Crime Investigation Department
-
లోకేశ్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకే ఇదంతా: పోసాని
సాక్షి, అమరావతి /గుంటూరు లీగల్: తన మీద ఎన్ని కేసులు కట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తాను నిజంగా తప్పు చేస్తే నరికేయండి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారాయన. పోసానిని సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. తన పరిస్థితి చాలా దైన్యంగా ఉందని దయచేసి విడుదల చేయమని వేడుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు. టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పీటీ వారెంట్ను అమలు చేసి కర్నూలు నుంచి మంగళగిరి మేజిస్ట్రేట్ వద్దకు పోసానిని తీసుకొస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పడంతో.. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. పీటీ వారెంట్ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్ను తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబును పోసాని దూషించారంటూ మంగళగిరికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
పోసాని లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ
అమరావతి, సాక్షి: నటుడు పోసాని కృష్ణమురళి తరఫున వైఎస్సార్సీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. పోసానిపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు), మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఈ పిటిషన్ విచారణ కంటే ముందే.. కర్నూలు జైలు నుంచి సీఐడీ పోలీసులు పోసానిని గుంటూరుకు తరలిస్తుండడం గమనార్హం. పోసానిపై దాఖలైన అన్ని కేసుల్లోనూ కస్టడీ పిటిషన్లను తిరస్కరించిన న్యాయస్థానాలు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చాయి. అంతేకాదు.. పలు జిల్లాలో దాఖలైన కేసులనూ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తరుణంలో ఈ ఉదయం ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా.. ఏపీ సీఐడీ తెర మీదకు వచ్చింది. ఐదు నెలల కిందట దాఖలైన కేసును పట్టుకుని గుంటూరు కోర్టు నుంచి పీటీ వారెంట్ పొందింది. ఈ ఉదయం కర్నూల్ జిల్లా జైలుకు పీటీ వారెంట్తో చేరుకుంది. ఇది పోసానిని బయటకు రాకుండా చేసే కుట్రేనని పేర్కొన్న వైఎస్సార్సీపీ.. హైకోర్టులో సదరు పీటీ వారెంట్ను సవాల్ చేసింది. -
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్లో కేసు.. బెయిల్కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
ఐసీఐసీఐ కుంభకోణంలో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట శాఖలో జరిగిన కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన టీడీపీ నేతను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము కాజేసిన ఈ కుంభకోణంలో ఈ టీడీపీ నేతే సూత్రధారి అని అప్పట్లోనే తేటతెల్లమైనా, ఆయన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆయన అరెస్టుకు సుదీర్ఘకాలం పట్టింది. కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న బ్యాంకు మేనేజర్ దూడ నరేష్ చంద్రశేఖర్ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి కుంభకోణానికి సంబంధించిన వివరాలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి రూ. 35 కోట్ల అజిత్కుమార్, ఆయన తల్లి ఖాతాల్లో జమ అయినట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో అజిత్ కుమార్ను అరెస్టు చేయక తప్పలేదు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించటంతో నెల్లూరు జైలుకు తరలించారు. అరెస్టు సందర్భంగా అజిత్కుమార్, అయన సోదరుడు దీపక్ సీఐడీ అధికారులపై దురుసుగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన తనను అరెస్టు చేస్తారా అంటూ ఎదురు తిరిగాడు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజిత్కుమార్పై కేసు నమోదు చేసిననట్లు రూరల్ ఎస్ఐ అనిల్కుమార్ చెప్పారు. టీడీపీ నేతగా హల్చల్ ఈ కుంభకోణం వెలుగు చూసిన వెంటనే మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాలను సెల్ఫీ వీడియో ద్వారా విడదల చేశాడు. ఇందులో కీలక సూత్రధారి సింగ్ అజిత్కుమార్ అనే విషయం అప్పట్లోనే వెల్లడైంది. తనకు టీడీపీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని, పార్టీ ఫండ్గా రూ. 4 కోట్ల ఇచ్చానని, టీడీపీ టికెట్ తనదేనని ప్రచారం చేసుకొన్నారు. ఎన్నారైగా చెప్పుకుంటూ పెద్ద కాన్వాయ్, దాంట్లో బౌన్సర్లతో హల్చల్ చేసేవాడు. అమెరికాలో ఉంటున్నట్లు చెప్పుకున్నప్పటికీ, తరుచూ స్వగ్రామానికి రావడంతో స్థానికుల్లోనూ అనుమానాలు ఉండేవి. ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ప్రత్తిపాటి పుల్లారావుకు రావడంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశాడు. ఆయనకు ఎలక్షన్ ఫండ్ కింద రూ. 2 కోట్లు ఇచ్చినట్టు సైతం ప్రచారంలో ఉంది. ఇదీ జరిగింది.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచిలో ఖాతాదారుల సొమ్ము కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గతేడాది అక్టోబర్లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పలువురు ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు చేయడంతోపాటు గోల్డ్ లోన్లు పొందారు. రికరింగ్ డిపాజిట్ల వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు రావడంతో వారి ఖాతాల్లో డిపాజిట్లు మాయమైనట్లు తేలింది. దీంతో బాధితులు పెద్దఎత్తున బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు.బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజినల్ హెడ్ రమేష్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి చేరుకొని విచారణ జరిపి, కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. 2017 నుంచి చిలకలూరిపేట బ్రాంచి మేనేజర్గా వ్యవహరించిన దూడ నరేష్ చంద్రశేఖర్ ఈ గోల్మాల్లో కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆయన 2021లో నరసరావుపేట, 2023లో విజయవాడలోని భారతీనగర్ బ్రాంచికి బదిలీ అయ్యారు. 2024లో చిలకలూరిపేట బ్రాంచి కుంభకోణం వెలుగు చూడటంతో ఆయన్ని సస్పెండ్ చేశారు. -
చెప్పినట్లు చేసి తీరాల్సిందే!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కక్ష సాధింపు కుట్రలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మరింత బరి తెగిస్తోంది. న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఏకంగా సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించే కుట్రను వేగవంతం చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్లతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే లక్ష్యంగా వేధింపులను తీవ్రతరం చేసింది. ప్రధానంగా వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగం పన్నింది. ఉన్నతాధికారులపై ప్రభుత్వ పెద్దల ఆగ్రహం!చంద్రబాబు ప్రభుత్వం గతేడాది జూన్ 12న అధికారంలోకి రాగానే రెడ్బుక్ కక్ష సాధింపులకు తెరతీస్తూ వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంపై అదే నెల 24న అక్రమ కేసు నమోదు చేసింది. అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చగా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందారు. దాంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సీఐడీ మరో అక్రమ కేసు నమోదు చేసింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో సాగుతున్న ఈ కుట్రను ప్రస్తుతం పోలీసు శాఖను శాసిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లను ఉద్దేశపూర్వకంగా పేర్కొనకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా ఈ కేసులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా చేయాలన్నది అసలు పన్నాగం. కేసు దర్యాప్తు పేరిట వాసుదేవరెడ్డిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్కు విస్పష్టంగా ఆదేశించారు. అప్పటి నుంచి విచారణ పేరిట సీఐడీ బృందాలు వాసుదేవరెడ్డిని వేధిస్తూనే ఉన్నాయి. ఆయన్ను కొద్ది రోజుల పాటు అనధికారికంగా నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి చెప్పినట్లుగా నడుచుకున్నామని, మద్యం వ్యవహారాలను వారిద్దరే పూర్తిగా పర్యవేక్షించారంటూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వక పోవడంతో ప్రభుత్వ పెద్దలు సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఈ కేసులో మరింతగా బరి తెగించేందుకు సీఐడీ సన్నద్ధమైంది. రప్పించి.. రహస్యంగా రికార్డింగ్!రెడ్ బుక్ కుట్రలో భాగంగా సీఐడీ పెద్దలు.. బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు, డిస్టిలరీల ప్రతినిధులను రప్పించి మాట్లాడుతున్నారు. వారు వచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచుతామని నమ్మబలుకుతున్నారు. సాధారణ సంభాషణలు, పిచ్చాపాటి తరహాలో మాట్లాడుతున్నప్పటికీ కార్యాలయంలో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మొత్తం వ్యవహారాన్ని రికార్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారిని మరోసారి పిలిపించి వీడియో రికార్డింగులను చూపించి బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. సీఐడీ అదుపులో సత్యప్రసాద్...అబద్ధపు వాంగ్మూలం నమోదు కుట్రలో భాగంగా బెవరేజస్ కార్పొరేషన్ పూర్వపు ఉద్యోగి సత్య ప్రసాద్ను సీఐడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను విజయవాడకు తరలించి కొద్ది రోజులుగా తమదైన శైలిలో విచారించి బెంబేలెత్తిస్తున్నారు. సత్య ప్రసాద్ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సీఐడీ అధికారుల బెదిరింపులు, వేధింపులు కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వారు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేందుకు సత్య ప్రసాద్ సమ్మతించినట్టు సమాచారం! దీంతో ఆయనతో న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించేందుకు సీఐడీ అధికారులు రెండు రోజులుగా సన్నాహాలు వేగవంతం చేశారు. వాంగ్మూలం నమోదు చేయించగానే కుట్రలో తరువాత అంకానికి తెరతీయనున్నారు.ఇక టార్గెట్ రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి..!సత్య ప్రసాద్ను బెదిరించి దారికి తెచ్చుకున్న సీఐడీ అధికారులు గతంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆచూకీ కోసం కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారన్నది స్పష్టమైన సమాచారం అందగానే అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సీఐడీ అధికారుల బృందాలను ఇప్పటికే హైదరాబాద్ పంపారు. వాసుదేవరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నది సీఐడీ అధికారుల లక్ష్యం.అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకుంటే అంతు చూస్తాం..!వాసుదేవరెడ్డితోపాటు బెవరేజస్ కార్పొరేషన్లో గతంలో పని చేసిన సత్య ప్రసాద్తో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించే కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. వారిద్దరినీ కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్న సీఐడీ అధికారులు.. ఈ వారంలో సీఆర్పీసీ 164 కింద అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక నిరీక్షించే ఓపిక లేదని.. అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా వాంగ్మూల నమోదు ప్రక్రియ పనులు మొదలు పెట్టడం గమనార్హం.తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు!రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్తోపాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించాలనే కుతంత్రాన్ని రచిస్తోంది. సీఐడీ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్ డ్రైవ్లు, సీడీలు, హార్డ్ డిస్క్లలో స్టోర్ చేస్తారు. అనంతరం వాటిని వెంటబెట్టుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు, డిస్టిలరీల కార్యాలయాల్లో తనిఖీలకు బయలుదేరుతారు. అవన్నీ ఆ నివాసాలు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో లభించినట్లు ప్రకటిస్తారు. తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలని సీఐడీ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది! -
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను చీఫ్గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్లాల్ను డీజీపీ తన చాంబర్కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్లాల్ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
అబద్ధపు వాంగ్మూలాలకు ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కీలక నేతలను వేధించే కుట్రలను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేయడంతోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ను రాజ్యాంగేతర శక్తిలా వాడుకుంటోంది. అక్రమంగా నమోదు చేసిన మద్యం కేసులో అధికారులపై బెదిరింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు సంస్థలో గతంలో పని చేసిన సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డితోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వారిని వేధిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు తీసుకోండి..అక్రమ కేసులు బనాయించండి త్వరలోనే కొందరు కీలక నేతలను అరెస్ట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఇటీవల టీడీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయనేమీ ముఖ్యమంత్రి కాదు.. హోంమంత్రి కూడా కాదు. లోకేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి మాత్రమే. పోలీసు శాఖ, సీఐడీ విభాగం, ఇతర దర్యాప్తు సంస్థలు ఆయన అధికారిక పరిధిలోకి రావు. అలాంటప్పుడు కొందరు వైఎస్సార్సీపీ నేతలను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన ఎలా ప్రకటించారన్నది కీలకంగా మారింది. అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని లోకేశ్ పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఏసీబీ అదనపు డీజీ అతుల్ సింగ్ తదితరులపై లోకేశ్ చిందులు తొక్కారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తరువాతే అక్రమ కేసుల కుట్రను సీఐడీ వేగవంతం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేధింపులకు పాల్పడి అరాచకం సృష్టించింది. ఈ క్రమంలో నారా లోకేశ్ మరోసారి వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టుల గురించి సీఐడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డికి వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు సీఐడీకి స్పష్టం చేశారని తెలుస్తోంది. ఆ బాధ్యతను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్తోపాటు రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్కు అప్పగించినట్టు సమాచారం.నెలాఖరుకల్లా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాల్సిందే...ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపుల కుట్రను తీవ్రతరం చేశారు. మద్యం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి పాత్ర ఉందని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈమేరకు బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేరెడ్డి, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సత్యప్రసాద్లను తీవ్రంగా వేధిస్తున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలను 164 సీఆర్పీసీ కింద ఈ నెలాఖరు కల్లా నమోదు చేయాల్సిందేనని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. అలా చేస్తే ఢిల్లీలో కీలక పోస్టింగు ఇస్తామని లేదంటే ఇప్పటికే వాసుదేవరెడ్డిపై నాలుగు అక్రమ కేసులు నమోదు చేశామని..ఇక ముందు మరిన్ని బనాయిస్తామని బెదిరిస్తున్నారు. అక్రమ కేసు నమోదు చేసి కనీసం రెండేళ్లపాటు జైలులో ఉంచుతామని ఘట్టమనేని శ్రీనివాస్ బెదిరించడం ప్రభుత్వ కుట్రలకు తార్కాణం. నెలాఖరునాటికి వారిద్దరితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించడమే లక్ష్యంగా సీఐడీ అధికారులు, ఘట్టమనేని శ్రీనివాస్ వేధింపులను తీవ్రతరం చేశారు. దీని వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందన్నది స్పష్టం. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఘట్టమనేని శ్రీనివాస్తోపాటు యావత్ పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తమను బెదిరిస్తున్న తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ సిద్ధమవుతున్నారని సమాచారం. -
చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు మెదపని సీఐడీ
సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును అటకెక్కించేసిన సీఐడీ ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే రీతిన వ్యవహరించింది. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ఇప్పుడు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది. స్కిల్ కుంభకోణం కేసులో చార్జిషీట్లు దాఖలు చేసేశామన్న సీఐడీ.. ఇక చేసేదేమీ లేదన్నట్టు సుప్రీంకోర్టు ముందు వ్యవహరించింది. దీంతో దర్యాప్తు సంస్థ అయిన సీఐడీనే చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో అసహాయత వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిష్కరించింది. స్కిల్ కుంభకోణం కేసు విచారణకు అవసరమైన సమయంలో సహకరించాలని సీఎం చంద్రబాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.చంద్రబాబే సీఎం కావడంతో మారిన సీన్చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా రూ.వందల కోట్లు దారి మళ్లాయి. షెల్ కంపెనీల ద్వారా విదేశీ ఖాతాలకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి టీడీపీ అధికారిక ఖాతాల్లోకి ఆ నిధులు వచ్చాయి. దీనిపై గత ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ ప్రాథమిక విచారణ జరిపి నిధుల మళ్లింపు వాస్తవమేనని తేల్చింది. ఇందుకు గాను చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు 2023 నవంబర్లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఐడీ అదే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది. తమ తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించుకుంది. దీనిపై అప్పటినుంచి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ వస్తోంది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం.. స్కిల్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో సీఐడీ తన దర్యాప్తును అటకెక్కించేసింది. చార్జిషీట్ల దాఖలులో అసాధారణ జాప్యం చేసింది. స్కిల్ కుంభకోణం కేసును ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగార్చేందుకు చర్యలు తీసుకుంది.జోక్యం అవసరం లేదన్న సీఐడీతాజాగా బుధవారం సీఐడీ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సీఐడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హైకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని, అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే సీఐడీ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, చార్జిషీట్ దాఖలు చేసినందున చంద్రబాబు బెయిల్ విషయంలో ఇప్పుడు తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. సీఐడీ పిటిషన్ను పరిష్కరిస్తున్నట్టు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రీరికార్డింగ్!
సాక్షి, అమరావతి : చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న సీఐడీ అందుకు చర్యలు వేగవంతం చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్ర మాలను ఆధారాలతో సహా వెల్లడించిన అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్పై ఒత్తిడి తెచ్చి, గతంలో ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని మా ర్పించి, కొత్తగా వాంగ్మూలం ఇప్పించడంలో విజ యవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయనతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని సీఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు ఆయన అంగీకరించలేదు. రెండుసా ర్లు ఆయనతో 164 సీఆర్సీపీ వాంగ్మూలాన్ని రీరి కార్డింగ్ చేసేందుకు సీఐడీ యత్నించి విఫలమైంది. ఓ సారి న్యాయాధికారి సెలవులో ఉండటంతో వాయిదా పడింది. మరోసారి న్యాయస్థానం ప్రాంగణం వరకూ వచ్చిన శ్రీధర్ బయటే చాలాసేపు తన వాహనంలో ఉండిపోయారు. న్యాయస్థానం లోపలికి వెళ్లలేదు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పలువురు న్యాయవాదులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాంగ్మూలం ఇవ్వకుండానే వెనుదిరిగారు. మూడో ప్రయత్నంలో బుధవారం సీఐడీ అధికారులు ఆయన్ని గుంటూరులోని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. సీఐడీ అధికారులు, మఫ్టీలో ఉన్న పోలీసు అధికారుల పహారా మధ్య దాదాపు రెండు గంటలపాటు ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇతరులు ఎవరూ ఆయన్ని కలిసేందుకు కూడా సీఐడీ అధికారులు అనుమతించలేదు.సీఆర్పీసీ 164 కింద శ్రీధర్ తన వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేసినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన వాహనంలో వెళ్లిపోయారు. వాంగ్మూలం రీరికార్డింగ్పై అధికారికంగా సీఐడీ, ఇతర అధికారులుగానీ స్పందించలేదు. -
మూడు నెలల్లో ముగించేద్దాం
సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. ఈ పథకాన్ని సిద్ధార్థ్ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.అన్నీ మూసేద్దాం..చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.అంతా లూథ్రా చెప్పినట్లే..సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవçÜ్థకు సూపర్ బాస్గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్పాల్పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
టాటా, గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయండి
సాక్షి, అమరావతి : సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును అభ్యర్థించింది. ఈమేరకు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఆ కౌంటర్లలో హైకోర్టును సీఐడీ కోరింది. కుక్కల విద్యాసాగర్తో కలిసి కుట్రలో పాల్గొనడం ద్వారా పోలీసు మాన్యువల్ ఆర్డర్ను ఉల్లంఘించారని చెప్పింది. ఈ కుట్రలో న్యాయవాది వెంకటేశ్వర్లు సైతం పాలుపంచుకున్నారని తెలిపింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 2న చేపట్టనుంది.విద్యాసాగర్కు బెయిల్ ఇవ్వొద్దు..జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని సీఐడీ హైకోర్టును కోరింది. విద్యాసాగర్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ మేరకు సీఐడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. -
సీఎం ‘సమోసా’ వివాదం.. దర్యాప్తు ఏం లేదు: సీఐడీ
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ‘సమోసా’ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఐడీ కార్యాలయంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరైన ఓ కార్యక్రమంలో ఆయనకు ఇవ్వాల్సిన సమోసాలు మాయం అయినట్లువార్తలు రావడంతో..ఈ అంశంపై వివాదం చెలరేగింది.. దీనిపై సీఐడీ దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు ఆరోపణలు రావడంతో.. తాజాగా దర్యాప్తు సంస్థ స్పందించింది. తాము ఎలాంటి విచారణ చేపట్టలేదని స్పష్టం చేసింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమం కోసం ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారని, అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ తినేశారని వార్తలు వచ్చాయి. సీఎం వద్దకు చేరాల్సిన అవి ఎవరి వల్ల మధ్యలో మిస్ అయ్యాయే గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సీఐడీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ రంజన్ ఓజా మాట్లాడుతూ.. సమోసాలు కనిపించకుండా పోవడంపై ఎలాంటి దర్యాప్తు జరపడం లేదని తెలిపారు. ఇది అంతర్గత విషయమని చెప్పారు. అయితే అధికారుల సమావేశానికి ఆర్డర్ చేసిన స్నాక్స్ బాక్స్లు కనిపించకుండా పోవడంపై ఆశ్చర్యం వేయడం చాలా సాధారణమైన విషయమని అన్నారు.దీనిపై విచారణ ఏం లేదని, కేవలం బాక్సుల గురించి తెలుసుకోవడానికి ఒక విజ్ఞప్తి మాత్రమే జరిగిందని చెప్పారు.మరోవైపు ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిందిు. ఇదంతా హాస్యాస్పదమైన వ్యవహారమని, సమోసాలను ఎవరు తింటే ఏమవుతుందని ప్రశ్నించింది. ‘సీఎం తినాల్సిన సమోసాలను తీసుకెళ్లిందెవరు..? సీఐడీ తేల్చనుంది..’’ అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుండటంతో సీఎం కార్యాలయం కూడా స్పందించింది. ప్రభుత్వం అటువంటి విచారణకు ఆదేశించలేదని, ఈ విషయంతో సంబంధం లేదని చీఫ్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ వెల్లడించారు. ఇది సీఐడీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. -
మూడేళ్లయినా చార్జిషీట్ ఎందుకు వేయలేదు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై దర్యాప్తును అటకెక్కించిన సీఐడీని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టంది. 2021లో కేసు నమోదు చేసినప్పటికీ, ఇప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మూడేళ్లు దాటినా ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ప్రధాన నిందితునిగా ఉన్న స్కిల్ డెలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీ ఉద్దేశపూర్వకంగానే మూలన పడేసిందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టు సైతం ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయిన ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకుండా సీఐడీ చేస్తున్న ఉద్దేశపూర్వక జాప్యం నిందితులకు వరంగా మారింది. ఈ కుంభకోణం మాస్టర్ మైండ్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన షరతుల్లో కొన్నింటిని హైకోర్టు సడలించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చింది. బోస్ సరెండర్ చేసిన పాస్పోర్ట్ను వెనక్కి ఇచ్చేయాలని విశాఖపట్నం మొదటి అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశించింది. రూ.25 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని బోస్ను ఆదేశించింది. విశాఖపట్నం కోర్టు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాస్పోర్ట్ని సరెండర్ చేస్తానని హామీ ఇవ్వాలని బోస్ని ఆదేశించింది. ప్రయాణ వివరాలన్నింటినీ ముందస్తుగానే కింది కోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజాధనం కొల్లగొట్టి విదేశాల్లో దాచారని ఈడీ వెల్లడిసుమన్ బోస్ను విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బోస్ పలు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ఆ డబ్బును విదేశాలకు తరలించారని, అందువల్ల విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వొదని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావు హైకోర్టును కోరారు. దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుందని వివరించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ షరతులను సడలించడం సరికాదని గట్టిగా వాదించారు. -
ఈడీ నీకెక్కడ క్లీన్చిట్ ఇచ్చింది?
ఈ నెల 15వ తేదీన ఈడీ విడుదల చేసిన ప్రెస్నోట్లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఈ కేసులో నిందితులకు చెందిన రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా పేర్కొంది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది.’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిషి (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో స్పెషలిస్టు. అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. – వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీకు క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చిందో చూపాలి..’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. టీడీపీ పాలనలో జరిగిన స్కిల్ స్కామ్పై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ దర్యాప్తు చేసి.. అన్ని ఆధారాలతోనే ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసిన చంద్రబాబును అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేసిందని, స్కామ్ జరిగినట్లు నిర్ధారించిందని, దానికి తార్కాణమే ఆ కుంభకోణంలో పాత్రధారులైన డిజైన్ టెక్ ఎండీ, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సహా నలుగురిని అరెస్ట్ చేసి రెండు విడతల్లో రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిందని వివరించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు కొనుసాగుతోందని ఈడీ తేల్చిచెబుతూ మీడియాకు ప్రకటన విడుదల చేస్తే.. దాన్ని పట్టుకుని తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... ఆస్తులు అటాచ్ చేస్తే.. క్లీన్చిట్ ఇచ్చినట్టా? సిల్క్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ నెల 15వ తేదీన విడుదల చేసిన ప్రెస్నోట్లో ఎక్కడా చంద్రబాబుకు క్లీన్చిట్ ప్రస్తావన లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. సీమెన్స్ ప్రాజెక్టులో భాగంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని మోసం చేశారని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఈడీ గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లు కలిసి ఏపీ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని, డొల్ల కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని స్వాహా చేశారని నిర్ధారించింది. ఇందులో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారినట్టు కూడా తేల్చింది. అందుకే ఇంతకు ముందే డిజైన్ టెక్ సిస్టమ్స్ సంస్థకు సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా నిందితులు అయిన వికాస్ వినాయక్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లను అరెస్టు చేసినట్టు వెల్లడించింది. తాజాగా మరో రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ స్పష్టంగా ప్రెస్నోట్లో తెలియజేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా ప్రకటించింది. ఆ ప్రెస్నోట్ చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు సుమన్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ నిందితులు. ఎందుకంటే చంద్రబాబే ముఖ్యమంత్రి హోదాలో 13 సార్లు.. 13 చోట్ల ఫైళ్లపై సంతకాలు పెట్టారు. వాళ్లకు రూ.371 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బు మొత్తం మళ్లీ డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. కాబట్టే నలుగురిని అరెస్టు చేసింది. ఆస్తులను అటాచ్ చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం తన అధికారిక టీడీపీ వెబ్సైట్లో ‘నిజం నిలిచింది.. న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్లో అక్రమ కేసు పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టులా చంద్రబాబుకు ఎటువంటిసంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడీ..’ అంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మనిíÙ (చంద్రబాబు) అబద్ధానికి రెక్కలు కట్టడంలో పీహెచ్డీ తీసుకున్నాడు. దీనికి చంద్రబాబు తనకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు మార్చేసుకున్నారు. అసలు ఇంకెవ్వరికీ చదువు రాదనుకుంటాడా... ఎవరికీ ఏమీ తెలియదనుకుంటాడా చంద్రబాబు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యాన్ని పెట్టుకుని ఎంతకైనా గోబెల్స్ ప్రచారం చేయగలననే అతి విశ్వాసం ఉన్నా కూడా... ఈ మాదిరిగా వక్రీకరించడం ఎవరి వల్లా కాదు!. ఈడీ అటాచ్లపై బాబు మాట్లాడరేం! ఈ స్కామ్లో ఈడీ అరెస్టు చేసిన మనుషులకు, ఆస్తులు అటాచ్ చేసిన సంస్థలకు డబ్బులు ఎవరు ఇచ్చారు..? చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టి రూ.371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా? జర్మనీకి చెందిన ఒరిజినల్ సీమెన్స్ కంపెనీ ఆ డబ్బులు తమకు ముట్టలేదని, ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా? సదరు కంపెనీ ప్రతినిధి నోయిడా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా ఇవ్వడం వాస్తవం కాదా? సీమెన్స్ సంస్థ ఈ డబ్బు పక్కదారి పట్టిందనే విషయాన్ని తమ అంతర్గత పరిశోధనలో కనుగొన్నామని.. అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్ బోస్ కంప్యూటర్లు, ఫోన్లను పరిశీలిస్తే బయటకు వచ్చిందని.. డబ్బు పుణే నుంచి హైదరాబాద్కు వెళ్లిందని.. సాక్షాత్తు సీమెన్స్ తమ అంతర్గత పరిశోధనలో వెల్లడైందని రిపోర్టు ఇచ్చిందా..? లేదా?. ఈ కేసులో నిందితుల ఆస్తుల ఆటాచ్మెంట్పై మాత్రం చంద్రబాబు మాట్లాడరు. కానీ, తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటాడు. చంద్రబాబును ఈడీ అరెస్టు చేయదా?సిల్క్ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబును, ఆయన పీఏ శ్రీనివాస్ను భవిష్యత్తులో ఈడీ అరెస్టు చేయదా? ప్రజాధనాన్ని డొల్ల కంపెనీలు సృష్టించి బయటకు పంపడం.. అలా వెళ్లిన డబ్బులు మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబులోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లను పంచుకోవడం అంటే ఇది కాదా? ఇద్దరు ఐఏఎస్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు సెక్షన్–164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని చెప్పారు. ఇది వాస్తవం కాదా? ఇవన్నీ కళ్ల ఎదుట కనిపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘న్యాయం గెలిచింది.. నిజం నిలిచింది..’ అని ఎలా అంటారు? కంటికి కనిపించే ఆధారాలు ఉన్నాయి. స్కామ్ నిజమే అని ఈడీ కూడా ధ్రువీకరించుకుని అరెస్టులు చేసింది... ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. అయినా చంద్రబాబు లడ్డూలు విషయం మాదిరిగా.. ఇసుక, మద్యం స్కామ్ల తరహా అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా.. అందరూ ఆలోచన చేయాలి. -
చిలకలూరిపేట ఐసీఐసీఐలో సీఐడీ విచారణ
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట బ్రాంచ్లో జరిగిన కుంభకోణం విషయంలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సీఐడీ అధికారుల బృందం గురువారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్కి చేరుకుని విస్తృతంగా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకు తలుపులు మూసివేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా విచారణ కొనసాగించారు. ఈ సందర్బంగా సీఐడీ ఏఎస్పీ సీహెచ్ ఆదినారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8న సీఐడీ ప్రధాన కార్యాలయంలో సంబంధిత విషయమై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కేసును గుంటూరు సీఐడీ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలిపారు. తమ విచారణలో ఇప్పటి వరకు 72 మంది ఖాతాదారులకు సంబంధించి రూ. 28 కోట్లు గోల్మాల్ జరిగినట్టు గుర్తించినట్లు తెలిపారు. 2021 నుంచి ఇక్కడ బ్రాంచి మేనేజర్గా పనిచేసిన దూడ నరేష్చంద్రశేఖర్, మరో ఇద్దరు కలిసి ఈ కుంభకోణానికి పాల్పడినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇక్కడ పనిచేసిన అనంతరం నరేష్చంద్రశేఖర్ నరసరావుపేట, విజయవాడ భారతీనగర్ బ్రాంచ్లలో మేనేజర్గా పనిచేసినట్టు తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న సమయంలో అతని అవకతవకలు వెలుగు చూసి ఈ ఏడాది జూలైలో బ్యాంకు అతనిని విధుల నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఈ నెల చిలకలూరిపేట బ్రాంచిలో జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఇంకా ఎవరైనా బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంలో ఉన్నారా లేరా అనేది విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. వారం, పది రోజుల్లో విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, కేసు విషయమై ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. సీఐడీ సీఐ సంజీవ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబు అండ్ కో కేసులన్నీ సీబీఐ, ఈడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపార వేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్ తదితరులతో పాటు పలు కంపెనీలపై గతంలో నమోదైన కేసులన్నింటినీ సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు తదితరాల స్కామ్లకు సంబంధించి చంద్రబాబు, ఇతరులపై నమోదైన కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవని.. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు నిమిత్తం ఈ కేసుల తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీబీఐ, ఈడీలకు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సీనియర్ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాల గంగాధర తిలక్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని ఆయన తన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు. దర్యాçప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయీ నివేదికలను కోర్టు ముందుంచేలా కూడా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో పాటు మొత్తం 114 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతివాదుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, సీబీఐ, ఈడీలను కూడా చేర్చారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాను వ్యక్తి గత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. ఆయా కుంభకోణాల్లో అక్రమాలు ఎలా జరిగాయో కూడా సమగ్రంగా వివరించారు.సీఐడీ ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు ‘ఫలితాలు వెలువడిన రోజున డీజీపీగా, పోలీసు బలగాలకు అధిపతి (హెచ్ఓఎఫ్)గా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు ప్రవేశాన్ని నిరాకరించారు. చంద్రబాబు తదితరులు అధికారంలోకి రాబోతున్నారని గ్రహించి, ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించారు. అంతేకాక మధ్యాహ్నం 12.30 గంటలకు రహస్యంగా సాయుధులను అక్కడ మోహరింప చేశారు. కౌంటింగ్ జరుగుతుండగానే, ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్లిపొమ్మన్నారు. ఈ విషయాలన్నీ పత్రికల్లో వచ్చాయి. ఓ డీజీపీ ఈ విధంగా చేయడం చట్ట విరుద్ధం, ఏకపక్షం, దౌర్జన్యపూరితం’ అని తిలక్ తన వ్యాజ్యంలో వివరించారు.ఆ కేసుల విషయంలో ఉదాసీనత స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసీఐఆర్ను రిజిష్టర్ చేసిందని తెలిపారు. కొందరు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపిందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తదితరులందరూ కూడా ఈ కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తిలక్ వివరించారు. ఈ కేసుల్లో సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తును చంద్రబాబు, ఇతర నేతలకు అనుకూలంగా నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. ఇసుక కుంభకోణంపై ఫిర్యాదు చేసినందుకు గనుల శాఖ అప్పటి డైరెక్టర్ జి.వెంకట రెడ్డిపై కక్ష తీర్చుకుంటున్నారన్నారు. తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని రెడ్బుక్ అంటూ పలువురు అధికారులను వేధిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
స్కిల్ కేసులో నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవపల్మెంట్ స్కాం కేసు ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో అరెస్టై 53 రోజులపాటు జైల్లో గడిపిన చంద్రబాబు.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ నేర పరిశోధన విభాగం(CID) వేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ జరపనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారన్నది సీఐడీ వాదన. అంతేకాదు.. రెడ్బుక్ పేరుతో అధికారుల్ని ఆయన తనయుడు నారా లోకేష్ సైతం విచారణ అధికారుల్ని బెదిరిస్తున్నాడన్నది మరో అభియోగం. ఈ రెండింటిపైనా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగుతోంది. ఇదిలా ఉంటే.. బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని గత విచారణలో చంద్రబాబుకు సుప్రీం కోర్టు వార్నింగ్ సైతం ఇచ్చింది.ఇదీ చదవండి: స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీం వార్నింగ్గత విచారణలో సందర్భంగా.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదిస్తూ.. ‘‘చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్లు స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ లో అధికారులు పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు అని వాదించారు. దీంతో.. రెడ్ బుక్ అంశంపై దాఖలు చేసిన అప్లికేషన్ రికార్డులలో ఉంచాలని రిజిస్ట్రీని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. -
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జగన్పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.-సిమ్మాదిరప్పన్న -
దొరికాడు దొంగ
సాక్షి, అమరావతి: ‘స్కిల్’ స్కామ్... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షెల్ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే తరహాలో షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్స్కామ్కు పాల్పడి షెల్కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్ క్రిమినల్ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్వర్క్ ఇదీ.. ♦ టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. ♦ డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. ♦ పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి. 370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్ టెక్ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ ప్రాజెక్ట్లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీకి డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు. ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్ నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్ స్కామ్లో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి 2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. స్కిల్ స్కామ్ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 జమ చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్స్కామ్లో చంద్రబాబును ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఐడీ చార్జ్షీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీఎండీ–సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్కర్ తదితర కంపెనీల అధికారులు -
చంద్రబాబే ప్రధాన నిందితుడు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కా పన్నాగంతోనే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ నిగ్గు తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజులు ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి సమగ్ర వివరాలతో సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన నిందితుడు (ఏ1)గా, రెండో నిందితుడి (ఏ2)గా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడును పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477 (ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఈ చార్జిషీట్లో పేర్కొంది. రూ.330 కోట్ల విలువైన ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా కనికట్టు చేశారని వివరించింది. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోయినా, ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను జీఎస్టీతోసహా రూ.371 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని తెలిపింది. అందులో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు కొల్లగొట్టారని వివరించింది. సీఐడీ చార్్జషీట్లోని ప్రధాన అంశాలు ఇవీ... 2017లోనే బయటపడినా.. 2017లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో జరిపిన సోదాల్లో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి, ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్టు ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం మొత్తం బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. స్కిల్ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో పక్కా పథకం ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం చంద్రబాబు తన బినామీ సంస్థ డిజైన్టెక్ను రంగంలోకి దింపారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు బినావీులు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్– డిజైన్టెక్ కంపెనీలు వాటి వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ మాత్రం తన వాటా కింద డిజైన్టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్టు నోట్ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లతో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోను చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర షెల్ కంపెనీల ద్వారా నిధులను హవాలా మార్గంలో మళ్లించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు పిటిషన్పై కొనసాగుతున్న విచారణస్కిల్ స్కామ్లో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న చంద్రబాబు వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు రెడ్బుక్ పేరుతో ఈ కేసులో కీలక సాక్షులు, అధికారులను బెదిరింపులకు గురిచేసి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని కూడా సీఐడీ ఆ పిటిషన్లో పూర్తి ఆధారాలతో పేర్కొంది. దర్యాప్తు చేస్తున్న ఈడీ మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించిన స్కిల్ స్కామ్ గురించి సీఐడీ అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నివేదించారు. దాంతో రంగంలోకి దిగిన ఈడీ ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్, షెల్ కంపెనీల సృష్టికర్త సురేశ్ గోయల్ను అరెస్ట్ చేసింది. డిజైన్టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్ల ఆస్తులను జప్తు చేసింది కూడా. సీఐడీ చార్్జషీట్లో పేర్కొన్న నిందితులు ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ఎండీ – సీఈవో ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ ఏ5: సీమెన్స్, డిజైన్టెక్, పీవీఎస్పీ స్కిల్లర్ తదితర కంపెనీల అధికారులు -
ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు కొట్టివేత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీ జప్తుచేసి ఉండగా, తిరిగి అవే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా జప్తుచేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్ట ఉద్దేశాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. పైగా డిపాజిటర్లకు కష్టం కలిగించేలా కూడా ఉన్నాయని స్పష్టంచేసింది. అందువల్ల ఈడీ ఉత్తర్వులను కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అదే సమయంలో సీఐడీ జప్తు ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉన్నాయని తేల్చిచెప్పింది. అలాగే.. ‘డిపాజిటర్లందరూ ప్రధానంగా ఏపీకి చెందిన వారే. జప్తు ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. తమ కష్టార్జితాన్ని వారు డిపాజిట్ల రూపంలో కంపెనీలో పెట్టారు. తాము చెల్లించిన ఈ డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మనీలాండరింగ్ చట్టం కింద అడ్జుడికేటింగ్ అథారిటీ వద్దకు వెళ్లి తేల్చుకోవడం డిపాజిటర్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ఏలూరులోని ప్రత్యేక కోర్టే ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చడం డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది. అందువల్ల ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కొట్టెస్తున్నాం’.. అని న్యాయస్థానం పేర్కొంది. అంతేకాక.. అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ జప్తుచేయడాన్ని ప్రత్యేక న్యాయస్థానం కూడా సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. డిపాజిటర్లను మోసంచేసి కూడబెట్టిన భారీ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాలను తిరిగి డిపాజిటర్లకు చెల్లించడమే డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశమన్న ప్రభుత్వ వాదనతో కూడా ఏకీభవించింది. అగ్రిగోల్డ్ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని ఈడీకి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పునిచ్చారు. ఈడీ జప్తు ఉత్తర్వులపై పిటిషన్లు.. మరోవైపు.. అగ్రిగోల్డ్ నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన వారూ అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయా ఫ్లాట్ల యజమానులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. రుణం ఇచ్చాం కాబట్టి, ఆస్తులను వేలంవేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు సైతం కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున పీఎస్పీ సురేష్కుమార్, పూజారి నరహరి, సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్లు వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న కోర్టు గతేడాది ఆగస్టులో తీర్పు రిజర్వ్ చేశారు. ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రవి ఈ వ్యాజ్యాలన్నింటిపై తన తీర్పును వెలువరించారు. ఆస్తి జప్తు ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు.. ‘జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లందరికీ సమానంగా పంచే అధికారాన్ని ప్రత్యేక కోర్టుకు డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కల్పిస్తోంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్–6లో ఉన్న ఏ నిబంధన కూడా మనీలాండరింగ్ చట్టం సెక్షన్–5లో లేదు. జప్తుచేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు సమానంగా పంపిణీ చేయాలన్న నిబంధన ఏదీ కూడా మనీలాండరింగ్ చట్టంలో లేదు. ఈ విషయంలో అడ్వొకేట్ జనరల్ వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. కేవలం ఆస్తి జప్తు చేయడం ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు. ఆస్తి జప్తు బాధితులను రక్షించలేదు. ఈ కారణాలరీత్యా 2015లో సీఐడీ జప్తుచేసిన ఆస్తులను తిరిగి 2020లో ఈడీ జప్తుచేస్తూ జారీచేసిన ప్రాథమిక ఉత్తర్వులను కొట్టెస్తున్నా’.. అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. ఆస్తుల జప్తునకు సంబంధించిన అన్నీ అంశాలను ఏలూరులోని ప్రత్యేక కోర్టు ముందే తేల్చుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
అగ్రిగోల్డ్ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది. ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు. ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అటాచ్మెంట్కు అనుమతి ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్మెంట్కు అనుమతి జారీ చేసింది. -
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్, ఇన్క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్షీట్లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్షీట్లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్కు ఫైబర్నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో గురువారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఏ 1 గా చంద్రబాబు, ఏ 2 గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. వీరితో పాటు నారా లోకేష్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్లను ముద్దాయిలుగా సీఐడీ పేర్కొంది. సింగపూర్తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ తేల్చింది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్ షీట్లో వెల్లడించింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్ మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. -
మద్యంకుంభకోణం దర్యాప్తులో సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. చీకటి జీవోలతో అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా మద్యం కాంట్రాక్టులు కట్టబెట్టి ఏటా రూ.1,300 కోట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతిపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ ఈ కుంభకోణం సూత్రధారులు, పాత్రధారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన తీరుపై కీలక ఆధారాలు సేకరించింది. దాంతో ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్ తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120 (బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13 (1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నోట్ ఫైళ్లు, చీకటి జీవోల గుట్టురట్టు: రాష్ట్రంలో 2012 నుంచి అమలులో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన తీరుపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతోపాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్లీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలనే ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. ‘కాపీ టు పీఎస్ టు సీఎం’అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపడం గమనార్హం. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ చేసింది. అంటే కేబినెట్కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ జారీ చేసింది. అయితే, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరతూ బార్ల యజమానుల సంఘం 2015 సెప్టెంబరు 9న వినతిపత్రం సమర్పించినట్టు చూపించడం గమనార్హం. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒకదానిని సృష్టించారు. అక్రమాన్ని కప్పిపుచ్చుకునేందుకు బార్ల యజమానుల పేరిట ఇలా లేఖను సృష్టించినట్టు సీఐడీ గుర్తించింది. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. మరోపక్క డిస్టిలరీలకు అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడమే కాకుండా, అప్పటివరకు లేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండిపడిందని ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నివేదించారు. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,300 కోట్లు నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు. ఈ మొత్తం బాగోతంపై గురించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇక నిందితుల విచారణే మద్యం కుంభకోణంపై కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందులో పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు ఉపక్రమిస్తోంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకుంది. ప్రధానంగా నోట్ఫైళ్లు, ఇతర ఆధారాలను సేకరించింది. ఒకే రోజులో పరస్పర విరుద్ధంగా నోట్ఫైళ్లు రూపొందించడం, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసిన తరువాత కూడా బార్ల యజమానుల పేరిట వినతిపత్రాన్ని రికార్డుల్లో చేర్చిన పన్నాగాన్ని ఛేదించనుంది. అందుకోసం త్వరలోనే నిందితులకు నోటీసులు జారీ చేయనుంది. నిందితుల విచారణకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారని గుర్తించింది. వారికీ నోటీసులు జారీ చేయనుంది. మద్యం కంపెనీల ప్రతినిధులతోపాటు కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధపడుతోంది. ఆ విచారణ ద్వారా గుర్తించిన అంశాలను సమీక్షించిన తరువాత కేసు దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్యాదవ్ ద్వారా హైదరాబాద్కు చెందిన రంజిత్కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్నగర్లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్లోని బాల్కనీ హోటల్కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
HYD: పాస్పోర్టు స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే 92 నకిలీ పాస్పోర్టులను సీఐడీ గుర్తించింది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్పోర్టులు రద్దు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. పలువురు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. పాస్పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాస్పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది. -
అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా అస్సాంలో రాహుల్పై నమోదైన క్రిమినల్ కేసును పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. జనవరి 23న గువాహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ ట్విటర్ ద్వారా తెలిపారు. సమగ్రమైన, లోతైన విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా మంగళవారం మేఘాలయా నుంచి అస్సాం గువాహటిలోకి రాహుల్ ప్రవేశించగా.. సిటీలోకి ఆయన యాత్రకు అనుమతి లేదని అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను దాటి దూసుకురావడంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు.. హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు వంటి ఆరోపణలతో రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై 9 కేసు నమోదు చేశారు. దీంతో రాహుల్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. గువాహటి ఘర్షణలకు సంబంధించిన కేసులో రాహుల్ను లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత హెచ్చరించారు. దీనిపై రాహుల్ కౌంటర్ ఇస్తూ బీజేపీ సర్కార్ తనపై మోపిన కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాహుల్ భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోనళ వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకేంద్రహోంమంత్రి అమిత్షాకు లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేసును సీఐడీకి బదిలీ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
లోకేశ్ ‘రెడ్ డైరీ’ కేసు 30కి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేలా నారా లోకేశ్.. అధికారులను బెదిరిస్తున్నారన్న సీఐడీ పిటిషన్పై విచారణను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో ఆయనకు ఇచ్చిన 41ఏ నోటీసులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్బుక్లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించిన విషయాన్ని ఆధారాలతో సహా నివేదించింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరింది. కాగా ఈ కేసులో జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ సుముఖత చూపలేదు. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు. నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఆ విషయాన్ని కూడా సీఐడీ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో న్యాయస్థానం ద్వారా నోటీసులు జారీ చేయాలని కోర్టు రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. లోకేశ్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని లోకేశ్ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానాన్ని మంగళవారం కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
Nara Lokesh: రెడ్బుక్ కేసు విచారణ నేడు
విజయవాడ, సాక్షి: నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు రెడ్ బుక్ బెదిరింపుల కేసు నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో కోర్టు ఆదేశాలానుసారం సీఐడీ, లోకేష్కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నోటీసులు అందుకోకపోవడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇవాళ ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా? అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువగళం పేరిట యాత్ర చేపట్టిన నారా లోకేష్.. ముగింపు రోజున పలు ఇంటర్వ్యూల్లో కోర్టు ధిక్కార వ్యాఖ్యలు చేశారు. దీంతో గత నెలలో ఏసీబీ కోర్టులో సీఐడీ ఒక మెమో దాఖలు చేసింది. లోకేష్కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ.. ఆధారాలతో సహా పిటిషన్లో సీఐడీ కోరింది. దీంతో తమ ముందు హాజరై స్వయంగా హాజరైగానీ లేదంటే న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని కోర్టు లోకేష్ను ఆదేశించింది. మెమోలో ఏముందంటే.. యువగళం ముగింపు సమయంలో లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ తప్పుడు కేసులు బనాయించిందని, రిమాండ్ విధించడం తప్పంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థను కించపరిచేలా ఉన్నాయని.. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల్ని తప్పుబట్టేలా ఉన్నాయని.. అన్నింటికి మించి కోర్టు ఆదేశాల్ని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ మెమోలో సీఐడీ పేర్కొంది. ఆ వాంగ్మూలాలు తప్పేనంటూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్రోడ్ కుంభకోణం, ఫైబర్ నెట్ స్కామ్.. తదితర కేసులలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారు. అయితే.. ఆ సమయంలో తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను నారా లోకేష్ తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారు. ‘‘అసలు అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారు? వాళ్ల పేర్లు రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశా. మా ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తా’ అంటూ లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది సాక్ష్యులను బెదిరించి.. కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించడమే అవుతుందని సీఐడీ ఏసీబీ కోర్టు పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. గతంలో లోకేష్కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకీ విరుద్ధంగా ఆయన మాట్లాడారని పేర్కొంది. లోకేష్పై కోర్టు సీరియస్ రెడ్ బుక్ బెదిరింపుల వ్యవహారంలో కేసులో.. నారా లోకేష్కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులును లోకేష్ తొలుత స్వీకరించలేదు. ఈ పరిణామంలో లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్టర్ పోస్టులో పంపాలని సీఐడీని ఆదేశించింది. దీంతో చేసేది లేక రిజిస్టర్ పోస్టులో సీఐడీ, లోకేష్కు నోటీసులు పంపింది. -
ఒకే ఆధార్, పాన్కార్డు.. పాస్పోర్టులెన్నో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల: తీగ లాగితే పాస్పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలోనే ఈ రాకెట్కు ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు రోహింగ్యాలు విదేశాలకు వెళ్లారన్న విషయాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారికి పలు నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి. స్థానికులు, విదేశీయులు అన్న తేడా లేకుండా.. ఎవరికి పాస్పోర్టులు కావాలన్నా.. కేవలం కొన్నిరోజుల్లోనే వచ్చేలా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. ఇప్పటివరకూ 92 మందిని దేశం దాటించగలిగారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీయులు ఉండటంతో విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరించారన్న విషయాన్నీ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. నాంపల్లి టు జగిత్యాల ఈ రాకెట్కు నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారి. ఇతను నాంపల్లిలోని బడే మజీదు వద్ద నివసించే ఇతను డీటీపీ గ్రాఫిక్స్లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్పోర్టు బ్రోకర్గాను పనిచేసేవాడు. నకిలీ విద్యార్హతలు, ఆధార్, పాన్కార్డు ఇలా కీలక నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్పోర్ట్లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. ఈ గ్యాంగ్ వద్ద దగ్గర దొరకని పత్రం అంటూ ఏదీ ఉండదు. విద్యార్హత, ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ చేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో వీరి పని మరింత సులువై, పాస్పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్పోర్టుల్లో అత్యధిక పాస్పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నంబరు ఉండటంతో విషయం వెలుగుచూసింది. ఈసీఎన్ఆర్ కేటగిరీలోనే.. ఇమిగ్రేషన్లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్ (ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్) కేటగిరీలోనే పాస్పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. చాలా పాస్పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నంబరునే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేసిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి, ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్పోర్ట్ యాక్ట్తోపాటు పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏజెంట్లు రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్వర్క్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి (హైదరాబాద్)కి చెందినవాడు కాగా.. మిగిలిన మహ్మద్ ఖమ్రుద్దీన్, చాంద్ఖాన్, దేశోపంతుల అశోక్ రావు (కోరుట్ల), పెద్దూరి శ్రీనివాస్ (తిమ్మాపూర్, కరీంనగర్), గుండేటి ప్రభాకర్ (జగిత్యాల), పోచంపల్లి దేవరాజ్ (వేములవాడ, సిరిసిల్ల), అబ్దుల్ షుకూర్ (రాయికల్, జగిత్యాల). వీరంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా కలిసి ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్లాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ... 2014లోనే డబుల్ పాస్పోర్ట్లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్రావు, చాంద్పాషాపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. శుక్రవారం సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. -
నకిలీ పాస్పోర్ట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో 108 పాస్పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్టాప్లు, మూడు ప్రింటర్లు, 11 పెన్డ్రైవ్లు, ఒక స్కానర్, పాస్పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్పోర్టుల వరకు హైదరాబాద్కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్పోర్టు బ్రోకర్తో టచ్లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్కు ఒక్కో పాస్పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్పోర్టు కార్యాలయాల్లో స్లాట్లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ ముఠా నుంచి పాస్పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర! నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది. అరెస్టు అయింది వీరే! అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు. -
భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్!
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు, బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధలయ్యాయి. ప్రభుత్వ భూములూ గల్లంతయ్యాయి. చంద్రబాబు, నారాయణ, వారి బినామీలు, సన్నిహితుల హస్తగతమయ్యాయి. ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ వర్తించే 1,072 ఎకరాల అసైన్డ్ భూములు.. రూ.760.25 కోట్ల ప్యాకేజీ వర్తించే 328 ఎకరాల ప్రభుత్వ భూములు.. వెరసి భూసమీకరణ ప్యాకేజీ కింద అమరావతిలో దాదాపు రూ.5వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు, నారాయణలు తమ గుప్పెట పట్టడం నమ్మలేని నిజం. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీ బట్టబయలైంది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రూ.5వేల కోట్ల భూదోపిడీ.. ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన 1,072 ఎకరాల అసైన్డ్ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ఏకంగా రూ.4,239.75 కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకుంది. ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో రూ.760.25 కోట్ల భూసమీకరణ ప్యాకేజీ పొందారు. మొత్తం భూసమీకరణ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్ల భూములు కొల్లగొట్టారు. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం రాజధాని భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా కథ నడిపారు. అనంతరం.. అసైన్డ్ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఈ జీఓను తీసుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా కోర్టును కూడా మోసంచేసి తమ పన్నాగాన్ని అమలుచేశారు. చట్ట ప్రకారం.. 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే ఆ జీఓను జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ భూములూ హాంఫట్.. ఇక రాజధాని కోసం అమరావతి పరిధిలోని ప్రభుత్వ భూములను కూడా చంద్రబాబు, నారాయణ ముఠా కొల్లగొట్టింది. ఎవరి ఆ«దీనంలోనూ లేని ప్రభుత్వ భూములను గుర్తుతెలియని వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. మొత్తం 328 ఎకరాల ప్రభుత్వ భూములు తమ బినామీలు 522 మంది ఆ«దీనంలో ఉన్నట్లుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేశారు. తద్వారా రూ.760.25 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు.. నారా చంద్రబాబు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) రావెల కిశోర్బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) తెనాలి శ్రావణ్కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) మండల ఎస్ఎస్ కోటేశ్వరరావు (రియల్టర్) మండల రాజేంద్ర (రియల్టర్) టకేవీపీ అంజనీకుమార్ (రియల్టర్) దేవినేని రమేశ్ (రియల్టర్) టబొబ్బా హరిచంద్రప్రసాద్ (రియల్టర్) హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) టపొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) దోనేపూడి దుర్గాప్రసాద్ (రియల్టర్) అసైన్డ్ భూదోపిడీలో నిందితులు ఏ1 : నారా చంద్రబాబు ఏ2 : పొంగూరు నారాయణ మరో 38 మంది సెక్షన్లు : ఐపీసీ సెక్షన్లు 420, 506, 166, 167, 217, 120 (బి) రెడ్విత్ 34, 35, 36, 37లతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం–1977 కింద ఎఫ్ఐఆర్ నమోదు. -
CBN: రిమాండ్ సబబే.. కేసు కొట్టేయలేం
ఢిల్లీ, సాక్షి: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్ లాంటిది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తీర్పు ఎలా వెలువరించారంటే.. తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. ముందుగా జస్టిస్ బోస్ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు." అని జస్టిస్ బోసు తీర్పు ఇచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్ త్రివేది తీర్పు ఇచ్చారు. మొదటి తీర్పు : జస్టిస్ బోస్ ఏమన్నారంటే.. ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్కు వర్తింపజేయరాదు చంద్రబాబు కేసులో 13(1)(c), 13(1)(d), 13(2) వర్తించవు అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ను కొట్టేయలేం కేవలం అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది రెండో తీర్పు : జస్టిస్ బేలా త్రివేది ఏమన్నారంటే.. అసలు ఈ కేసులో చంద్రబాబు పిటిషన్కు ఏ రకంగా 17ఏ వర్తించదు 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం పాత కేసులకు 17ఏ వర్తించదు, సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది.. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదు ట్రయల్ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబబే దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్షీట్ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కంటిన్యూ అవుతుంది ఇలాంటి కేసుల్లో 17ఏను అంగీకరిస్తే.. మొత్తం న్యాయప్రక్రియ అపహస్యం అవుతుంది పెండింగ్లో ఉన్న అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందన్న వాదన మొదలవుతుంది అసలు 17ఏ వర్తించాలన్న వాదనే సరికాదు, దీని పర్యవసానాలు ఊహించనంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకువస్తాయి దర్యాప్తు అధికారులకు పూర్తి అధికారాలున్నాయి, అవినీతి నిరోధక చట్టం కింద విచారణ కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు నిజాయితీపరుల రక్షణ కోసమే ఈ సవరణ తీసుకొచ్చామన్నది పార్లమెంట్ చర్చల సారాంశం ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే..! సెప్టెంబర్ 22వ తేదీన ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సెప్టెంబర్ 25వ తేదీన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు బాబు క్వాష్ పిటిషన్ 26న సంబంధిత న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం విచారణలో ఉన్నందున మరుసటి రోజుకి వాయిదా జస్టిస్ సంజీవ్ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ల ధర్మాసనం ముందుకు సెప్టెంబర్ 27వ తేదీన బాబు క్వాష్ పిటిషన్ ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ భట్ మరోసారి సీజేఐ చంద్రచూడ్ ముందుకు పిటిషన్ అక్టోబర్ 3న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు బాబు పిటిషన్ అక్టోబర్ 9,10,13వ తేదీల్లో వాడీవేడిగా సాగిన వాదనలు అక్టోబర్ 13వ స్కిల్ పిటిషన్కు తోడైన ఫైబర్ గ్రిడ్ కేసు పిటిషన్ స్కిల్, ఫైబర్ గ్రిడ్ పిటిషన్లను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం బెంచ్ అక్టోబర్ 17వ తేదీన పిటిషన్పై తీర్పు రిజర్వ్ నవంబర్ 9వ తేదీన ఫైబర్ గ్రిడ్ పిటిషన్పై విచారణ చేస్తామని చెబుతూ.. అంతకు ముందే స్కిల్ కేసు తీర్పు వెల్లడిస్తామన్న బెంచ్ దసరా, దీపావళి సెలవుల దృష్ట్యా విచారణ వాయిదా అక్టోబర్ 31వ తేదీన షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మీద బయటకు మొత్తం 52 రోజులపాటు జైల్లో చంద్రబాబు.. మధ్యలో సీఐడీ కస్టడీ విచారణ నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అదే తేదీన పలు షరతులతో బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఇవాళ వెలువడ్డ రెండు తీర్పులు -
జడ్జిమెంట్ డే: స్కిల్ కేసులో ఏం జరగబోతోంది?
సాక్షి, ఢిల్లీ: ఏపీ రాజకీయ వర్గాలు స్కిల్ కేసులో నేటి సుప్రీం కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తాను తప్పు చేయలేదని చెప్పలేకపోతున్న చంద్రబాబు.. తన అరెస్ట్ చెల్లదని, తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాడీవేడిగా వాదనలు జరిగిన ఈ క్వాష్ పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నాం తీర్పు వెలువడనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ కేసును కొట్టేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అదే సమయంలో ఆయనపై ఫైబర్నెట్ కేసు నమోదు కాగా ఈ కేసులోనూ సుప్రీంను ఆశ్రయించారు ఆయన తరఫు లాయర్లు. అయితే.. స్కిల్ కేసు క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించిన తర్వాతే.. ఫైబర్నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా పెండింగ్లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17, 19వ తేదీల్లో విచారణకు రానున్నాయి. దీంతో.. ఇవాళే 17-ఏ పిటిషన్పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించనుంది. వాడీవేడీ వాదనలు ఇవే.. స్కిల్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కోర్టుల్లో వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో ఆ మరుసటిరోజు సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంలో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఈ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ అభ్యర్థించారాయన. అక్కడ సుదీర్ఘమైన వాదనలే జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వీలు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారు. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ, రంజిత్కుమార్లు వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని సీఐడీ తరఫున వాదించారు . ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫు లాయర్ల విజ్ఞప్తులు.. వరుస సెలవుల నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న తీర్పును ఇవాళ వెల్లడించనున్నారు. ఏపీ సీఐడీ అభియోగాలు.. అరెస్ట్.. రిలీజ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట కుట్రపూరితంగా భారీ అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేసింది నేర పరిశోధన విభాగం(CID). చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనేది సీఐడీ అభియోగం. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని అవినీతి నిరోధక న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) కోర్టులో ప్రవేశపెట్టాగా.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు పలుమార్లు పొడిగించుకుంటూ వెళ్లింది. చివరకు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకి కంటి సర్జరీ, చికిత్స లాంటి కారణాల విజ్ఞప్తి దృష్ట్యా.. మానవతా దృక్ఫథంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆపై.. హైకోర్టులోనే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయ్యింది. -
సీఐడీ అధికారుల ఎదుట లొంగిపోయిన చంద్రబాబు
సాక్షి, అమరావతి/ నగరంపాలెం: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు, మద్యం కొనుగోళ్లలో అక్రమాలు, ఉచిత ఇసుక దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు సీఐడీ అధికారుల ఎదుట శనివారం లొంగిపోయారు. ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పూచీ కత్తులు సమ ర్పించారు. ఈ మూడు కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోయి ఒక్కో కేసులో ఇద్దరు పూచీకత్తుతో పాటు రూ.లక్ష చొప్పున ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ కోసం దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు హాజరుకావాలని కూడా పేర్కొంది. ఆ మేరకు హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న బాబు పార్టీ నేతలతో కలసి ముందుగా విజయవాడ తులసీనగర్లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పూచీకత్తులు సమ ర్పించారు. అనంతరం తాడేç³ల్లిలోని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాల కేసులో ముందస్తు బెయిల్కు అవసరమైన పూచీకత్తులు సమ ర్పించారు. చివరిగా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్న బాబు మద్యం కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీనరేష్ కూడా ముందస్తు బెయిల్కోసం పూచీకత్తులు సమర్పించారు. స్పందించని కేడర్ బాబు రాకను పురస్కరించుకుని అందరూ సీఐడీ కార్యాలయానికి రావాలని తెలుగుదేశం గ్రూపుల్లో నిన్నటి నుంచి మెస్సేజులు పెట్టినా కేడర్ స్పందించలేదు. చంద్రబాబు కారుని సీఐడీ కార్యాలయంలోకి అనుమతించగా, కొంతమంది తెలుగు తమ్ముళ్లు ఆకారుతో లోనికి వెళ్లేందుకు పోటీపడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టేశారు. యువత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొద్దిసేపు గలాటా స్పష్టించారు. చంద్రబాబు రాకను కవర్ చేసేందుకు వచ్చిన సాక్షి మీడియాపై టీడీపీ నేతలు దుర్బాషలాడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవ చేశారు. బాబుకు నిరసన సెగ కంకిపాడు: పెనమలూరు సీటు సెగ టీడీపీ అధినేత చంద్రబాబుకే నేరుగా తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం కృష్ణాజిల్లా తాడిగడపలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పెనమలూరు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోడే ప్రసాద్ అనుచరులు నిరసనకు దిగారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కే ఇవ్వాలని సీఐడీ కార్యాలయం వద్ద బారికేడ్లను తోసుకుంటూ వెళ్లి ప్రసాద్కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. -
Chandrababu: లొంగిపోయి పూచీకత్తుల సమర్పణ
విజయవాడ, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనపై దాఖలైన మూడు కేసుల్లో అరెస్టును తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని నేర పరిశోధన సంస్థ(సీఐడీ) కార్యాలయం, తాడేపల్లి సిట్, గుంటూరు సీఐడీ ఆఫీసుల్లో ఆయా కేసుల్లో శనివారం లొంగిపోయిన ఆయన.. పూచీకత్తులు, బాండ్ షూరిటీలు సమర్పించారు. ముందుగా విజయవాడ తులసినగర్లోని సీఐడీ ఆఫీస్కు వెళ్లిన చంద్రబాబు.. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన టీడీపీ అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు.. ఇన్నర్ రింగ్రోడ్ కేసులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఆపై పూచీకత్తులు సమర్పించారు. చివరగా గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత.. మద్యం పాలసీ కేసులో ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో అధికారులకు ష్యూరిటీ సమర్పించారు. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్ బాబు ‘పూచీకత్తు’ సంతకాలు చేశారు. ఇసుకాసురుడి అవతారంలో చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఇసుక కుంభకోణం. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు. తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే కొనసాగుతూ వచ్చింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా సాగింది. చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా సైతం విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు చేశారు. APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది నేర దర్యాప్తు సంస్థ సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్నారు చంద్రబాబు. IRR భలే మలుపు.. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు కట్టబెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మూడుసార్లు మార్పు చేశారు. అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకో జరిపారు. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. ఇన్నర్ రింగ్రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు కట్టబెట్టారు. అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం చేకూరింది. ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్మెంట్ జరిగింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించారు లింగమనేని. కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం జరిగింది. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసంగా.. సీఎంగా, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు కొనసాగుతున్నారు. మద్యంనూ వదలని బాబు అండ్ కో ఇది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. ఇష్టానుసారంగా మద్యం కంపెనీలకు అనుమతి ఇచ్చారు చంద్రబాబు. ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజనాకు రూ.1500 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ సైతం తేల్చింది. టీడీపీ నేతల బార్లు, డిస్టిల్లరీలకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లోనూ చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ్ లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఈ కేసులన్నింటిలోనూ తీర్పు వెల్లడించింది. చంద్రబాబుతో పాటు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్రకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం చంద్రబాబు అంతులేని అక్రమాలకు ఓ మచ్చు తునక మాత్రమే. యువతకు నైపుణ్య శిక్షణ పేరిట చంద్రబాబు సాగించిన బాగోతం చూసి యావత్ దేశం అవాక్కయ్యింది. జర్మనీకి చెందిన సీమెన్స్కి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో కాగితాలపై ప్రాజెక్టు సృష్టించారు. రూ.370 కోట్ల వ్యయాన్ని ఏకంగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. సీమెన్స్ పేరుతో జీవో జారీ చేసి తన బినామీ కంపెనీ డిజైన్టెక్తో ఒప్పందం చేసుకున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా రూ.271 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా అక్రమార్జనను తన నివాసానికే చేరవేశారు. ఈ అవినీతి నెట్వర్క్ గుట్టును సీఐడీ ఛేదించడంతో చంద్రబాబు అక్రమాలు బట్టబయలయ్యాయి. స్కిల్ స్కామ్ సృష్టికర్త చంద్రబాబేనని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆధారాలతో సహా వెల్లడైంది. దీంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షిట్ నమోదు చేసింది. టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు ఏ–2గా, మరో 38 మందిని నిందితులుగా పేర్కొంటూ సిట్ కేసు నమోదు చేసింది. గతేడాది సెపె్టంబరు 9న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరిచింది. చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తూ సీఐడీ అధికారులు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన న్యాయమూర్తి ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఖైదీ నంబర్ 7691గా చంద్రబాబు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తరువాత అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు సాగించిన స్కిల్ స్కామ్ ఇలా సాగింది.. విద్యా శాఖ స్థానంలో ఏపీఎస్ఎస్డీసీ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టటాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కని్వల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమేరకు జీవో జారీ చేశారు. కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. అంతా బాబు ముఠానే.. ఏపీఎస్ఎస్డీసీకి అప్పట్లో డైరెక్టర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, చంద్రబాబు సన్నిహితుడు కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు ఇందులో కీలకంగా వ్యవహరించారు. గంటా సుబ్బారావుకు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో పోస్టుతోపాటు ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ – ఇన్నోవేటివ్ కార్పొరేషన్ కార్యదర్శి, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ఏకంగా 4 పోస్టులు కట్టబెట్టారు. నేరుగా నిధులు మంజూరు జరిగేలా కుతంత్రం పన్నారు. అనంతరం సీమెన్స్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ జీవీఎస్భాస్కర్ సతీమణి, యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అపర్ణను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు.. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు సీమెన్స్కి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90% కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు! గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు! గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. టెండర్లు లేకుండా తన బినామీ కంపెనీకి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకే ఈ ఎత్తుగడ వేశారు. నో రూల్స్... సీమెన్స్– డిజైన్ టెక్ ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరపున నిధులు ఎలా మంజూరు చేస్తామని పీవీ రమేశ్ నోట్ ఫైల్లో పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల నిబంధనలకు విరుద్ధమని వారించినా చంద్రబాబు లెక్క చేయలేదు. గంటా సుబ్బారావు చెప్పినట్లు నిధులు విడుదల చేయాలని ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ..) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, తరువాత ఆ ఫైల్ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతకు పీవీ రమేశ్ తెలియచేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లను మంజూరు చేశారు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్మెంట్–ట్రైనింగ్, సాధారణ పరిపాలన శాఖకు చెందిన మొత్తం 13 నోట్ ఫైళ్లలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేశారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఐదు చోట్ల సంతకాలు చేశారు. షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమరి్పంచి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబు బంగ్లాకు రూ.241 కోట్లు చేరవేశారు. కేసులో కీలక నిందితులు ఏ–1 చంద్రబాబు, నాటి ముఖ్యమంత్రి ఏ–2 కింజరాపు అచ్చెన్నాయుడు, నాటి కార్మిక శాఖ మంత్రి ఏ–3 గంటా సుబ్బారావు, నాటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–సీఈవో ఏ–4 కె.లక్ష్మీ నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ సలహాదారు ఏ–5 నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, మాజీ ఓఎస్డీ ఏ–6 అపర్ణ ఉపాధ్యాయుల, ఐఏఎస్, నాటి ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈవో ఏ–7 ప్రతాప్ కుమార్, నాటి ఫైనాన్షియల్ ఆఫీసర్, ఏపీఎస్ఎస్డీసీ ఏ–8 సుమన్ బోస్, సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ ఏ–9 జీవీఎస్ భాస్కర్ ప్రసాద్, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ హెడ్ ఏ–10 వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, డిజైన్టెక్ ఎండీ ప్రాజెక్ట్ గురించి తెలియదన్న సీమెన్స్ సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్లోని తమ ఎండీ సుమన్ బోస్ను పదవి నుంచి తొలగించింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. స్కిల్ స్కామ్లో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్వర్క్ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు. మదింపు బూటకం.. నివేదిక నాటకం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు సరైందేనంటూ ‘సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్(సీఐటీడీ) థర్డ్ పార్టీగా మదింపు జరిపి నివేదిక సమర్పించిందంటూ చంద్రబాబు అడ్డగోలుగా వాదించి అడ్డంగా దొరికిపోయారు. తాము ఇచ్చింది మూడో పార్టీ నివేదికే కాదని, కేవలం ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన పత్రాల పరిశీలన మాత్రమేనని ‘సీఐటీడీ’ స్పష్టం చేసింది. వాస్తవానికి అంతకంటే ముందే డిజైన్ టెక్కు టీడీపీ సర్కారు నిధులు విడుదల చేసేసింది. కొరడా ఝుళిపించిన ఈడీ ఈ స్కామ్పై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి అవి ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు వెళ్లాయి? తిరిగి దేశంలోని ఏ ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు ఇప్పటికే నిర్ధారించింది. నాడే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం టీడీపీ హయాంలోనే 2017లోనే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా నాడు ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. బాబు అవినీతి నెట్వర్క్ ఇదిగో.. టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది. డిజైన్ టెక్ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు. పీవీఎస్పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లో ఉన్న వివిధ షెల్ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... ఏసీఐ: రూ.56 కోట్లు నాలెడ్జ్ పోడియమ్: రూ.45.28 కోట్లు ఈటా: రూ.14.1 కోట్లు పాట్రిక్స్: రూ.3.13 కోట్లు ఐటీ స్మిత్: రూ.3.13 కోట్లు భారతీయ గ్లోబల్: రూ.3.13 కోట్లు ఇన్వెబ్: రూ.1.56 కోట్లు పోలారీస్: రూ.2.2 కోట్లు కాడెన్స్ పార్టనర్స్: రూ.12 కోట్లు ♦ మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్ గుప్తా డ్రా చేసి షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసానికి అందించారు. మనోజ్ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు హైదరాబాద్లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్పీ కంపెనీ దుబాయి, సింగపూర్లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్కు తరలించారు. అక్కడ మనోజ్ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేర్చారు. ♦ ఏపీఎస్ఎస్డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్వర్క్ ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఇలా చంద్రబాబు బంగ్లాకు చేరిపోయాయి. ♦ అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్కి మనోజ్ అక్రమ నిధులను తరలించిన పాత్రధారులు చంద్రబాబు ఆదేశాలతో విదేశాలకు పరారయ్యారు. విచారణకు రావాలని నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, మనోజ్ పార్థసాని దుబాయ్కు ఉడాయించారు. -
కోర్టు ద్వారా లోకేశ్కు నోటీసులు ఇవ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై నమోదైన కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నారా లోకేశ్కు నోటీసులు అందించాలని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మంగళవారం కోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్బుక్లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించడం కలకలం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోవడం లేదు’ కాగా.. ఈ కేసులకు సంబంధించి గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న లోకేశ్ను అరెస్ట్కు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారించిన న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. కాగా.. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు లోకేశ్ అందుబాటులోకి రాలేదు. రెండుసార్లు ఆయన నివాసానికి వెళ్లినా అధికారులను కలిసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు. నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఈ విషయాన్ని సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. లోకేశ్ ఉద్దేశపూర్వకంగానే నోటీసులను తీసుకోవడం లేదని వివరించారు. ఈ అంశంపై తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం లోకేశ్కు స్వయంగా నోటీసులు అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. -
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
నారా లోకేష్కు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుబట్టడంతోపాటు కీలక సాక్షులుగా ఉన్న అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్పై న్యాయస్థానం కీలక ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్బుక్లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో బెదిరించడం కలకలం రేపింది. గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్కు నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కు వాయిదా వేసింది. ఇవాళ రావాలని సీఐడీ అధికారులకు చెప్పిన లోకేశ్ వ్యక్తిగత సిబ్బంది ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన మేరకు లోకేశ్కు నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. ఆ సమయంలో లోకేశ్ నివాసంలో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. అధికారులు చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేకపోయింది. నోటీసులు అందించేందుకు శుక్రవారం ఉదయం రావాలని లోకేశ్ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు. దీంతో లోకేష్కు నేడు నోటీసులు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను లోకేశ్ ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేసింది. రెడ్బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరిస్తూ.. భయపెట్టేందుకు ప్రయత్నించారని వివరించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేశ్ ఆరోపణలు చేశారని పేర్కొంది. సీఐడీ స్పెషల్ పీపీ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్దేశపూర్వకంగానే బెదిరించారు.. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ 14వ నిందితునిగా ఉన్నారు. విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని లోకేశ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద గతంలో నోటీసు ఇచ్చాం. అందులో పలు షరతులు విధించాం. ఈ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాం. ఆ తర్వాత ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అతన్ని 2 రోజుల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఈనెల 19న ఏబీఎన్, ఈటీవీ తదితర చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను, అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరించారు. సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు. కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా చేశారు. 53 రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్కు పంపడమన్నది రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవస్థలను మేనేజ్ చేయడం’ ద్వారానే జరిగిందని లోకేశ్ అన్నారు. నిందితులను రిమాండ్కు పంపడం న్యాయ ప్రక్రియలో భాగం. కానీ న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని లోకేశ్ మాట్లాడారు. ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఓ రెడ్ బుక్ను సిద్ధం చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమంటూ లోకేశ్ బెదిరించారు. చంద్రబాబు, లోకేశ్లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇంటర్వ్యూలను, అందుకు సంబంధించిన వివరాలను సీడీలో కోర్టు ముందుంచాం. వాటిని పరిగణనలోకి తీసుకుని లోకేశ్ అరెస్ట్కు ఆదేశాలివ్వండి’ అని దుష్యంత్రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. నేరుగా అరెస్టు చేయవచ్చు కదా? ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ.. 41ఏ కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తే, మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేశ్ ఇంటర్వ్యూలను చూసి, ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేశ్కు నోటీసులు జారీ చేసి.. వారి వివరణ కూడా తెలుసుకుంటామన్నారు. అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబూ ఉల్లంఘించారు.. పోలీసులను, సాక్షులను పలు ఇంటర్వ్యూల్లో లోకేశ్ బెదిరించిన విషయాన్ని సీఐడీ హైకోర్టు దృష్టికి కూడా తెచ్చింది. ఆయన ఇంటర్వ్యూలను పెన్ డ్రైవ్లో ఉంచి వాటిని ఓ మెమో రూపంలో సీఐడీ స్పెషల్ పీపీ దుష్యంత్ శుక్రవారం హైకోర్టు జడ్జి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు ముందుంచారు. చంద్రబాబు, లోకేశ్లు ఎంతో పరపతి కలిగిన వ్యక్తులని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులను విధించిందని గుర్తు చేశారు. కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందన్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు వెలువరించే ముందు చంద్రబాబు, లోకేశ్లు మాట్లాడిన మాటలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని దుష్యంత్ కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. ఈ దశలో ఈ కేసుతో సంబంధం లేని వివరాలతో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ మెమోపై అభ్యంతరాలుంటే వాటిని తమ ముందుంచాలని ప్రణతిని ఆదేశించారు. వాటిని పరిశీలించాక చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేశారు. -
లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలపై ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలతో సహా ఏసీబీ కోర్టుకు సీఐడీ అందజేసింది. కాగా యువగళం ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కిల్ స్కాం కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని అన్నారు. ఏసీబీ న్యాయమూర్తి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ సీఐడీ తన మెమోలో పేర్కొంది. స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కామ్ తదితర కేసులలో అప్పటి సీఎంహోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఇచ్చారు. చదవండి: బెడిసికొట్టిన యువగళం ముగింపు సభ ప్లాన్.. అయితే ఆ వాంగ్మాలాలు ఇవ్వడాన్ని లోకేష్ తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అధికారులు 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని.. రెడ్ బుక్లో పేర్లు రికార్డు చేశానని, తమప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం కాగా దీన్ని సైతం లోకేష్ తప్పుబట్టడంపై న్యాయవర్గాలలో విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షుల బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్కు జారీ చేసిన 41ఏ నోటీసుల్లో పేర్కొన్న షరతులకుcrime in విరుద్దమని సీఐడీ తెలిపింది. -
సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేదా ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో పలు చిక్కులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. మనీలాండరింగ్ కూడా జరిగిందని వివరించింది. సీఆర్డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణాలపై 2020లోనే సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు చేయాలని సీబీఐని కూడా కోరినట్లు తెలిపింది. సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపామంది. ఇందుకు జీవోలు కూడా జారీ చేశామని తెలిపింది. ఉండవల్లి వ్యాజ్యంలో కోర్టు ఏ ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ తెలిపారు. ఇతర మార్గాల్లోనోటీసులు పంపేందుకు అనుమతివ్వండి నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కొందరికి అందాయని, కొందరు తిరస్కరించారని, డోర్ లాక్, ఇంట్లో లేరు వంటి కారణాలతో కొన్ని వెనక్కి వచ్చాయని ఉండవల్లి తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వివరించారు. నోటీసులు అందని వారికి పత్రికలు, వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపేందుకు అనుమతివ్వాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇప్పటి వరకు సీఐడీ చేసిన దర్యాప్తు వివరాలతో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లాక నివేదికపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నోటీసులు అందని వారికి వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
చంద్రబాబుకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన బెయిలు రద్దు పిటిషన్లో సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపింది. డిసెంబరు 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిలు రద్దుచేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఏపీ సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు వినిపిస్తూ.. మధ్యంతర బెయిలు సమయంలో హైకోర్టు విధించిన షరతులు పొడిగించాలని కోరారు. దీంతోపాటు కేసు గురించి పబ్లిక్ డొమైన్లో ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలన్నారు. ఈ సమయంలో.. కోర్టులో ఉన్న అంశాలపై శాఖ అధికారులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ ఆరోపించారు. ఇరుపక్షాలకు ఈ షరతు వర్తించేలా చూడాలని అభ్యర్థించారు. అగర్వాల్ వాదనకు ఏపీ సీఐడీ తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం తెలిపారు. షరతులనేవి నిందితులకే వర్తిస్తాయని.. ప్రభుత్వానికి వర్తించవని చెప్పారు. అయితే, మీరు వాయిదా కోరుతున్నారా.. అని ధర్మాసనం ప్రశ్నించగా.. ప్రతివాదికి నోటీసులు జారీచేయాలని రోహత్గి బదులిచ్చారు. ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్లో మెరిట్స్పై నిర్ధారణలు ఉన్నాయని, ఇది రూ.300 కోట్ల ప్రజాధనం మళ్లించిన కేసు అని వివరించారు. ఏపీ సీఐడీ విజ్ఞప్తిని ధర్మాసనం అనుమతించింది. చంద్రబాబుకు నోటీసులు జారీచేస్తున్నామని, నవంబరు 3వ తేదీన ఏపీ హైకోర్టు విధించిన షరతుల్లో బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడం లేదా పాల్గొనడం మినహా అన్నీ వర్తిస్తాయని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీఐడీ దాఖలు చేసిన అటాచ్మెంట్ పిటిషన్ను ఆమోదిస్తూ న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ ఉన్నారు. కుంభకోణంలో నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో వారి ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఏపీ, తెలంగాణలో టెరాసాఫ్ట్ కంపెనీ, తుమ్మల గోపీచంద్ తదితరుల పేరిట ఉన్న రూ.114 కోట్ల విలువైన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను హోం శాఖ ఆమోదించింది. దాంతో ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు న్యాయస్థానం అనుమతినివ్వడంతో ఆస్తుల అటాచ్మెంట్కు సీఐడీ సిద్ధమవుతోంది. చంద్రబాబు పన్నాగమే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి సీఎం చంద్రబాబు తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి ఫైబర్నెట్ టెండర్లను కట్టబెట్టారు. మొత్తం రూ.3,300 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. మొదటి దశ కింద రూ.330 కోట్ల ప్రాజెక్టును టెండర్లలో ఎల్–1గా వచ్చిన బిడ్డర్ను కాదని మరీ టెరాసాఫ్ట్కు కట్టబెట్టారు. అందుకోసం బ్లాక్ లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీని ఆ జాబితా నుంచి తొలగించి, టెండర్లలో పాల్గొనేందుకు అనుమతించారు. ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీయే టెండర్లలో పాల్గొని, పనులు దక్కించుకుంది. ఇది పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధం. టెరాసాఫ్ట్ కంపెనీ పనులు కూడా నాసిరకంగా చేసి, రూ.144.53 కోట్లను దారి మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అటాచ్ చేయాలనినిర్ణయించిన ఆస్తులు ♦ ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చదరపు అడుగుల ఇంటి స్థలం. ♦ కోటేశ్వరరావు డైరెక్టర్గా ఉన్న నెప్టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్కు చెందిన విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లోని ఓ ఫ్లాట్. ♦ టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, ఆయన పేరిటే యూసఫ్గూడలో ఉన్న మరో ఫ్లాట్. ♦ తుమ్మల గోపీచంద్ భార్య పవన దేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న వ్యవసాయ భూమి. -
‘మద్యం’ కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ‘మద్యం’ కేసులో మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా వారి పార్టీ నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల ఖజానాకు రూ.1,500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై సీఐడీకి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు, కొల్లు రవీంద్ర, శ్రీనరేష్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు, రవీంద్రల వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మద్యం దుకాణాలు, బార్లకు శాసన సభ ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజు తొలగించినట్లు చెప్పారు. ఇందుకు గవర్నర్ సైతం ఆమోదముద్ర వేశారన్నారు. ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తూ ఎక్సైజ్ చట్టానికి చేసిన సవరణకు అప్పటి మంత్రి మండలి ఆమోదం కూడా ఉందన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 163 (3) ప్రకారం గవర్నర్కు మంత్రులు చేసిన సూచనలపై న్యాయ సమీక్ష కుదరదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. కొల్లు రవీంద్ర తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ వాదనల నిమిత్తం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం శ్రీనగేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 28కి వాయిదా వేశారు. -
ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్నెట్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల ఆస్తుల్ని అటాచ్ చేయాలని నేర దర్యాప్తు విభాగం(సీఐడీ)ని మంగళవారం ఆదేశించింది విజయవాడ అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు). ఫైబర్నెట్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్మెంట్కు అనుమతివ్వాలని పిటిషన్లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. ఫైబర్నెట్ కేసులో అటాచ్కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. -
స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. మంజూరు చేస్తూ జస్టిస్ టి.మల్లికార్జున్రావు ఇవాళ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని తెలిపిన హైకోర్టు.. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని స్పష్టం చేసింది. ఈనెల 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చవని, సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యుషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన నేరంలో పాత్ర ఉందని చెప్పలేమని, ఉల్లంఘనలపై అధికారులు సీఎంకు చెప్పినట్లు ప్రాథమిక ఆధారాల్లేవని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు విచారణ మొదలయ్యాక 22 నెలలు చంద్రబాబు బయటే ఉన్నారని, కొద్ది రోజుల ముందే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, విచారణ కాలంలో కేసును ప్రభావితం చేశారనేందుకు ఒక్క ఆధారం లేదని హైకోర్టు పేర్కొంది. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారన్న హైకోర్టు.. కేసు విచారణ నుంచి చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదని తెలిపింది. చంద్రబాబు బెయిల్ ఆర్డర్లో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చంద్రబాబు బెయిల్ ఆర్డర్ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అనడం సరికాదని పేర్కొంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చిందన్న సీఐడీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇది బెయిల్ పిటిషన్ మాత్రమే కాబట్టి స్కిల్ స్కామ్ కేసు లోతుల్లోకి వెళ్లి పూర్తి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్న హైకోర్టు.. ట్రయల్ కోర్టులో కేసు విచారణ సందర్భంగా అన్ని అంశాలు లోతుగా విచారణకు వస్తాయని తెలిపింది. ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ను చట్ట ప్రకారం విచారించాలని హైకోర్టు సూచించింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ మీద 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఆరోగ్య కారణాలు చూపించడంతో మానవతా కోణంలో ఏపీ హైకోర్టు బాబుకి అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్పై వాదనలు సాగాయిలా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఈ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించి ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణ పోలీసులు కేసులు కూడా పెట్టారు. లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్కు సీల్డ్కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. బెయిలు మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. స్కిల్ స్కామ్ రూ.10 నోట్లు వాడి హవాలా రూపంలో డబ్బు తరలించారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్ల ద్వారా ఈ విషయం బయటపడింది. బోస్, కన్వేల్కర్ మెస్సేజ్ల ఆధారంగా డబ్బు హైదరాబాద్కు చేరినట్లు తెలిసింది. స్కిల్ స్కామ్లో మెన్స్ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారు. అప్పటి చీఫ్ సెక్రటరీ తన లెటర్లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాశారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారు చట్టం ముందు అందరూ సమానులే. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలి. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదు. చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయి. బెయిల్పిటిషన్పై విచారణ చేసినప్పుడు.. కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరిపి సాధించింది ఏంటి?. ఇప్పుడు మళ్లీ విచారణ ఎందుకు? సీఐడీ డీఐజీ, ఏఏజీలు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. ఇది అడ్వకేట్స్ ఎథిక్స్కు విరుద్ధం. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, ఆ పని చేయం. పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరించకూడదు. -
చేటుతెచ్చే పోస్టులొద్దు
సాక్షి, అమరావతి : ఎవరిపైనైనా అసభ్యకర పదజాలంతో, దూషణలతో లేదా కించపరిచే చిత్రాలు, మీమ్స్, ఇతర విధాలుగా సోషల్ మీడియాలో పోస్టు పెడితే అడ్డంగా బుక్కయినట్టే. సొంత ఐడీ అయినా, ఫేక్ ఐడీ అయినా ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని రాష్ట్ర సీఐడీ ఇట్టే పట్టేస్తుంది. ఇందుకు తగ్గ అధునాతన పరిజ్ఞానాన్ని ఇప్పటికే సీఐడీ అంది పుచ్చుకుంది. దాని ఆధారంగా సోషల్ మీడియా వేధింపులకు కళ్లెం వేసేందుకు పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు ప్రత్యర్థులను దూషిస్తూ, వేధిస్తూ పోస్టులు పెట్టే అవకాశాలున్నందున వీటిపై గట్టి నిఘా పెట్టింది. ఈ పోస్టులు పెట్టే వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం నిత్యం సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను వడపోసి, అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పుడీ విభాగాన్ని మరింత పటిష్టం చేసి, అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యలను వేగవంతం చేయనుంది. 100 మందికి పైగా నిపుణులు సీఐడీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. అందులో సోషల్ మీడియా, ఆన్లైన్, సైబర్ వ్యవహారాలపై నైపుణ్యం ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎంపిక చేసిన కానిస్టేబుళ్లతో ఈ విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడీ విభాగంలో మరో 25 మంది నిపుణులైన అధికారులను నియమించనున్నారు. దాంతోపాటు జిల్లాల్లో పని చేస్తున్న 75 మంది నిపుణులైన పోలీసు అధికారులు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. దీంతో 100 మందికిపైగా నిపుణులతో పటిష్ట విభాగం అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు మౌలిక వసతులు, ఇతర అంశాలతో కూడిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. నిరంతర నిఘా.. సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా నిత్యం వివిధ సోషల్ మీడియా ఖాతాలను సీఐడీ పరిశీలిస్తోంది. అన్ని రకాల సోషల్ మీడియా పోస్టులను రోజూ కాచి వడపోస్తోంది. అసభ్యకర, వేధింపులకు పాల్పడే, వైషమ్యాలు రెచ్చగొట్టే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులను గుర్తించి, వాటిని పెట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. అందుకోసం సోషల్ మీడియా సంస్థల ప్రధాన కార్యాలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచి్చంది. అసభ్యకర పోస్టులను వెంటనే తొలగిస్తోంది. అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తోంది. విదేశాల నుంచి అసభ్యకర పోస్టులు పెడుతూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నవారిని కూడా ఉపేక్షించడంలేదు. వారిపైనా చర్యల కోసం సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలను సంప్రదించి వేగంగా దర్యాప్తు చేస్తోంది. అవసరమైతే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేస్తోంది. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు తెరుస్తోంది. న్యాయస్థానాల ద్వారా తగిన శిక్షలు పడేలా పటిష్టంగా, వేగంగా దర్యాప్తు చేస్తోంది. పదే పదే కుట్రపూరితంగా సోషల్ మీడియా వేధింపులకు పాల్పడే వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు కూడా నిర్ణయించింది. ప్రధానంగా ఏడాది నుంచి సీఐడీ దూకుడు బాగా పెంచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో సోషల్ మీడియాలో అస భ్యకర పోస్టులపై సీఐడీ కఠిన చర్యలు చేపట్టింది. ఆ గణాంకాలు ఇలా ఉన్నాయి... ♦ 2022లో తొలగించిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులు: 1,450 ♦ 2023లో ఇప్పటివరకు తొలగించిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులు: 2,170 ♦నిత్యం పరిశీలిస్తున్న సందేహాస్పద సోషల్ మీడియా ఖాతాలు: 2000 ♦ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని గుర్తించిన సోషల్ మీడియా ఖాతాలు: 405 ♦ ఇప్పటివరకు తెరిచిన సైబర్ బుల్లీయింగ్ షీట్లు: 2,995 ♦ విదేశాల నుంచి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యల కోసం ఆయా దేశాలతో సంప్రదించిన కేసులు: 45 ♦ జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులు: 5 -
టీడీపీ ఆఫీస్కు సీఐడీ నోటీసులు
సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి నేర దర్యాప్తు విభాగం(CID) నోటీసులు జారీ చేసింది. పార్టీ అకౌంట్లో జమ అయిన నగదు వివరాల్ని కోరుతూ సీఐడీ ఆ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ జనరల్ సెక్రటరీతో పాటు ట్రెజరర్ పేరిట సీఐడీ ఆ నోటీసుల్ని జారీ అయినట్లు సమాచారం. పార్టీ అకౌంట్లోకి వచ్చిన రూ. 27 కోట్ల వివరాలు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ. ఈ నెల 18వ తేదీన సీఐడీ కార్యాలయానికి వివరాలతో రావాలంటూ ఆ ఇద్దరికి నోటీసుల్లో సీఐడీ సూచించింది. ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి మళ్లిందనే అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ, ఏసీబీ కోర్టుకు ఇంతకు ముందే సమర్పించింది కూడా. అంతేకాదు.. ఈ కేసులో టీడీపీ అడిటర్ను విచారించాల్సిన అవసరమూ ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది కూడా. -
చంద్రబాబుపై తొందరపాటు చర్యలుండవు
సాక్షి, అమరావతి: అస్మదీయుల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్పై ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ ఇచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులోనూ ఇలాంటి హామీనే ఇచ్చానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు సైతం అదే హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటిశస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముందుకెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ రకంగానూ ముందుకెళ్లొద్దంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ గతంలో తానిచ్చిన ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక కుంభకోణం.. ముందస్తు బెయిల్పై నేడు విచారణ ఉచిత ఇసుక విధానం పేరుతో ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించినందుకు సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరపనున్నారు. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసుల మీద కేసులు పెడుతోందన్నారు. వేధింపులకు గురి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏ అంశంపై ప్రశ్నిస్తే ఆ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పకుండా చేసేందుకే ప్రభుత్వం తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే
సాక్షి, అమరావతి: కంటి శస్త్ర చికిత్స కోసం తాత్కాలిక బెయిల్ పొందిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టు విధించిన బెయిల్ షరతులను అప్పుడే ఉల్లంఘించడం మొదలు పెట్టారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. అనారోగ్యం సాకుతో బయటకు వచ్చిన చంద్రబాబు ఆ వెంటనే రాజకీయ ర్యాలీ ప్రారంభించారని, జైలు బయటే మీడియాతో కూడా మాట్లాడారని తెలిపారు. హైకోర్టు చంద్రబాబుకు పలు షరతులతో మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వీటికి అదనంగా మరిన్ని షరతులు విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు మీడియాతో మాట్లాడటం, ర్యాలీల్లో పాల్గొనడం, కేసు గురించి మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేయడానికి వీల్లేదంటూ ఆదేశించింది. సీఐడీ అనుబంధ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసి కూడా చంద్రబాబు వాటికి విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తాము అదనపు షరతులు విధించాలని ఎందుకు మొత్తుకుంటున్నామో దీనినిబట్టి అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన పెన్డ్రైవ్ను కోర్టుకు సమర్పించి, దానిని పరిశీలించాలని కోరారు. చంద్రబాబు కోర్టు షరతులకు లోబడి వ్యవహరిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులను ఆయన వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ అధికారులు చంద్రబాబు స్వేచ్ఛకు ఏ రకంగానూ భంగం కలగనివ్వబోరని, ఇది తాము ఇస్తున్న హామీ అని నివేదించారు. మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో కోర్టు ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు తెలిపారని సుధాకర్రెడ్డి గుర్తు చేశారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు జోక్యం చేసుకుంటూ.. మీ వద్ద ఇంటెలిజెన్స్ ఉందిగా.. దాని సాయంతో చంద్రబాబుపై నిఘా పెట్టొచ్చుగా అని వ్యాఖ్యానించారు. నిఘా వేరు, ఓ వ్యక్తి వెంట వెళ్లడం వేరని, నిఘా అనేది వ్యక్తికి తెలియకుండా చేసేదని సుధాకర్రెడ్డి వివరించారు. అనంతరం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ కోరుతున్న అదనపు షరతులు దర్యాప్తు కోసం కాదని, ఇతర కారణాలున్నాయని అన్నారు. సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. దర్యాప్తు ప్రభావితం కాకుండా ఉండేందుకే బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానాలు షరతులు విధిస్తాయన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా కోర్టు షరతులను ఉల్లంఘించలేదని, ర్యాలీలో పాల్గొనలేదన్నారు. ఆయనకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు ఆయన వద్దకే ప్రజలు వచ్చారన్నారు. న్యాయస్థానం షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దును కోరే స్వేచ్ఛ సీఐడీకి ఉందని, అందువల్ల సీఐడీ కోరుతున్న విధంగా షరతులు విధించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు అదనపు షరతుల విషయంలో శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని తెలిపారు. -
కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించిన చంద్రబాబు!
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తొలిరోజే కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడారాయన. అంతేకాదు.. జనం మధ్య తిరగకూడదని, ఆస్పత్రికి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన షరతులనూ ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబుకి ఉన్న అరోగ్య కారణాల రీత్యా మానవతాధృక్పథంతో నాలుగు వారాలపాటు పలు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ర్యాలీలో పాల్గొనకూడదని.. మీడియాతో మాట్లాడకూడదు.. కేసు దర్యాప్తును ఏకంగానూ ప్రభావితం చేయకూడదని తీర్పు ఉత్తర్వుల్లో జస్టిస్ మల్లికార్జునరావు స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ హైకోర్టు షరతుల్ని చంద్రబాబు లెక్కచేయలేదు. బయటకు రాగానే వెంటనే మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్ షరతుల ఉల్లంఘనను సీఐడీ న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. కేవలం కంటి సర్జరీ కోసమే ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28వ తేదీన సాయంత్రం తిరిగి రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే మధ్యంతర బెయిల్ వెంటనే రద్దు అవుతుందని కోర్టు చంద్రబాబును హెచ్చరించింది కూడా. కోర్టును బాబు తప్పుదోవ పట్టించారు కోర్టు తీర్పును ఉల్లంఘించిన చంద్ర బాబు బెయిల్ రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగ రాజు కోరుతున్నారు. ఆరోగ్య కారణాలు చూపి, బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ‘‘చంద్రబాబు తనకు రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుపట్టించారు. ఆరోగ్యం బాగోలేదని నాటకాలు ఆడారు. కాబట్టి, వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలి. జైలుకు పంపించాలి’’ అని చీకటిమిల్లి మంగరాజు ఒక ప్రకటనలో కోరారు. -
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు. ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి వివరాల కోసం చదవండి చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను ఏసీబీ కోర్టు అనుమతించింది. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు: ఏపీబీసీఎల్ ఎండీ మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ పేర్కొన్నారు. రెండు బేవరేజ్లు, మూడు డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారు. 8 శాతం వ్యాట్ కాకుండా 6 శాతం పన్నులు తీసేశారని APBCL ఎండీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం కంపెనీల అనుమతుల పూర్తి కథేంటీ? 40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు వినూత్నం, విశేషం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్.. ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో తన దగ్గరి నేత రుణం తీర్చుకున్నారు. ► SPY బ్రాండ్ ఎవరిదో అందరికీ తెలుసు. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు. ► PMK డిస్టిలరీ పార్టీలోని ఓ సీనియర్ నేత వియ్యంకుడిందని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది ► శ్రీకృష్ణా డిస్టిలరీ కూడా రాయలసీమ టిడిపి నేతకు చెందినది ► 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. ► చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు పదవి నుంచి దిగిపోయే కొద్ది ముందు ఇచ్చారు. ► టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతి ఇచ్చింది. -
న్యాయ వ్యవస్థను కించపరుస్తున్న లోకేశ్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, ఆధారాలతో సహా దొరికిన దొంగ చంద్రబాబు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా విమర్శించారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆధారాలు ఉన్నాయనే న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. విజయవాడ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టుల మెట్లు ఎక్కినా, ఆయనకు ఊరట లభించకపోవడంతో 50 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేశారని లోకేశ్ విమర్శించడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కిల్ స్కామ్కు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకంగా 13 ఫైళ్లలో సంతకాలు చేశారని గుర్తు చేశారు. తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఆధారాలతోసహా వెలికి తీసిందన్నారు. ఆయన ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో అసెంబ్లీలో స్క్రీన్పై ప్రదర్శించి ప్రజలకు స్పష్టంగా వివరించామని చెప్పారు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలని లోకేశ్ను ప్రశ్నించారు. మంత్రి అమర్నాథ్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘సీమెన్స్’ తిరుగులేని సాక్ష్యం ♦ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్తో తమకు ఎలాంటి సంబంధం లేదని జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ స్పష్టం చేసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఇది తిరుగులేని సాక్ష్యం. అసలు కేబినెట్ అనుమతి లేకుండానే ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు అవినీతికి నాంది పలికారు. ♦ స్కిల్ ప్రాజెక్ట్ పేరిట జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడం.. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకుంటున్నట్టు మోసం చేయడం.. అనంతరం డిజైన్టెక్ అనే కంపెనీ ద్వారా త్రైపాక్షిక ఒప్పందంగా మార్చడం అంతా కూడా ప్రజాధనాన్ని దోచేందుకు వేసిన పన్నాగమే. ఇదంతా పూర్తి ఆధారాలతో బయటపడిన విషయాన్ని లోకేశ్ గుర్తించాలి. ♦నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు చెల్లించాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం వాస్తవం కాదా? ఆ విధంగా చెల్లించిన నిధులు షెల్ కంపెనీల ద్వారా హైదారాబాద్ జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసానికి చేరడం సీఐడీ దర్యాప్తులో వెల్లడి కావడం నిజం కాదా? ♦ అసలు చంద్రబాబుకు ఐటీ శాఖ ఎందుకు నోటీసులు జారీ చేసిందో సమాధానం చెప్పగలరా? ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా? ♦ స్కిల్ స్కామ్ కేసులో విచారణకు సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి వాసుదేవ్ పార్థసానిలను ఎందుకు విదేశాలకు పంపించారో సమాధానం చెప్పగలవా లోకేశ్? ♦ అమరావతిలో తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణం, టిడ్కో ప్రాజెక్ట్ల టెండర్ల కేటాయింపులో కాంట్రాక్ట్ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు ఐటీ శాఖే వెల్లడించింది. తమకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బ్రాంచి అధికారులు నోటీసులు ఇవ్వాలి తప్ప.. ఢిల్లీ ఆఫీసు వారు కాదని చంద్రబాబు చేసిన వాదనను ఐటీ శాఖ కొట్టి పారేసింది. లెక్కల్లో చూపని రూ.118 కోట్ల ఆదాయానికి ఆధారాలు చూపాలని ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా లోకేశ్? మేనేజ్ చేయటంలో దిట్ట మీ బాబే ♦ 40 ఏళ్లుగా చంద్రబాబు కంటే బాగా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారానే మీ బాబు చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, అడ్డదారిలో సీఎం పదవి దక్కించుకున్నారు. టీడీపీని, ఆ పార్టీ గుర్తును, ట్రస్ట్ను కూడా కొట్టేశారు. ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీతో కలసి అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబే అన్నది ప్రజలకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసిన విషయం తెలియదా లోకేశ్? వైఎస్ జగన్పై కాంగ్రెస్ పెట్టిన అక్రమ కేసుల్లో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయ్యారనే విషయం తెలియదా? బాబులా మేనేజ్ చేయాల్సిన అవసరం సీఎంకు, వైఎస్సార్సీపీకి లేదు. ♦ లోకేశ్ 35 రోజులు ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. పైగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షానే తనను పిలిపించుకున్నారని అబద్దాలు చెప్పారు. కానీ ఆయన పదే పదే అడిగితేనే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పడంతో అసలు బండారం బయటపడింది. అబద్ధాలు చెప్పడం, గోబెల్స్ ప్రచారంలో లోకేశ్ తన తండ్రి చంద్రబాబును మించిపోయారు. చంద్రబాబుకు లోకేశ్తోనే ముప్పు ♦ చంద్రబాబుకు ఏదైనా ముప్పు ఉంటే అది లోకేశ్తోనే ఉండొచ్చు. చంద్రబాబు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయినట్టే.. ప్రస్తుతం చంద్రబాబుకు లోకేశ్ వెన్నుపోటు పొడిచే అవకాశాలున్నాయి. ♦చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా ఎందుకోసం? పోలీసుల కాల్ డేటాతో చంద్రబాబుకు ఏం సంబంధం? దర్యాప్తు అధికారులు విచారణ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఆ కాల్ డేటాను టీడీపీకి ఎందుకు ఇవ్వాలి. జైలు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్యులు 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లోకేశ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా పేదలకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఈ యాత్రలో వివరిస్తుంటే సర్వత్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వ లేకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ తప్ప చంద్రబాబుకు ప్రజలకు మేలు చేయడం అన్నది తెలియదు. ఆయన ఒక్క ఎన్నికల్లో అయినా పొత్తు లేకుండా గెలిచారా? గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. చివరికి లోకేశ్ను కూడా గెలిపించుకోలేకపోయారు. -
నిజం గెలిచింది.. బాబు జైలుకెళ్లారు
సాక్షి, అమరావతి: అడుగడుగునా కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలులో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం ‘నిజం గెలవాలి’ యాత్ర. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటూ, అవినీతి తప్పితే మరే దృష్టీ లేకపోయినప్పటికీ, పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. ఫైబర్నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, పేదల నుంచి అసైన్మెంట్ భూములను కొల్లగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వీటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. టిడ్కో గృహాల నిర్మాణం, అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది. తెలంగాణ సర్కారును దెబ్బతీసేందుకు చేసిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు. అదేమంటే.. దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు? సీబీఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థల పైనే çహూంకరించేవారు. అవినీతిలో బాబు ‘స్కిల్’ ఇది 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఈ కార్యక్రమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఇది తప్పని ఆరి్థక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు. ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేసి, కొందరిని అరెస్టు కూడా చేసింది. ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు. 18 నోట్ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్లు గుర్తించారు. అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆధారాలు బలంగా ఉండటంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడంలేదు. ఎంతసేపూ అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడంలేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు భూదోపిడీ కథ ఇదీ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు. అదే అలైన్మెంట్ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేశ్ కరకట్ట నివాసాన్ని, హెరిటేజ్ ఫుడ్స్కు, నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు. పార్టీలోనే అనుమానాలు ఇప్పటివరకు 155 మందికిపైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, వీరంతా బాబు అరెస్టయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానీకమూ చెబుతున్నారు. అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయటపెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరిని పరామర్శించాలి, యాత్ర ఎక్కడి వరకు, ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు. సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి, ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడీ అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పారీ్టలో ఆందోళన నెలకొంది. ఫైబర్నెట్లో బాబు ‘సెట్టింగ్’ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది. రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పటివరకూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారు. ఎల్1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్కు టెండరు కట్టబెట్టారు. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు. 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారు. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించారు. అసైన్మెంట్ పేరుతో పేదలను దోచిన బాబు బ్యాచ్ అమరావతి ప్రాంతంలో అసైన్మెంట్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి, వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది. అమారావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది. దాంతో ఆందోళన చెందిన అసైన్డ్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపింది. అతి తక్కువ ధరకు దాదాపు 617 ఎకరాల అసైన్డ్ భూములు హస్తగతం చేసుకుంది. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఈ బ్యాచ్ రూ.3,737 కోట్లు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు. బాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అసలు వాస్తవమేంటంటే.. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు. కానీ, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే, ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు. దీంతో బాబు సతీమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది. భవనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే, ఈ ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో అన్నీ దాపరికాలే. యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం, రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకే తెలియవు. ఇప్పటివరకు షెడ్యూలే విడుదల చేయలేదు. మొదటిరోజు పాకాల మండలం నేండ్రగుంటలో ఒక పరామర్శ, ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఒక దళితవాడలో సహపంక్తి భోజనం, సాయంత్రం చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు చూచాయగా కార్యక్రమాలు గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు. -
Oct 20th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Cases Arrest Remand Court Hearings And Political Updates 20:49, అక్టోబర్ 20, 2023 మనసంతా బాబే.! ► తెలంగాణ ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నా.. రేవంత్ మనసంతా బాబు గురించే ► బాబు ఎప్పుడొస్తాడు? తనకు ఎలా దారి చూపిస్తాడు? ► తెలంగాణ ఎన్నికల కీలక సమయంలో బాబు గైడెన్స్ లేకుండా ఎలా పని చేసేది? 19:49, అక్టోబర్ 20, 2023 రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691 చంద్రబాబు ఆరోగ్యం కుశలం ► రాజమండ్రి జైల్లో చంద్రబాబు క్షేమంగా ఉన్నారన్న డాక్టర్లు ► ఇవ్వాళ్టి హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన డాక్టర్లు 19:39, అక్టోబర్ 20, 2023 యాక్షన్ ఎవరిపై.? రియాక్షన్ ఎవరిపై ? ► రాజమండ్రిలో ఈ నెల 23 న టీడీపీ - జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ► పైకి పొత్తుల ప్రకటన, లోలోన గుంభనంగా మంతనాలు ఈ పొత్తుతో నాకేంటీ అన్న చందాన టీడీపీ, జనసేన నాయకులు ఎంత లాభపడదాం? ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం? గెలిచే సీట్లు ఎన్ని? కచ్చితంగా ఓడే సీట్లు ఎన్ని? పైకి ఉద్యమ కార్యాచరణ, లోన సమన్వయ సమస్య ఇప్పటికిప్పుడు పక్క పార్టీకి ఎలా జై కొట్టేది? పోటీకి అవకాశం లేనపుడు సాగిలపడడమెందుకు? అసంతృప్తిని కప్పిపుచ్చేందుకు అటు పవన్, ఇటు లోకేష్ రకరకాల ప్రయత్నాలు 19:19, అక్టోబర్ 20, 2023 ముఖ్యమంత్రి ఆశలకు మంగళం ► జనసేన కార్యవర్గానికి స్పష్టత ఇచ్చిన పవన్ ► సీఎం పదవి కంటే ప్రజల భవిష్యత్తే ముఖ్యం ► ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టమే, సుముఖమే ► కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ► ఈరోజు మన ప్రాధాన్యం సీఎం పదవి కాదు ► జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉన్నా టిడిపితో కలిసి వెళ్లాలి ► గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పనిచేయాలి ► ప్రతికూల సమయంలోనే నాయకుడి ప్రతిభ తెలుస్తుంది ► ఒకరి అండదండలు లేకుండా జనాదరణతో ఇంతదూరం వచ్చాం ► 150 మంది క్రియాశీల సభ్యులతో పార్టీ ప్రారంభమైంది ► ప్రస్తుతం పార్టీలో 6.5 లక్షల మందికి పైగా సభ్యులున్నారు ► పార్టీపరంగా ఏ నిర్ణయమైనా నేను ఒక్కడినే తీసుకునేది కాదు ► ప్రజల్లో ఉన్న భావాన్ని పలు నివేదికల ద్వారా తెప్పించుకున్నా ► మన పార్టీకి కళ్లు, చెవులు క్రియాశీల సభ్యులే ► క్రియాశీల సభ్యుల అభిప్రాయాలు నివేదిక రూపంలో తీసుకుంటున్నా ► అందరి అభిప్రాయాల మేరకే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నా 18:18, అక్టోబర్ 20, 2023 2 ములాఖత్ లకు ఓకే ►చంద్రబాబుకు జైల్లో రెండు లీగల్ ములాఖత్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ►చంద్రబాబుకు భద్రత దృష్ట్యా రెండు ములాఖత్లను ఒకటికి కుదించిన జైలు అధికారులు ►లీగల్ ములాఖత్లు మూడుకి పెంచాలని మరోసారి పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు ►వివిధ కోర్టులలో కేసులు ఉండటంతో మూడు ములాఖాత్లు ఇవ్వాలని కోరిన బాబు తరపు న్యాయవాదులు ►రెండు ములాఖత్ లను అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు 17:20 అక్టోబర్ 20, 2023 నవంబర్ 9కి ఫైబర్ గ్రిడ్ కేసు ►ఏసీబీ కోర్టులో ఫైబర్నెట్ కేసు పీటీ వారెంట్పై నిర్ణయం వాయిదా ►పైబర్నెట్ పీటీ వారెంట్పై నిర్ణయం నవంబర్ 10కి వాయిదా ►సుప్రీంకోర్టులో ఫైబర్నెట్ కేసుపై విచారణ ఉన్నట్లు సీఐడీ మెమో ►సీఐడీ మెమో ఆధారంగా ఏసీబీ కోర్టులో విచారణ నవంబర్ 10కి వాయిదా ►ఫైబర్నెట్ స్కామ్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంలో విచారణ నవంబర్9కి వాయిదా ►తొలుత నవంబర్8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►నవంబర్9న విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు న్యాయవాది విజ్ఞప్తి 15:10, 20 అక్టోబర్ 20, 2023 హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ ఖాళీ ►బీఆర్ఎస్లో చేరిన టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ► రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ►కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు అధికారం లోకి వచ్చింది బీఆర్ఎస్: రావుల ►కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది చెందుతుంది ►మేము అభివృద్ది కోసం పోటీ పడ్డాం కానీ వ్యక్తుల కోసం ఏనాడూ పోటీ పడలేదు 14:05 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో సీడీఆర్ పిటిషన్ వాయిదా ►ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్ విచారణ వాయిదా ►ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►చంద్రబాబు లాయర్ల పిటిషన్పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశం ►ఈ నెల 26వరకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ►పీపీ విజ్ఞప్తితో పిటిషన్ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 13:55 అక్టోబర్ 19, 2023 టీడీపీ శ్రేణుల్లో వైరాగ్యం ►చంద్రబాబు అరెస్ట్తో పాతాళానికి పడిపోయిన టీడీపీ గ్రాఫ్ ►నాయకత్వ లేమితో పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ►మాటిమాటికి ఢిల్లీకి పోతున్న నారా లోకేష్ ►హడావిడి చేసి.. ఆపై సినిమాలతో బిజీ అయిన నందమూరి బాలకృష్ణ ►సగం సినిమా షూటింగ్లతో.. సగం రాజకీయాలతో అయోమయస్థితిలోకి జనసేన క్యాడర్ను నెట్టేసిన పవన్ ► సింపథీ కోసం నారా భువనేశ్వరి యాత్ర తెరపైకి ►బాబు అరెస్ట్ అప్పటి నుంచి.. ఇచ్చిన నిరసనల పిలుపునకు ప్రజల నుంచి కనీసం స్పందన లేని వైనం ►న్యాయస్థానాల్లోనూ వరుసగా తగులుతున్న దెబ్బలు.. దక్కని ఊరట ►పండుగ తర్వాత కూడా పరిస్థితి మారకుంటే.. తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్న కొందరు నేతలు 13:34 అక్టోబర్ 19, 2023 స్కిల్ స్కామ్ లో బయటపడింది గోరంత! డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కామెంట్స్ ►దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టు అయిన బాధ ఆయన కుటుంబ సభ్యుల్లో కనిపించలేదు.. ►చంద్రబాబు బాధలో ఉంటే బాలకృష్ణ సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టే జైలు నుంచి రాజకీయం చేస్తున్నారు ►బాబు అనారోగ్యంగా ఉంటే కేజీ బరువు ఎలా పెరుగుతారు? ►చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణ కోరవచ్చు కదా! ► రూ. 371 కోట్ల అవినీతిలో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి జైలు జీవితం అనుభవిస్తున్నారు ►స్కిల్ స్కామ్ లో బయటపడింది కేవలం గోరంత మాత్రమే ►చంద్రబాబు అవినీతి పూర్తిస్థాయిలో వెతికి తీస్తే కొండంత అవినీతి బయటపడుతుంది నారా బ్రాహ్మణి ట్వీట్స్ వెనుక అత్తమామల వేధింపులే కారణం అయ్యుండొచ్చు. @brahmaninaraతో గొడవపడి అప్పట్లో నారా భువనేశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నారా ఇంటిగుట్టు వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. - మాజీ మంత్రి పేర్నినాని #GajaDongaChandrababu#EndofTDP pic.twitter.com/slTX4WCgm5 — YSR Congress Party (@YSRCParty) October 20, 2023 13:06 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మరో రెండు పిటిషన్లు బాకీ ►ఏసీబీలో కోర్టులో ఇవాళ ఇంకా రెండు విచారణకు రావాల్సిన చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్ విచారణపై నిర్ణయం తీసుకోనున్న ఏసీబీ కోర్టు ►సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదాతో.. ఏసీబీ కోర్టులోనూ వాయిదా పడే అవకాశం ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు 12:55 అక్టోబర్ 19, 2023 ఓడిపోయే స్థానాలు మనకొద్దు సార్ ►మంగళగిరిలో జనసేన సీనియర్లు, ముఖ్యనేతలతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ►టీడీపీతో పొత్తు, వారాహి యాత్రపై చర్చించనున్న పవన్ ►టీడీపీ ముందర జనసేన డిమాండ్లు ఉంచాలని పవన్పై ఒత్తిడి చేయనున్న సీనియర్లు ►పాతికా, ముప్ఫై కాదు.. జనసేనకు యాభై సీట్లు కేటాయించాలి ►సామాజిక వర్గ బలం ఉన్న నియోజకవర్గాలతో పాటు అడిగిన నియోజకవర్గాలే ఇవ్వాలి ►ఓడిపోయే స్థానాలను అంటగట్టొద్దు ►వారాహి యాత్ర అంతటా చేయడం దండగ ►పోటీ చేసే స్థానాల్లోనే చేద్దాం ►పవన్ కల్యాణ్కు రెండు సీట్లు ఇవ్వాలి.. రెండు చోట్లా పోటీకి టీడీపీ వాళ్లు కృషి చేయాలి ►టీడీపీకి సమాన గౌరవం జనసేనకు ఇవ్వాలి ►టీడీపీ రెబల్స్కు జనసేనలోకి పంపకూడదు ►పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రమే టికెట్లు ఇవ్వాలి ►లిక్కర్, పెట్రోల్.. ఇలా మొత్తం ఎన్నికల ఖర్చంతా టీడీపీనే భరించాలి 12:32 అక్టోబర్ 19, 2023 లాయర్ల కోట్ల ఫీజులకు డబ్బెక్కడది?: లక్ష్మీ పార్వతి ►చంద్రబాబు కేసుల కోసం సీనియర్ లాయర్లు ►40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారు ►సీనియర్ లాయర్లకు రోజు రూ.కోటి నుంచి రూ.2.50 కోట్లు ఫీజు ►లాయర్ల ఫీజుకే కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చు ►2 శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారు ►లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ్నుంచి డబ్బులు వచ్చాయో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు తెలపాలి ►దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారా? 11:22 అక్టోబర్ 19, 2023 క్వాష్ తర్వాతే ఫైబర్ నెట్ సంగతి ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ తీర్పు పెండింగ్లో ఉందని.. అది ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించిన సుప్రీంకోర్టు ►ఆ తర్వాతే ఫైబర్ నెట్ కేసు సంగతి చూస్తామని వెల్లడి ►చంద్రబాబు జైలులోనే ఉన్నారు కదా, మీరు ఇంటరాగేషన్ చేసుకోవచ్చు కదా: జడ్జి ►క్వాష్ పిటిషన్పై 8వ తేదీన తీర్పు ఇస్తామన్న ధర్మాసనం ►క్వాష్ పిటిషన్పై ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►ఇవాళ లిఖిత పూర్వక వాదనల సమర్పణకు ఆఖరు తేదీ ►17ఏ సెక్షన్పైనా సాగిన వాడీవేడి వాదనలు ►స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్కు సుప్రీం నో ► నేరుగా తుది తీర్పే ఇస్తామని చంద్రబాబు లాయర్లకు స్పష్టీకరణ ►నవంబర్ 8 కోసం ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన టీడీపీ శ్రేణులు 10:59 అక్టోబర్ 19, 2023 ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ►విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్కుమార్ వాదనలు సిద్ధార్థ లూథ్రా వాదనలు: ►పిటిషనర్పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది ►ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు ►ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు ►చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతోంది.. ఈ అంశాన్ని కౌంటర్ అఫిడవిట్లో తెలిపాం -- ►వాదనల తర్వాత తదుపరి విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు ►వ్యక్తిగత ఇబ్బంది కారణంగా ఆ మరుసటి రోజుకి విచారణ కోరిన లాయర్ లూథ్రా ► సరేనన్న ధర్మాసనం ► నవంబర్ 9దాకా.. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని, పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం 10:49 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ ►చంద్రబాబు లీగల్ ములాఖత్ పిటిషన్ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు ►లీగల్ ములాఖత్లను పెంచాలని గురువారం పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసుల విచారణలు ఉన్నందునా.. లీగల్ ములాఖత్ల సంఖ్య మూడుకి పెంచాలని పిటిషన్లో కోరిన లాయర్లు ► అత్యవసర విచారణ కోరగా.. సాధ్యం కాదన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశం ►ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు ►సరైన లీగల్ ఫార్మట్లో మరోసారి పిటిషన్ ఫైల్ చేయమని సూచన 10:15 అక్టోబర్ 19, 2023 చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్నెట్ స్కాం ►ఫైబర్నెట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి 09:45 అక్టోబర్ 19, 2023 ఏసీబీ కోర్టులో మూడు పిటిషన్లపై విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో పీటీ వారెంట్పై విచారణ ►సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ►నేడు ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డ్స్ పిటిషన్పై విచారణ ►చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్ డేటా రికార్డ్స్ ఇవ్వాలని పిటిషన్ వేసిన చంద్ర బాబు తరపు న్యాయవాదులు ►ఈ పిటిషన్పై ఇప్పటికే కౌంటర్ వేసిన సీఐడీ తరుపు న్యాయవాదులు ►సీడీఆర్ పిటిషన్ నేడు విచారించనున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబుకి లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని గురువారం బాబు లాయర్ల పిటిషన్ ►అత్యవసర విచారణకు నిరాకరించిన ఏసీబీ కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశం ►నేడు లీగల్ ములాఖత్ల పిటిషన్పైనా విచారణ జరిగే అవకాశం 08:55 అక్టోబర్ 19, 2023 బాబు ఆరోగ్యం.. నారా ఫ్యామిలీ అల్లిన కథలు ►గురువారం వర్చువల్ విచారణ టైంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన జడ్జి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? చంద్రబాబు : ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : జైల్లో డాక్టర్లున్నారు కదా, రోజూ చెక్ చేస్తున్నారా? చంద్రబాబు : అవును, రోజూ డాక్టర్లు చెక్ చేస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : డాక్టర్లు హెల్త్ రిపోర్ట్ ఇస్తున్నారా? చంద్రబాబు : అవును, డాక్టర్లు ఏ రోజుకారోజు హెల్త్ రిపోర్టు ఇస్తున్నారు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : ఇంకా ఏమైనా సమస్యలున్నాయా? చంద్రబాబు : జెడ్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిని నేను, నాకు సెక్యూరిటీపై అనుమానాలున్నాయి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి : మీకున్న సందేహాలను రాతపూర్వకంగా ఇవ్వండి, పరిశీలిస్తాం ఇవి చంద్రబాబు స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన మాటలు.. మరి నారా ఫ్యామిలీ ఏమంటోంది? మా నాన్నకు స్టెరాయిడ్స్ : గత వారం తనయుడు నారా లోకేష్ బాబు చంద్రబాబు ఆరోగ్యం విషమంగా ఉంది, ఆయన కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం : చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ ►ఈ ఆరోపణలన్నీ వట్టివేనని తేల్చిన కోర్టు విచారణ ►లోకేష్, భువనేశ్వరీ అసత్య ఆరోపణలు ఎందుకు? ►స్టెరాయిడ్స్, కిడ్నీలు ఎక్కడినుంచి అల్లిన కథలు? ►టీడీపీ పతనం నేపథ్యంలోనే.. సానుభూతి కోసం అసత్యాల ప్రచారమా? 08:36 AM, అక్టోబర్ 20, 2023 తీర్పు ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ ►చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్పై నేడు సుప్రీం కోర్టులో విచారణ ►స్కిల్ డెవెలప్మెంట్ కేసులో చంద్రబాబు పిటిషన్పై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏపై వాడీవేడిగా సాగిన వాదనలు ►ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళ(శుక్రవారం) ఆఖరిరోజు ►వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ ►నేరుగా తీర్పు ఇస్తామంటూ.. బాబు లాయర్లు చేసిన మధ్యంతర బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించిన ధర్మాసనం ►21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు ►ఎలాంటి తీర్పు వస్తుందో? ఎప్పుడు వస్తుందోనని చంద్రబాబు కుటుంబ సభ్యుల్లో.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన 08:15 AM, అక్టోబర్ 20, 2023 టీడీపీ ఆశలన్నీ ఆ ఫలితం మీదే! ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టి నుండి చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ కొనసాగింపు ►నవంబర్ 1 వరకు రిమాండ్లోనే చంద్రబాబు ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ ఫలితంపైనే టీడీపీ ఆశలు ►జైల్లో చంద్రబాబుకు యధావిధిగా కొనసాగుతున్న ఆరోగ్య పరీక్షలు ►సుప్రీంలో క్వాష్ పిటిషన్ ఫలితం తేలాకే ప్రారంభం కానున్న భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర 07:43 AM, అక్టోబర్ 20, 2023 సుప్రీంలో బాబు ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►సుప్రీం కోర్టులో నేడు ఫైబర్ నెట్ స్కామ్ కేఏసు విచారణ ►ఫైబర్ నెట్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ ► ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణ ► హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►విచారించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►9వ నెంబర్ కేసుగా లిస్ట్ అయిన పిటిషన్ ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపుల్లో బాబు భారీ అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు ► ఇవాళ్టి సుప్రీం ఆదేశాల తర్వాతే.. పీటీ వారెంట్పై విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 07:30, అక్టోబర్ 19, 2023 అన్నీ నిజాలే చెప్పాలి ► నిజం గెలవాలి పేరిట యాత్రలో నారా భువనేశ్వరీ నిజం చెప్పాలి ► ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఏ రకంగా పార్టీ లాక్కున్నారో నిజం చెప్పాలి ► నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం నుంచి ఏ రకంగా తరిమేశారోనన్న నిజం చెప్పాలి ► ఎందుకు 14 కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడో నిజం చెప్పాలి ► వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబే అన్న నిజం చెప్పాలి ► రెండెకరాల నుంచి వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో నిజం చెప్పాలి ► అమరావతి పేరిట భ్రమరావతిని సృష్టించి రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేశారో నిజం చెప్పాలి ► హెరిటేజ్కు లబ్ది చేకూర్చేందుకు చిత్తూరు డెయిరీని ఏ రకంగా మూతవేశారో నిజం చెప్పాలి ► ఎస్సీలు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అసలు వైఖరిని నిజంగా బయటపెట్టాలి ► స్కిల్ స్కాం, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట వందల కోట్లు ఎలా మేశారో నిజం చెప్పాలి ► తన వాళ్ల కోసం చంద్రబాబు చేసిన మేళ్ల గురించి నిజాలు బయటపెట్టాలి 07:10 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబుకు భద్రతా అనుమానాలు ►జైల్లో తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ►గురువారం వర్చువల్ విచారణ సందర్భంగా జడ్జితో ప్రస్తావించిన బాబు ►అలాంటి సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని బాబుకి సూచించిన కోర్టు ►చంద్రబాబు రాసిన లేఖను సీజ్ చేసి సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశం ►ఆరోగ్య సమస్యలూ ఉన్నాయని జడ్జితో చెప్పిన చంద్రబాబు ►అధికారుల్ని వివరణ కోరిన ఏసీబీ న్యాయమూర్తి ►ప్రత్యేక వైద్య బృందం ఉందన్న అధికారులు ►వైద్య నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఆదేశించిన ఏసీబీ జడ్జి 07:10 AM, అక్టోబర్ 20, 2023 వెకేషన్ బెంచ్కు బెయిల్ పిటిషన్ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా ►సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ను తోసిపుచ్చిందని గుర్తు చేసిన సీఐడీ తరపు న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణ చేపట్టలేమన్న హైకోర్టు ►విచారణను దసరా తర్వాతకి వాయిదా వేసిన కోర్టు ► వెకేషన్ బెంచ్కు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేసిన బాబు లాయర్లు ►బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం ►చంద్రబాబు ఆరోగ్య సమస్యలను జడ్జి దృష్టికి తీసుకెళ్లిన బాబు లాయర్లు 06:55 AM, అక్టోబర్ 20, 2023 వివిధ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లు ►ఫైబర్ నెట్ కేసులో నేడు చంద్రబాబు పిటిషన్పై విచారణ ►ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనున్న ద్విసభ్య ధర్మాసనం ►స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్పై విచారణ ►ఇప్పటికే ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ ►నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పించనున్న ఇరుపక్షాల న్యాయవాదులు ►తీర్పు దసరా తర్వాతే వెలువడే అవకాశం? ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ నవంబరు 7కి వాయిదా ►నేడు కాల్ డేటా రికార్డింగ్(సీడీఆర్) పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ ►సుప్రీంలో ఫైబర్నెట్ కేసు విచారణ ఉండడంతో.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హాజరు పెండింగ్ ► సుప్రీం ఆదేశాల తర్వాతే.. ఫైబర్ నెట్ కేసులోనూ పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకునే ఛాన్స్ 06:35 AM, అక్టోబర్ 20, 2023 చంద్రబాబు రిమాండ్ @41 ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ ► నంద్యాలలో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►సెప్టెంబర్ 10న రిమాండ్ విధించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ► నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 41వ రోజుకి చేరిన జ్యుడీషియల్ రిమాండ్ ► 7691 నెంబర్తో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ► స్నేహా బ్లాక్లో ప్రత్యేక గది వసతి ►కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనం, స్కిన్ ఎలర్జీ దృష్ట్యా ఏసీ వసతి ►ప్రత్యేక బృందంతో రోజుకి మూడుసార్లు వైద్య పరీక్షలు ►తాజాగా.. గురువారం ఐదోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగింపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రం అట్టుడికిపోతున్నట్లు JaiTDP, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కరోజూ కూడా ఎక్కడా హెరిటేజ్ని మూసిన దాఖలాలు కనిపించలేదు. నేను వస్తున్నా అంటూ గప్పాలు కొట్టిన బాలయ్య.. హైదరాబాద్కి వెళ్లిపోయి కులాసాగా సినిమా పూర్తి చేసుకుని ఈరోజు… pic.twitter.com/C9SXh0EKTU — YSR Congress Party (@YSRCParty) October 19, 2023 -
‘కిలారు’ డుమ్మా
సాక్షి, అమరావతి: ఊహించిందే జరుగుతోంది! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుట్రలకు తెర తీసిన టీడీపీ.. కీలక సాక్షులను ప్రభావితం చేస్తోంది. ఈ స్కామ్లో అక్రమ నిధుల తరలింపులో కీలక పాత్రధారిగా ఉన్న లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ సీఐడీ దర్యాప్తునకు డుమ్మా కొట్టడమే దీనికి నిదర్శనం. తాడేపల్లిలో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయంలో సోమవారం విచారణకు హాజరైన ఆయన రెండో రోజు మంగళవారం మాత్రం ముఖం చాటేశారు. సిట్ అధికారులు తనను ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానంటూ నమ్మబలికిన కిలారు రాజేశ్ రెండో రోజు మాత్రం గైర్హాజరయ్యాడు. తాను ప్రస్తుతం విచారణకు రాలేనని, దసరా తరువాత వస్తానంటూ ఈ మెయిల్ పంపడం గమనార్హం. తొలుత పరారై.. టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాల్లో నారా లోకేశ్, కిలారు రాజేశ్ ప్రధాన పాత్ర పోషించినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. అదే విషయాన్ని సీఐడీ అదనపు డీజీ సంజయ్ ప్రకటించడంతో ఆందోళనకు గురైన మాజీ సీఎం చంద్రబాబు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాలని కిలారు రాజేశ్ను ఆదేశించారు. దీంతో ఆయన చాలా రోజులు అదృశ్యమయ్యారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని అప్పటికే విదేశాలకు పరారు కావడం గమనార్హం. చంద్రబాబు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ సీఐడీ తరపు న్యాయవాదులు ఇదే వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేసు దర్యాప్తునుచంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని, సాక్షులను బెదిరిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అనివార్యంగా హాజరు.. అనివార్యంగా హాజరు కావాల్సి రావడంతో సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చిన కిలారు రాజేష్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో బెంబేలెత్తారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, కాంట్రాక్టులకు సంబంధించిన పత్రాల గురించి సిట్ అధికారులు ప్రశి్నంచినట్లు సమాచారం. ప్రస్తుతం అవి తనవద్ద లేవని, ఇంట్లో ఉన్నాయని, సమయం ఇస్తే వాటిని తెస్తానని చెప్పిన కిలారు రాజేశ్ మర్నాడు పత్తా లేకుండా పోవడం గమనార్హం. లోకేశ్ వార్నింగ్తో మళ్లీ అజ్ఞాతంలోకి స్కిల్ స్కామ్లో నిధుల మళ్లింపుపై సిట్ కీలక ఆధారాలను సేకరించినట్లు గుర్తించిన లోకేశ్, ఆయన న్యాయ నిపుణుల బృందం కిలారు రాజేశ్ వరుసగా రెండో రోజు విచారణకు హాజరైతే మరిన్ని ఆధారాలు వెలుగు చూడటం ఖాయమని ఆందోళన చెందింది. సిట్ అధికారులు అడిగిన పత్రాలను ఇవ్వొద్దని, రెండో రోజు విచారణకు హాజరుకావొద్దని అతడిని లోకేశ్ ఆదేశించినట్లు సమాచారం. కేసు విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని లోకేష్ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో దసరా తరువాత మాత్రమే విచారణకు వస్తానంటూ మెయిల్ పంపిన కిలారు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూనే సాక్షులను ఈ స్థాయిలో బెదిరిస్తున్న చంద్రబాబు బెయిల్పై బయటకు వస్తే ఈ కేసులో కీలక సాక్షులను మరింత ఒత్తిడికి గురి చేసిదర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కిలారు రాజేశ్ గైర్హాజరును న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
మాపై సీఐడీ కేసు కొట్టేయండి
సాక్షి, అమరావతి : తమపై సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. రామోజీరావు తమను తుపాకీతో బెదిరించి, సంతకాలు ఫోర్జరీ చేసి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమకున్న షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ అయిన శైలజా కిరణ్ పేరు మీద అక్రమంగా బదలాయించుకున్నారని మార్గదర్శి ఫైనాన్సియర్స్లో వాటాదారు అయిన జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో సీఐడీ అధికారులు రామోజీరావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. రామోజీరావు, శైలజా కిరణ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సీఐడీ తరఫున స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలు మొదటిసారి విచారణకు వస్తున్నందున కేసు పూర్తి వివరాలను తెలుసుకుని, వాటిని కోర్టు ముందుంచాల్సి ఉందని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని శివకల్పనారెడ్డి కోరారు. లూథ్రా జోక్యం చేసుకుంటూ.. ఈలోపు పిటిషనర్లను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఈలోపు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈలోపు పిటిషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోబోతున్నారా.. అని శివకల్పనారెడ్డిని ప్రశ్నించారు. ఈలోపు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని శివకల్పనారెడ్డి చెప్పారు. బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోబోమంటే విచారణను వాయిదా వేస్తానని న్యాయమూర్తి తెలిపారు. దీంతో అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని శివకల్పనారెడ్డి చెప్పారు. దీనిని రికార్డ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
Ramoji : రామోజీరావు ఘరానా మోసం, CID కేసు, వెంటనే క్వాష్ పిటిషన్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావు నుంచి మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆయనపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు వెళ్లింది. మార్గదర్శిలతో తమక రావాల్సిన వాటాల కోసం వెళ్తే.. రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు గాదిరెడ్డి యూరిరెడ్డి. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి రెడ్డి కొడుకే ఈ యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని.. గతంలో స్వయంగా కలిసి షేర్ల గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అవినీతి అక్రమాల పుట్ట కదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్యే తమ షేర్హోల్డింగ్పై స్పష్టత రావడంతోనే. ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు యూరిరెడ్డి పేర్కొన్నారు. యూరిరెడ్డి ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన తన తండ్రి జీజే రెడ్డి.. జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. అదే జిల్లాలోని పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావుని.. కమ్యూనిస్ట్ నేత అయిన కొండపల్లి సీతారామయ్య ఉద్యోగం కోసం జీజే రెడ్డికి రికమండ్ చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీరావుకు టైపిస్ట్ కమ్ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే రామోజీరావు తన బిజినెస్ స్కిల్స్ చూపించి.. తన తండ్రికి దగ్గరయ్యారని, ఆపై చిట్ఫండ్కంపెనీ కోసం రూ.5 వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. ప్రతిగా మా నాన్నకు(జీజే రెడ్డికి) రామోజీరావు షేర్లు కేటాయించారు.. అని ఫిర్యాదులో యూరిరెడ్డి పేర్కొన్నారు. 1985లో తన తండ్రి జీజే రెడ్డి మరణించిన తర్వాత షేర్ల గురించి తెలియదు. అయితే.. 2014లో సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగానే తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. గుమాస్తా రామోజీ .. మరి ఎలా ఓనర్ అయ్యాడు? వాటాల కోసం పలుమార్లు సంప్రదించే యత్నం చేశాం. కానీ, రామోజీరావు మమ్మల్ని కలవలేదు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు రామోజీరావు. నా తండ్రి పేరు మీద ఉన్న షేర్లు నా పేరు మీద బదలాయించామని ఆయన్ని కోరాను. దానికి ఆయన.. కొంతకాలానికి బదిలీ చేస్తానని చెప్పారు. తిరిగి ఆయన్ని కలిశాక.. నా పేరిట షేర్లు బదిలీ చేయడానికి నా సోదరుడిని నుంచి అఫిడవిట్పై నో అబ్జెక్షన్ సంతకం చేయమన్నారు. అయితే అక్కడ ఓ ఖాళీ అఫిడవిట్ కాగితలం ఉండడంతో మేం అభ్యంతరం వ్యక్తం చేశాం. ఆ సమయంలో కోపంతో ఉన్న తుపాకీతో బెదిరించి కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేయించుకున్నట్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. కానీ, ఆ కాగితాలు చెల్లవని.. ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండడం, ఆ షేర్లు శైలజా కిరణ్ పేరు మీద బదలాయించడంతో.. దర్యాప్తు సంస్థను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అలా ఫిర్యాదు, ఇలా క్వాష్ పిటిషన్ యూరి రెడ్డి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ CID పోలీసులు కేసు నమోదు చేయగానే.. రామోజీ రావు ఎక్కడ లేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ నమోదు చేశారు. కేవలం కొన్ని గంటల్లోనే క్వాష్ పిటిషన్ వేయడం సామాన్యులెవరికీ సాధ్యం కాని విషయం. ఈ కేసు నేడు హైకోర్టు ముందు విచారణకు రానుంది. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ ఫిర్యాదు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు.. 420, 467, 120-B, R/w 34 ప్రకారం కేసు నమోదు అయ్యింది. ఈ FIRను సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ వేసింది రామోజీ టీం. -
కిలారు రాజేష్ సైలెన్స్.. మళ్లీ విచారణ
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ నేత కిలారు రాజేష్ను ఏపీ సీఐడీ సోమవారం తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో విచారించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో స్కామ్కు సంబంధించి ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టేందుకు అధికారులు యత్నించారు. అయితే విచారణలో అధికారులు వేసిన ప్రశ్నలకు మౌనంగా ఉండడం.. కొన్నింటికి తెలియదనే సమాధానం ఇవ్వడంతో మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు ఆయన్ని కోరారు. స్కిల్ స్కామ్కు సంబంధించి కిలారు రాజేష్కు సీఐడీ అధికారులు 25 ప్రశ్నల దాకా అడిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఏడు గంటలపాటు రాజేష్ విచారణ కొనసాగింది. ప్రధానంగా మనోజ్ వాసుదేవ్ పార్థసానితో సంబంధాలపైనా ప్రశ్నలు వేసింది. అయితే.. పార్థసాని ఎవరో తనకు తెలియదని రాజేష్ సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో సీఐడీ అధికారులు పార్థసానితో జరిగిన వాట్సాప్ ఛాటింగ్, నగదు ట్రాన్జాక్షన్స్ వివరాలను కిలారు రాజేష్ ముందు పెట్టడంతో ఆయన ఖంగుతిన్నారు. అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఆపై.. నారా లోకేష్తో పరిచయం, వ్యాపారాల గురించి సీఐడీ ఆరా తీసింది. కానీ, దానికి ఆయన సైలెంట్గా ఉండిపోయారు. ఆపై షెల్ కంపెనీల నుంచి వచ్చిన నగదును ఎవరెవరికి చేరవేశారని ఆరా తీశారు అధికారులు. కానీ, ఆ ప్రశ్నకు కూడా తెలియదంటూనే సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. చివరగా.. చంద్రబాబు, లోకేష్లతో జరిపిన మెయిల్స్ సంభాషణలపైనా సీఐడీ ఆరా తీసింది. తాను మెయిల్స్ చేయలేదు అనడంతో.. కొన్ని మెయిల్స్ వివరాల్ని రాజేష్ ముందు పెట్టారు అధికారులు. అది చూసి ‘‘తెలియదు.. గుర్తు లేదు..’’ అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలో కీలక ప్రశ్నలకే ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి రేపు(మంగళవారం, అక్టోబర్ 17న) విచారణకు రావాలని కిలారు రాజేష్ను సీఐడీ కోరింది. స్కిల్ స్కామ్కు సంబంధించిన విచారణ కోసం హాజరు కావాలని సీఐడీ అధికారులు కిలారు రాజేష్కు నోటీసులు జారీ చేశారు. అంతకు ముందు ఆయన ఈ కేసులో అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. స్కిల్ కేసులో రాజేష్ను నిందితుడిగా చేర్చలేదని, అవసరమైతే సీఆర్పీసీ 41 A ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ, కోర్టుకు తెలిపింది. -
తెలుగు యువత నాయకుల అత్యుత్సాహం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా కుంచనపల్లిప్రాతూరు రోడ్డులో ఉన్న ఏపీ సీఐడీ సిట్ కార్యాలయం వద్ద మంగళవారం తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిట్ కార్యాలయం గోడలు దూకేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ సీఐడీ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ సమయంలో బయటవారిని ఎవరినీ అనుమతించకుండా రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కొందరు తెలుగు యువత నాయకులు... సిట్ కార్యాలయం వెనుక వైపు గోడదూకి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకుని లోపలికి రావొద్దని పదేపదే చెప్పినా వినకుండా గోడదూకేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్రమంగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినవారిపై వీఆర్వో మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, అధికార ప్రతినిధి సజ్జ అజయ్, చందర్లపాడు మండల అధ్యక్షుడు కమ్మ గోపీచంద్, నందిగామకు చెందిన గుళ్లపల్లి ఠాగూర్బాబు, ఈపూరి వినోద్, ఏలూరు జిల్లా ఎన్ఆర్ పేటకు చెందిన నాయుడు పవన్ ఉన్నారని చెప్పారు. -
సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలి
మంగళగిరి: సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలని.. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే ఆయనకు బెయిల్ రావడం లేదని స్పష్టంచేశారు. మంగళగిరిలోని ఆరో ఏపీ ఎస్పీ బెటాలియన్లో మంగళవారం జరిగిన జాగిలాల ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెబుతున్న ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబును మోయడం తప్ప పవన్ కళ్యాణ్కు మరే ఎజెండా లేదన్నారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో 21వ జాగిలాల ప్రదర్శనలు నిర్వహించారు. అధికారుల శిక్షణలో ప్రతిభ కనబరిచిన పలు జాగిలాలు, వాటి శిక్షకులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. -
నారా లోకేష్కు మళ్లీ సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు కూడా విచారణకు రావాలంటూ ఆయన్ని అధికారులు నోటీసుల్లో కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ నారా లోకేష్ను ఏపీ సీఐడీ అధికారులు 50 దాకా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంటరాగేషన్లో లోకేష్ కీలక అంశాలకు సమాధానం ఇవ్వలేదు. చాలా ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో.. చాలా ప్రశ్నలకు లోకేష్ తెలియదనే సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. చాలా ప్రశ్నలకు ఆయన పదే పదే లాయర్ల దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. సీఐడీ విచారణలో.. హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్ను అధికారులు ప్రశ్నించగా.. తనకు తెలియదనే ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో.. లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు సీఐడీ అధికారులు చూపించడంతో ఆయన ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారని, కీలక అంశాలపై దాటవేత ధోరణిని ప్రదర్శించారు కాబట్టే.. మరోసారి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ మార్చారన్నది నారా లోకేష్పై ఉన్న ప్రధాన అభియోగం. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, హెరిటేజ్ సంస్థ ఏ6గా, నారా లోకేష్ను ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు తెలిపింది. దీంతో.. ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్ను నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నుంచి స్వల్ప ఊరట పొందిన లోకేష్ను ఇవాళ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. -
నారాయణ అల్లుడికి హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, విజయవాడ: నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీస్ క్వాష్ చేయాలన్న పునీత్ పిటిషన్ను కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్ను హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. కొత్త కోణాలు వెలుగులోకి టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్మెంట్లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్మెంట్నే మాస్టర్ప్లాన్లో పొందుపరచాలని షరతు విధించారు. అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు. చదవండి: తోడు దొంగల ‘రింగ్’! -
‘ఇన్నర్’లోనూ చుక్కెదురు
సాక్షి, అమరావతి :ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రో కోకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏ–1 నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా తాను కస్టడీలోనే ఉన్నట్లు (డీమ్డ్ కస్టడీ) భావించాలన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు రెండూ వేర్వేరు కేసులని, రెండూ కూడా వేర్వేరు లావాదేవీలకు సంబంధించినవని, రెండు కేసుల్లో దర్యాప్తు అధికారులూ వేర్వేరని, విచారించిన సాక్షులు, సేకరించిన సాక్ష్యాలు కూడా వేర్వేరని హైకోర్టు స్పష్టంచేసింది. అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీలో ఉన్నట్లు (డీమ్డ్) భావించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంగానీ, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయడంగానీ జరగలేదని, అందువల్ల ఆయన బెయిల్కు అర్హులుకాదని స్పష్టంచేసింది. చంద్రబాబు వాదనలో బలంలేదు 2022లో నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు తనను అరెస్టుచేయకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, తనను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఇలా చేస్తున్నారంటూ చంద్రబాబు వాదనలో ఎలాంటి బలంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని, ఇదే కేసులో ఏ–2 నుంచి ఏ–5 వరకు నిందితులు ముందస్తు బెయిళ్లు కూడా పొందారని న్యాయస్థానం గుర్తుచేసింది. ముందస్తు బెయిల్ విషయంలో చంద్రబాబు ఇన్నేళ్లు నిద్రపోయి, ఇప్పుడు పోలీసులను నిందిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. స్కిల్ కేసులో అరెస్టుచేసిన మరుసటిరోజే చంద్రబాబును ఇన్నర్ కేసులో కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ సీఐడీ సీఆర్పీసీ సెక్షన్–267 కింద సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని గుర్తుచేసింది. అలాగే, ఈ బెయిల్ పిటిషన్ను తన సరెండర్ పిటిషన్గా భావించి, తనకు బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు అభ్యర్థనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అలాగే, ఇన్నర్ కేసులో హైకోర్టు ముందు చంద్రబాబు భౌతిక హాజరుగానీ, వాస్తవిక లొంగుబాటు గానీ సాధ్యంకాదని, తన పిటిషన్లో చంద్రబాబు ఎక్కడా కూడా తాను హైకోర్టు ముందు లొంగిపోయేందుకు అనుమతినివ్వాలని కూడా కోరలేదని తెలిపింది. అలాంటి అభ్యర్థన ఏదీ లేనప్పుడు, ఈ పిటిషన్ను సరెండర్ పిటిషన్గా భావించలేమని తేల్చిచెప్పింది. అలాగే, బెయిల్ విషయంలో ఆ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోలేమని కూడా స్పష్టంచేసింది. అంతేకాక.. ఒకవేళ కోర్టు స్కిల్ కేసులో తన కస్టడీని ఇన్నర్ కేసులో డీమ్డ్ కస్టడీగా భావించని పక్షంలో, తాను దాఖలు చేసిన ఈ పిటిషన్ను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పరిగణించి, ముందస్తు బెయిల్ మంజూరు విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి ఏ మాత్రం వెళ్లడంలేదని, కేవలం డీమ్డ్ కస్టడీ అంశానికే పరిమితం అవుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి సోమవారం 24 పేజీల తీర్పును వెలువరించారు. క్విడ్ ప్రో కో పై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అలాగే క్విడ్ ప్రో కో కూడా జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. లింగమనేని రమేష్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ సంస్థలకు లబ్ధిచేకూర్చారని ఆరోపించింది. ఈ లబ్ధికి ప్రతిఫలంగా కరకట్ట వద్ద ఉన్న ఇంటిని లింగమనేని రమేష్ చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇక ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ప్రమోద్కుమార్ దూబే, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
బాబుకు మళ్లీ భంగపాటు
సాక్షి, అమరావతి :చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. సిŠక్ల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం తిరస్కరించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేస్తారనే సీఐడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించిన ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. సర్వత్రా తీవ్ర ఆసక్తి కలిగించిన ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు గత నెల 10 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఆయన బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకించింది. వాడీవేడిగా వాదనలు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వరుసగా మూడ్రోజులపాటు ఇరుపక్షాల న్యాయవాదులు వాడీవేడిగా వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్కుమార్ దూబే వాదనలు వినపిస్తూ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, సీఐడీ తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ విదేశాలకు పరారైన విషయాన్ని పొన్నవోలు ప్రస్తావించారు. గతంలో న్యాయస్థానం ఎదుట 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన ఆర్థిక శాఖ రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు విరుద్ధంగా పలు టీవీ చానళ్లలో మాట్లాడడాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు బెదిరింపులు, ఒత్తిడితోనే వారిద్దరూ పరారయ్యారని, పీవీ రమేశ్ మాట మార్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర సాక్షులను కూడా బెదిరించి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని పొన్నవోలు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు 44 పేజీల తీర్పును వెలువరించారు. పీటీ వారెంట్లపై విచారణ వాయిదా.. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్నెట్ కేసుల్లో చంద్రబాబును అరెస్టుచేసి విచారించేందుకు పీటీ వారెంట్లను అనుమతించాలన్న సీఐడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం వాడీవేడిగా వాదనలు సాగాయి. పీటీ వారెంట్లపై రైట్ టు ఆడియన్స్ పిటిషన్ వేశాం కాబట్టి తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద అభ్యంతరం వ్యక్తంచేశారు. పీటీ వారెంట్లపై న్యాయస్థానం ఆదేశాలు సరిపోతాయన్నారు. ఈ అంశంపై న్యాయమూర్తి లేవనెత్తిన సందేహాలకు సీఐడీ తరపు న్యాయవాది సమాధానాలు ఇస్తుండగా.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. న్యాయస్థానాన్ని ఎవరూ శాసించలేరని స్పష్టంచేస్తూ చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇలా అయితే ఈ కేసులను విచారించలేనని.. స్పెషల్ కోర్టుకో వేరే వారికో బదిలీ చేయాలని రిజిస్ట్రీకి చెబుతానన్నారు. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు వెనక్కి తగ్గారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలకు అవకాశం ఇచ్చేందుకు కేసు విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. మళ్లీ కస్టడీకి నిరాకరణ.. మరోవైపు.. చంద్రబాబును మరోసారి విచారించేందుకు కస్టడీకి అనుమతించాలన్న సీఐడీ పిటిషన్ను కూడా న్యాయమూర్తి తిరస్కరించారు. గతంలో ఇచ్చిన రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయన్ని మరోసారి విచారించేందుకు మూడ్రోజుల కస్టడీకి అనుమతించాలని సీఐడీ కోరింది. జ్యుడీషియల్ కస్టడీ 15 రోజుల గడువు ముగిసినందున మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్ను తిరస్కరించింది. -
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఐదుగురి పేర్లను కొత్తగా నిందితులుగా చేర్చింది దర్యాప్తు సంస్థ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(AP CID). సోమవారం నలుగురి పేర్లను చేరుస్తూ.. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల ( నారాయణ కళాశాల ఉద్యోగి ధనంజయ్ భార్య), ఆవుల మణి శంకర్( నారాయణ బంధువు), రాపూరి సాంబశివరావు( రమాదేవి బంధువు), వరుణ్ కుమార్ కొత్తాపు పేర్లు కేసులో చేర్చాలని మెమో దాఖలు చేసింది సీఐడీ. క్రైం నంబర్ 16/2021 గా ఇప్పటికే ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ.. సెక్షన్ 120(b), 409, 420,166,167,34,35,37,218 IPC మరియు 13(2), 13(1) ఆఫ్ పీసీ యాక్ట్ గా కేసు నమోదు చేసింది కూడా. ఇదే స్కాంలో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి పి.నారాయణ ఏ2గా, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఏ14గా ఉన్నారు. తాజాగా.. నారాయణ భార్య రమాదేవిని ఏ15గా, రావూరి సాంబశివరావు ఏ-16, ఏ-17గా ఆవుల మణిశంకర్, ఏ-18గా ప్రమీల, వరుణ్కుమార్ కొత్తాపును ఏ19గా చేర్చింది. ఈ కేసుకు సంబంధించి నారా లోకేష్కు, నారాయణకు తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏ1 చంద్రబాబు పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: నారా-నారాయణ దోపిడీ.. ఇలా.. -
Oct 8th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:30PM, అక్టోబర్ 08 2023 రేపు చంద్రబాబు కేసులకు సంబంధించి అత్యంత కీలకం 5 కేసుల్లో తీర్పు, క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ ►1. బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు తీర్పు ►2. సీఐడీ కస్టడీ పిటిషన్-ఏసీబీ కోర్టు తీర్పు ►3. అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు ►4.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు ►5. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు ►టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్కు నెల రోజులు - గత నెల 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ 6:00PM, అక్టోబర్ 08 2023 అర్జంటుగా ఇండియా కూటమికి జై కొట్టేద్దామా? ► తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అంతర్మథనం ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► టిడిపి సీనియర్ నేత సమాచారం ప్రకారం కార్యకర్తల్లో సడలిన విశ్వాసం ► ఎన్నికలకు ఏడు నెలల ముందు ఇంత గందరగోళమా? ► ఒక్క అరెస్ట్కే పార్టీ అతలాకుతులం కావాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? ► జాతీయ స్థాయిలో రెండు కూటములు తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను ఎందుకు దూరం పెడుతున్నాయి? ► నాడు మోదీని చంద్రబాబు ఎందుకు నానా మాటలు అనాలి? ఇప్పుడెందుకు లోకేష్ వెళ్లి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించాలి? ► ఇప్పటికిప్పుడు బహిరంగంగా ఇండియా కూటమికి జై కొడితే మార్పు ఉంటుందా? ► కనీసం కాంగ్రెస్ అధిష్టానంతోనయినా చంద్రబాబు అరెస్ట్ ఖండించేలా ప్రకటన చేయిద్దామా? ► మన బలహీనతను పవన్ కళ్యాణ్ ఎత్తిపొడుస్తున్నా... మనం మాత్రం జనసేనకు జై కొట్టాలా? ► తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందని పవన్ కళ్యాణ్ బహిరంగసభలో ఎలా ప్రకటిస్తాడు? ► లోకేష్ జనంలో ఉండకుండా... ఢిల్లీకి ఎందుకు పరిమితం అవుతున్నట్టు? 5:42PM, అక్టోబర్ 08 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 5:24PM, అక్టోబర్ 08 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ బస్సు యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల పడరాని పాట్లు ►చివరకు.. చంద్రబాబు భార్య భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారని ప్రకటన ►తనకు అంతగా రాజకీయాలు తెలియవని చెప్పినా భువనేశ్వరిని బలవంతంగా ఒప్పించిన సీనియర్లు ►ఈ నెల 5న కుప్పం నుంచి యాత్ర ప్రారంభిస్తారని ఎల్లో మీడియాలో కథనాలు ►మేలుకో తెలుగోడా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు ప్రచారం ►ఢిల్లీ నుంచి లోకేష్ రాగానే మారిన సీను ►తాను ఢిల్లీలో ఉంటూ అమ్మ ప్రజల్లో తిరిగితే తన పరిస్థితి ఏంటని చినబాబు సీరియస్ ►సుప్రీంకోర్టులో ఏదో ఒకటి తెలిసే వరకు ఆగాలని లోకేష్ సూచించినట్టు పార్టీలో ప్రచారం ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ఎన్నికలకు ఎలాగూ ఆరు నెలలు ఉంది కదా ఇప్పుడే తొందరెందుకు అన్నట్టుగా టిడిపి తీరు 5:04PM, అక్టోబర్ 08 2023 కుటుంబ సభ్యులను కూడా నమ్మడం లేదా? ► జైల్లో చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచి కొత్త తలనొప్పి ► పార్టీ పగ్గాల విషయంలో ఎవరినీ నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ► చంద్రబాబు అరెస్ట్ కాగానే పార్టీ సారథ్యం నేనంటూ ముందుకొచ్చిన బాలకృష్ణ ► టిడిపి కార్యాలయంలో మీటింగ్ లు పెట్టి మరీ నేనేనని ప్రకటించిన బాలకృష్ణ ► బాలకృష్ణను అత్యంత చాకచక్యంగా ఏపీ నుంచి తప్పించిన చంద్రబాబు ► తెలంగాణ ఎన్నికల వరకు ఏపీ వ్యవహారాలు పక్కనబెట్టి హైదరాబాద్ లోనే ఉండాలని బాలకృష్ణకు సూచన ► బావ మాట కాదనలేక హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పరిమితమైన బాలకృష్ణ ► తెలంగాణలో ఒక్క సీటులో కూడా తెలుగుదేశం కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి ► అయినా భీకర ప్రకటనలు చేస్తూ లేని గాంభీర్యం ప్రదర్శిస్తోన్న బాలకృష్ణ ► బావ చంద్రబాబు కొట్టిన దెబ్బను అర్థం చేసుకున్నా.. బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో బాలకృష్ణ 4:40PM, అక్టోబర్ 08 2023 పత్తా లేని చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల’ ► పక్కా ప్లాన్ తో పరారీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాసరావు చౌదరీ ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల ►శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ఈమెయిల్ ద్వారా నోటీసు పంపిన ప్రభుత్వం ►చంద్రబాబు చేసిన అక్రమ దందాల లెక్కలన్నీ పెండ్యాల హ్యండిల్ చేసినట్టు ఆధారాలు ►ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా నోటీసులు ఇచ్చింది పెండ్యాలకే ►పెండ్యాల దగ్గర స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి చంద్రబాబు సృష్టించిన బ్లాక్ మనీ రూ.2వేల కోట్లు ►లెక్కలు లేని రూ.2వేల కోట్లకు సంబంధించిన వివరాలివ్వాలని చంద్రబాబును అడిగిన ఐటీ 4:10PM, అక్టోబర్ 08 2023 రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు.. ►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు ►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు ►గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న సీఎం రమేష్, సుజనా చౌదరీ ►నడ్డాను ఎల్లో మీడియాకు తీసుకెళ్లేందుకు సర్వ శక్తులు ఒడ్డిన తెలుగు బీజేపీ నేతలు ►చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకోవాలని నడ్డాకు ఎల్లో మీడియా విజ్ఞప్తులు ►చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకుంటే.. తెలంగాణ ఎన్నికలకు సహకరిస్తామంటూ రాయబేరాలు ►చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి వచ్చేందుకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ►అయినా పట్టించుకోకపోవడంతో ఎల్లో మీడియా సంపాదకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు ►నేరుగా ప్రధాని మోదీ వ్యక్తిత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు 3:30PM, అక్టోబర్ 08 2023 ఆశలన్నీ అక్టోబర్ 9 మీదే.. ►అక్టోబర్ తొమ్మిదో తేదీపై టీడీపీ కోటీ ఆశలు ►సుప్రీంకోర్టులో కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్ నేతలతో సమాలోచనలు ► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు ► గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన ► ఇప్పటికే గట్టి వాదనలతో CIDకి కేసులో ఎడ్జ్ ► కేసు దర్యాప్తు సెక్షన్ 17A సవరణకు ముందే ప్రారంభమయిందని స్పష్టం చేసిన CID 2:31PM, అక్టోబర్ 08 2023 Justice delayed is justice denied ఎంత కరెక్టో Justice hurried is justice buried కూడా అంతే కరెక్ట్ : YSRCP ►న్యాయం ఆలస్యం కాకూడదు ►అదే విధంగా వేగంగా న్యాయ నిర్ణయాలు తీసుకోకూడదు ► రూ. 100 కోట్ల లిక్కర్ కుంభకోణం లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నాడు ► రూ. 371 కోట్ల స్కిల్ కుంభకోణం లో తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయల వచ్చాయి ,మిగిలిన సొమ్ము బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి ద్వారా బాబుకు ముట్టాయి. ►అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ. 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు ►అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4న కేంద్ర సంస్థ ఇన్కమ్ట్యాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. ►CID నోటీస్ అందుకోగానే వాళ్ళు ఇద్దరూ విదేశాలకు పారిపోయారు 2:30PM, అక్టోబర్ 08 2023 ►17 A మీద ప్రశాంత్ భూషణ్ అనే సీనియర్ న్యాయవాది 2018 నవంబర్ 15న ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ►ఆ తీర్పు ఈ ఏడాది నవంబర్ 20న విచారణకు వచ్చే అవకాశం ఉంది ►అప్పటి వరకు 17A మీద చంద్రబాబు వాదన మీద నిర్ణయం తీసుకోవద్దు అని కోరాలని సీబీసీఐడి లాయర్ల యోచన 12:52 PM, అక్టోబర్ 08 2023 టీడీపీ నేత బండారు వ్యాఖ్యల పై సుప్రీంకోర్టుకు వెళ్తా : మంత్రి రోజా ►న్యాయపరంగా పోరాడతా ►బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలి ►మహిళలను ఒకమాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలి ►మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు ►చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది ►చంద్రబాబు తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? ►టీడీపీ ఫెయిల్యూర్ను డైవర్ట్ చేయడానికే నన్ను టార్గెట్ చేశారు ►టీడీపీ, జనసేనకు దిగజారుడు రాజకీయాలే తెలుసు 12:21 PM, అక్టోబర్ 08 2023 చంద్రబాబు అక్రమంగా దోచుకున్న విషయం నిజం కాదా?: మంత్రి కాకాణి ►కోర్టులో చంద్రబాబు లాయర్లు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ►లైట్స్ ఆర్పేసి మేము దోచుకుంటాం అన్నట్లుగా టీడీపీ నేతలు కార్యక్రమాలు చేస్తున్నారు.. ►చంద్రబాబు తప్పు చేయలేదని.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కష్టపడుతోంది.. 12:09 PM, అక్టోబర్ 08 2023 లోకేష్, భువనేశ్వరి లకు సూటి ప్రశ్న ►కొంచెం సావధానముగా సమాధానం చెప్పండి Mam me nana garu edo chepparu okasari vinandi pic.twitter.com/X9QUNAXhnU — Naveen Kumar (@NaveenKNi) October 2, 2023 11:08 AM, అక్టోబర్ 08 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి: YSRCP ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అన్నారు ►అసలు Heritage విలువ ఎంత? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తల్లి భువనేశ్వరిని కూడా ఇరికించిన నారా లోకేష్#LooterLokesh#CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam#TDPInsiderTrading#TDPScams#KhaidiNo7691 pic.twitter.com/EAnSfS9Fok — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 09:55 AM, అక్టోబర్ 08 2023 టీడీపీపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు ►మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! ►రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు ►ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట ►వాళ్ళ ఆనందమే వేరులే ►మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్ గా చెప్పడం ఎదైతో ఉందో...నభూతో నభవిష్యత్ మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2023 09:30 AM, అక్టోబర్ 08 2023 చంద్రబాబు పిటిషన్ @ సుప్రీంకోర్టు ► సుప్రీంకోర్టులో 59వ నంబర్గా లిస్ట్ అయిన చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► అక్టోబర్ 9, 2023, సోమవారం రోజు సుప్రీం కోర్టులో లిస్ట్ అయిన చంద్రబాబు కేసు 08:15 AM, అక్టోబర్ 08 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో 29వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►చంద్రబాబుకు యథావిధిగా కొనసాగుతున్న భద్రత ►రేపు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టులో విచారణకు రానున్న కీలక కేసులు ►సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్వాష్పై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు ►హడావుడిగా మరోసారి ఢిల్లీ వెళ్లిన లోకేష్ ►చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు ప్రజాస్పందన కరువు ►లోకేష్ క్యాంప్ ఆఫీస్ మినహా మిగిలిన చోట్ల పెద్దగా కనిపించని ఆందోళన కార్యక్రమం Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 07:50 AM, అక్టోబర్ 08 2023 నా ఆస్తి లక్ష కోట్లు : చంద్రబాబు వీడియోను విడుదల చేసిన YSRCP ► తన ఆస్తి గురించి బహిరంగంగా ప్రసంగించిన చంద్రబాబు ► నా ఆస్తే లక్ష కోట్ల రుపాయలని ప్రకటించిన చంద్రబాబు ► ఎలక్షన్ అఫిడవిట్లో ఒక లెక్క, తెర వెనక మరో లెక్క కేవలం 2 ఎకరాలతో మొదలైన నువ్వు, అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావ్ చంద్రబాబూ? ఎంత మంది పేద ప్రజలను దోచుకుంటే అన్ని లక్షల కోట్లు సంపాదించావ్ @ncbn? #GajaDongaChandrababu#CorruptionKingCBN pic.twitter.com/v9Zqvi3Whs — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 07:46 AM, అక్టోబర్ 08 2023 దోచుకుంటే జైల్లో పెట్టరా?: మంత్రి దాడిశెట్టి రాజా ►అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.370 కోట్లు చంద్రబాబు అప్పనంగా దోచేశారు ►బాబును జైల్లో పెట్టకుండా సన్మానాలు చేస్తారా.. ►చంద్రబాబు వల్ల ఒకతరం యువత మొత్తం మోసపోయింది 07:30 AM, అక్టోబర్ 08 2023 స్కిల్ స్కాంలో ఈ సందేహాలను టీడీపీ తీరుస్తుందా? : YSRCP ► స్కిల్ కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది అక్టోబరు, 2014లో ► నిధుల విడుదల జరిగింది డిసెంబరు, 2015లో ► నిధుల విడుదల తర్వాత సెంటర్లు ప్రారంభమైంది 19 నెలల తర్వాత ► నిధుల విడుదలకు అంత ఆత్రం చూపించిన వారు సెంటర్లు ఎందుకు ఆలస్యం చేశారు? ► సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నోట్ఫైల్లో చీఫ్ సెక్రటరీ రాసిందానిపై ఏమంటారు? ► కేంద్ర సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) సెబి ద్వారా GST శాఖ (గూడ్స్ & సర్వీస్ టాక్స్)కు అలర్ట్ వచ్చిందానిపై ఏమంటారు? ► GST చంద్రబాబు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగానే బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు? ► చంద్రబాబు హయాంలో ACB (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, ఎందుకు వెంటనే ఆపేసింది ? ► ACB (అవినీతి నిరోధక శాఖ) శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అంటే విచారణ ఆపేయడానికి కారణం ఎవరు? ► సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రకటించిన చంద్రబాబు ► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తుందని చెప్పుకొచ్చిన తెలుగుదేశం నేతలు ► అసలు మాకు సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా ప్రకటించిన సీమెన్స్ ► కాదు, కాదు సీమెన్స్ గ్రాంట్ ఇన్ కైండ్ ఇచ్చిందంటూ ప్రకటించిన సుమన్ బోస్ ► అంటే కేవలం బ్రాండింగ్ కోసం సీమెన్స్ను కలుపుకున్నారా? ► మొత్తం డాక్యుమెంట్లలో ఎక్కడా డేట్, ప్లేస్తో పాటు అన్నీ ముఖ్యమైన వివరాల దగ్గర ఖాళీలెందుకు ఉంచారు? ► అసలు ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని చీకట్లో ఎందుకు చేసుకున్నారు? 07:10 AM, అక్టోబర్ 08 2023 చంద్రబాబుపై కనిపించని సానుభూతి ►కాంతితో క్రాంతి కార్యక్రమానికీ స్పందన కరువు ►బాబు అరెస్టుతో సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నాలు ►పట్టించుకోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు ►టీడీపీ ఎన్ని కార్యక్రమాలు చేసినా అన్నీ విఫలం ►బాబు అవినీతి చేశారని ప్రజలు నమ్ముతున్నారంటున్న విశ్లేషకులు ►అందుకే టీడీపీ పిలుపునకు స్పందించడంలేదని వెల్లడి 07:01 AM, అక్టోబర్ 08 2023 మళ్లీ ఢిల్లీ విమానం ఎక్కిన లోకేశ్ ►టీడీపీ శ్రేణుల్లో అయోమయం ►సీఎం జగన్ ఢిల్లీ వెళ్లగానే రాజమండ్రికి వచ్చిన చినబాబు ►సీఎం తిరిగి రాగానే మళ్లీ ఢిల్లీకి వెళ్లిన వైనం ►ఇదంతా అరెస్టు భయం వల్లే అంటున్న ఆ పార్టీ నేతలు ►కీలక వేళ పార్టీని వదిలేస్తున్నారని క్యాడర్లో ఆందోళన వీళ్లిద్దరు కలిసి రెండు పార్టీలను నడపటం 🤣#PackageStarPK #LooterLokesh pic.twitter.com/8gk2jVMiHb — Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) October 2, 2023 06:37 AM, అక్టోబర్ 08 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @29 ►స్కిల్ స్కామ్ కేసులో 29వ రోజుకి చేరిన రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా బాబు ►మూడోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తాజాగా.. అక్టోబర్ 19దాకా రిమాండ్ పొడిగింపు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలోనే ఎవరూ లేరు. అధికారంలో ఉన్నపుడు వందల మందిని అక్రమంగా అరెస్టు చేయించాడు. నేను కూడా ఆయన బాధితుడినే. @ncbn స్కామ్లు చేసి ఆధారాలతో సహా అడ్డంగా దొరికి జైలుకు వెళ్లాడు. తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు. - APSFL ఛైర్మన్ గౌతం రెడ్డి… pic.twitter.com/6TkpdCZLud — YSR Congress Party (@YSRCParty) October 7, 2023 -
Oct 7th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 08:00PM, అక్టోబర్ 07 2023 టీడీపీ నేత బండారుపై సినీనటి రమ్యకృష్ణ ఆగ్రహం ►మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా? ►బండారు సత్యనారాయణని క్షమించకూడదు ►బండారు అసభ్యంగా దూషించడం దారుణం ►మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం ►మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. ►అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, ►కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. ►నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా 07:38PM, అక్టోబర్ 07 2023 ►టిడిపి ఇచ్చిన కాంతితో క్రాంతి కార్యక్రమం పట్టించుకోని ప్రజలు ►ఇళ్లలో లైట్లు ఆర్పి క్యాండిల్స్ వెలిగించాలని టీడీపీ పిలుపు ►యథావిధిగా వ్యాపారాలు చేసుకున్న ప్రజలు 5:10 PM, అక్టోబర్ 07 2023 స్కిల్ స్కాంలో ఈ సందేహాలను టిడిపి తీరుస్తుందా? : YSRCP ► స్కిల్ కార్పోరేషన్ ఏర్పాటు జరిగింది అక్టోబరు, 2014లో ► నిధుల విడుదల జరిగింది డిసెంబరు, 2015లో ► నిధుల విడుదల తర్వాత సెంటర్లు ప్రారంభమైంది 19 నెలల తర్వాత ► నిధుల విడుదలకు అంత ఆత్రం చూపించిన వారు సెంటర్లు ఎందుకు ఆలస్యం చేశారు? ► సీమెన్స్ వాటా గురించి ఆగకుండా నిధులు విడుదల చేయమని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నోట్ఫైల్లో చీఫ్ సెక్రటరీ రాసిందానిపై ఏమంటారు? ► కేంద్ర సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) సెబి ద్వారా GST శాఖ (గూడ్స్ & సర్వీస్ టాక్స్)కు అలర్ట్ వచ్చిందానిపై ఏమంటారు? ► GST చంద్రబాబు ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగానే బాధ్యులెవరో తేల్చండి అంటూ చర్య ఎందుకు తీసుకోలేదు? ► చంద్రబాబు హయాంలో ACB (అవినీతి నిరోధక శాఖ) విచారణ ప్రారంభించి, ఎందుకు వెంటనే ఆపేసింది ? ► ACB (అవినీతి నిరోధక శాఖ) శాఖ రిపోర్టు చేసేది ముఖ్యమంత్రికే. అంటే విచారణ ఆపేయడానికి కారణం ఎవరు? ► సీమెన్స్ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రకటించిన చంద్రబాబు ► కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇస్తుందని చెప్పుకొచ్చిన తెలుగుదేశం నేతలు ► అసలు మాకు సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా ప్రకటించిన సీమెన్స్ ► కాదు, కాదు సీమెన్స్ గ్రాంట్ ఇన్ కైండ్ ఇచ్చిందంటూ ప్రకటించిన సుమన్ బోస్ ► అంటే కేవలం బ్రాండింగ్ కోసం సీమెన్స్ను కలుపుకున్నారా? ► మొత్తం డాక్యుమెంట్లలో ఎక్కడా డేట్, ప్లేస్తో పాటు అన్నీ ముఖ్యమైన వివరాల దగ్గర ఖాళీలెందుకు ఉంచారు? ► అసలు ఇంత ముఖ్యమైన ఒప్పందాన్ని చీకట్లో ఎందుకు చేసుకున్నారు? 3:10 PM, అక్టోబర్ 07 2023 మాజీ మంత్రి బండారు పై ఎంపీ నవనీత్ కౌర్ ఆగ్రహం ► బండారు నీకు అసలు సిగ్గు లేదా? ► మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా? ► మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా..? ► ఆంధ్రా, తెలంగాణ లో మహిళలను చాలా గౌరవిస్తారు ► ఈ బండారు ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడాడు ► మంత్రి రోజా కు మేం అండగా ఉంటాం ► నేనే కాదు యావత్ మహిళలంతా రోజా కు అండగా ఉంటారు ► మంత్రి రోజా సినీ పరిశ్రమలో చాలా కాలం హీరోయిన్గా ఉన్నారు ► పెద్ద పెద్ద హీరోల తో పనిచేసిన ఆమెని ఇలా కించపరుస్తారా..? ► ఈ రాజకీయ నాయకుడు మహిళల కోసం ఇంతలా దిగజారి మాట్లాడరు.! ► బండారు నీకు రాజకీయలు ముఖ్యమా..? ► లేక ఆంధ్ర, తెలంగాణ మహిళల గౌరవం ముఖ్యమా..? ► బండారుకి ఇప్పటికైనా సిగ్గురావాలి ► నేను ఎంపీగా, నటిగా, మహిళగా రోజా కి అండగా ఉంటా : ఎంపీ నవనీత్ కౌర్ 3:10 PM, అక్టోబర్ 07 2023 మళ్లీ ఢిల్లీకి లోకేష్ ► మధ్యాహ్నం రాజమండ్రి నుంచి ఢిల్లీకి లోకేష్ ► రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే మకాం ► పదో తారీఖున నేరుగా విజయవాడలోని CID ఎదుట విచారణకు లోకేష్ ► ఎలాగైనా బీజేపీ అగ్రనేతలను కలవాలని తీవ్రంగా ప్రయత్నాలు ► నిన్ననే బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ఎల్లోమీడియా అధినేతల భేటీ ► చంద్రబాబు, లోకేష్ గురించి నడ్డాకు వివరించినట్టు సమాచారం ► నడ్డా సహకారం తీసుకుని అపాయింట్మెంట్లు తీసుకోవాలని లోకేష్ యత్నాలు 3:00 PM, అక్టోబర్ 07 2023 ములాఖత్లో లోకేష్కు చంద్రబాబు ఏం చెప్పారు? ► రాజమండ్రి జైల్లో శుక్రవారం 45 నిమిషాలపాటు చంద్రబాబుతో లోకేష్ భేటీ ► పలు అంశాలపై లోకేష్తో సుదీర్ఘంగా చర్చించినట్టు వెల్లడించిన ఎల్లో మీడియా ► CID విచారణకు అక్టోబర్ 12వరకు సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో ఉండడమే బెటర్ అని లోకేష్కు సూచించినట్టు సమాచారం ► ఢిల్లీలో తన వెంట ఎంపీ/లాయర్ కనకమేడలను ఉంచుకోవాలని లోకేష్కు సూచన ► తన కేసుకు సంబంధించి ఏమేం చేయాలో లోకేష్కు సవివరంగా సూచించినట్టు సమాచారం ► క్వాష్ కొట్టేయకపోతే ఏం చేయాలి? బెయిల్ విషయంలో ఎలా ముందుకెళ్లాలి..? ► జాతీయ స్థాయిలో మనకు అనుకూలంగా ఎవరెవరు ఉన్నారు? ► రెంటికి చెడ్డ రేవడి అయినట్టుగా మన పరిస్థితి ఎందుకుంది? ► ఇంకా ఏమేం చేయాలి..? ఎవరెవరితో మాట్లాడాలి..? ► మూడు కేసుల్లో ఏదో ఒక దాంట్లో అరెస్ట్ పరిస్థితి వస్తే లోకేష్ ఏం చేయాలి? ► సాంకేతికంగా తమకు అనుకూలంగా ఉన్న అంశాలేంటీ అన్నదానిపై చర్చించినట్టు సమాచారం 2:40 PM, అక్టోబర్ 07 2023 చంద్రబాబు స్కాం బయటపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే : మంత్రి ధర్మాన ► శ్రీకాకుళం : చంద్రబాబు కేసులు కేంద్ర సంస్థలే దర్యాప్తు చేస్తున్నాయి : మంత్రి ధర్మాన ప్రసాదరావు ► ఇద్దరు వ్యక్తులకు డబ్బులు వెళ్లాయని దర్యాప్తులో తేలింది ► ఒకరు చంద్రబాబు పీఏ, మరొకరు లోకేష్ పీఏ ► మాజీ సీఎం అంటూ వదిలేయమంటే ఎలా ? ► తప్పు చేయలేదని వాదించే చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి 2:07 PM, అక్టోబర్ 07 2023 రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు.. : అచ్చెన్న ►కోర్టు విచారణపై అచ్చెన్న అడ్డగోలు వ్యాఖ్యలు ►స్కిల్ కేసులో ఎలాంటి ఆధారాల్లేవని నెల రోజుల తర్వాత AAG చావు కబురు చల్లగా చెబుతున్నారు ►ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి అంటూ కేసులు పెడుతున్నారు ►రింగ్ రోడ్డు లేదు.. బొంగు రోడ్ లేదు.. ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ కోర్టుకెళ్లాడు ►అచ్చెన్నకు YSRCP ఒకే ఒక ప్రశ్న ►తప్పు చేయలేదని ఘీంకరించే మీరు... కోర్టు ముందుకెళ్లి అరెస్ట్ చేసిన విధానం మాత్రం తప్పని ఎందుకు వాదిస్తున్నారు? 12:47 PM, అక్టోబర్ 07 2023 చంద్రబాబు ఎన్నో దీపాల్ని ఆర్పేశారు: అంబటి ►పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ పొలిటికల్ బఫూన్స్ ►అవనిగడ్డలోనేమో ఎన్డీయే నుండి బయటకు వచ్చానని పవన్ అన్నారు ►మొన్నటి మీటింగ్ లో ఎన్డీయే లోనే ఉన్నానన్నారు ►చంద్రబాబు అవినీతి పై ఇంటింటికీ ప్రచారం చేస్తామని లోకేష్ అంటున్నారు ►వారంతా పొలిటికల్ బఫూన్స్ ►పవన్ సభలు పొత్తుల ప్రకటనకు ముందు ఎలా జరిగాయి? ►ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో చూస్తే అర్థం అవుతుంది ►ప్రజలు పవన్, చంద్రబాబు పొత్తులను అంగీకరించటం లేదు ►ఆ రెండు ఓట్లు కలిసేలా లేవు ►2014-19 మధ్యలో చంద్రబాబు చేసిన స్కాంలపై విచారణ జరుగుతోంది ►ఇందులో పవన్ పాత్ర కూడా కచ్చితంగా ఉందని మా అనుమానం ►అవినీతితో అరెస్టు ఐన వ్యక్తికి మద్దతు ఇవ్వటం వెనుక కారణం.. లంచాల్లో వాటా అందటం వలనే! ►కోట్ల రూపాయలు తీసుకుని వాదించే లాయర్లను చంద్రబాబు పెట్టుకున్నారు ►ఐనాసరే ఆధారాలు పక్కాగా ఉన్నందునే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ వేశారు ►రామోజీరావు మార్గదర్శిలో, రాధాకృష్ణ ఖాతాలో కూడా అవినీతి సొమ్ము పడే ఉంటుంది ►ఎన్నో దీపాలను ఆర్పేసిన అవినీతిపరుడు చంద్రబాబు ►చంద్రబాబు అరెస్ట్ నిరసనగా.. ఇళ్లలో లైట్లు ఆర్పేయటం ఏంటి? ►పవన్ చెత్తశుద్దితో చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు ►టీడీపీ బలహీన పడిందని పవన్ స్పష్టంగా చెప్పారు ►పవన్ ఎన్డీయేతో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎలా సపోర్ట్ చేస్తారు? ►ఎన్డీయే నుండి బయటకు రాకుండా ప్రకటించిన ఈ పొత్తు అక్రమం, అనైతికం 12:05 PM, అక్టోబర్ 07 2023 సింహగిరిపై టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ ►సింహచలం వెళ్లిన బండారు సత్యమూర్తితో సహా టీడీపీ నేతలు ►రాజకీయ విమర్శలకు అనుమతి లేదన్న పోలీసులు ►పోలీసులతో వాగ్వాదానికి దిగిన పీలా సోదరులు, టీడీపీ నేతలు ►అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని పోలీసులకు బెదిరింపులు 11:35AM, అక్టోబర్ 07 2023 పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ కళ్యాణే : ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ► పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు ► పవన్ కళ్యాణ్ బిజెపిని కాదని బయటకు రమ్మనండి ► పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్ళాయో బయటకు రావడం ఖాయం ► నాకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాలా ద్వారా దేశం దాటింది ► అది దుబాయ్ కి వెళ్ళాయా? లేక రష్యాకు వెళ్ళాయా, సింహపూర్ కు వెళ్ళాయా తేలాలి ► పవన్ కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి ► లోకేష్, వ్యవస్ధలను మేనేజ్ చేసేది మీ నాన్న చంద్రబాబే ► చీకట్లో చిదంబరంను కలిసింది.. కాళ్ళు పట్టుకున్నది కూడా చంద్రబాబే ► ఓటుకు కోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబే ► వాట్ ఐయామ్ సేయింగ్, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్నది చంద్రబాబే ► తెలంగాణలో కేసులు రాగానే కరకట్టకు పారిపోయింది చంద్రబాబే ► ఇన్ని తప్పులు, ఇన్ని అక్రమాలు చేసి ఇప్పుడు ఎదురుప్రశ్నిస్తున్నారా? 11:30AM, అక్టోబర్ 07 2023 TDP నేతల సిగ్గుమాలిన వ్యాఖ్యలపై సినీ రంగం సీరియస్ ► మంత్రి RK రోజాపై బండారు దిగజారి వ్యాఖ్యలు చేశారు : సీనియర్ సినీ నటి రాధిక ► బండారు ఒక మహిళ పట్ల అలా మాట్లాడడానికి సిగ్గుండాలి ► మీకు అటెన్షన్ రావడం కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తారా? ► మీరు బయటికి వెళ్లినపుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? 11:10AM, అక్టోబర్ 07 2023 బాబు చేసింది అవినీతి.. ఉద్యమం కాదు : సజ్జల ► చంద్రబాబు అరెస్ట్పై టిడిపి చేస్తోన్న నిరసనలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన ► చంద్రబాబు విప్లవ కారుడో.. లేక ఉద్యమమో చేసి జైలుకు వెళ్లినట్లు టిడిపి హడావుడి చేస్తోంది ► చంద్రబాబు అవినీతికి స్పష్టమైన ఆధారాలున్నాయి ► తప్పు చేయకపోతే చంద్రబాబు అవినీతి పై మేం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ► చంద్రబాబు స్కిల్ స్కామ్ కు సంబంధించి 13 చోట్ల సంతకాలు పెట్టిన విషయం వాస్తవమా..కాదా ► స్కాం అంశం పక్కదోవ పట్టించడానికే ఎలక్ర్టోరల్ బాండ్స్ అంశం తెచ్చారు ► కోర్టుల్లో అన్ని విషయాలు తేలతాయి 11:00AM, అక్టోబర్ 07 2023 లోకేష్ వ్యాఖ్యలపై జైలు అధికారుల సీరియస్ ► చంద్రబాబు అరెస్ట్పై సానుభూతి కోసం లోకేష్ తాపత్రయం ► జైల్లో భద్రత లేదంటూ లోకేష్ కొత్త రాగం ► జైల్లో నక్సలైట్లు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న లోకేష్ ► వారి నుంచి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందన్న లోకేష్ ► జైలు అధికారులకు ఓ లేఖ వచ్చిందంటూ నిన్న ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు ► లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జైలు అధికారులు ► లేని కారణాలను చూపుతూ జైలును రాజకీయం చేయడంపై ఆగ్రహం ► రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మరింత భద్రత పెంపు ► ముందు వేడినీళ్లన్నారు, తర్వాత దోమలన్నారు, ఇప్పుడు మావోయిస్టులంటున్నారు.! ► రాజకీయం కోసం జైలు మీద నిందలెందుకు? ► చంద్రబాబు జైల్లో నిశ్చింతగా ఉన్నారు, ఎలాంటి ముప్పు లేదన్న అధికారులు 10:54AM, అక్టోబర్ 07 2023 శాంతి ర్యాలీ పేరిట అశాంతికి కుట్ర.? ► చంద్రబాబు అరెస్ట్పై శాంతి ర్యాలీకి తెలుగుదేశం వ్యూహం ► శాంతి ర్యాలీ పేరిట భారీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ప్లాన్ ► అంగళ్లు తరహాలో మరోసారి అల్లర్లకు అవకాశం ► అంగళ్లు ఘటనలో చూపు కోల్పోయిన కానిస్టేబుల్, 27 మందికి తీవ్ర గాయాలు ► శాంతి భద్రతల నేపథ్యంలో టీడీపీ, జనసేన, సీపీఐ నేతలకు పోలీసుల నోటీసులు ► టీడీపీ శాంతి ర్యాలీకి అనుమతి లేదని తెలిపిన పోలీసులు ► పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహిస్తామంటున్న ఆనందబాబు 08:54AM, అక్టోబర్ 07 2023 మళ్లీ ఢిల్లీ బాట పట్టిన లోకేష్ ►మళ్లీ ఢిల్లీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ►గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ యువనేత ►ములాఖత్ అయిన మరుసటి రోజే ఢిల్లీకి ►సుప్రీంకోర్టులో సోమవారం చంద్రబాబు పిటిషన్పై వాదనలు ►చంద్రబాబు కేసు వ్యవహారం నేపథ్యంలో మరోసారి ఢిల్లీకి లోకేష్ ►న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ప్రచారం ►సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా బాబు పిటిషన్పై విచారణ ►చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని టీడీపీ ఆశాభావం 07:58AM, అక్టోబర్ 07 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ►పటిష్టమైన భద్రత ఏర్పాట్లతో పాటు వైద్య సదుపాయాలు కూడా ►ములాఖత్లో నిన్న చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు ►జైల్లో ఆరోగ్యంగానే ఉన్న చంద్రబాబు ►చంద్రబాబు అరెస్టుపై ప్రజల దృష్టి కోసం టీడీపీ వరుస కార్యక్రమాలు ►ఇవాళ లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమానికి పిలుపు 07:58AM, అక్టోబర్ 07 2023 బాబు భద్రతపై లోకేష్ అతి ►చంద్రబాబు భద్రతపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు ►జైలుపై దాడి చేస్తారని బెదిరిస్తున్నారంటూ.. మీడియా ముందుకు ►జైల్లో నక్సల్స్, గంజాయి అమ్మేవాళ్లు ఖైదీలంటూ వ్యాఖ్య ►ఢిల్లీకి వెళ్లే ముందు కూడా లోకేష్ ఇలాంటి వాదన ►అప్పుడు దోమలతో చంపించేందుకు కుట్రంటూ ఆరోపించి నవ్వులపాలు ►చంద్రబాబు భద్రతపై ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూ వస్తున్న జైలు అధికారులు ► అయిన అతి చేస్తున్న లోకేష్ బాబు 07:30AM, అక్టోబర్ 07 2023 చంద్రబాబు అండ్ కో పిటిషన్ల పర్వం ►వేర్వేరు కోర్టుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరికొందరి పిటిషన్లు ►అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో .. బెయిల్ కోరుతూ పిటిషన్ ► ఏసీబీ కోర్టులో ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ ► సోమవారం తీర్పు వెలువరించనున్న ఏసీబీ జడ్జి ► స్కిల్ కేసులో ఏపీ సీఐడీ వేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని సుప్రీంలో పిటిషన్ ►సోమవారం(9వ తేదీన) సుప్రీంలో విచారణకు రానున్న పిటిషన్ ►గత వాదనల్లో ముగ్గురు లాయర్లు బాబు తరపున వాదనలు.. ఇంకెంత మంది అని బెంచ్ అసహనం ► విచారణ దశలోనే ఉంది కదా.. ఎందుకంత ఆందోళన అని బాబు లాయర్లకు ప్రశ్న ► బాబు జైల్లో ఉన్నారని.. అత్యవసరంగా విచారించాలన్న బాబు లాయర్లు ►కుదరదని చెప్పి.. విచారణ వాయిదా వేసిన ధర్మాసనం ►ఏపీ హైకోర్టు: ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో ఏ1గా చంద్రబాబు ► బెయిల్ కోసం పిటిషన్.. కొనసాగుతున్న విచారణ ► ఇన్నర్ రింగ్రోడ్డు కేసులోనే.. అక్టోబర్ 12న CID ముందు హాజరు కానున్న లోకేష్ ► ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో.. ఏ2 నారాయణ పిటిషన్లపైనా ఏపీ హైకోర్టు విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్లోనూ ఏపీ హైకోర్టు బాబు అండ్ కో పిటిషన్లు 07:08AM, అక్టోబర్ 07 2023 నిరాశ, నిస్పృహల్లో టీడీపీ ►స్కిల్ స్కామ్లో పక్కా ఆధారాలతో దొరికిన చంద్రబాబు ► బయటకు వస్తారో? రారో.. అని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన ►ఏసీబీ కోర్టులో మూడు రోజులపాటు బెయిల్ పిటిషన్పై సుదీర్ఘంగా వాదనలు ►సోమవారానికి తీర్పు వాయిదా వేసిన జడ్జి ►సీఎం హోదాలో స్కిల్డ్గా స్కామ్కు పాల్పడిన వైనాన్ని తన వాదనల్లో వినిపించిన ఏఏజీ పొన్నవోలు ►కీలక డాక్యుమెంట్లు సైతం సమర్పణ ►చంద్రబాబు ఆర్థిక లావాదేవీలను సైతం విచారించాలన్న ఏఏజీ ►కనీసం మూడు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి 06:52AM, అక్టోబర్ 07 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @28 ►స్కిల్ స్కామ్ కేసులో 28వ రోజుకి చేరిన రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా బాబు ►మూడోసారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తాజాగా.. అక్టోబర్ 19దాకా రిమాండ్ పొడిగింపు ఇంతకీ.. ఎవరి జట్టు పవనా?:YSRCP ►ఓవైపు టీడీపీతో జనసేత పొత్తు అంటావు. ►ఇంకోవైపు ఎన్డీయే నుంచి జనసేన ఇంకా బయటకు రాలేదు.. బీజేపీ కలిసి వస్తుందంటావ్. ►టీడీపీతో సమన్వయ కమిటీ అంటావు.. బీజేపీతో కూడా సమన్వయ కమిటీ వేశానంటావు. ►ఇంతకీ నువ్వు ఎవరితో ఉన్నట్టు? ►పూటకో మాట చెబుతూ.. జనసేన కార్యకర్తల్ని కూడా అయోమయానికి గురిచేస్తున్నావ్? ►అసలు వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై కనీసం నీకైనా స్పష్టత ఉందా? ఢిల్లీలో @naralokeshను కలిసేందుకు కూడా ఇష్టపడలేదు బీజేపీ పెద్దలు. నువ్వేమో ఓవైపు @JaiTDPతో పొత్తు అంటావు. ఇంకోవైపు ఎన్డీయే నుంచి ఇంకా బయటకు రాలేదంటావు. బీజేపీ మాతో కలిసి వస్తుందంటావు. టీడీపీతో సమన్వయ కమిటీ అంటావు. అదే సమయంలో బీజేపీతో కూడా సమన్వయ కమిటీ వేశానంటావు. ఇంతకీ నువ్వు… pic.twitter.com/vJwt38MGfC — YSR Congress Party (@YSRCParty) October 6, 2023 -
ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!
తెలుగుదేశం పార్టీ చేస్తున్న విన్యాసాలు గమ్మత్తుగా ఉన్నాయి. వారికి ఎప్పుడు ఏ నిరసన చేపట్టాలో కూడా తెలియనట్లుగా ఉంది. గతంలో యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరిత కేసులు పెట్టినప్పుడు ఆయన ఎదుర్కున్న తీరు.. అవినీతికి పాల్పడి ప్రభుత్వ నిధులు కైంకర్యం చేశారన్న ఆరోపణలకు గురై జైలు పాలైన చంద్రబాబు నాయుడు వైనానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. జగన్ కనీసం ప్రభుత్వంలో మంత్రి కాదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ చేపట్టిన కొన్ని పరిశ్రమలలో కొందరు పెట్టుబడులు పెట్టడాన్నే అవినీతిగా చూపించి, దానికి క్విడ్ ప్రోకో అని పేరుపెట్టి ఆయనను నిర్భంధించారు. విశేషం ఏమిటంటే ఆనాడు మంత్రివర్గం వివిధ పరిశ్రమలకు సాధారణంగా ఇచ్చిన రాయితీలను సైతం తప్పుపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలకు తనను బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినీతికి పాల్పడ్డారని సీఐడీ పలు ఆధారాలు చూపుతోంది. అయినా చంద్రబాబు అవినీతిపరుడు కాడని తెలుగుదేశం అంటోంది.ఆ పార్టీ వాదనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారు. ✍️ఇక ఆయన కుటుంబ సభ్యులు అబ్బే! మాకు ఎంతో ఆస్తి ఉంది. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్ముకుంటే రూ.400 కోట్లు వస్తాయి.. అని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎంత పద్దతిగా ,ఎంత నిజాయితీగా పాలన సాగించి ఉండాలి. కాని అందుకు విరుద్దంగా నానా రకాల స్కామ్ లకు చంద్రబాబు బృందం పాల్పడింది.జగన్ పై కేసులు పెట్టడం కోసం ఆనాడు న్యాయ వ్యవస్థను వాడుకున్నారని పలువురు మేధావులు బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. ఎందుకంటే జగన్ తో కాని, ఆయన సంస్థలతో కాని సంబంధం లేని వ్యక్తి ఒకరు హైకోర్టుకు లేఖ రాస్తే.. దానిపై కనీసం సంతకం లేకపోయినా విచారణకు తీసుకున్న తీరు విమర్శలకు గురి అయింది. దానిని అత్యంత వేగంగా సీఐబీకి అప్పగించారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తికి ఉమ్మడి ఏపీలో ఒక ఉన్నత పదవి కూడా ఇవ్వడంతో పలు విమర్శలు వచ్చాయి. సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై ఒక కేసు కాదు.. పదకొండు కేసులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అప్పట్లో ఎంతగానో నష్టపోయింది. సోనియాగాంధీ, చంద్రబాబు, ఆ సీబీఐ అధికారి అందుకు కారణం అని నిర్వివాదాంశంగా అంతా భావిస్తారు. పరిశ్రమలు పెట్టకుండా బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారేమో దర్జాగా బయట తిరుగుతుంటే వారి జోలికి వెళ్లని సీబీఐ.. ఏపీలో మాత్రం పరిశ్రమలు పెట్టేవారిని అరెస్టు చేసింది. వీరి కుట్ర కారణంగా చీరాల,రేపల్లె ప్రాంతంలో రావాల్సిన పలు భారీ పరిశ్రమలు ఆగిపోయాయి. పదమూడువేల ఎకరాలు సేకరించినప్పటికీ వాటిని నిరుపయోగంగా ఉంచేయవలసి వచ్చింది. అది వినియోగంలోకి వచ్చి ఉంటే వేలాది మందికి ఉపాది కల్పిస్తున్న మరో శ్రీసిటీ తయారయ్యే అవకాశం ఉండేది. అలా జరగనివ్వకుండా అభివృద్దిని అడ్డుకోవడమే కాకుండా ,జగన్ ను ఎలాగైనా రాజకీయాలలో లేకుండా చేయాలని సోనియా, చంద్రబాబులు విపరీతమైన కృషి చేశారు. అప్పట్లో హైకోర్టులో ఈ కేసు రాగానే ఇదేదో కుట్రేమో అని చాలామంది అనుకున్నారు. అలాగే ఆ వ్యవహారం కొనసాగింది. ✍️సీబీఐ జగన్కు నోటీసు ఇస్తే.. ఆయన దానిపై విమర్శలు చేయలేదు. మాచర్ల వద్ద ఆయన ప్రచార సభలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట తేదీ ప్రకారం సీబీఐ విచారణకు వెళ్లారు. కొన్ని రోజులు ఆ విచారణ చేశాక ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఉమ్మడి ఏపీ అంతటా అలజడి ఏర్పడింది. కాని గొడవలు జరగలేదు. ప్రజలంతా ఇది కుట్ర అని నమ్మారు. అందుకే ఆ టైమ్ లో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 ఉప ఎన్నికలకుగాను.. పదిహేను చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, టీఆర్ఎస్ ఒక చోట గెలిచాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అలా ప్రజల మద్దతు జగన్ కు లభించింది. ✍️ఆయన జైలులో ఉన్న పదహారు నెలలు న్యాయ పోరాటం చేశారే కాని, రోడ్లపై ఆందోళనలు జరపలేదు. కేవలం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టుకున్నందుకే జగన్ అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. తనకు సమస్యలు వస్తాయని తెలిసినా.. జగన్ ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారే కాని, ఎక్కడా తగ్గలేదు. డప్పులు కొట్టడాలు, ఈలలు ఊదడాలు వంటివి చేయలేదు. ఆ రోజుల్లో జగన్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత ఘోరమైన కధనాలు రాసేవో తలచుకుంటే చీదర వేస్తోంది. సీబీఐ విచారణ పేరుతో ఉన్నవి.. లేనివి రాసేవారు. పలుమార్లు జగన్ను తీహారు జైలుకు పంపేస్తారని, ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని వార్తలు వండేవారు. తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా విమర్శలు చేసేది అంటే.. వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగేది. చివరికి జగన్ సతీమణి భారతి వెళ్లి ఆయనను జైలులో కలిస్తే కూడా టీడీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు..అయినా జగన్ ఓర్పు వహించారు. సహించారు. ధైర్యంతో నిలబడ్డారు. తదుపరి 2014లో అనూహ్యంగా తన పార్టీ గెలవకపోయినా ఆయన చలించకుండా తనదైన శైలిలో ప్రజలలో తిరిగి వారి ఆదరణ పొందారు. అది జగన్ ధైర్యం. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానివి. జగన్ ప్రభుత్వం రాగానే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వాటిలో వాస్తవాలను వెలికితీయించింది. అవినీతికి ఆధారాలను కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వమే కాదు. కేంద్రానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు కు ఒక నోటీసు పంపి రూ. 118 కోట్ల రూపాయల నల్లధనం ఆయన ఖాతాలలోకి వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపి వివరణ కోరింది. అంతకుముందు చంద్రబాబు పీఎస్గా ఉన్న శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరపడం, చంద్రబాబు టైమ్ లో కాంట్రాక్టులు పొందిన షాపూర్ జీ సంస్థలలో దొరికిన ఆధారాలతో రెండువేల కోట్ల అవకతవకతలు జరిగినట్లు అధికారికంగానే సీబీటీడీ ప్రకటించింది. అయినప్పటికీ చంద్రబాబు అత్యంత నీతిమంతుడని తెలుగుదేశం కాని, ఆయన కుటుంబ సభ్యులు కాని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని అవినీతిని సహించను అంటూ బీరాలు పలికిన రామోజీరావు కూడా చంద్రబాబు అసలు అవినీతికి పాల్పడలేదని డబాయిస్తూ కధనాలు ఇస్తున్నారు. తెలుగుదేశం కరపత్రికగా ఈనాడు మీడియాను ఆయన మార్చేశారు. ఆయన పత్రిక చూసినా, ఆయన టీవీని చూసినా నిత్యం అబద్దాలు తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. పూర్తిగా విశ్వసనీయతను రామోజీ కోల్పోయారు. ✍️ఇక ఆంద్రజ్యోతి ,టివి 5 వంటి వాటి గురించి రాయడం వృధా. వారు ఎప్పటినుంచో బట్టలు ఊడదీసుకుని శరభ,శరభ అంటూ వేప రెమ్మలు కట్టుకుని తిరుగుతున్నారు. సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసింది. తెలుగుదేశం వారంతా తమ అధినేత దొరికిపోయారే అని మదనపడుతున్న తరుణంలో ,ఎల్లో మీడియా మాత్రం అసలు ఏమీ జరగలేదని, స్కిల్ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారంటూ పిచ్చి ప్రచారం ఆరంభించింది. అంతే తప్ప 240 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు, లోకేష్ లకే చేరిందన్న సీఐడీ వాదనకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు,అమరావతి అస్సైన్డ్ భూములు మొదలైన స్కాములన్నిటిపైన సాక్ష్యాధారాలతో ఏపీ సీఐడీ కేసులు పెడుతుంటే.. వీరికి గుక్క తిరగడం లేదు.గతంలో జగన్ పై కేసులు పెట్టి సీబీఐ విచారణ పేరుతో తంతు సాగిస్తే, ఇప్పుడు సీఐడీ పూర్తి విచారణ చేపట్టి, ఆధారాలు దొరికిన తర్వాతే ,వందల కోట్లు స్వాహా అయ్యాయని నమ్మిన తర్వాతే చంద్రబాబుపై, ఆయన అనుచరులపై కేసులు పెట్టింది. ✍️గతంలో న్యాయ వ్యవస్థలో తాము ఏమి అనుకుంటే అది జరుగుతుందని భావించిన తెలుగుదేశం పార్టీవారికి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటే వాటిని తట్టుకోలేకపోతున్నారు. జగన్ కేసుల్లో కాని, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వివిధ విషయాలలో న్యాయ వ్యవస్థ అనుసరించిన వైఖరిపై కూడా విమర్శలు వస్తే , ఆ వ్యవస్తనే తప్పు పడతారా అంటూ తెలుగుదేశం దీర్ఘాలు తీసేది.కాని తన విషయానికి వచ్చేసరికి మాత్రం జడ్జిలను వ్యక్తిగతంగా దూషించడానికి వెనుకాడలేదు. కోర్టులు అన్నిటిని పరిశీలించి చంద్రబాబును రిమాండ్ ద్వారా జైలుకు పంపింది. కింది కోర్టులలో సానుకూల తీర్పులు రాకపోవడంతో ప్రస్తుతం సుప్రింకోర్టుకు చంద్రబాబు వెళ్లారు.ఈలోగా కేసులకు భయపడి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఢిల్లీకి చిత్తగించి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఇంతకాలం మమ్మల్ని ఏమీ చేయలేరు.. ఏం పీకారు..అంటూ రోతరోతగా మాట్లాడిన వీరు ఇప్పుడు హడలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్రమ కేసులు అంటూ నిరసనలు, ర్యాలీలు తీస్తున్నారు. క్యాండిళ్లు వెలిగిస్తున్నారు. డప్పులు కొడుతున్నారు. విజిల్స్ ఊదుతున్నారు.వాటిని చూసేవారు ఆశ్చర్యపోయే పరిస్థితి. ✍️చంద్రబాబు జైలుకు వెళితే వీరు సంబరాలు చేసుకున్నట్లు ఉంది తప్ప బాధపడుతున్నట్లు లేదని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజంగానే చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆ డప్పు కొట్టడం ఏమిటి? విజిల్ ఊదడం ఏమిటి? శాసనసభలో ఆమె తండ్రి బాలకృష్ణ అలాగే విజిల్ ఊది నవ్వులపాలైతే, అదే దారిలో ఆమె కూడా వ్యవహరించడం విడ్డూరంగానే ఉంది. వీరు ప్లేట్లు తీసుకుని మోత చేస్తుంటే, గతంలో చంద్రబాబు పాలనలో కాపు రిజర్వేషన్ ఆందోళనకారులు కంచాలు కొట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించింది అందరికి గుర్తుకు వచ్చింది.గతంలో జగన్ ను కోర్టు జైలుకు పంపింది కనుక అవన్ని సక్రమ కేసులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు అదే కోర్టు తనను జైలుకు పంపితే మాత్రం అది అక్రమం అని అంటున్నారు.ఆయన నిరసన దీక్ష చేశారట ఆయనకు సంఘీబావంగా ఆయన భార్య భువనేశ్వరి కూడా దీక్ష చేశారు.ఇవి నిరసనలతో పోయే కేసులా? కోర్టులలో రుజువు చేసుకోవలసిన కేసులు కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కాకపోతే చంద్రబాబు జైలుకు వెళితే వెళ్లారు ..కనీసం సానుభూతి అయినా సంపాదించాలన్న యావలో ఇలా చేస్తున్నట్లుగా ఉంది. ✍️అప్పట్లో జగన్ ముందుగా బెయిల్ కోసం ప్రయత్నించారు.కాని దానికి కూడా అడుగడుగునా అడ్డుపడేవారు. మామూలుగా అయితే మూడు రోజులలో బెయిల్ రావల్సిన కేసుల్లో జగన్ ను కాబట్టి పదహారు నెలలు ఉంచారని ఒక సీనియర్ న్యాయవాది అప్పట్లో నాతో చెప్పారు. ఇప్పుడు బెయిల్ కోసం కాకుండా కేసును కొట్టివేయించుకోవాలని చంద్రబాబు లాయర్ల ప్రయత్నమట.అందుకే కేసు లోతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాలకే పరిమితమై వాదనలు చేస్తున్నారు. అప్పట్లో జగన్ లాయర్లు ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు. కాని చంద్రబాబు లాయర్ మాత్రం తాము కోరుకున్న న్యాయం దొరకకపోతే కత్తిపట్టాలన్న ఒక సూక్తిని ప్రచారంలోకి తెచ్చారు.తద్వారా వారు ఎంత డిస్పరేట్ గా ఉందీ తెలియచెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థలో తన ఇష్టం వచ్చినట్లు చెలామణి చేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు కాలం మారిందన్న సంగతి అర్దం అవుతుండాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘స్కిల్ స్కామ్’ సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అనేందుకు ఆధారాలను సీఐడీ ఒక్కొక్కటిగా కోర్టు ముందుంచుతోంది. ఈ కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి గురువారం ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు. ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని ఏఏజీ స్పష్టంచేశారు. దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే చేరాయని చెప్పారు. అందులో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని చెబుతూ ఆ రికార్డులను న్యాయస్థానానికి సమర్పించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయకూడదని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా రెండో రోజు గురువారం విచారించింది. సీఐడీ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా తరలించిన నిధుల్లో రూ.27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరడం సాధారణ విషయం కాదని చెప్పారు. ఈ అంశంపై విచారించేందుకు టీడీపీ ఆడిటర్ను ఈ నెల 10న సీఐడీ విచారణకు పిలిచిందని తెలిపారు. ఈ కుంభకోణంలో మిగిలిన నిధులు కూడా షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ఎలా చేరాయో వివరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేశారని చెప్పారు. నిధుల విడుదలకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని తెలిపారు. నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ను సీఐడీ విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వగానే ఆయన పరారైన విషయాన్ని మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దారి మళ్లాయని గతంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చిన అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఇటీవల అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలని చెప్పారు. దర్యాప్తు సక్రమంగా సాగి మొత్తం కుట్రను వెలికితీసే వరకూ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. రెండు రోజుల కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించలేదని, అందువల్ల ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఒప్పందంతో అప్పటి సీఎం చంద్రబాబు పాత్ర ముగిసిందని, ఆ తరువాత జరిగే అవినీతి, అక్రమాలతో ఆయనకు సంబంధం లేదని అన్నారు. సాంకేతికంగా ఈ ప్రాజెక్టుతో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. సీఎం హోదాలోనే చంద్రబాబు నిధుల మంజూరుకు అనుమతించారని చెప్పారు. కాబట్టి చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను శుక్రవారం కూడా వింటామని ఏసీబీ న్యాయస్థానం తెలిపింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు
సాక్షి, అమరావతి : ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలన్నీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే జరిగాయని హైకోర్టుకు సీఐడీ నివేదించింది. ప్రాజెక్టు రూపకల్పన మొదలు అమలు వరకు ప్రతి దశలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.333 కోట్లకు పెంచారని చెప్పారు. ఈ విషయాన్ని పలువురు వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇరుపక్షాలు పోటాపోటీగా వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తవడంతో తీర్పును రిజర్వ్ చేస్తూ జస్టిస్ సురేష్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. టెండర్ నిబంధనలు, ఒప్పందంలో నిర్దేశించిన ప్రమాణాలకు భిన్నంగా కాంట్రాక్టు సంస్థ నాసిరకం సామగ్రిని ఉపయోగించిందని, దీనివల్ల ఖజానాకు రూ.115 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. ఈ మొత్తాన్ని టెరాసాఫ్ట్ అధినేత, చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్ తొలుత తన కుటుంబ సభ్యుల ఖాతాలకు, అక్కడి నుంచి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించారన్నారు. ఈ విషయంలో మరిన్ని వివరాలను రాబట్టేందుకు చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసలు వేమూరి హరిప్రసాద్ చంద్రబాబు సిఫారసుతోనే గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడు అయ్యారన్నారు. టెరాసాఫ్ట్కు లబ్ధి చేకూర్చేందుకే ఎలాంటి కారణం లేకుండా టెండర్ గడువును పొడిగించారని తెలిపారు. చంద్రబాబు కార్యాలయం మౌఖిక ఆదేశాలతో టెండర్ గడువు చివరి తేదీకి ముందు రోజు టెరాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారని కోర్టుకు నివేదించారు. సంబంధిత శాఖకు ఇన్చార్జ్గా ఉన్న ఓ ఉన్నతాధికారి టెరాసాఫ్ట్కు ప్రాజెక్టు అప్పగించడంపై అభ్యంతరం తెలిపారని, దీంతో ఆయన్ని బదిలీ చేసి, నామమాత్రపు పోస్టు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించలేదని, ఆ తరువాత సీఐడీ పలువురు వాంగ్మూలాలను నమోదు చేసి, లోతైన దర్యాప్తు చేసిందన్నారు. దీంతో చంద్రబాబు పాత్రపై పలు ఆధారాలు లభించాయని, ఆయన్ని నిందితునిగా చేర్చామని అన్నారు. చంద్రబాబు కుమారుడు రెడ్ బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తే కాక, బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేయగల సమర్థత ఉన్న వ్యక్తి కూడానని కోర్టుకు వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబుపై కేసు నమోదు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. చంద్రబాబు లబ్ధి పొందినట్లు ఒక్క ఆధారం చూపలేదు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ ఈ కేసు నమోదు చేసి రెండేళ్లయిందని, ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేయలేదని, చార్జిషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. ప్రాజెక్టు వ్యయం పెంపు పూర్తిగా సంబంధిత శాఖ అంతర్గత విషయమన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లబ్ధి పొందినట్లు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపడంలేదన్నారు. ఈ రెండేళ్లు చంద్రబాబు బయటే ఉన్నారని, ఒక్క సాక్షిని కూడా ప్రభావితం చేయలేదని చెప్పారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వ ప్రోద్బలంతో సీఐడీ ఈ కేసు నమోదు చేసిందన్నారు. ప్రతి కేసులో చంద్రబాబును జైలులోనే ఉంచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోందన్నారు. -
Oct 5th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates 6:05 PM, అక్టోబర్ 05 2023 మెదక్ : చంద్రబాబునాయుడిని జనమే బ్యాన్ చేశారు : మంత్రి హరీష్ రావు ► మెదక్ జిల్లా సభలో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీష్రావు ► కులాలు, జాతుల గురించి చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదు ► చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు ► చివరకు ప్రజలు ఆయన్నే బ్యాన్ చేశారు, ఇప్పుడు జైలుకు పంపారు ► చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు 6:00 PM, అక్టోబర్ 05 2023 ఎట్టకేలకు ఢిల్లీ వదిలిన లోకేష్ ► ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 22 రోజుల పాటు ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► రఘురామకృష్ణరాజుతో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చలు జరిపిన లోకేష్ ► వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, ఎంపీ రఘురామ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తండ్రి చంద్రబాబును ములాఖత్లో కుటుంబసభ్యులతో పాటు కలవనున్న లోకేష్ ► చంద్రబాబుకు మరో 14 రోజులు పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం ► ఆదివారం మళ్లీ లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోతాడని ప్రచారం ► సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ► విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు లాయర్లతో కలిసి వెళ్లనున్న నారా లోకేష్ 5:10 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు నేర చరిత్రపై YSRCP విమర్శలు ► పదవిని అడ్డుపెట్టుకుని రూ.6 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శ ► దోపిడిలో లోకేష్, పవన్ కళ్యాణ్లకు వాటా ఉందని విమర్శ Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money! Costarring his coterie of co-looters Guru - Mr Ramoji Rao Biological Son - Mr @NaraLokesh Adopted Son - Mr @PawanKalyan And… pic.twitter.com/tuQHUCEFPy — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 5:00 PM, అక్టోబర్ 05 2023 రేపు ACB కోర్టులో చంద్రబాబు బెయిల్పై వాదనలు ► విజయవాడ : చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా ► రేపు మధ్యాహ్నం బాబు న్యాయవాది దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న AAG పొన్నవోలు ► రేపు మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ PT వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 4:45 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : చంద్రబాబు బెయిల్పై తీర్పు రిజర్వ్ ► హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముగిసిన వాదనలు ► చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు ► స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారు ► చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు మాకు సమాచారం ఉంది ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు ► చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు 4:45 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం నిధులన్నీ చంద్రబాబు ఖాతాలకు చేరాయి : సజ్జల ► స్కిల్ స్కామ్ కేసులో CID ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు తెలిపింది ► స్కామ్లో డబ్బులు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లినట్టు CID ఆధారాలు సేకరించింది ► ఈ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందని CID దర్యాప్తులో తేలింది ► NDA కూటమి నుంచి బయటకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది ► టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ► పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలి ► అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలి ► చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు ► ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదు : సజ్జల 4:38 PM, అక్టోబర్ 05 2023 స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు 4:31 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా ► రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ► రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటానన్న న్యాయమూర్తి ► ఇవాళ హోరాహోరీగా సాగిన ఇరుపక్షాల వాదనలు 2:50 PM, అక్టోబర్ 05 2023 బుద్ధా వెంకన్న కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్న పిటిషన్ ► పేర్నినాని పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించిన బుద్ధా వెంకన్న ► వల్లభనేని వంశీ, కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్నపై కేసు ► గన్నవరం ఆత్కూరు స్టేషన్లో కేసు పెట్టిన పేర్నినాని ► బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు 2:50 PM, అక్టోబర్ 05 2023 బండారు కేసు @ హైకోర్టు ► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బండారు పిటిషన్ ► తనపై పెట్టిన కేసును సవాలు చేసిన టిడిపి నేత బండారు ► బండారు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్కు హైకోర్టు సూచన ► ఇటీవల మంత్రి రోజాపై నీచ వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు ► మహిళలను కించపరిచినవారు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్న మంత్రి రోజా ❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU — Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023 2:45 PM, అక్టోబర్ 05 2023 లంచ్ తర్వాత వాదనలు పునఃప్రారంభం ► ఏపీ హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు ► ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు 2:15 PM, అక్టోబర్ 05 2023 తెలుగుదేశం, జనసేనలకు YSRCP చురకలు ► ఎన్నికలు రాగానే ప్యాకేజీ రాజకీయాలా? ► ఇవేం పార్టీలు, ఇవేం పొత్తులు : అంబటి జనసేన రాజకీయ పార్టీ కాదు ! తెలుగుదేశం బలహీనపడినప్పుడు వాడే బలం మందు! @PawanKalyan @naralokesh @JaiTDP — Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2023 1:50 PM, అక్టోబర్ 05 2023 బాబు బయటకు వస్తే.. సాక్ష్యాధారాలు తారుమారే ► ఏపీ హైకోర్టు: ఫైబర్గ్రిడ్ కేసు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరు అనటం సరికాదు ► పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయం గుర్తించాం ► అందుకే నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చాం ► టెరా సాప్ట్ కు పనులు ఇవ్వటం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయి ► నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు 1:40 PM, అక్టోబర్ 05 2023 మద్ధతివ్వండి ప్లీజ్.. CPIని రిక్వెస్ట్ చేసిన TDP ► గుంటూరు జిల్లా CPI కార్యాలయానికి వెళ్లిన TDP నాయకులు ► ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్తో TDP నేతల భేటీ ► TDP బృందంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ ► ఈ నెల 7న జరిగే శాంతి ర్యాలీకు CPI మద్దతు కోరిన TDP నాయకులు 1:20 PM, అక్టోబర్ 05 2023 ఓట్ల కోసం కక్కుర్తి పడతారా? మీలో మీకైనా కనీస గౌరవముందా? ► తెలుగుదేశం, జనసేన నాయకులపై YSRCP విమర్శలు ► మీలో మీకే గౌరవం లేదు, ప్రజలను ఏం గౌరవిస్తారని ప్రశ్న మనసులో లేని ప్రేమ, అభిమానాన్ని నటిస్తూ అధికారం కోసం @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నాయి. కానీ.. ఎంత సీనియర్ నటులైనా లేని గౌరవాన్ని అన్నివేళలా నటించడం సాధ్యం కాదు కదా..? చంద్రబాబుని గాడు అని @PawanKalyan సంభోదిస్తే.. ఆ పవన్ కళ్యాణ్ని మరింత వెటకారంగా గాడూ అంటూ నందమూరి… pic.twitter.com/VXuaS4QYhQ — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 1:10 PM, అక్టోబర్ 05 2023 కార్పోరేషన్ తప్పు చేస్తే.. చంద్రబాబుకేంటీ సంబంధం : బాబు లాయర్ వాదన ► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు ► దూబే : సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► న్యాయమూర్తి : చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కార్పోరేషనుకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటీ? ► దూబే : స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయింది ► బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పోరేషన్కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ► సీమెన్స్తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు ► స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది ► అక్కడ అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉన్నట్టు? : దూబే 12:50 PM, అక్టోబర్ 05 2023 హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ వాదనలు ► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై హైకోర్టులో వాదనలు ► ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనలు ప్రకారమే బిడ్డర్కు ఇచ్చారు ► ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు, ► ఈ కేసులో కొందరికి బెయిల్ లభించింది ► చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలి : లాయర్ అగర్వాల్ 12:38 PM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పాత్రకు ఇవే ఆధారాలు : ACB కోర్టులో పొన్నవోలు ► విజయవాడ : రెండో రోజు ACB కోర్టులో సంచలన నిజాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ► నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారు ► చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పణ ► ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పణ ► రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ACB కోర్టుకు సమర్పణ ► దీనికి సంబంధించిన ఆడిటర్ను విచారణకు పిలిచాం ► ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారు ► డొల్ల కంపెనీలని సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని వివరించిన పొన్నవోలు 12:30 PM, అక్టోబర్ 05 2023 ఫైబర్నెట్ స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర ► ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంలో వాదనలు ► తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్ ► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు ► చంద్రబాబు నాయుడు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించాలన్న AG శ్రీరామ్ 12:30 PM, అక్టోబర్ 05 2023 భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి : YSRCP ► భువనేశ్వరీ ఇటీవల చేసిన ప్రకటనపై నారుమల్లి పద్మజ విమర్శలు ►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా? ►హెరిటేజ్లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు ►దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి, ఆస్తుల అఫిడవిట్లపై విచారణ జరపాలి ►బండారు సత్యనారాయణ లాంటి కీచకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతన్నారు ►ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సాహిస్తున్నారు? ►ఒక మహిళ కన్నీరు తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారంటే టీడీపీ వారి పైశాచికత్వాన్ని ఏం అనాలి? ►భువనేశ్వరి సభలో ఒక పిల్లాడితో చండాలంగా మాట్లాడించారు ►భువనేశ్వరి చప్పట్లు కొడుతుంటే అసలు వీరు మహిళలేనా అనిపిస్తోంది ►చంద్రబాబు చేసిన స్కాంలలో కూడా భువనేశ్వరి పాత్ర ఉందనే అనుమానం వస్తోంది ►విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? 12:24 PM, అక్టోబర్ 05 2023 బెయిల్ ఇవ్వొద్దు, కస్టడీకి అప్పగించండి : CID లాయర్ పొన్నవోలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే ► కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుంది ► బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన అదనపు అడ్వకేట్ జనరల్ 12:10 PM, అక్టోబర్ 05 2023 ఇవ్వాళ ACB కోర్టు ముందుకు చంద్రబాబు ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్పై నేడు కోర్టు నిర్ణయం ► ఇవాళ ACB కోర్టు ముందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు హాజరు ► ఈ సాయంత్రానికి రాజమండ్రికి నారా లోకేష్ ► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేష్ 12:04 PM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు ► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి ► చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు ► రూ.27 కోట్లు నేరుగా టిడిపి ఖాతాలో జమ అయ్యాయి ► ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు ► న్యాయం ముందు అందరూ సమానమే.... ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే ► ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? ► ఇది మామూలు కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు ► చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు 11:43 AM, అక్టోబర్ 05 2023 జైల్లో చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల కుస్తీలు ► కృష్ణా జిల్లా : పెనమలూరు టీడీపీలో టిక్కెట్ చిచ్చు ► ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్న దేవినేని గౌతమ్ ► జనసేన మద్ధతుతో పెనమలూరు టిడిపి టిక్కెట్ దేవినేని గౌతమ్కు ఇస్తారని ప్రచారం ► పార్టీలో పరిస్థితుల పై నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్ అసహనం ► దేవినేని గౌతమ్కు టిడిపి టికెట్ ఇస్తే.. పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా : బోడే ► క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ క్యాడర్ అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా 11:43 AM, అక్టోబర్ 05 2023 ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టుకు ఫిర్యాదు ► విజయవాడ : ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ► ఎల్లో మీడియా తప్పుడు కథనాలను కోర్టు ముందు ప్రస్తావించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి ► ACB జడ్జి తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తప్పుడు కథనాలు రాశారని తెలిపిన పొన్నవోలు ► తప్పుడు కవరేజీపై కోర్టు ఆగ్రహం ► విచారణ జరుగుతున్న హాలులో న్యాయవాదులు కాకుండా ఇంకెవరూ వుండకూడదని న్యాయమూర్తి ఆదేశం 11:40 AM, అక్టోబర్ 05 2023 TDP, జనసేన అట్టర్ఫ్లాప్: జోగి రమేష్ ► తాడేపల్లి : టీడీపీ, జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం ► టీడీపీ, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది ► పవన్ మీటింగ్ అట్టర్ ప్లాప్ షోలా మారిపోయింది ► పవన్ తాట తీస్తానని చెప్పి రెండు చోట్లా ఓడిపోయాడు ► ఎలాంటి విలువలు, విశ్వసనీయత లేని మనిషి పవన్ ► రంగాను చంపించిన వారికి అమ్ముడుపోతావా పవన్? ► కాపుల కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు వేధించారు ► పవన్ మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది రాలేదు ► చేసిన తప్పుకు చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు టీడీపీ, జనసేన పార్టీల కలయిక వైరస్ లాంటిది కాబట్టే.. రెండు పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. - మంత్రి జోగి రమేష్ #PackageStarPK#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/FwjhTPedU2 — YSR Congress Party (@YSRCParty) October 5, 2023 11:35 AM, అక్టోబర్ 05 2023 NDA నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే : పవన్ కళ్యాణ్ ► నాకు చాలా ఇబ్బందులున్నాయి ► NDAలో భాగస్వామి ఉండి కూడా.. నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపాను ► వంద శాతం నా మద్ధతు ఎందుకు ప్రకటించానంటే.. ► ఎందుకంటే తెలుగుదేశం చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి ► తెలుగుదేశం నాయకులు చాలా బలహీనంగా ఉన్నారు ► మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన పోరాట పటిమ టిడిపికి అవసరం కాబట్టి మద్ధతిచ్చాను #PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd — Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023 11:30 AM, అక్టోబర్ 05 2023 NDAకు పవన్ కళ్యాణ్ రాం రాం.! ► తెలుగుదేశం కోసం పవన్కళ్యాణ్ NDAకు గుడ్బై ► ప్రకటించిన జాతీయ న్యూస్ ఏజెన్సీ ANI Actor, Politician Pawan Kalyan exits NDA to support Chandrababu Naidu Read @ANI Story | https://t.co/K8qOh21K9Y#PawanKalyan #NDA #ChandrababuNaidu pic.twitter.com/Ojlq1ylmg1 — ANI Digital (@ani_digital) October 5, 2023 11:20AM, అక్టోబర్ 05 2023 ACB కోర్టులో రిమాండ్ మెమో ► విజయవాడ : చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన CID ► 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసిన సీఐడీ 11:00AM, అక్టోబర్ 05 2023 ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ అగర్వాల్, లూథ్రా 10:40AM, అక్టోబర్ 05 2023 బాబు స్కీంలు ఇవ్వలేదు.. స్కాంలు చేశారు ►చంద్రబాబు స్కీం లు ఇవ్వలేదు, స్కాంలకు పాల్పడ్డారు ►తాను కట్టిన జైల్లో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు ►మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును ఉరి తీయాలి ►మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే నాలుక చీరేస్తాం ►పవన్ కల్యాణ్ కొట్టే.. సినిమా డైలాగ్ లకు వైఎస్సార్సీపీ భయపడదు :::వంగపండు ఉష, రాష్ట్ర సంస్కృతిక విభాగం అధ్యక్షురాలు 10:24AM, అక్టోబర్ 05 2023 కోర్డుకి చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి ►సీఐడీ తరపున నిన్న బలమైన వాదనలు వినిపించిన ఏఏజీ ►స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది ►స్కిల్ స్కామ్ ఫిక్షన్ కాదు.. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారం ►బాబు చేసిన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి ►చెప్పినట్లు చేయాలని అధికారులను బెదిరించారు ►బాబు ఆదేశాలతోనే.. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారయ్యారు ►బెయిల్పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేయొచ్చని వాదనలు ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్పై ప్రారంభం కానున్న వాదనలు 09:56AM, అక్టోబర్ 05 2023 ముందస్తుపై కాసేపట్లో వాదనలు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►మరికాసేపట్లో వాదనలు ప్రారంభం ►ఫైబర్ నెట్ కుంభకోణంలో కేసులో నిందితుడిగా చంద్రబాబు ►ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు 09:22AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఉంటుందా? ►స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు ►26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ 7691గా బాబు ►సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►రెండుసార్లు పొడిగించిన ఏసీబీ కోర్టు ►రిమాండ్లో, సీఐడీ కస్టడీ ఇంటరాగేషన్లో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్వయంగా జడ్జికి చెప్పిన చంద్రబాబు 09:00AM, అక్టోబర్ 05 2023 పరిటాల సునీతపై కేసు నమోదు ►టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటా సునీతపై కేసు నమోదు ►శ్రీసత్యసాయి కనగానపల్లి లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ ►సునీతతో పాటు తనయుడు శ్రీరామ్ సహా 119 మందిపై కేసు 08:29AM, అక్టోబర్ 05 2023 నేడు రాజమండ్రికి లోకేష్? ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ► బ్లూ జీన్ యాప్ ద్వారా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న అధికారులు ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ జరుగనున్న విచారణ ►నేడు రాజమండ్రి రానున్న నారా లోకేష్? ►రేపు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి 08:08AM, అక్టోబర్ 05 2023 బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడు ►ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►నేడు విచారణకు వచ్చే అవకాశం 07:53AM, అక్టోబర్ 05 2023 తాడు లేని బొంగరంగా.. టీడీపీ ►అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమల ►యనమలే పార్టీకి దిక్కంటూ వార్తలు ►టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. ►తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే.. కొడుకు పలాయనం చిత్తగించాడు. ►టీడీపీ క్యాడర్ అడ్రస్సే లేదు ::: వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమలే దిక్కంటూ వస్తున్న వార్తలు చూస్తుంటే టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే, కొడుకు పలాయనం చిత్తగించాడు. క్యాడర్ అడ్రస్సే లేదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2023 07:48AM, అక్టోబర్ 05 2023 డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టిందట! ►మహానేత వైఎస్సార్పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ►వైఎస్సార్ మేరు పర్వతం.. పవన్ కంకర కుప్ప ►ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేది పవన్.. ప్రజలకోసం జీవించిన వ్యక్తి వైఎస్సార్ ►2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు..కానీ జగన్ అప్పటికే కడప ఎంపీ ►నువ్వు అంత గొప్పోడివి అయితే ప్రజలు ఓడించరు కదా!. ►సొల్లు కబుర్లు మానేసి నాలుగు ఓట్ల కోసం ట్రై చేయు నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత! వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ @Pawankalyan? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి… pic.twitter.com/pmEetPK8K1 — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:26AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రిలో పోలీసుల అలర్ట్ ►ఛలో రాజమండ్రి పేరిట టీడీపీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పిలుపు ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పర్మిషన్ లేదని నిన్ననే స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలను ఉపేక్షించమని హెచ్చరిక ►144 సెక్షన్తో పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు ►రాజమండ్రిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు 07:18AM, అక్టోబర్ 05 2023 సూత్రధారి చంద్రబాబే: ఏఏజీ సుధాకర్రెడ్డి ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై నేడు కూడా కొనసాగనున్న విచారణ ►నేడు ఉదయం 11.15 గంటలకి ప్రారంభం కానున్న వాదనలు ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి సంబంధం లేదని వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►చంద్రబాబుకి కనీసం కండిషనల్ బెయిల్ అయినా ఇవ్వాలని కోరిన దూబే ►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు ►చంద్రబాబు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలని కోరిన పొన్నవోలు ►చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని ప్రస్తావన ►తీవ్రమైన ఆర్ధిక నేరాలలో బెయిల్ ఇవ్వకూడదన్న సుప్రీం తీర్పుని ఉదహరించిన పొన్నవోలు ►చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో సహకరించలేదని వివరణ ►చంద్రబాబుని మరో అయిదు రోజుల కస్ఢడీకి ఇవ్వాలని కోరిన పొన్నవోలు ►పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడం వెనక చంద్రబాబు హస్తముందన్న పొన్నవోలు ►ఇరువర్గాల వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్, కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం 06:58AM, అక్టోబర్ 05 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ ►చంద్రబాబు బెయిల్, కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►నిన్న సుదీర్ఘంగా సాగిన ఇరువైపుల వాదనలు ►నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు 06:52AM, అక్టోబర్ 05 2023 రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు ►నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ►వర్చువల్గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ►ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్గానే ప్రవేశపెట్టిన వైనం ►రిమాండ్ పొడిగింపు కోరుతూ.. మెమో దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు 06:40AM, అక్టోబర్ 05 2023 జైల్లో భద్రంగా చంద్రబాబు ►జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబు ►స్నేహ బ్లాక్లో ప్రత్యేక వసతులు ►ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు ►కోర్టు అనుమతితో.. ఇంటి భోజనానికి అనుమతి ►కుటుంబ సభ్యులతో ములాఖత్లు 06:30AM, అక్టోబర్ 05 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @26 ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ఏపీ సీఐడీ అరెస్ట్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం ►26వ రోజుకి చేరిన చంద్రబాబు రిమాండ్ -
పీటీ వారెంట్పై విచారణను నిరోధించలేం
సాక్షి, అమరావతి: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో జరిగిన ఆర్థిక అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్పై విచారణ జరపకుండా ఏసీబీ కోర్టును నిరోధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే నిరాకరించిన విషయాన్ని సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్తో పాటు సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగుతున్నాయని ఏజీ వివరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ ఇవ్వొద్దని అభ్యర్థించారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. గురువారం ఉదయం నుంచే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని తెలిపింది. ఇరుపక్షాలూ ఆరోజే వాదనలు పూర్తి చేయాలని స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలపై నమోదు చేసిన కేసులో సీఐడీ చంద్రబాబును 25వ నిందితునిగా చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సురేష్ రెడ్డి బుధవారం మరోసారి విచారణ జరిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ ఎండీ తరఫున తాను న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదనలు వినిపించానని, అందువల్ల ఈ కేసును విచారించడంపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఇరుపక్షాల న్యాయవాదులను కోరారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు న్యాయవాదులు స్పష్టంగా చెప్పడంతో విచారణ కొనసాగించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలకు, వాటిలో లోటుపాట్లకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్నారు. టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు చేసిన కమిటీలో, పనులు అప్పగించిన కమిటీలో చంద్రబాబు సభ్యుడు కాదన్నారు. సీఐడీ 2021లో కేసు నమోదు చేసి, ఇన్నాళ్లూ మౌనంగా ఉందన్నారు. ఏనాడూ చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదని, మొన్నటి వరకు నిందితునిగా కూడా చేర్చలేదని తెలిపారు. అకస్మాత్తుగా ఆయన్ని 25వ నిందితునిగా చేర్చారని తెలిపారు. తమ ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించేంత వరకు పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా ఉత్తర్వులివ్వాలని కోరారు. అగర్వాల్ అభ్యర్థనపై ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టును సైతం ఇదే రకమైన కోరిక కోరారని, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని ఏజీ చెప్పారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. ఏసీబీ కోర్టులో బెయిల్, పోలీసు కస్టడీ పిటిషన్లపై విచారణ ముగిసిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. లేదని శ్రీరామ్ తెలిపారు. ఏజీ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పీటీ వారెంట్ విషయంలో ఏసీబీ కోర్టును నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించారు. -
Oct 4th 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand In Rajamaundry Central Prison, Cases Scams, Political Comments And Court Hearings Ground updates 07:28 PM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ నెట్ స్కాంలో బాబు ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వింటామన్న హైకోర్టు 05:44 PM, అక్టోబర్ 04, 2023 ఏబీఎన్, టీవీ-5 తీరుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం ►ఏబీఎన్, టీవీ-5లో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ►ఏబీఎన్, టీవీ-5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి ►ఏబీఎన్, టీవీ-5 దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి ►పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు ►కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు ప్రసారం చేశారు ►కోర్టు నన్ను తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు ►బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే విధానాలతో ఏబీఎన్,టీవీ-5 ఛానెళ్లు నడుస్తున్నాయి ►ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ►నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. 05:07 PM, అక్టోబర్ 04, 2023 స్కిల్ స్కామ్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ►విచారణ రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రేపు ఉదయం 11 గంటలకు తిరిగి విచారించనున్న కోర్టు 04:05 PM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టు: సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు వాదనలు ►సీమెన్స్ కంపెనీ పేరుతో స్కిల్ స్కామ్కు పాల్పడ్డారు ►కేబినెట్ ఆమోదంతో ఎంవోయూ జరిగిందనడం అవాస్తవం ►చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ విదేశాలకు పారిపోయారు ►శ్రీనివాస్ పాస్పోర్ట్ సీజ్ చేసేలా కోర్టు ఆదేశాలివ్వాలి 03:47 PM, అక్టోబర్ 04, 2023 ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ స్కాం కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు 03:39 PM, అక్టోబర్ 04, 2023 ►స్కిల్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్పై విచారణ వాయిదా ►ఈ నెల 12కు వాయిదా వేసిన హైకోర్టు 03:03 PM, అక్టోబర్ 04, 2023 సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది: ఏఏజీ ►చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి ►చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉంది ►స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం ►డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు ►2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది ►సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది ►ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది ►ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు ►స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం ►బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి ►స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు ►ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం ►జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ ►సీమెన్స్తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు 02:54 PM, అక్టోబర్ 04, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ ►సీఐడీ తరఫున వాదనలు ప్రారంభించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 01:30 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై లంచ్ బ్రేక్ ►చంద్రబాబు తరపున వాదనలు పూర్తి ►మధ్యాహ్నం 2.30 గంటలకి మొదలు కానున్న సీఐడీ వాదనలు ►కండీషన్ బెయిలయినా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే విజ్ఞప్తి ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడానికి చంద్రబాబుకి సంబందం లేదంటూ వాదనలు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి 01:26 PM, అక్టోబర్ 04, 2023 నారా ఫ్యామిలీకి పరామర్శలు ►రాజమండ్రి : భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ ► భువనేశ్వరిని పరామర్శించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 01:21 PM, అక్టోబర్ 04, 2023 అక్టోబర్ 10 వరకు ఢిల్లీలోనే లోకేష్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న నారా లోకేష్ ►ఈ నెల 9 న సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా ►అప్పటి వరకు ఢిల్లీలోనే ఉండనున్న లోకేష్ 01:15 PM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు లాయర్ సుదీర్ఘ వాదనలు ►బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్న ప్రమోద్ కుమార్ దూబే ► స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు ► ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలు ఉన్నాయి ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంట్ ధరను నిర్ధారించింది ► కాస్ట్ ఎవాల్యుయేషన్ కమిటీలో చంద్రబాబు లేరు ► కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు ► సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించింది ► చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు ► చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విచారణ చేపట్టారు ► ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ► ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు..అవసరం ఏముంది? ► కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు?:న్యాయవాది దూబే 01:00 PM, అక్టోబర్ 04, 2023 విజయవాడ: ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న వాదనలు ►స్కిల్ కుంభకోణం కేసులో సీఐడీ అభియోగాల్ని ప్రస్తావిస్తున్న బాబు లాయర్ దూబే ►ఉమ్మడి ఏపీలో ఓ భూ వివాదానికి సంబంధించి అప్పటి సీఎం రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు దృష్టికి తెచ్చిన దూబే ►క్యాబినెట్ నిర్ణయంలో ముఖ్యమంత్రులను తప్పు పట్టడం సరికాదన్న వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన దూబే ►సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదు ►సంతకం చేసిన ఘంటా సుబ్బారావు బెయిల్ మీద ఉన్నారు ►కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపింది 12:53 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి ► చంద్రబాబు పిటిషన్ విచారణ.. అడిషినల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు చేరుకున్నారు ► ప్రస్తుతం బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న వాదనలు ►వాదనలు వినిపిస్తున్న బాబు లాయర్ దూబే 12:18 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు న్యాయవాది దూబే వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో కొనసాగుతోన్న విచారణ ►బెయిల్ పిటిషన్పై వాదనలు వివిపిస్తున్న బాబు లాయర్ ప్రమోద్కుమార్ దూబే ►స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు ►అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే. సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు ►సునీత అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు ►సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. ►కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్మెంటు ధరను నిర్దారించింది ►ఆ కమిటీలో చంద్రబాబు లేరు ►ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు ►అతనికి సుప్రీం కోర్టు నవంబర్ 16వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది ►చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు ►అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు ►ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు ►ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.. అవసరం ఏముంది? ►కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది ►కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు? 12:00 AM, అక్టోబర్ 04, 2023 పవన్కు పోలీసుల నోటీసులు ►జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు పంపారు ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులు ►పెడన బహిరంగ సభలో గొడవలు జరుగుతాయన్న పవన్ ►నోటీసులపై వివరణ ఇచ్చిన ఎస్పీ జాషువా ►మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన పవన్ ►రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కు నోటీసులిచ్చాం ►నోటీస్లకు ఇంత వరకు సమాధానం ఇవ్వలేదు ►మాకు పవన్ కళ్యాణ్ కంటే నిఘా వ్యవస్థ బలంగా వుంది ►మీకు తెలిసిన సంచారం వుంటే మాకు తెలియపరచండని పవన్ ను కోరాం ►300 పైగా సిబ్బందితో సెక్యూరిటీని ఏర్పాటు చేశాం 11:50 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్పై మొదలైన వాదనలు ►చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టులో ప్రారంభమైన వాదనలు ►బెయిల్ పిటిషన్తో పాటు కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపైనా వాదనలు విననున్న ఏసీబీ జడ్జి ►వాదనలు వినిపిస్తున్న బాబు తరపు లాయర్ ప్రమోద్కుమార్ దుబే ►అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు రాకుండానే ప్రారంభమైన విచారణ ► జడ్జి సూచన మేరకు.. వాదనలు నోటు చేసుకుంటున్న సీఐడీ తరపు లాయర్లు 11:45 AM, అక్టోబర్ 04, 2023 హైకోర్టులో నారాయణ పిటిషన్ విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ►ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఏ2గా నారాయణ ► విచారణకు రావాలంటూ ఇటీవలె సీఐడీ నోటీసులు ►అనారోగ్య కారణాల రీత్యా ఇంటివద్దే విచారించేలా ఆదేశించాలని హైకోర్టులో నారాయణ పిటిషన్ ►ఆ పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ►నారాయణ పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి ►క్వాష్ పిటిషన్ను మరో బెంచ్కు బదిలీ చేయాలన్న న్యాయమూర్తి ►విచారణ ఎల్లుండికి వాయిదా 11:15 AM, అక్టోబర్ 04, 2023 ఏసీబీ కోర్టుకు స్పెషల్ జీపీ వివేకానంద ►ఏసీబీ కోర్టుకు హాజరైన సీఐడీ తరపు న్యాయవాది స్పెషల్ జీపీ(గవర్నమెంట్ ప్లీడర్) వివేకానంద ►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై విచారణ ►చంద్రబాబు కస్టడీ పిటిషన్తో పాటు ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్రోడ్డు కేసు) పీటీ వారెంట్లపైనా వాదనలు వినిపించనున్న జీపీ వివేకానంద ► తొలుత కొనసాగనున్న చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు 11:05 AM, అక్టోబర్ 04, 2023 ఆ రెండు పిటిషన్లతో పాటు పీటీ వారెంట్లపైనా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు వినాల్సిందిగా ఏసీబీ న్యాయస్ధానాన్ని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ►తమ తరపున సీనియర్ న్యాయవాదులు రావాల్సి ఉందన్న ప్రభుత్వ తరపు న్యాయవాదులు ►చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందున వాదనలకు ఎక్కువ సమయం పడుతుందన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►అయితే.. రెగ్యులర్ కాల్స్ అటెండ్ చేసి వాదనలు వింటానన్న ఏసీబీ జడ్జి ►ఈలోగా.. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను నోట్ చేసుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులకు జడ్జి సూచన ►కాసేపట్లో చంద్రబాబు పిటిషన్లపై ప్రారంభం కానున్న విచారణ ►మొదటగా వాదనలు వినిపించనున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►బెయిల్, కస్టడీ పిటిషన్లతో పాటు సీఐడీ దాఖలు చేసిన ఫైబర్ నెట్, ఐఆర్ఆర్(రింగ్రోడ్డు కేసు) పీటీ వారెంట్ల పైనా విచారించనున్న ఏసీబీ కోర్టు 10:47 AM, అక్టోబర్ 04, 2023 వీడిన ఉత్కంఠ.. బాబు పిటిషన్లపై కాసేపట్లో విచారణ ►విజయవాడ ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగనున్న విచారణ ►కోర్టుకు చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాది దూబే ► ఇంటరాగేషన్లో చంద్రబాబు సహకరించలేదని.. ఐదు రోజుల కస్టడీ కోరుతున్న ఏపీ సీఐడీ ► రాజమండ్రి జైలులోనే రెండ్రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించిన సీఐడీ ►కాలయాపన చేసిన చంద్రబాబు.. అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ ► స్కిల్ స్కాంలో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపు లాయర్ల పిటిషన్ 10:14 AM, అక్టోబర్ 04, 2023 చంద్రబాబు పిటిషన్ల విచారణపై సందిగ్ధం? ►ఎన్ఐఏ దాడులకు నిరసనగా.. బాయ్కాట్ పిలుపు ఇచ్చిన విజయవాడ బార్ అసోషియేషన్ ►ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై జరగాల్సిన విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును మరో ఐదు రోజుల కస్టడీ కోరిన ఏపీ సీఐడీ ►బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లాయర్ల వాదన ►సుప్రీంలో ఎస్ఎల్పీ పిటిషన్ పెండింగ్లో ఉండడంతో.. 4వ తేదీ వరకు వాయిదా కోరిన బాబు లాయర్లు ►కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకోనున్న సీఐడీ లాయర్లు ►పిటిషన్లపై విచారణ ఉంటుందా? లేదా? అనే దానిపై కొద్దిసేపట్లో రానున్న స్పష్టత 09:45 AM, అక్టోబర్ 04, 2023 తూర్పు గోదావరిలో 144 సెక్షన్: ఎస్పీ జగదీష్ ►టీడీపీ ఛలో రాజమండ్రి జైలుకు పిలుపు ►గురువారం నిర్వహించేందుకు ప్లాన్ ►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున.. అనుమతి లేదన్న జిల్లా ఎస్పీ జగదీశ్వర్ ►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు నో పర్మిషన్ అని స్పష్టీకరణ ►144 సెక్షన్తో పాటు పోలీస్ సెక్షన్ 30 విధింపు ఉన్నట్లు ప్రకటన 09:04 AM, అక్టోబర్ 04, 2023 టీడీపీ వర్గాల్లో టెన్షన్ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢీలా పడిన టీడీపీ శ్రేణులు ►నాయకత్వం లేకపోవడంతో.. ఎటూ పాలుపోని పరిస్థితి ►చంద్రబాబు కేసుల్లో వెలువడే కోర్టు ఫలితాలపై టెన్షన్ టెన్షన్ ►ఇప్పటికే టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజాస్పందన కరువు ►చేసేది లేక.. జనాల వద్దకే వెళ్లాలని ప్రణాళికల రూపకల్పన 08:50 AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసు విచారణ ►ఈ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్చాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ►కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆర్కే మరొక పిటిషన్ కూడా ►"మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్ ►ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది ►ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి ►అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో వినతి ►విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ►ఇదే కేసులో.. నిన్న రేవంత్రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు 08:20 AM, అక్టోబర్ 04, 2023 పవన్లాంటి చెత్త నేత లేడు! ►గొడవలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్..? ►అయినా గొడవలు జరిగేలా మాట్లాడేది నువ్వు. ►దేశం మొత్తం మీద నీలాంటి చెత్త రాజకీయ నాయకుడు ఉండడు. :::వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ 07:38 AM, అక్టోబర్ 04, 2023 బండారుకు ఓ మహిళ సూటి ప్రశ్న ► మంత్రి రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ ► అరెస్ట్.. ఆపై కండిషనల్ బెయిల్ మీద విడుదల ► టీడీపీ నేతపై మండిపడుతున్న మహిళా లోకం ►టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలని పిలుపు. ►మీ ఇంట్లోనూ ఆడవాళ్లు ఉంటారని గుర్తు చేస్తూ.. హితవు టీడీపీ నాయకులు తొలుత మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి. వయసు పెరగ్గానే సరిపోదు.. కాస్త జ్ఞానం, ఇంగితం కూడా ఉండాలి. మంత్రి రోజా గారి గురించి నువ్వు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు.. మీ ఇంట్లో భార్య లేదా కూతురిని ఉద్దేశించి అంటే నీకు ఎలా ఉంటుంది బండారు సత్యనారాయణ? టీడీపీ నేతలు కాస్త నోరు… pic.twitter.com/4QPXKD69oc — YSR Congress Party (@YSRCParty) October 4, 2023 07:30AM, అక్టోబర్ 04, 2023 ఫైబర్ గ్రిడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదన్న అడ్వకేట్ జనరల్ ►లోకేష్ ను నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామన్న ఏజీ ►41ఏ నోటీసును లోకేష్ అనుసరించకపోతే ప్రోసీజర్ ఫాలో అవుతామని ఏజీ చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేసిన న్యాయమూర్తి 07:25AM, అక్టోబర్ 04, 2023 నేడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపి హైకోర్టు విచారణ ► ఇవాళ్టి వరకు(అక్టోబర్ 4) లోకేష్ ను అరెస్ట్ చేయొద్దన్న కోర్టు ►నేడు మళ్లీ జరగనున్న వాదనలు 07:15AM, అక్టోబర్ 04, 2023 నేడు వివిధ కోర్టుల్లో కేసుల కీలక విచారణ ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ ►IRR, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారెంట్లు దాఖలు చేసిన సీఐడీ విచారణ అడిగే అవకాశం ►హైకోర్టులో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ ►IRR కేసులో మాజీ మంత్రి నారాయణ ను విచారణకు రావాలని కోరిన సీఐడీ ►తనను ఇంటి దగ్గరే విచారణ చేయాలని, లేని పక్షంలో వాయిదా వేయాలని హైకోర్టులో నిన్న నారాయణ పిటిషన్ ►నారాయణ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ 06:52AM, అక్టోబర్ 04, 2023 10న సీఐడీ ముందుకు లోకేష్ ►అక్టోబర్ 10న CID ముందు హాజరు కావాలని లోకేష్కు హైకోర్టు ఆదేశం ►లోకేష్పై మూడు కేసులు, రింగ్రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ స్కాం ►అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టులో లోకేష్ మరో లంచ్ మోషన్ పిటిషన్ 06:50AM, అక్టోబర్ 04, 2023 సుప్రీంలో బాబుకి దక్కని ఊరట ►సుప్రీంకోర్టులో చంద్రబాబుకు షాక్, చంద్రబాబు పిటిషన్పై విచారణ సోమవారానికి(అక్టోబర్ 9వ తేదీకి) వాయిదా ►ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు విచారణ జరిగే అవకాశం ►చంద్రబాబుపై మూడు కేసులు, స్కిల్ స్కాం, అంగళ్లు, రింగ్ రోడ్ ►ఏపీ హైకోర్టు : ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో బాబు బెయిల్ పిటిషన్ విచారణ 06:46AM,అక్టోబర్ 04, 2023 రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు @25 ►సీఎంగా ఉన్న టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు ►రెండేళ్ల దర్యాప్తు అనంతరం.. ప్రధాన నిందితుడిగా నిర్ధారించుకున్న ఏపీ సీఐడీ ►సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అరెస్ట్ ► రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్ మీద చంద్రబాబు ► ఖైదీ నెంబర్ 7691గా స్నేహా బ్లాక్లో ప్రత్యేక వసతులు ► కోర్టు ఆదేశాల ప్రకారం.. ఇంటి భోజనానికి అనుమతి, వైద్య సదుపాయాలు ► నేటితో (అక్టోబర్ 4)తో 25వ రోజుకు చేరిన చంద్రబాబు రిమాండ్ ► నేడు చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ -
IRR Case: నారాయణకు సీఐడీ నోటీసులు
సాక్షి, కృష్ణా: ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కామ్ కేసులో.. మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు ఝలక్ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా యానకు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ. అమరావతి ఇన్నర్రింగ్ రోడ్డు స్కామ్లో ఏ2గా ఉన్న నారాయణ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచడంతో.. ఆయన అరెస్టుకి భయపడి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈలోపే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు ఈ స్కామ్లో కీలక పాత్ర ఉందని నిర్ధారించుకుంది ఏపీ సీఐడీ. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది. అక్టోబర్ 4వ తేదీన నారా లోకేష్ను తమ ఎదుట హాజరు కావాలని స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఇప్పుడు అదే తేదీన నారాయణను సైతం విచారణ చేపడుతుండడం గమనార్హం. ఇన్నర్ రింగ్రోడ్డు స్కామ్ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలోఅమరావతి మాస్టర్ ప్లాన్లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది ఏపీ సీఐడీ. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. -
‘స్కిల్’ కుంభకోణం కేసులో 4 వరకు లోకేశ్ను అరెస్ట్ చేయొద్దు
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 4వ తేదీ వరకు లోకేశ్ను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లోకేశ్ను ఇప్పటివరకు నిందితునిగా చేర్చలేదని కోర్టుకు నివేదించారు. నిందితుడు కానప్పుడు అరెస్ట్ చేయడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. కేవలం భయాందోళనతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఇప్పటికైతే అరెస్ట్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్లమని, తాము ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తామని చెప్పారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అంశాల ఆధారంగా వాళ్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీపీకి లోకేశ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, ఆయన తండ్రి అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పారు. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తమ వద్ద ఆధారాలున్నాయని వివరించారు. ఆ రిమాండ్ రిపోర్టును ఆధారంగా 20 రోజుల తరువాత ఇప్పుడు పిటిషన్ దాఖలు చేశారన్నారు. లోకేశ్ చెబుతున్న కారణాల్లో సదుద్దేశం కనిపించడంలేదని, సంబంధం లేని అంశాలన్నింటినీ లేవనెత్తుతున్నారని చెప్పారు. నిందితునిగా చేర్చకుండానే బెయిల్ ఇవ్వాలంటూ ఎలా కోర్టుకొస్తారని ప్రశ్నించారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. బుధవారం లేదా గురువారం విచారణ జరిపినా అభ్యంతరం లేదని, అప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోర్టుకు నివేదించారు. అంతకు ముందు లోకేశ్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతున్నామన్నారు. చంద్రబాబు రిమాండ్ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులని పేర్కొందని, సీఐడీ ఉద్దేశాన్ని ఇది స్పష్టం చేస్తోందని చెప్పారు. చంద్రబాబునే సీఐడీ అధికారులు ఈ కేసులో అక్రమంగా, అన్యాయంగా ఇరికించారని, తప్పుడు కేసు బనాయించారని అన్నారు. లోకేశ్ విషయంలో కూడా అదే రీతిలో చేస్తారని, సీఐడీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. 4వ తేదీ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, కావాలంటే ఆ తరువాత విచారణ జరిపి ముందస్తు బెయిల్పై ఏ నిర్ణయమైనా తీసుకోండని కోర్టును అభ్యర్థించారు. -
బాబు కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు
సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్మెంట్ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అనుగుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్మెంట్ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్కు చంద్రబాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్ ప్రోకోయేనని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్ఆర్ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అలైన్మెంట్ మార్పు వల్ల రమేశ్ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు. రమేశ్ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు. రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్మెంట్ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ను సైతం అలాగే రూపొందించారని వివరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్ ప్రో కో ఉందన్నారు. ఐఆర్ఆర్ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేశారు. -
ఫైబర్గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి
సాక్షి, అమరావతి : ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫైబర్ గ్రిడ్ కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. 2021 సెప్టెంబర్లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును సీఐడీ ఇటీవల 25వ నిందితునిగా చేర్చిందని తెలిపారు. ఆ మేర ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు. ఇదీ కేసు.. : చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.321 కోట్ల మేర కుంభకోణం జరిగింది. ఈ ప్రాజెక్టు టెండర్ను టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ 2021లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
వామ్మో చినబాబు.. రింగ్రోడ్డులో ఎన్ని మలుపులో!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు ఎదురు దెబ్బే తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన కుంభకోణం కేసులో వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు సహకరించాల్సిందేనంటూ ఏ-14 లోకేష్కు తేల్చి చెప్పి.. కుట్రను బయటపెట్టిన దర్యాప్తు సంస్థకు ఫ్రీ హ్యాండ్ అందించింది. ఇప్పుడు లోకేష్ నుంచి సదరు భూ దోపిడీలో నిజాలు రాబట్టేందుకు ఏపీ సీఐడీ ప్రయత్నించాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు అవినీతి గుట్టు కదులుతోంది. ఒక్కొక్కటిగా స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. అయితే ఈ స్కామ్లన్నింటిలోనూ తనయుడు నారా లోకేష్ హస్తం ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది అందుకే అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. ఇక.. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో అయితే నారా లోకేష్ పాత్ర మామూలుగా లేదు. ప్లాన్డ్గా తండ్రీకొడుకులు లబ్ధి పొందే యత్నాలు చేశారు. ఏపీ సీఐడీ సేకరించిన పక్కా ఆధారాలు గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఏకంగా.. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే లోకేష్ ఏమేర ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. సిట్ సేకరించిన ఆధారాల్లో.. ►సీఆర్డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్ సందేశాలు, మ్యాపులు ►టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలు ►కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఖరారు చేశారని పేర్కొనడం గమనార్హం. ► మరోవైపు ఐఆర్ఆర్ అలైన్మెంట్లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. ► నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్ఆర్ ఎలైన్మెంట్ను నిర్ధారించారని సిట్ అధికారులకు ఈమెయిల్స్ పంపాయి. ► ఐఆర్ఆర్ అలైన్మెంట్ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్దే కీలక పాత్ర అని సిట్ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. క్విడ్ప్రోకో ద్వారా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చెబుతోంది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. సొంత కంపెనీకి భూములు టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే తనయుడు లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించారు. లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నారు. ఆపై అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ను ఖరారు చేశారు. మెమోలో ఇలా.. చంద్రబాబు బినామీల పేరిట భారీగా కొల్లగొట్టిన భూములు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొల్లగొట్టిన 148 ఎకరాల విలువ అమాంతంగా పెరిగేలా కుట్రకు పాల్పడ్డారు. క్విడ్ప్రోకో కింద లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. ఏ-6గా హెరిటేజ్ ఎందుకంటే.. హెరిటేజ్ ఫుడ్స్ అంటే నారా చంద్రబాబు కుటుంబం.. చంద్రబాబు కుటుంబం అంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్కు అనేక ప్రయోజనాలు కలిగించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్కు అడ్డగోలుగా కల్పించిన ప్రయోజనం పెద్ద కుంభకోణమే. అందుకే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ను ఏ–6గా సీఐడీ పేర్కొంది. ఎందుకంటే.. ఈ కేసులో ఏ–1 చంద్రబాబు నాయుడి సతీమణి అయిన నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్కు వైస్ చైర్పర్సన్, ఎండీగా ఉండగా, ఏ–14గా ఉన్న లోకేశ్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారు. వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ వ్యవహారాలను పూర్తిగా చంద్రబాబు, లోకేశే నిర్వహిస్తున్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉంది. ఇందులో 23,66,400 షేర్లతో 10.20 శాతం వాటా లోకేశ్ పేరునే ఉంది. -
ఏపీ హైకోర్టులో నారా లోకేష్కు ఎదురు దెబ్బ
సాక్షి, గుంటూరు: ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సీఐడీని ఆదేశించిన కోర్టు.. మరోవైపు విచారణకు సహకరించాల్సిందేనని నారా లోకేష్కు తేల్చి చెప్పింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్ పేరు చేరుస్తూ ఈ మధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సీఐడీ మెమో దాకలు చేసింది. దీంతో అరెస్ట్ భయంతో.. నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై వాదనలు జరిగాయి. లోకేష్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే లోకేష్కు 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ‘‘మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని లోకేష్ను ఆదేశించిండి’’ అని ఏజీ శ్రీరామ్ చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 41-ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని సూచించింది. ఆ ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. మరికాసేపట్లో ఏపీ సీఐడీ అధికారులు లోకేష్ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: పాపం.. లోకేష్ను కించపరుస్తూ యెల్లో మీడియా కథనాలు -
.. ఈ హెడ్డింగ్ ఓకేనా సార్!
.. ఈ హెడ్డింగ్ ఓకేనా సార్! -
ఎన్నిరోజుల నుంచి రిమాండ్లో ఉన్నారు?
సాక్షి, ఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సుప్రీం కోర్టు ఇవాళ(సోమవారం) విచారణకు స్వీకరించలేదు. అత్యవసరంగా చంద్రబాబు పిటిషన్ను విచారించాలని న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మెన్షన్ చేయగా.. కుదరదని తేల్చేసింది సర్వోన్నత న్యాయస్థానం. అయితే.. పూర్తి వివరాలతో రేపు రావాలని.. రేపే(మంగళవారం) మెన్షన్ లిస్ట్లో చేరుస్తామని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడంతో పాటు.. సీఐడీ రిమాండ్లపై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే.. హడావిడిగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు తీసుకెళ్లారు లూథ్రా. అయితే సుప్రీం కోర్టులో ఇవాళ్టి మౌఖిక ప్రస్తావన విషయాల జాబితాలో(oral mentioning matters) ఈ పిటిషన్ లేదు. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుని.. ‘‘ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దానికి లూథ్రా ‘ఈ నెల 8వ తేదీన’అని బదులిచ్చారు. ఎన్నిరోజుల నుంచి రిమాండ్లో ఉన్నారని సీజేఐ ఆరా తీశారు. కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించగా సీజేఐ ఆపి.. రేపే అన్ని విషయాలను రేపు మెన్షన్ చేయాలని లూథ్రాకు సూచించారు. దీంతో.. రేపు లిస్టింగ్ అంశంగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టు ముందుకు వెళ్లనుంది. అలాగే ఈ పిటిషన్పైనా విచారణ తేదీని కూడా ఖరారు చేసే ఛాన్స్ ఉంది. కానీ, ఈనెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: బ్రహ్మణి మాటతో బిత్తరపోయిన జనసేన కేడర్ -
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
CBN: ఇంటరాగేషన్లో కాలయాపన.. ప్రశ్నలకు జవాబులు దాటవేత
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా.. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును ఇంటరాగేషన్ చేసింది సీఐడీ అధికారుల బృందం. అయితే విచారణలో ఆయన అధికారులకు ఏమాత్రం సహకరించకపోగా.. డాక్యుమెంట్ల సాకుతో కాలయాపన చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారుల బృందం విచారించింది. రెండో రోజు దాదాపు 6 గంటలకు పైగా చంద్రబాబును విచారించారు. రెండు రోజుల పోలీస్ కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదు. డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి, దాటవేతకు ప్రయత్నించారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. మొత్తం 12 గంటలపాటు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ప్రతీ గంటకకు అయిదు నిమిషాల బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు విచారణను వీడియో తీయించారు. అనంతరం బాబుకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు విచారణ అధికారి డిఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ చేశారు. ఒక్కో బృందంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు ఉండగా.. రెండు రోజుల విచారణలో దాదాపు వంద ప్రశ్నలు సంధించారు. షెల్ కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారణ జరిపారు. చంద్రబాబు పీఏపెండ్యాల శ్రీనివాస్కు హవాలా రూపంలో రూ. 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నించారు. 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలు, అర్ధికశాఖ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రూ. 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని అధికారులు ప్రశ్నించారు. ఐఏఎస్అధికారుల వాంగ్మాలాలను, డాక్యుమెంట్లను ముందుపెట్టి చంద్రబాబుని అధికారులు ప్రశ్నించారు. బాబుకు, గంటా సుబ్బారావుకు, సుమన్ బోస్కు మధ్య సంబందాలపైనా సీఐడీ అధికారులు విచారించారు. కిలారు రాజేష్కు నారా లోకేష్కు మధ్య ఆర్ధిక సంబంధాలపైనా ప్రశ్నలు వేశారు. అయితే కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా చంద్రబాబు దాటవేసినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో చంద్రబాబుని వర్చువల్గా హాజరుపరిచారు సీఐడీ అధికారులు. -
లోకేష్ భయంపై టీడీపీలోనూ సెటైర్లు?
సాక్షి, అమరావతి: ‘‘లోకేష్బాబులో అరెస్ట్ చేస్తారనే భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’’. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నారా చంద్రబాబు నాయుడిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకుని అరెస్ట్ చేసిన సీఐడీ.. ఈ స్కామ్లో తనయుడు లోకేష్ పాత్రపైనా ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. ఇప్పుడు సీఐడీ ఇంటరాగేషన్లోనూ చంద్రబాబు లోకేష్ పేరు చెప్పొచ్చు!. అందుకే.. అరెస్ట్ చేస్తారనే భయంతోనే చినబాబు ఢిల్లీని వీడడం లేదు’’ ఇది టీడీపీలో కొందరు సీనియర్ నేతలు ఓపెన్గానే చర్చించుకుంటున్న విషయం. చంద్రబాబు జైలుకు వెళ్లాక.. కోర్టులో వేసిన పలు పిటిషన్లపై విచారణ మొదలవ్వగానే లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఒకవైపు పొలిటికల్గా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే యత్నం చేయడంతో పాటు లీగల్గానూ చర్చలు జరిపేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లారని టీడీపీ శ్రేణులు తొలుత భావించాయి. కానీ.. వరుస పరిణామాలు వాళ్లకు తత్వం బోధపడేలా చేశౠయి. లోకేష్.. అరెస్ట్ భయంతోనే ఢిల్లీలో ఉండిపోయారని వాళ్లు కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఒకవైపు తండ్రి వేస్తున్న పిటిషన్లకు ప్రతికూల తీర్పులు దక్కుతున్నాయి. మరోవైపు రాజకీయంగానూ విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ రెండింటిలో దేనికి లోకేష్ నుంచి కనీస స్పందన లభించడం లేదు. కేవలం సోషల్ మీడియాలో ఏవో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పోస్టులు పెడుతూ నెట్టుకొస్తున్నారు. ఏపీకి వస్తే.. ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఢిల్లీలో ఉండిపోయారు.ఇప్పటికే లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో తాను గనుక ఏపీకి వస్తే.. దర్యాప్తు పేరిట తన నుంచి ఎక్కడ నిజాలు రాబడతారనే భయంలో లోకేష్ ఉన్నారేమో అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. లోకేష్ తీరుపై టీడీపీ శ్రేణుల అసంతృప్తి నారా లోకేష్ మరొక వారంపాటు ఢిల్లీలోనే ఉండనున్నారన్నది టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న లీకుల సారాంశం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తండ్రి చంద్రబాబు నాయుడిని ఇప్పటికే కస్టడీ విచారణ చేపట్టింది సీఐడీ. ఈ ఇంటరాగేషన్లోనూ చంద్రబాబు తనకు సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పి ఉంటారా? అనే ఆందోళనలోనూ చినబాబు కనిపిస్తోందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఐడీ ఢిల్లీకి పోలేదా? తండ్రి జైలుకు వెళ్తే.. ఇక్కడే ఉండి పార్టీని నడిపించాల్సిందిపోయి.. కుటుంబ సభ్యులు చెప్పారని ఢిల్లీకి ఆయన వెళ్లడం(పచ్చిగా చెప్పాలంటే పారిపోవడమే!) సరికాదని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఏపీకి తిరిగి వచ్చి పార్టీ సమావేశం నిర్వహించి కేడర్లో ధైర్యం నింపాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నా.. రావాలని బలవంతం చేయొద్దని ఆయన వాళ్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఐడీ అరెస్ట్ చేయాలనుకుంటే.. ఢిల్లీకి కూడా వస్తుంది కదా అని కొందరు అంటే.. ‘‘అప్పుడు చూసుకుందాం’’ అని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిచాలదన్నట్లు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలంటూ చినబాబు పిలుపు ఇవ్వడంపైనా వాళ్లు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఇంటరాగేషన్లో ముద్దాయికి 50 ప్రశ్నలు!
సాక్షి, తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రథమ ముద్దాయి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తొలిరోజు సీఐడీ కస్టడీ విచారణ Interrogation ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబును.. శనివారం మొత్తంగా ఏడు గంటలపాటు ప్రశ్నించింది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడి నేతృత్వంలోని బృందం. అలాగే.. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే విచారణ ముగించిన సీఐడీ.. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబు విచారణ కొనసాగింది. శనివారం ఉదయం, మధ్యాహ్నాం రెండు దఫాలుగా ప్రశ్నించారు అధికారులు. ఫస్ట్ హాఫ్లో దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. భోజన విరామంతో పాటు విచారణలో మొత్తం నాలుగుసార్లు బ్రేకులు ఇచ్చారు. బాబు వయసు రీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ.. యాభై ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా చంద్రబాబును ప్రశ్నించింది సీఐడీ. స్కిల్ స్కాంలో కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు.. సాక్ష్యాధారాల మాయంపైనా సీఐడీ ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?. ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా.. నిధులు ఎందుకు విడుదల చేశారు?. యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?.. లాంటి ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. సుమన్ బోస్తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?. ఆయనతో గంటా సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి?. సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?. ఈ స్కామ్లో బాబుతో పాటు అచ్చెన్నాయుడి పాత్ర ఏంటి?. మూడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్.. డిస్కౌంట్గా ఎందుకు మారింది?. రూ. 3 వేల కోట్ల గురించి అడగొద్దని అధికారుల్ని ఎందుకు దబాయించారు? లాంటి ప్రశ్నలూ సంధించినట్లు సమాచారం. అయితే వాటిని ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించారనేది సీఐడీ కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాతే తెలిసేది. బాబు తరపు లాయర్లు దమ్మలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో.. చంద్రబాబు స్టేట్మెంట్ను పకడ్బందీగా రికార్డ్ చేశారు సీఐడీ అధికారులు. మరోవైపు విచారణ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల అలర్ట్ అయ్యారు. విచారణ జరిగాక.. స్థానిక గెస్ట్హౌజ్కి వెళ్లింది సీఐడీ అధికారుల బృందం. రేపు(సెప్టెంబర్ 24, ఆదివారం) కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబును విచారించనుంది సీఐడీ. ఇదీ చదవండి: ఫస్ట్ టైం.. ‘బ్లూజీన్’తో కోర్టులో హాజరైన చంద్రబాబు -
చీకటి ఒప్పందానికి రుజువు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికిపోయిన దొంగ, మాజీ సీఎం చంద్రబాబును ఎల్లో మీడియా పునీతుడిగా, అన్నా హజారేకు అన్న మాదిరిగా ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. గతంలో చంద్రబాబును పెద్ద లంచగొండిగా పేర్కొంటూ రామోజీరావు స్వయంగా తన పత్రికలో కార్టూన్ వేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబును దేశభక్తుడి మాదిరిగా చిత్రీకరించేందుకు ఈనాడు ఆపసోపాలు పడుతోందన్నారు. ఫేక్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ఎల్లో మీడియా చంద్రబాబును దోమలతో చంపేలా కుట్ర చేస్తున్నారంటూ కథనాలు ప్రచురించడం పైశాచికత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. సిల్క్ డెవలప్మెంట్ స్కామ్పై శుక్రవారం శాసనసభలో స్వల్ప కాలిక చర్చలో కన్నబాబు మాట్లాడారు. కరెంట్ పోయిందని కహానీలు ఒప్పందం సమయంలో కరెంట్ పోవడంతో తేదీ వేయలేదని సీమెన్స్ ఇండియా అప్పటి ఎండీ సుమ న్బోస్ చెప్పడం విడ్డూరంగా ఉంది. నిజమైన చీకటి ఒప్పందానికి ఇదే ఉదాహరణ. విజనరీగా ప్రచారం చేసుకునే చంద్రబాబు హయాంలో సెక్రటేరియట్, సీఎంవోల్లో కనీసం జనరేటర్ కూడా లేదా? కరెంట్ పోయిన వెంటనే సెల్ఫోన్లో టార్చ్ వేస్తున్న రోజులివి! స్కిల్ స్కామ్లో చంద్రబాబు సహనిందితులు ముకుల్ అగర్వాల్, సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ గతంలో ఒకే కంపెనీలో పనిచేశారు. పక్కా ఆధారాలతో ఈడీ అరెస్టు చేసిన సుమన్ బోస్ బెయిల్పై వచ్చి చంద్రబాబు తప్పు చేయలేదని చెప్పడం సిగ్గుచేటు. గుజరాత్తో పోలిక సిగ్గుచేటు గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 85 శాతం సీమెన్స్, 15 శాతం ప్రభుత్వం భరించింది. ఇందులో సీమెన్స్ గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కాకుండా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా (సీఎస్ఆర్) రూ.99.85 కోట్లు సమకూరిస్తే ప్రభు త్వం రూ.17.10 కోట్లు ఖర్చు పెట్టింది. అదే ఏపీలో రూ.3,281 కోట్ల ప్రాజెక్టు అంటూ సీమెన్స్ పేరుతో బోగస్ ఒప్పందం చేసుకున్నారు. ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటాగా ఏకంగా రూ.371 కోట్లను విడుదల చేసి అప్పనంగా దోచేశారు. చంద్రబాబు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వకీల్సాబ్ కోర్టుల్లో కేసు వాదిస్తుంటే లోకల్ వకీల్ సాబ్ రోడ్లపై దొర్లుతూ వాగుతున్నాడు. పెండ్యాలకు టికెట్లు తీసింది మీరే.. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, లోకేశ్ అనుచరుడు కిలారు రాజేష్ను విచారిస్తే మొత్తం బయటకొస్తుంది. వారిని ఇప్పటికే దేశం దాటించేశారు. లోకేశ్ జాతీయ మీడియాతో పెండ్యాల శ్రీనివాస్ అసలు ప్రభుత్వ ఉద్యోగి కాదని చెబుతు న్నారు. పెండ్యాల శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగే. చంద్రబాబుకు సూట్కేసుల్లో డబ్బులు తెచ్చింది అతడే. పైగా శ్రీనివాస్ పిక్నిక్కు అమెరికా వెళ్లాడని లోకేశ్ చెబుతున్నాడు. అలాగైతే మీ నాన్నను (చంద్రబాబును) అరెస్టు చేసిన వెంటనే వెనక్కి పిలిపించొచ్చు కదా? మీరే టికెట్లు తీసి ఆయన్ను అమెరికా పంపించారనేందుకు మాదగ్గర ఆధారా లున్నాయి. ఇంటర్పోల్ సాయం తీసుకునైనా పెండ్యాల శ్రీనివాస్, రాజేష్ను వెనక్కి తీసుకొస్తాం. దొంగతనం తేటతెల్లం: పేర్ని నాని, మాజీ మంత్రి చంద్రబాబు సీఐడీ విచారణలో నాకు తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. ఆయనకు బాకా ఊదే వ్యక్తులు, మీడియా సంస్థలు ఆధారాలు అడుగుతున్నాయి. లంచాలను ఫోన్పే, బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకుంటారా? ఒకప్పుడు చంద్రబాబు ఒక్కరే ప్రజాధనాన్ని స్వాహా చేయగా లోకేశ్ రాకతో దోచుకునే జేబులు పెరిగాయి. టీడీపీ జమా ఖర్చులు చూసే దొంగ ఆడిటర్ను స్కిల్ డెవలప్మెంట్లో పెట్టుకుని కథ నడిపించారు. చంద్రబాబు తన గ్లామర్, గడ్డం అందాన్ని చూసి సీమెన్స్ పరుగెత్తుకుంటూ వచ్చిందని కేబినెట్లో కథలు చెప్పారు. ఇప్పుడు దొంగతనం తేటతెల్లం అవుతోంది. వాటాల కోసమే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నప్పుడు కత్తి అందించిన బాలకృష్ణకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. మొన్న బావను అరెస్టు చేయగానే పార్టీ ఆఫీసులో సీట్లో కూర్చోగా ఈరోజు అసెంబ్లీలోనే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చున్నారు. మావాడు (పవన్ కళ్యాణ్) ఒక్కసారి ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా కూడా గెలవలేదు. అందుకే చంద్రబాబు ఎక్కడా సంతకం పెట్టలేదని అజ్ఞానంగా మాట్లాడుతు న్నాడు. చంద్రబాబు న్యాయవాదులు ఎక్కడా స్కిల్లో స్కామ్ జరగలేదని వాదించట్లేదు. రిమా ండ్ రిపోర్టులో ఏమీ లేదని ఎనిమిదేళ్ల వయసున్న తన పిల్లాడు కూడా చెబుతాడని చంద్రబాబు కుటుంబ సభ్యురాలు (నారా బ్రహ్మణి) అంటు న్నారు. ఈ వివరాలన్నీ తెలిస్తే తన తాతకు ఇంత స్కిల్ ఉందా? అని ఆ పిల్లాడికీ అర్థం అవుతుంది. తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే. పంజాబ్లో సినిమాల షూటింగ్ల పిచ్చి ఉన్న డేరా బాబా నేరం చేసి దొరికిపోయాడు. గోదావరి పుష్కరాల్లో అమాయకులను బలి తీసుకున్న చంద్రబాబు కూడా అదే కోవలోకి వస్తారు. -
డొల్ల కంపెనీలు.. దొంగ అగ్రిమెంట్లు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు రూ.371.25 కోట్ల ప్రజాధనాన్ని దొంగ అగ్రిమెంట్లు, డొల్ల కంపెనీలతో దోచుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సెబీ, జీఎస్టీ, ఈడీల విచారణలో ఈ కుంభకోణం వెలుగులోకి రాగా, తరువాత ఐటీ శాఖ దాడుల్లో కూడా చంద్రబాబు అక్రమాలు బహిర్గతమయ్యాయని చెప్పారు. వీటి ఆధారంగా సీఐడీ విచారించడంతో చంద్రబాబు పాత్రతో సహా మరిన్ని అంశాలు తేలాయన్నారు. నాలుగైదేళ్లు విచారణ అనంతరం పలువురు సాక్షులను ప్రశ్నించి పత్రాలను పరిశీలించాక ఆధారాలు లభించడంతోనే చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలు చేసిన చంద్రబాబును అరెస్టు చేయకుండా సన్మానం చేయమంటారా? అని నిలదీశారు. స్కిల్ స్కామ్పై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిస్తూ అన్ని అంశాలను కూలంకషంగా సభకు వివరించారు. హడావుడిగా కార్పొరేషన్.. డొల్ల కంపెనీలకు డబ్బులు చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే వీలైనంత వేగంగా ప్రజాధనాన్ని దోచేసేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగానే 2015 ఫిబ్రవరి 25న స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్టుమెంట్ను ఏర్పాటు చేశారు. స్కిల్ శిక్షణ ఉన్నత విద్యలో భాగంగా ఉండగా దాన్ని వేరుచేసి స్కిల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్గా విభజించారు. తరువాత జర్మనీకి చెందిన సీమెన్స్కు తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో నైపుణ్య శిక్షణ అంటూ జీవో నెం 4 ఇచ్చారు. దానికి భిన్నంగా డిజైన్టెక్ అనే షెల్ కంపెనీని తెచ్చి ఒప్పందం చేసుకున్నారు. దొంగ సంతకాలు, తేదీలు వేయకుండా జరిగిన ఈ ఎంఓయూ పూర్తిగా అక్రమమే. ఆరు క్లస్టర్లుగా ఒక్కోదాని పరిధిలోని 5 ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో క్లస్టర్కు అయ్యే ఖర్చు రూ.546 కోట్లుగా చూపించి అందులో 90 శాతం సీమెన్స్ సంస్థ భరిస్తుందని, 10 శాతం నిధులను ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తుందని జీవోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆ జీవో, ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియదు. ఒకవేళ ఎవరైనా ఎంఓయూ చేసుకుని ఉంటే తమకు సంబంధం లేదని సీమెన్స్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆరు క్లస్టర్లకు రూ.3,281 కోట్లు ఖర్చు అవుతుందని తేల్చారు. ఈ ప్రాజెక్టు నివేదిక కూడా పూర్తిగా బోగస్. తమకు తెలియకుండా ఇండియాలో తమ ఎండీ నాటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం పేరుతో అవినీతికి పాల్పడ్డారని సీమెన్స్ కంపెనీ అంతర్గత విచారణలో తేలింది. దీంతో ఆ ఎండీని తొలగించినట్లు సీమెన్స్ కంపెనీ లిఖితపూర్వకంగా వెల్లడించింది. అదే విషయాన్ని సీమెన్స్ లీగల్ హెడ్ న్యాయస్థానంలో 164 సెక్షన్ కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇంత జరిగినా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ఇంకా కళ్లు మూసుకుని ఉండాలా? పలు అరెస్టులు జరిగిన ఈ అంశంలో విచారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదా? ఈడీ విచారించిన నిందితులే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లోనూ ఉన్నారు. సీమెన్స్ ఇండియా తరఫున గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని సౌమ్యాద్రి శేఖర్ బోస్గా సంతకం చేసిన వ్యక్తి ఏపీకి వచ్చేసరికి ఎంఓయూలో సుమన్ బోస్గా సంతకం చేశారు. అతడితోపాటు డిజైన్టెక్ తరఫున సంతకం చేసిన కన్విల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ తరఫున ఒప్పందం చేసుకున్న చంద్ర అగర్వాల్, పేమెంటు తీసుకున్న సురేష్ గోయెల్ను ఈడీ గతంలో అరెస్టు చేసింది. ఇంతమందిని ఈడీ అరెస్టు చేసినా మనం కళ్లు మూసుకొని ఉండాలా? అక్రమాలను గుర్తించిన జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం సుమన్బోస్ను ఆ పదవి నుంచి తొలగించింది. ఈ కుంభకోణంపై సీఐడీ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించింది. అనేక అక్రమాలు జరిగినట్లు అందులో తేలింది. ఇన్ని వాస్తవాలు కళ్లముందు కనిపిస్తుండడంతో టీడీపీ వాళ్లు కక్ష సాధిస్తున్నారంటున్నారు. తప్పు జరగలేదని చెప్పట్లేదు. కార్పొరేషన్ ఏర్పాటే ఒక దుష్ట పన్నాగం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఎంతో హడావుడిగా విధి విధానాలు లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి కావాలని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ కల్లం స్పష్టంగా రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తమకు నచ్చిన వ్యక్తులను తెచ్చి ఇంత ముఖ్యమైన సంస్థలో కీలక పోస్టుల్లో నియమించారు. గంటా సుబ్బారావును ఎండీ, సీఈఓగా నియమించారు. తరువాత అదే వ్యక్తిని ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు సీఎం, హయ్యర్ ఎడ్యుకేషన్గా నియమించారు. సెక్రటరీ టు స్కిల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ బాధ్యతలూ అప్పగించారు. అన్ని హోదాల్లో ఒకే వ్యక్తిని నియమించుకున్నారు. నైపుణ్య శిక్షణ పేరిట రూ.371 కోట్లను త్వరగా కొట్టేయాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు. 90 శాతం గ్రాంటు వస్తుందని జీఓలో చెప్పి ఎంఓయూలో దాని ఊసే లేకుండా చేశారు. ప్రభుత్వం నుంచి హడావుడిగా నిధులు విడుదల చేశారు. టెండర్లకు వెళ్లకుండా డబ్బులు కాజేసేందుకు పథకం ప్రకారం వ్యవహరించారు. డిజిటల్ ఫైల్స్ లేకుండా.. ఈ శిక్షణ వ్యవహారంలో గత ప్రభుత్వం ఏ ఒక్క ప్రొసీజర్ను కూడా అనుసరించలేదు. డిజిటల్ ఫైల్సు లేకుండా ఫిజికల్ ఫైల్స్తోనే తతంగం నడిపించారు. కొత్త ప్రాజెక్టు కనుక ఒకేసారి కాకుండా పైలట్గా చేపట్టాలని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత సూచించినా పట్టించుకోలేదు. ముందుగానే రూ.371 కోట్లు ఎలా విడుదల చేస్తారని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి సీఎస్ కృష్ణారావు, ఇతర అధికారులు కూడా నిధుల విడుదలపై కొన్ని అభ్యంతరాలు చెప్పినా పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసేశారు. ఇవన్నీ నాటి సీఎం పాత్ర లేకుండా జరుగుతాయా? శ్రీనివాస్, పార్థసానిలను విచారిస్తే ఈ డబ్బులు ఎవరిదగ్గరకు చేరాయో తేలుతుంది. జీఎస్టీ డీజీ విచారణతో వెలుగులోకి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారంతో 2017 ఆగస్టులో మొదటిసారిగా జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (పుణే) డొల్ల కంపెనీలను విచారిస్తున్న సమయంలో కొన్ని బోగస్వి దొరికాయి. ఆ డొల్ల కంపెనీలకు డబ్బులు చేరవేసి అక్కడినుంచి వేరే సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి మళ్లించినట్లు జీఎస్టీ విచారణలో తేలింది. దీంతో అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏషియా లిమిటెడ్, స్కిల్లర్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ (పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్), డిజైన్ టెక్ సిస్టమ్స్ లిమిటెడ్కు జీఎస్టీ డీజీ నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఈ సంస్థలతోనే ఎంఓయూ కుదుర్చుకున్నారు. జీఎస్టీ డీజీ విచారణలో అక్రమాలు బయటపడిన తరువాత, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా విచారణ జరిపారు. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై జీఎస్టీ అధికారులు నాటి టీడీపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టాల్సిన గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోగా అవినీతికి కీలకమైన ఫైళ్ల నుంచి నోట్ ఫైళ్లను మాయం చేసింది. ఆ తరువాత ఓ విజిల్ బ్లోయర్ (ప్రజా వేగు) స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో గత సర్కారు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సీఐడీ విచారణతో మొత్తం అక్రమాలు బయటకు వస్తున్నాయి. పలు డొల్ల కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని తరలించినట్లు తేటతెల్లమైంది. ప్రాథమిక విచారణ చేశాక 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత కొంతమందిని విచారించి అరెస్టు కూడా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పటి డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీ నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, సురేష్ గోయెల్ (ఢిల్లీ చార్టెడ్ అకౌంటెంట్), మనోజ్కుమార్ జైన్ (ఢిల్లీ చార్టెడ్ అకౌంటెంట్), యోగేష్ గుప్తా (షేర్స్ ట్రేడింగ్ బిజినెస్) శ్రావణ్కుమార్ తులరాంజాజు (షేర్ ట్రేడింగ్ బిజినెస్)లను అరెస్టు చేశారు. 2017 నుంచి 2023 వరకు సెబీ, జీఎస్టీ ఇంటెలిజెన్సు, ఐటీ, ఈడీలు విచారించాయి. ఈడీ కూడా సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినయ్ కన్విల్కర్, ముకుల్చంద్ అగర్వాల్, సిరీస్ చంద్రకాంత్ఝా, బిపన్కుమార్శర్మ, నీలన్శర్మ, గంటి వెంకటసత్య భాస్కర్ ప్రసాద్, వీరందరినీ విచారించి అరెస్టు చేసింది. ఒప్పందం తరువాత షెల్ కంపెనీల ఏర్పాటు ఇక డబ్బుల చెల్లింపులు చూస్తే గత ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని దోచేయడానికి ఎంత ఆరాటపడ్డారో అర్థమవుతుంది. ఒప్పందం కుదిరిన కొద్దిరోజులకే 2015 డిసెంబర్ 5న అప్పటికప్పుడు రూ.185 కోట్లు విడుదల చేశారు. 2016 జనవరి 29న మళ్లీ అర్జెంటుగా రూ.85 కోట్లు, 2016 మార్చి 11న రూ.67 కోట్లు, మార్చి 31న రూ.34 కోట్లు.. ఇలా మొత్తం నిధులను విడుదల చేశారు. విచిత్రమేమంటే క్లస్టర్లేవీ ఏర్పాటు కాకుండానే నిధులను ఇచ్చేశారు. స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లాంటి కొన్ని కంపెనీలను ఎంఓయూ కుదిరిన నెలరోజుల తరువాత ఏర్పాటు చేసి వాటి ద్వారా నిధులను తరలించేశారు. స్కిల్లర్ కంపెనీ అనేది డొల్ల కంపెనీ అని, కేవలం డబ్బులు కాజేయటానికే దాన్ని ఏర్పాటు చేశారని సీఐడీ తేల్చింది. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నేరుగా డిజైన్ టెక్కు రూ.273.21 కోట్లను తరలించి అక్కడి నుంచి డొల్ల కంపెనీల ద్వారా వేర్వేరు మార్గాల్లో నిధులను దోపిడీ చేశారు. పీవీఎస్పీ, స్కిల్లర్ ఇండియా, ఏసీఐ, క్యాడన్స్, పొలారస్, నాలెడ్జి పోడియం, ఈటీఐ, పాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్ సహా వివిధ ఫారెన్ కంపెనీల ద్వారా ఈ నిధులను కొల్లగొట్టారు. యోగేష్గుప్తా డొల్ల కంపెనీలలో భాగస్వామిగా తేలాడు. అతడు చంద్రబాబుకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ స్కామ్లో నిందితుడు. ఈ స్కామ్లో మనోజ్ వాసుదేవ్ పార్థసానిని విచారిస్తే మంగేష్, అతుల్సోని వినయ్ అనే వ్యక్తులు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు అందించారని ఐటీ శాఖ తేల్చింది. ఇదంతా చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా నడిచింది. విక్కీజైన్ అనే వ్యక్తిని శ్రీనివాస్ తమకు అటాచ్ చేయడంతో డబ్బులు పంపినట్లు వారు ఐటీ శాఖకు వెల్లడించారు. ఈ స్కామ్లో రామోజీరావు వియ్యంకుడు ఆర్వీఆర్ రఘు కూడా ఉన్నాడు. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలను విచారించడానికి సీఐడీ 2023 సెప్టెంబర్ 5న నోటీసులు ఇవ్వగా వారిద్దరు ఆ మర్నాడే విదేశాలకు పరారయ్యారు. చిత్ర విచిత్రాలు సీఐడీ పరిశోధనల్లో అనేక అవకతవకలు బయట పడ్డాయి. సౌమ్యాద్రి బోస్ అనే వ్యక్తి సీమెన్సు ఇండియా సాఫ్ట్వేర్కు ఎండీగా ఉన్నాడు. గుజరాత్తో చేసుకున్న ఎంఓయూలో సౌమ్యాద్రి బోస్ అని సంతకం చేసి మన దగ్గరకు వచ్చేసరికి సుమన్ బోస్గా పేరు మార్చేసి సంతకం చేశాడు. కంపెనీలో ఎండీగా ఉంటూ వేర్వేరు పేర్లతో సంతకాలు పెట్టడమన్నది ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. అగ్రిమెంట్ జూన్ 2015 అని పేర్కొని ఎక్కడా తేదీ వేయలేదు. తేదీ లేకుండా అగ్రిమెంట్ ఎక్కడైనా చూశామా? పేజీ చివర్లో సీమెన్స్ ఇండియా లిమిటెడ్, డిజైన్ టెక్ ఇండియా లిమిటెడ్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం చేసుకున్నట్లు ఉన్నా తేదీలు వేయలేదు. ‘డాష్..’ అంటూ ఖాళీలు ఉంచారు. సాక్షి సంతకాల వద్ద కూడా ఖాళీ ఉంచారు. ఎంఓయూలో డిజైన్టెక్ ద్వారా అమలు చేస్తునట్లు చూపించి తరువాత మూడో పార్టీగా పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రైవేటు లిమిటెడ్, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలను తెరపైకి తెచ్చారు. జీఓలో సీమెన్సు అమలు చేయాలని పేర్కొని ఒప్పందంలో డిజైన్టెక్కు పరిమితం చేసి చివరకు స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగిస్తున్నట్లు చూపించారు. అసలు డిజైన్టెక్కే ఓ డొల్ల కంపెనీ. అది మరో డొల్ల కంపెనీకి ఇచ్చేసింది. ఉపసంహరించుకోవడానికి మనమెవరం? ప్రతిపక్ష సభ్యులు ఈ శాసనసభలో చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపసంహరించుకోవడానికి మనమెవరం? కోర్టు, చట్టం తమ పని తాము చేస్తున్నాయి. విపక్ష సభ్యులకు వారికి కేటాయించిన సమయం కన్నా ఎక్కువ ఇస్తామని, ప్రభుత్వం సమాధానమిస్తుందని చెబుతున్నా వినకుండా వెళ్లిపోయారు. విజిల్ వేసిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మిగతా వారు కూడా వెళ్లిపోయారంటే చర్చించాలని వారికి ఏ కోశానా లేదు. చంద్రబాబు లాంటి మహా మేధావి ఎక్కడా దొరకడని వారి అభిప్రాయం. -
వ్యూహాత్మకంగా చంద్రబాబు విచారణకు సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో.. చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? ఎలా విచారించాలి? అనేదానిపై సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. స్కామ్లో చంద్రబాబే ప్రధాన నిందితుడు.. అంతిమ లబ్ధిదారుడు కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కస్టడీ నుంచి వీలైనంత కీలక సమాచారం రాబట్టాలని భావిస్తోంది ఏపీ సీఐడీ. చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో ఏం జరగబోతోంది?.. ఏ విధంగా సీఐడీ విచారణ చేయనుంది? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు పర్మిషన్ లభించిన నేపథ్యంలో సీఐడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారుల బృందం వెళ్లనుంది. మెరికల్లాంటి అధికారుల్ని ఇప్పటికే ఏపీ సీఐడీ కస్టడీ విచారణ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో చంద్రబాబును ప్రశ్నించే అధికారుల జాబితాను ఇప్పటికే సీఐడీ కోర్టుకు సమర్పించింది కూడా. శనివారం ఉదయం నుంచే ఆధికారులు విచారణ చేపట్టే విధంగా సిద్ధం అవుతున్నారు. కోర్టు నిర్దేశించిన టైం ప్రకారం ఉదయం 9.30గం. నుంచి సాయత్రం 5గంటల దాకా.. తిరిగి ఆదివారం సైతం ఇదే సమయంలోనే విచారణ చేపట్టనుంది. లంచ్, టీ బ్రేక్లకు మినహా మిగిలిన సమయం అంతా విచారణకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. కోరింది ఐదురోజులు అయినప్పటికీ.. రెండే రోజులు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాబట్టి.. తక్కువ సమయం ఉండటం వల్ల వీలైనంత ఎక్కువ సమయం విచారణకు వాడుకోవాలనేది సీఐడీ వ్యూహంగా కనిపిస్తోంది. రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి వీలైనంత ఎక్కువగా సమాచారం రాబట్టాలి.. ఇది ఇప్పుడు సీఐడీ ముందున్న టాస్క్. ఈ మేరకు ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు ఏ విధంగా ముడుపులు చేరాయో తేల్చే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ విధంగా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వరకు వచ్చిందో తేల్చడమే కస్టడీలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు పాత్రపైన సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్తో చంద్రబాబు మీటింగ్లపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వద్దన్నా.. ఎందుకు అలా చేశారు? కేవలం షెల్ కంపెనీలు ముడుపుల వ్యవహారం మాత్రమే కాకుండా… కేసులో ఏవిధంగా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి చేశారనే విషయంపైనా సీఐడీ దృష్టి సారించింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటులో క్యాబినెట్ అప్రూవల్ లేకపోడం నుంచి మొదలు ఏవిధంగా అధికార దుర్వినియోగం జరిగిందనే విషయంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు బలవంతపెట్టి వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో సీఐడీ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిపి విచారించేందుకు ఈ కేసులో ఉన్న నిందితులను పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్బీ కూడానా? కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించపోతే ఏం చేయాలి?.. ఈ విషయంపైనా సీఐడీ అధికారులు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ప్లాన్ బీ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే.. కస్టడీ పిటిషన్ పొడిగించాలనే విజ్ఞప్తితో పాటు విచారణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని కోర్టుకు తెలపాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. సీఐడీ విచారణలో చంద్రబాబును షాక్ గురిచేసే కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పక్కా ఆధారాలతో ఈ స్కామ్లో దొరికిన చంద్రబాబును కస్టడీకి తీసుకోవడం ద్వారా కీలకమైన విషయాలనే సీఐడీ బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ?
