత్రం అందుకొన్నారు. చదవండి: థియేటర్లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్కు రెడీ! సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది -
సీఎం జగన్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వైఎస్సార్ సీపీ నాయకుడు, సినీ నటుడు అలీ కొనియాడారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆదివారం వైఎస్సార్ సీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో అలీ పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ ఆస్ట్రేలియా కో–ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు తమ కుటుంబ సభ్యులతో సహా భారీగా సంఖ్యలో హాజరయ్యారు. -
స్టేజ్పై డ్యాన్స్ చేసిన వెంకటేశ్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి..
F3 Success Meet Vizag, పెదవాల్తేరు(విశాఖ తూర్పు): మహిళా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఎఫ్–3 (F3) సినిమా అఖండ విజయం సాధించిదని ప్రముఖ హీరో వెంకటేశ్ తెలిపారు. ఆర్.కె.బీచ్ దరి గోకుల్పార్కులో శనివారం రాత్రి ఎఫ్–3 ఫన్టాస్టిక్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ తనకెప్పుడూ స్పెషల్ అన్నారు. తన తొలి సినిమా కలియుగ పాండవులు షూటింగ్ విశాఖ బీచ్రోడ్డులోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మల్లీశ్వరి వంటి ఎన్నో సూపర్హిట్ సినిమాలను విశాఖలో చిత్రీకరించామన్నారు. తాను నటించిన దృశ్యం–2, నారప్ప వంటి సినిమాలు ఓటీటీలో మాత్రమే విడుదల కావడంతో తన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారని పేర్కొన్నారు. ఎఫ్–3 సినిమాకు అభిమానులు విజయం చేకూర్చారని సంతోషం వ్యక్తం చేశారు. మరో హీరో వరుణ్తేజ్ మాట్లాడుతూ 'అభిమానుల ఆదరణే తమకు వందకోట్ల ఆదాయంతో సమానం. విశాఖ నోవాటెల్ హోటల్లోనే దర్శకుడు అనిల్ ఎఫ్–3 సినిమా కథ రాసుకున్నారు. మళ్లీ అవకాశం వస్తే కథ వినకుండానే వెంకటేశ్తో సినిమా చేస్తాను.' అని పేర్కొన్నారు. నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ విశాఖలో ఆర్య, పరుగు సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. అమెరికాలో కూడా ఇదే ఆదరణ లభించడం అపూర్వమన్నారు. ఈ రోజుకు సినిమా విడుదలై 9 రోజులవుతుందని.. రూ.100 కోట్ల గ్రాస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జగదాంబ వంటి 1,100 సీట్లు ఉన్న థియేటర్లో ఎఫ్–3 హౌస్ఫుల్స్తో నడుస్తోందని జగదాంబ థియేటర్ అధినేత జగదీష్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఎఫ్–4 త్వరలోనే ప్రకటిస్తామన్నారు. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 'విశాఖతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు ముందు నేను చేసిన చాలెంజ్తో మీడియా కూడా షాక్ అయింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణను నేను, హీరో వెంకటేశ్ ఎంతో రుచి చూశాం' అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ కేవలం ప్రేక్షకులను నవ్వించడానికే ఈ సినిమా తీశానన్నారు. ఈ సినిమాలో ఆలీ పాత్ర నచ్చిందా అని ప్రేక్షకులను అడిగారు. తనకు ఎఫ్–2 కంటే ఎఫ్–3 సినిమా అంతకుమించి ఆనందం ఇచ్చిందన్నారు. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చాలా బాగా పండాయన్నారు. తన సినిమా కథలన్నీ వైజాగ్లోనే రాసుకున్నానని చెప్పారు. జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ ఎఫ్–3 చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. ఇదే రోడ్డుపై ఎన్నో షూటింగ్లు చేశానని నటుడు అలీ చెప్పారు. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హీరో వెంకటేశ్, వరుణ్తేజ్, అనిల్ సినిమాలోని ఓ పాటకు నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సే నో టు ప్లాస్టిక్ ఎఫ్–3 విజయోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ విశాఖలో ఆదివారం నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామన్నారు. విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మారుస్తున్నట్లు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాత దిల్రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ విశాఖను ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలన్న జీవీఎంసీ ప్రయత్నాన్ని అభినందించారు. ప్రజల సంపూర్ణ సహకారంతోనే ఇది సాధ్యపడుతుందన్నారు. -
నాటక కళాకారులను గుర్తుతెచ్చే ‘ఉత్సవం’
నాటక కళా రంగం గొప్పదనం గురించి తెలియజేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వ వహిస్తున్న ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా దీలీప్, రెజీనా నటించారు. ముఖ్య పాత్రల్లో ప్రకాశ్రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్లుక్, టీజర్ విడుదల కానుంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడని, కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ అద్భుతమైన విజువల్స్తో ‘ఉత్సవం’ను అందంగా తీర్చిదిద్దారని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చెప్పారు. -
నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ
‘సౌత్ సినిమాలు అంటే నార్త్ వాళ్లకు ఒకప్పుడు బాగా ప్రేమ ఉండేది. ఇప్పుడు ఇంకా ప్రేమ వచ్చింది. అలాగే వీళ్లు మనల్ని తొక్కేస్తున్నారనే భయం కూడా వాళ్లకు మొదలైంది’ అని కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. స్టార్ ఇమేజ్ ఉంది. 43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు? బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి గారి కోసమే ఆ సీరియల్ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరో చేశాడు. స్టార్ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరినీ ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే..అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరు అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడం లేదు. కథ విని నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎఫ్ 3లో పూర్వ అలీగారిని చూడగలమా? తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్లో అంత సత్తా ఉంది. లొకేషన్లో కూడా టెక్నీషయన్స్ బాగా ఎంజాయ్ చేశారు. శిరీష్ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎఫ్3లో మీ క్యారెక్టర్ పేరు? పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం.. సినిమా ఎండింగ్లో మీకు ఆ విషయం తెలుస్తుంది (నవ్వుతూ..). సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు? ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరినీ తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. వెంకటేశ్, వరుణ్తేజ్ కామెడీ టైమింగ్ గురించి? వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరూ బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు. సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్కు రేచీకటి అయితే.. వరుణ్కు నత్తి.. మరి మీకేముంది? నాకు గన్ ఉందిగా (నవ్వుతూ..) అనిల్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్ చేశారా? ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని సింపుల్గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మేంటేన్ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావు సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్ రాజు గారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్ అదృష్టం. వెంకటేశ్తో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది? ఆయనతో నేను చేసిన సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి, వెంకటేశ్, మోహన్బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్బాబు ఎక్స్పర్ట్స్ పొలిటికల్ కెరీర్ గురించి? నన్ను హీరోగా క్రియేట్ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. పొలిటికల్ లీడర్గా క్రియేట్ చేయబోతున్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారే. ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా(నవ్వుతూ..) ఫైనల్గా ఎఫ్3 గురించి ఏం చెప్తారు? ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది. కొత్త సినిమాల గురించి? అంటే సుందరానికి, ఎఫ్3, లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని పిలుస్తున్నారు. -
మళ్లను పరామర్శించిన సినీనటుడు ఆలీ
సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తల్లి సన్యాసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీనటుడు ఆలీ సీతమ్మధారలోని మళ్ల నివాసానికి గురువారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆలీ ప్రార్థించారు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
ఎఫ్ 3 ఒక మంచి ట్రీట్లా ఉంటుంది – వెంకటేశ్
‘‘అందరి అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ‘ఎఫ్ 3’ చిత్రం ఒక ట్రీట్లా ఉంటుంది. అందరూ వచ్చి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్ని హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ కంటే ‘ఎఫ్ 3’ ప్రేక్షకులకు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకున్నాం. ‘ఎఫ్ 3’లో రే చీకటి ఉన్న పాత్ర చేశా’’ అన్నారు. (చదవండి: నన్ను నమ్మవు.. ఆడపిల్లను కదా.. సాయి పల్లవి డబ్బింగ్ వీడియో వైరల్) వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ ‘ఎఫ్ 3’ ఫ్రెష్నెస్ని, నవ్వులను తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత అందరూ ఏమీ ఆలోచించకుండా మీ కుటుంబాలతో కలిసి వచ్చి ‘ఎఫ్ 3’ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ‘ఎఫ్ 2’ అనేది ప్రాక్టీస్ మ్యాచ్లాంటిది.. ‘ఎఫ్ 3’ అనేది మెయిన్ మ్యాచ్.. ఈ మ్యాచ్లో సిక్స్ కాదు.. బాల్ స్టేడియం బయటకి వెళుతుంది. మీ అందరికీ ‘ఎఫ్ 3’ నచ్చుతుంది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ –‘‘ఎఫ్ 3’ ట్రైలర్లో చూపించింది కొన్ని నవ్వులు మాత్రమే.. సినిమాలో అంతకుమించిన నవ్వులను మీ కోసం దాచి ఉంచాం. ‘ఎఫ్ 3’లో మోర్ ఫన్ అని పెట్టాం. ఈ రోజు ట్రైలర్కి వచ్చిన స్పందనను బట్టి చెబుతున్నాం.. ‘ఎఫ్’ ఫర్ ఫ్యామిలీ. ఎంటర్టైన్మెంట్ చేయడంలో వెంకటేశ్గారు ఎవరెస్ట్.. ఆ ఎవరెస్ట్ పక్కన నటించేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ని చూస్తే ‘ఇంత కామెడీ చేయగలడా?’ అంటారు. ఈ ఫ్రాంచైజీని నిర్మించడానికి సపోర్ట్ చేసిన నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. అలీ మాట్లాడుతూ – ‘‘ఈ చంటి (వెంకటేశ్ని ఉద్దేశించి) ‘ఎఫ్ 3’లో మామూలుగా చేయలేదు. ఇక్కడ మా చంటి (వరుణ్ తేజ్ని ఉద్దేశించి).. వీరిద్దరూ ఈ సినిమాని తమ భుజాలపై మోశారు’’ అన్నారు. -
కూతురి గురించి గుడ్న్యూస్ షేర్ చేసిన కమెడియన్ అలీ
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆయన సీతాకోకచిలుక’చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అనతికాలంలోనే స్టార్ కమెడియన్గా పాపులర్ అయ్యారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క బుల్లితెరపై కూడా ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారాయన. ఇక అలీ భార్య జుబేదా ఈ మధ్యే యూట్యూబ్లో ఎంట్రీ ఇచ్చి రకరకాల వీడియాలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు సంతానం. తాజాగా అలీ పెద్దకూతురు ఫాతిమా గురించి ఓ గుడ్న్యూస్ను షేర్ చేసుకున్నారు. ఫాతిమా డాక్టర్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా తన కూతురు డాక్టర్ కావడం అలీ కోరిక అని తెలుస్తుంది. అలీ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫాతిమాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.