
అమరావతి: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.