రైతుకు సాయం ఎక్కడ? | AP Farmers Fires on AP Govt: andhra pradesh | Sakshi

రైతుకు సాయం ఎక్కడ?

Published Sun, Feb 9 2025 5:24 AM | Last Updated on Sun, Feb 9 2025 5:24 AM

AP Farmers Fires on AP Govt: andhra pradesh

కనీస మద్దతు ధర దక్కని పరిస్థితి

గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణిస్తున్న ధరలు

అన్నదాత సుఖీభవ అమలు జాడలేదు

ఏపీ కౌలు రైతుల సంఘం ఆగ్రహం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యంసహా ప్రధాన పంట ఉత్పత్తులకు గతంలో ఎన్నడూ లేని విధంగా  ఈ ఏడాది కనీస మద్దతు ధరలు దక్కని దుస్థితి నెలకొందని ఏపీ కౌలు రైతుల సంఘం(ap tenant rythu sangam) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇచ్చిన ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు.  పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం  ‘ఆదాయం వచ్చే ఉద్యాన, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటూ’ పేర్కొనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన  ఆహార పంటలను దెబ్బతీసి, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలన్న ప్రయత్నమేనని మండిపడ్డారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ముఖ్యాంశాలు..

ధాన్యం కనీస మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,730లు ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్రంలో ఒక్కరైతుకూ ఈ ధర దక్కలేదు. కేవలం రూ.1,400–1,500 మధ్య చెల్లించారు. 

పత్తికి గతేడాది రూ.12వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6వేలు, మిరపకు గతేడాది రూ.25వేలు ఉంటే, ఈ ఏడాది రూ.13వేలు,  కందికి గతేడాది రూ.10 వేలుంటే, నేడు రూ.7వేలుకు మించి పలకడం లేదు. 

అన్నదాత సుఖీభవ పథకం కింద  రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం మాటలకే పరిమితమయ్యింది.

పక్క రాష్ట్రాలను చూస్తే...
కేరళలో 16 రకాల పంటలకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.
ఒరిస్సాలో ఈ ఏడాది నుంచి ధాన్యానికి ఎమ్మెస్పీకి రూ.800 బోనస్‌ కలిపి క్వింటాకు రూ.3,100 చొప్పున చెల్లించింది.
తెలంగాణలో కూడా క్వింటాకు రూ.500 బోనస్‌ ఇచ్చి  ధాన్యాన్ని  కొనుగోలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement