సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం | Andhra Pradesh Government Changed The Names Of Welfare Schemes Implemented By YSRCP, New Names Inside | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం

Published Wed, Jun 19 2024 5:22 AM | Last Updated on Wed, Jun 19 2024 11:31 AM

Andhra Pradesh Government Changed the Names Of Welfare Schemes

సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆరు పథకాలకు టీడీపీ ప్రభుత్వం పేర్లు మార్చింది. ఈ మేరకు సాంఘిక సంకేమ శాఖ కార్యదర్శి కె.హర్ష­వర్థన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంప్రూవ్‌మెంట్‌గా ‘నాడు–నేడు’ డాష్‌ బోర్డు పేరు మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘మనబడి నాడు–­నేడు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది.]

ఈ పనుల పురోగతితో పాటు అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రత్యేక కమిషనర్‌ను కూడా నియమించింది. అయితే, ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖలో ‘నాడు–నేడు’ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ను ‘స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంప్రూవ్‌మెంట్‌’గా పేరు మార్చారు. ఈ విభాగంలో రాష్ట్రంలోని సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల పునర్‌ నిర్మాణంతో పాటు 11 రకాల సదుపాయాలను కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ విభాగం చేపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement