ఏపీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో ఎంకే మీనా | AP ECO MK Meena Comments Over Election Counting Preparations In State | Sakshi
Sakshi News home page

ఏపీలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: సీఈవో ఎంకే మీనా

Published Mon, Jun 3 2024 1:33 PM | Last Updated on Mon, Jun 3 2024 3:16 PM

AP ECO MK Meena Comments Over Election Counting Preparations In State

సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను లెక్కించనున్నట్టు వెల్లడించారు.

కాగా, సీఈవో ముఖేష్‌ కుమార్‌ మీనా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ఏపీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. 119 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement