
విజయవాడ, సాక్షి: ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరట దక్కింది. విచారణకు హాజరు కావాలని సీఐడీ జారీ చేసిన నోటీసుల్ని సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణలో వర్మపై తొందరపాటు చర్యలు తీసుకో వద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.