సాక్షి, అమరావతి: విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు దక్కాయని తేలిపోయింది. అసలేం జరిగింది? అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్రింగ్ రోడ్డు తుది అలైన్మెంట్ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని తేలింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని తేలింది. లోకేశ్దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
స్కిల్ కుంభకోణం బాబు ఆలోచనల నుంచే
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగిశాయి. దాదాపు మూడున్నర గంటల పాటు వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం దీనిపై గురువారం తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అంతకు ముందు సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ చంద్రబాబు ఆలోచనల నుంచే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పుట్టిందని కోర్టుకు నివేదించారు. దీనికి సంబంధించిన ప్రతి విషయం ఆయనకు తెలుసని, ఈ కుంభకోణంలో అంతిమ లబ్దిదారులు చంద్రబాబుతో పాటు ఆయనకు సంబంధించిన వ్యక్తులేనని నివేదించారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దగ్గర పెట్టుకుని చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబును తాము (సీఐడీ) విచారిస్తే ఆయనకు వ చ్చిన నష్టం ఏమీ ఉండదని, అదే తాము విచారించకుంటే దర్యాప్తునకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. పోలీసు కస్టడీకి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టే చంద్రబాబు పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నిందితుడు కోర్టును అలా చేయడానికి వీల్లేదు, ఇలా చేయడానికి వీల్లేదని శాసించలేడన్నారు. నిందితుడు ముందు న్యాయం మోకరిల్లరాదని, ఒకవేళ అలా జరిగితే వ్యవస్థ కుప్పకూలినట్లేనన్నారు. విచారణలో మౌనంగా ఉండే హక్కు నిందితుడికి ఉందని, అయితే విచారణకు సహకరించాల్సిన బాధ్యత కూడా నిందితుడిపై ఉందని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణాన్ని రాజకీయ కారణాలతో వెలికి తీసినట్లు చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి దీన్ని పుణె జీఎస్టీ అధికారులు వెలికి తీశారని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను జీఎస్టీ అధికారులు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (టీడీపీ సర్కారు) దృష్టికి తెచ్చారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా దారి మళ్లించారో వివరించారని చెప్పారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు చర్యలతో జీఎస్టీ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు. ఆ తరువాత షెల్ కంపెనీల గుట్టు రట్టు కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి వాటితో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశాయని చెప్పారు. ఐటీ శాఖ నోటీసులు ఇవ్వగానే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పారిపోయారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఇలాంటి కేసును రాజకీయ ప్రేరేపితం, కక్ష సాధింపు అనడం దారుణమన్నారు. చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందని, దీన్ని బట్టి ఎంత పకడ్బందీగా ఈ కుంభకోణానికి వ్యూహరచన చేశారో అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు. చంద్రబాబును విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించారు. ఇప్పుడు కస్టడీ కోరడం ఏమిటి? చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్దార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించామని, వాటి ఆధారంగా చంద్రబాబును జ్యుడీషియల్ రిమాండ్కు పంపాలని సీఐడీ మొదటి రోజే కోర్టును కోరిందని పేర్కొన్నారు. అన్ని ఆధారాలు సేకరించినప్పుడు ఇప్పుడు తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఏముందన్నారు. స్కిల్ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2023లో చంద్రబాబును అరెస్ట్ చేసిందని, ఇంత కాలం సీఐడీ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. వారి అలసత్వానికి చంద్రబాబును కస్టడీకి కోరడానికి వీల్లేదన్నారు. 45 ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చిన ప్రతిష్టను కాలరాసేందుకే సీఐడీ ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతోందన్నారు. సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారిస్తున్న సమయంలో దర్యాప్తు అధికారులు ఆ వివరాలను మీడియాకు లీక్ చేశారని తెలిపారు. చంద్రబాబు ఎమ్మెల్యే కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కేసు మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును విచారించే పరిధి ఏసీబీ కోర్టుకు లేదన్నారు. పరిధి లేకుంటే ఎందుకీ పిటిషన్లు? దీనికి సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్రెడ్డి, స్పెషల్ పీపీ వివేకానంద తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులు.. ప్రజా ప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో చార్జిషీట్ దాఖలైన తరువాత ట్రయల్ మొదలు పెట్టి విచారణ కొనసాగించేందుకు మాత్రమే ఉద్దేశించినవన్నారు. రిమాండ్ విషయంలో ఆ కోర్టులు జోక్యం చేసుకోలేవన్నారు. ఒకవేళ ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదని భావిస్తే ఆ విషయాన్ని మొదటే చెప్పి ఉండాల్సిందన్నారు. ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేకుంటే హౌస్ రిమాండ్, బెయిల్, మధ్యంతర బెయిల్ ఇలా ఇన్ని పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఒకవైపు పరిధి లేదంటూనే మరో వైపు ఇన్ని పిటిషన్లు వేయడం చంద్రబాబు తీరును తెలియచేస్తోందన్నారు. మేం సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు.. ఏసీబీ కోర్టు కేసు విచారణ మొదలు కాగానే సీఐడీ కస్టడీ పిటిషన్లో చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించింది. అందులో కోర్టును శంకించేలా పేర్కొన్న అంశాలపై అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు న్యాయవాదుల తీరుతో ఒకింత మనస్తాపం చెందిన కోర్టు.. ఈ కేసును తాము విచారించడంపై మీకేమైనా అభ్యంతరం ఉందా? అంటూ సీఐడీ న్యాయవాదులను ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమకు అభ్యంతరం లేదని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. ఇదే ప్రశ్నను చంద్రబాబు తరఫు న్యాయవాదులను కోర్టు అడిగినప్పటికీ వారు మౌనంగా ఉన్నారు. అయినప్పటికీ కోర్టు మరోసారి అడగటంతో.. తాము సర్టిఫై చేయాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఒకింత తీవ్ర స్వరంతో బదులిచ్చారు. దీంతో కోర్టు విచారణను ప్రారంభించింది. ఆ దృశ్యాలతో మాకేం సంబంధం లేదు.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ దృశ్యాలు మీడియాలో రావడంపై ప్రశ్నించింది. ఆ దృశ్యాలను తాము లీక్ చేశామంటున్న చంద్రబాబు న్యాయవాదులు అందుకు ఆధారాలుంటే చూపాలని సీఐడీ స్పెషల్ పీపీ వివేకానంద కోరారు. ఆ దృశ్యాలు మీడియాలో ఎలా వచ్చాయో, వాటిని ఎవరు చిత్రీకరించారో తమకు తెలియదన్నారు. విచారణ రోజు చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు, సహాయకులు కూడా కలిశారని కోర్టు దృష్టికి తెచ్చారు. -
‘స్కిల్’ స్కామ్ కేసు: ప్రజాధనాన్ని లూటీ చేశారు
సాక్షి, అమరావతి: ప్రజాధనం దుర్వినియోగం అధికార విధుల్లో ఎంతమాత్రం భాగం కాదని, అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ సీఎం చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చంద్రబాబు స్వలాభాపేక్షతో, ఉద్దేశపూర్వకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు మంగళవారం నివేదించారు. ఇదంతా అప్పటి సీఎం చంద్రబాబుకు తెలిసే, ఆయన సమక్షంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.371 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించేందుకు సీఐడీకి ఇంత సమయం పట్టిందని, చిన్న ఛాన్స్ కూడా తీసుకోలేదని, పక్కా ఆధారాలున్నాయని నిర్ధారించుకున్న తరువాతనే చంద్రబాబు అరెస్ట్ వరకు వెళ్లామన్నారు. గుజరాత్లో ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలకు రూ.కోటి చెల్లించగా, మన రాష్ట్రంలో మాత్రం అవే కేంద్రాలకు రూ.వందల కోట్లు చెల్లించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు రాజకీయ ప్రేరితమంటూ చంద్రబాబు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టుకు వివరించారు. నిజాయతీతో పనిచేసే అధికారులు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులను రాజకీయ కక్ష సాధింపుల నుంచి కాపాడేందుకే అవినీతి నిరోధక చట్టంలో 17ఏను చేర్చారే కానీ, నిర్భీతితో పట్ట పగలే ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబు వంటి వారి కోసం కాదన్నారు. ప్రజాధనానికి ధర్మకర్తగా, రక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి భక్షకుడిగా మారి రూ.వందల కోట్లను దారి మళ్లించేశారన్నారు. ఇది పూర్తిగా అనధికారిక విధుల కిందకే వస్తుందని, అందువల్ల చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ఎంత మాత్రం వర్తించదని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ దశలో దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం దర్యాప్తు చేపట్టాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా విచారణ నిమిత్తం చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను సోమవారం వరకు ఒత్తిడి చేయవద్దంటూ ఏసీబీ కోర్టును ఆదేశిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి పొడిగించలేదు. సుదీర్ఘంగా వాదనలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు గత మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఆధారంగా విజయవాడ ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సైతం కొట్టేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో మధ్యాహ్నం 12.05 గంటలకు మొదలైన వాదనలు సాయంత్రం 5.20 వరకు నిరాటంకంగా కొనసాగాయి. వాదనల సమయంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. చంద్రబాబు తరఫున దేశంలోనే అత్యంత ఖరీదైన సీనియర్ న్యాయవాదిగా పేరున్న హరీష్ సాల్వే, టీడీపీ తరఫున ప్రతి కేసును వాదించే మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. లండన్లో ఉంటున్న హరీష్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా అర్ణబ్ గోస్వామి కేసును కూడా ప్రస్తావించారు. 2024లో ఎన్నికలు రాబోతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వం తన కౌంటర్ను చివరి నిమిషంలో తమకు అందచేసిందని, ముందే అందచేసి ఉండాల్సిందని సాల్వే పేర్కొనగా, సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ జోక్యం చేసుకుని ఇది కూడా కక్షపూరిత రాజకీయంలో భాగమేనంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మనుషులు విదేశాలకు పారిపోయారు.. ఐటీ శాఖ అధికారులు చంద్రబాబుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు నోటీసులు ఇవ్వగానే ఒకరు దుబాయ్కి, మరొకరు వాషింగ్టన్కు పారిపోయారని సీఐడీ తరఫున న్యాయవాదులు తెలిపారు. డిజైన్ టెక్ కంపెనీ రూ.200 కోట్లు దారి మళ్లించినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో బహిర్గతమైందన్నారు. పలు కీలక డాక్యుమెంట్లను మాయం చేశారని, వాటన్నింటినీ కూడా వెతికే పనిలో దర్యాప్తు అధికారులుఉన్నారని తెలిపారు. ముగ్గురి వాదనలు పూర్తి కాగానే దీనిపై సాల్వే, లూథ్రా తిరుగు సమాధానం ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ వ్యవహారంలో ఏం చెప్పాలనుకున్నా, ఇప్పుడే చెప్పాలని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని, ప్రధాన వ్యాజ్యంపైనే నిర్ణయం వెలువరిస్తానని తేల్చి చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు పూర్తి చేయడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. 10 రోజుల్లోనే కొట్టేయాలంటున్నారు సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, పొన్నవోలు సుధాకర్రెడ్డిలు వాదనలు వినిపిస్తూ స్కాం జరిగిన తీరును వివరించారు. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, పలువురిని విచారించాల్సి ఉందని, మరి కొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. దర్యాప్తు దశలో కేసును కొట్టేయడానికి వీల్లేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందంటూ నిహారికా కేసులో సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. సెప్టెంబర్ 7న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని, 9న అరెస్ట్ చేశారని, 12న ఆయన తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి కేవలం 10 రోజులే అయిందన్నారు. తాము కౌంటర్ ఇప్పుడే ఇచ్చామని చంద్రబాబు న్యాయవాదులు చెబుతున్నారని, వాస్తవానికి 900 పేజీల అదనపు డాక్యమెంట్లను వారు ఇప్పుడే తమకు అందచేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ అసలు వర్తించదన్నారు. కేసు నమోదు చేసింది 2021లో కావొచ్చు, కానీ కథ నడిచింది మొత్తం 2014, ఆ తరువాతేనని కోర్టుకు నివేదించారు. 2018కి ముందే ఈ కుంభకోణం వ్యవహారంలో సీఐడీ ప్రాథమిక దర్యాప్తు జరిపిందని వివరించారు. రికార్డులను తారుమారు చేయడం, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం పబ్లిక్ డ్యూటీ కిందకు రానే రాదన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్ద ఆలోచనల నుంచే ఈ కుంభకోణం మొదలైందని రోహత్గీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐశాఖ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డ్యాం కట్టాం, వరదల వల్ల అది కొట్టుకుపోయింది.. మా తప్పేమీ లేదని చెప్పేంత చిన్న వ్యవహారం కాదని కోర్టుకు నివేదించారు. ఈ కుంభకోణం వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన పెద్దలు, దానిని దారి మళ్లించేందుకు పలు షెల్ కంపెనీలను సృష్టించారని, ఇందుకు పక్కా ఆధారాలున్నాయంటూ కోర్టు ముందుంచారు. కేసు డైరీని సైతం కోర్టుకు సమర్పించి కీలక ఆధారాలను నివేదించారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే హైకోర్టు సీఆర్సీసీ సెక్షన్ 482 కింద తనకున్న అధికారాన్ని ఉపయోగించగలదన్నారు. ప్రాథమిక దశలో దర్యాప్తును కొనసాగించకుండా పోలీసులను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని తెలిపారు. దర్యాప్తు ప్రాథమిక దశలో కోర్టులు ఆరోపణల పూర్వాపరాల్లోకి వెళ్లడానికి వీల్లేదన్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ను దాఖలు చేసేందుకు పోలీసులకు అనుమతినివ్వాలని కోరారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితం అని చెబుతున్నారని, అదే నిజమైతే 2021లోనే చంద్రబాబును నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే వారమన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఆధారాలు లభించాయి కాబట్టే ఇప్పుడు అరెస్ట్ చేశామన్నారు. స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందే రూ.300 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రైవేటు కంపెనీల పేరు మీద మళ్లించేశారు, అదే ఇక్కడ కీలక విషయమని కోర్టుకు వివరించారు. ఒప్పందంలో భాగమైన రెండు ప్రైవేటు కంపెనీలు కలిసి మూడో కంపెనీని తెరపైకి తెచ్చి, ఆరు షెల్ కంపెనీలను సృష్టించి నిధులను మళ్లించేశాయన్నారు. ఇదంతా కూడా చంద్రబాబుకు తెలిసే జరిగిందని వివరించారు. నిధుల చెల్లింపునకు ఆయనే అనుమతినిచ్చారని తెలిపారు. ఇదంతా తాము చెబుతున్నది కాదని, కాగితాలే అందుకు సాక్ష్యమన్నారు. కార్పొరేషన్ను ప్రతివాదిగా చేర్చాల్సిందే.. ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)ను ప్రతివాదిగా చేర్చకుండానే పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కె.అజయ్రెడ్డిని ప్రతివాదిగా చేర్చారని, ఆయనకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. అందువల్ల కార్పొరేషన్ను ప్రతివాదిగా చేర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. -
Babu Case : గవర్నర్ అనుమతి చుట్టే బాబు లాయర్ల పట్టు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు.. క్వాష్ పిటిషన్కు అనర్హుడని సీఐడీ తరపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు న్యాయవాదులు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టును కోరారు. ► 2018 జూన్ 5వ తేదీనే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది.ఐపీసీ ప్రకారం నేరం కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది. 2015లోనే ఈ స్కాంకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. ఒక సెక్షన్కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు అని హైకోర్టు ముందు వాదించారాయన. ► పథకం ప్రకారం కుంభకోణం జరిగింది. ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. షెల్ కంపెనీల కోసమే డబ్బు విడుదల చేశారు. ఎంవోయూలో సబ్కాంట్రాక్టుల అంశం ప్రస్తావనే లేదు. చంద్రబాబు నాయకత్వంలో నెమ్మదిగా మానిప్యులేషన్ చేశారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బు తరలించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగింది. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఏనాడో అరెస్ట్ చేసేవారు.ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోంది. ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. . ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. మెరిట్స్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది. దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపైనే నిందలు మోపుతున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► 2021కు ముందు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే కంపెనీలకు రూ.300 కోట్లు విడుదల చేశారు. అవినీతి చేసిన వారు సెక్షన్ 17ఏ పేరుతో తప్పించుకోలేరు. సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. కాబట్టి.. పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలి. సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి అని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
తప్పు చేయకపోతే గగ్గోలెందుకు?
సాక్షి, అమరావతి : ‘అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు భయమెందుకు? అనేక కేసుల్లో జరిగే తరహాలోనే ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు ఎందుకు? విచారణకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చు’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. స్కిల్ స్కామ్లో సీఐడీ పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతోనే దర్యాప్తు చేస్తున్నారని, రూ.241 కోట్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించినట్టు స్పష్టమవుతోందని చెప్పారు. కస్టోడియల్ కస్టడీలో విచారిస్తే నిజ నిర్ధారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తన చేతికి ఆ రిమాండ్ రిపోర్టు అందినందున, ఇందులో నిజా నిజాలు, క్రెడిబులిటీ చెప్పదల్చుకున్నానని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి.. ♦ ఎంతో మంది నాయకులు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. కొంత మందికి శిక్షలు పడ్డాయి. నిర్దోషులు హానరబుల్ (గౌరవం)గా బయటకొచ్చారు. కానీ ఎక్కడా జరగని విధంగా ఇక్కడే ఏదో జరిగిపోయినట్టు చంద్రబాబు కేసు విషయంలో కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. ఆయన అరెస్టు సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.241 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఈ నెల 9న సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ♦ ప్రభుత్వ డబ్బు (ప్రజాధనం) బోగస్ ఇన్వాయిస్ల ద్వారా టెక్నాలజీ పార్ట్నర్స్కు, ఇతరులకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఆ సిక్స్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. వారికి ఇచ్చిన డబ్బుకు లెక్కలేదు. దానికి జీఎస్టీ కట్టలేదని జీఎస్టీ అథారిటీ వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ వాళ్లూ విచారించారు. తర్వాత ఇన్కంట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత.. దీనికి సంబంధించి కొన్ని కీ నోట్ ఫైల్స్ మిస్ అయ్యాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు. ♦ 141 మంది సాకు‡్ష్యలను కూడా విచారించి ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఎవరి అకౌంట్లో పడింది.. నిధులు ఎలా దారి మళ్లాయి.. షెల్ కంపెనీల ద్వారా తిరిగి వీళ్ల వద్దకు ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఇవన్నీ మరింత స్పష్టంగా విచారించడానికే చంద్రబాబును అరెస్టు చేశారు. నేరం చేయకపోతే భయమెందుకు? ♦ చంద్రబాబు ఏ రకమైన నేరం (ఫ్రాడ్) చేయకపోతే, నిధులు దుర్వినియోగం చేయకపోతే, నిబంధనలు ఉల్లంఘించకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కిందకు రాకపోతే, అది 409 కిందకు రాకపోతే ఎందుకు భయపడుతున్నట్లు? నిధులు అక్రమంగా మళ్లింపు(సైఫెన్) అని తెలుస్తోంది. ఆ డబ్బు దుర్వినియోగం అయినట్టు తేటతెల్లమైంది. సీఐడీ పోలీసులు రికార్డును బట్టే ముందుకెళ్తున్నారు. ♦ ఇది సరికాదనుకున్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది.. జరిగిందిదీ అని ఆ ఆరు షెల్ కంపెనీలు వచ్చి చెప్పడం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రైవేటు కెపాసిటీతో ఏదైనా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. అండర్ స్టాండింగ్ ఉండొచ్చు. కానీ దాంతో మా కంపెనీకి ఏ సంబంధం లేదని సిమన్స్ ఇండస్ట్రీ వాళ్లు చెబుతున్నారు. డిజైన్ టెక్ ప్రైవేట్ కంపెనీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. షెల్ కంపెనీలు కూడా వాస్తవ సమాధానం చెప్పడం లేదు. ఇంత మందికి శిక్షణ ఇచ్చామని, ఇన్ని పరికరాలు కొన్నామని బెయిల్ పిటిషన్లలో ఎందుకు చెప్పలేదు? ♦ ఇంత క్లియర్గా కేసు ఉంటే ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం విచిత్రం అనిపిస్తోంది. ఆయన సత్యవంతుడని నిరూపించుకుంటే రేపు పరువు నష్టం దావా వేయొచ్చు. ఇలా గగ్గోలు పెట్టడం అనవసరం. ఇంత కంటే పూర్తి ఆధారాలతో కూడిన(ఫుల్ ఫ్రూఫ్) కేసు నేను చూడలేదు. అనుమానాలకు తావులేదు. గవర్నర్ అనుమతి అవసరం లేదు ♦ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి కావాలనే వాదన జరుగుతోంది. సెక్షన్ 17ఎ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 2018లో ఫోర్స్లోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన నేరాలకు అది వర్తించదు. కాబట్టి అవి అంతకంటే ముందు నేరాలు కాబట్టి 17ఎ లో గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది వర్తించదు. అచ్చెన్నాయుడు కేసులో ఇది డిసైడ్ అయ్యింది. ♦ అరెస్టు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇవన్నీ విచారణలో భాగమే. దాదాపు 141 మంది సాకు‡్ష్యలను విచారించారు. ఏడుగురిపై రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. తర్వాత అత్యంత ఎక్కువ సమాచారం సేకరించారు. దర్యాప్తునకు సహకరించడ లేదు. అంతకు ముందు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరూ సహకరించడం లేదు. తర్వాత కొన్ని నోట్ ఫైల్స్ మిస్సింగ్. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం వీరికి చేరిందనేది నిర్ధారణ కావాలంటే అరెస్ట్ చేసి విచారిస్తేనే నిజానిజాలు బయటపడతాయి. -
ఫేక్ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్’
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. ఆయన అవినీతి స్పష్టంగా కనబడుతుండడంతో ప్రజల్లో ఏమాత్రం మద్దతు లభించడంలేదు. దీంతో ఎల్లో మీడియా, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియాతోపాటు టీడీపీ శ్రేణులు, రంగంలోకి దిగి చంద్రబాబు సత్యహరిశ్చంద్రుడంటూ ప్రజలను ఏమార్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు చేసిన అవినీతిపై సీఐడీ స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా.. ఆధారాల్లేవని, చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, దార్శనికుడికి ఇలాంటి పరిస్థితి కల్పించారంటూ సానుభూతి వచ్చేలా బుకాయిస్తూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటైన పెయిడ్ ప్రమోషన్కు తెరలేపారు. ఇందులో భాగంగా రెండ్రోజులుగా ప్రజలకు అదేపనిగా ఐవీఆర్ఎస్ ఫోన్కాల్స్ వస్తున్నాయి. ‘మచ్చలేని రాజకీయాలకు మారుపేరైన చంద్రబాబునాయుడు వంటి నిజాయితీ గల నాయకుడిని చేయని తప్పుకు జైల్లో పెట్టారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి’.. అంటూ 50 సెకన్ల ఫోన్కాల్ రాష్ట్రంలోని అన్ని మొబైల్ యూజర్లకు వెళ్లేలా భారీ పెయిడ్ ప్రమోషన్ చేపట్టారు. ఐటీ ప్రొఫెషనల్స్ పేరుతో హడావుడి ఎల్లో మీడియా అయితే అడ్డూఅదుపు లేకుండా చంద్రబాబును సమర్థించే పనిలో మునిగిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి రకరకాల వ్యక్తులతో మాట్లాడిస్తూ అది నిజంగా అమలు జరిగినట్లు భ్రమ కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని జనం నుంచి స్పందన లేకపోవడంతో ఐటీ ఉద్యోగులను ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ ఐటీ, ఎన్ఆర్ఐ విభాగాలు ప్లాన్చేసి హైదరాబాద్లో కొందరు ఐటీ ఉద్యోగులను సమీకరించి ఆందోళనలు చేయించారు. కానీ, ఇందులో ఐటీ ఉద్యోగుల కంటే బయటి వ్యక్తులే భారీగా ఉన్నట్లు తేలింది. వారిలో చాలామందికి స్విగ్గీ కూపన్లు ఇచ్చి తీసుకొచ్చినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. బెంగళూరులోనూ ఇదే తరహాలో కొందరు ఐటీ ఉద్యోగులతో ఆందోళన చేయించారు. నిజానికి.. చంద్రబాబు అరెస్టయితే టీడీపీ శ్రేణులు, నాయకులే పెద్దగా బయటకు రాలేదు. దయచేసి బయటకు రావాలని అచ్చెన్నాయుడు, యనమల వంటి నేతలు పార్టీ శ్రేణుల్ని టెలీకాన్ఫరెన్స్లో బతిమాలుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగులతో టీడీపీ ముఖ్య నేతలు ఆందోళనలు చేయిస్తున్నట్లు తేలింది. దీనికి వారు తెరవెనుక వ్యూహ రచనచేసి అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. పథకం ప్రకారం ఫేక్ ప్రచారం.. ఇక టీడీపీ ప్రొఫెషనల్స్ విభాగానికి చెందిన తేజశ్విని అనే యువతి చంద్రబాబుకు మద్దతుగా విడుదల చేసిన ఒక వీడియోను వైరల్ చేశారు. అమరావతి ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పలు కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. టీడీపీకి సంబంధించి ముఖ్యమైన ప్రతి కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఆమెను ఐటీ ప్రొఫెషనల్గా రంగంలోకి దింపి వీడియోలు చేయించి వైరల్ చేస్తున్నారు. ఇలాంటి మరికొందరిని టీడీపీ ఒక వ్యూహం ప్రకారం పనిచేయిస్తూ చంద్రబాబు నిజాయితీపరుడని కలర్ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. ‘స్కిల్ డెవల ప్మెంట్’ను సమర్థించుకుంటూ శుక్రవారం ఆ పార్టీ ఏకంగా ఒక వెబ్సైట్ను రూపొందించడం విశేషం. వీటన్నింటినీ చూపిస్తూ ‘వీ స్టాండ్ విత్ చంద్రబాబు’.. పేరుతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ, సాధారణ ప్రజానీకంలో మాత్రం చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై పెద్దగా స్పందన కనిపించడంలేదు. వారి నుంచి ఎలాగైనా సానుభూతి పొందడానికి ఆ పార్టీ అన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలకు దిగింది. -
బాబు బెయిల్ పిటిషన్లో కౌంటర్ వేయండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వేసిన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆ పిటిషన్కు విచారణార్హతే లేదు : సీఐడీ పీపీ చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైఎన్ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ మేర ఆయన దాఖలు చేసిన పిటిషన్కు అసలు విచారణార్హతే లేదన్నారు. సీఆర్సీపీ సెక్షన్ 437, సెక్షన్ 439 కింద బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని.. అయితే, ఈ సెక్షన్ల కింద మధ్యంతర బెయిల్ ఇవ్వడమన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఈ సెక్షన్లలో ఎక్కడా కూడా మధ్యంతర బెయిల్ ప్రస్తావనేలేదని ఆయన తెలిపారు. మధ్యంతర బెయిల్ తమ హక్కు అన్నట్లు చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్నారని.. ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న వ్యక్తి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదన్నారు. తాము ఇప్పటికే పోలీసు కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని, అందులో కౌంటర్లు దాఖలు చేయాలని ఈ కోర్టు ఆదేశించినా చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేయలేదని వివేకానంద కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు హైకోర్టును ఆశ్రయించి, ఈ కోర్టు (ఏసీబీ కోర్టు) కౌంటర్ కోసం ఒత్తిడి చేస్తోందన్నట్లు హైకోర్టుకు చెప్పి, పోలీసు కస్టడీ పిటిషన్లో ఈ కోర్టు (ఏసీబీ కోర్టు)ను ముందుకెళ్లకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు తెచ్చారని తెలిపారు. వాస్తవానికి పోలీసు కస్టడీ పిటిషన్లో తామే కౌంటర్ కోసం ఒత్తిడి చేశామే తప్ప, ఈ కోర్టు ఎవరినీ ఒత్తిడి చేయలేదన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో తమ పోలీసు కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు విచారించలేని పరిస్థితిలో ఉండటంతో, దానిని అడ్డంపెట్టుకుని బెయిల్ కోసం పిటిషన్ వేసి మధ్యంతర బెయిల్ కోరుతున్నారని వివేకానంద తెలిపారు. వాస్తవాలను కోర్టు ముందుంచాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చెబుతున్నామన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని విచారణను వాయిదా వేయాలని వివేకానంద కోరారు. మధ్యంతర బెయిల్పై విచారణ సబబేనా? అనంతరం.. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ప్రధాన బెయిల్ కౌంటర్ దాఖలు చేసి, వాదనలు విని దాన్నితేల్చేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ సమయంలో న్యాయస్థానం స్పందిస్తూ.. సీఐడీ కేసు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇదే సమయంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ తమ ముందు పెండింగ్లో ఉందని, ఈ పరిస్థితుల్లో బెయిల్పై విచారణ జరపడంపై స్పష్టత కావాలని తేల్చిచెప్పింది. పోలీసు కస్టడీ పిటిషన్లో ముందుకెళ్లకుండా హైకోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తుచేసింది. అందువల్ల ఈ దశలో మధ్యంతర బెయిల్పై వాదనలు వినడం సబబా? కాదా? అన్న సందేహం కలుగుతోందని ఏసీబీ తెలిపింది. కానీ, మధ్యంతర బెయిల్పై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఏసీబీ కోర్టుకుందని దమ్మాలపాటి తెలిపారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాం కాబట్టి, మధ్యంతర బెయిల్పై కింది కోర్టు విచారణ జరపకూడదన్న నిషేధం ఏదీలేదన్నారు. న్యాయస్థానం స్పందిస్తూ.. మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్నందున, క్వాష్ పిటిషన్లో విచారణ తరువాత హైకోర్టులో వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఈ బెయిల్పై తదుపరి విచారణ జరుపుతామని స్పష్టంచేస్తూ విచారణను 19కి వాయిదా వేసింది. -
‘స్కిల్’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్ కంపెనీయే ఈ మెయిల్ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్ ఇంకా ఏం చెప్పారంటే.. కుంభకోణం సూత్రధారి చంద్రబాబే ♦ కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు. ♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్ అకౌంటెంట్కు ఏపీఎస్ఎస్డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్ను ఆమోదించారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమెన్స్ కంపెనీ పేరుతో మోసం ♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వాడుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ♦ సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్ఎస్డీసీ, సీఐడీలకు అందించింది. భారత్లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మేరMý ు సుమన్బోస్, ఇతరులు డిలీట్ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు, మెసేజ్లు, ఇతర డాటాను రిట్రైవ్ చేసి సీఐడీకి అందించింది. ♦ డిజైన్ టెక్ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్గా నకిలీ ఒప్పందం ♦ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్ టెక్ అనే కంపెనీని భాగస్వామిని చేశారు. ♦ సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్టెక్ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల ♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్ టెక్ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు ♦ డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్ కంపెనీ నుంచి రూ.58.80 కోట్ల సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్ టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీలకు మళ్లించింది. ♦ వాటిలో షెల్ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. గుజరాత్ మోడల్ కాదు.. ♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్ను పరిశీలించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్ను రూపొందించింది. ♦ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. నోట్ ఫైళ్లు మాయం ♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్ చేసింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది. చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు ♦ షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. ♦ డిజైన్టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా యోగేశ్ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. ♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్కే అందించామని మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్’ కుంభకోణం బట్టబయలు ♦ ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్బోస్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. ♦ డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్ కూడా చేసింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్పై విడుదలయ్యారు. ♦ ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్ వినాయక్ ఖన్వేల్కర్తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసింది. ♦ సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
‘స్కిల్ స్కాం: 13 చోట్ల చంద్రబాబు సంతకాలు’
సాక్షి, విజయవాడ: కేబినెట్ అనుమతి లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటులో విధి విధినాలు పాటించలేదని, ప్రైవేట్ వ్యక్తి గంటా సుబ్బారావుకు మూడు బాధ్యతలు అప్పగించారని సంజయ్ తెలిపారు. నేరుగా ఈ డిపార్ట్మెంట్ చంద్రబాబుతో సంప్రదించేలా ప్లాన్ చేశారు. జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలున్నాయి. బడ్జెట్ అనుమతి, కౌన్సిల్ సమావేశానికి కూడా బాబు సంతకం ఉంది. సిమెన్స్ను తెచ్చి స్కిల్ సెంటర్లు పెట్టాలన్నది ఎంవోయూలో లేదు. అగ్రిమెంట్ దురుద్దేశపూర్వకంగా చేసుకున్నారు’’ అని సీఐడీ చీఫ్ పేర్కొన్నారు. ‘‘స్కిల్ స్కామ్ లో రిమాండ్ తర్వాత కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లందరికీ సమాధానం చెప్పదల్చుకున్నాం. ఆ కార్పొరేషన్ ద్వారా హవాలా ద్వారా నిధులు దారి మళ్లాయి. సీమన్స్, డిజైన్ టెక్ సంస్థల ద్వారా నిధుల మళ్లింపు జరిగింది. చంద్రబాబు ప్రోద్బలంతో నే ఇది జరిగింది. ఏ 37ని ఏ1గా పెట్టడం ఏంటి అన్న ప్రశ్న హాస్యాస్పదం. గంటా సుబ్బారావుకి మూడు రకాల హోదాలు ఇచ్చారు. జే.వెంకటేశ్వర్లు అనే టీడీపీ వ్యక్తిని చార్టెడ్ అకౌంటెంట్గా పెట్టారు.’’ అని సీఐడీ పేర్కొంది. ‘‘13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు. నిధులు విడుదల చేయాలని కూడా చంద్రబాబు సంతకం పెట్టిన ఆధారాలు ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ని నియామకంలో సంతకం ఉంది. డిప్యూటీ సీఈవో అపర్ణ నియామకంలోనూ చంద్రబాబు సంతకం ఉంది. క్యాబినెట్ సమావేశం మినిట్స్లో కూడా సంతకం ఉంది. అగ్రిమెంట్ కి సంబంధీన జీవో లో 90:10 శాతం అని చెప్పినా.. ఆ అగ్రిమెంట్ లో 90 శాతం కోసం ప్రస్తావన లేదు. ఇందులో స్పష్టంగా దుర్బుద్ధి, దురుద్దేశ్యం కనిపిస్తోంది’’ అని సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. ‘‘జీవోను తుంగలో తొక్కి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సీమన్స్ కంపెనీ నే స్వయంగా చెప్పింది. మేజిస్ట్రేట్ ముందే వాళ్లు స్టేట్మెంట్ ఇచ్చారు. సీమన్స్ యాజమాన్యంకి కేవలం 58 కోట్లు మాత్రమే తీసుకున్నట్టు చెప్పారు. రూ.371 కోట్లను విడుదల చేసి నేరుగా 241 కోట్ల ను ఒక కంపెనీ కి పంపారు. 241 కోట్లను షెల్ కంపెనీలకి దారిమళ్లించారు. డిజైన్ టెక్కి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 371 కోట్లు నేరుగా పంపారు. 58 కోట్ల సాఫ్ట్వేర్ని 2700 కోట్లు కింద ఆడిటింగ్లో చూపించారు. గుజరాత్ వెళ్లి చూసి వచ్చారు. అక్కడ గ్రౌండ్ లో ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ మాత్రం సాఫ్ట్ వేర్ని ఊహించుకోమంటున్నారు. 6 చోట్ల పెట్టకముందే రూ.371 కోట్లని ప్రైవేట్ కంపెనీకి పంపారు. అధికారులు నిధులు విడుదల చేయడానికి వీలు లేదని ఫైల్లో రాసినా ఇచ్చారు’’ అని సీఐడీ తెలిపింది. ‘‘డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్ కార్ని ఈడీ, సీఐడీ గతంలోనే అరెస్ట్ చేశారు. ఈడీ అరెస్ట్ చేసి, రూ.32 కోట్లు ఆస్తులను అటాచ్ చేసింది. సీమన్స్ సంస్థ సీఐడీకి మెయిల్ పంపింది. మేము డబ్బు పెట్టలేదని సీమన్స్ మెయిల్ లో చెప్పింది. ఎండీ సుమన్ బోస్ షెల్ కంపెనీలతో చేతులు కలిపారు. ఆ విషయం సీమన్స్ విచారణ లో తేలింది అని సీమన్స్ సంస్థ చెప్పింది. ఏసీబీ కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించాకే రిమాండ్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్ వేశాం. అధికారులు ఒత్తిడి వల్ల ఏమి రాశారో అన్నింటినీ ఆధారాలతో చూపాం. జీవోలకు సంబంధించిన నోట్ ఫైల్స్ ని కూడా కొన్ని చోట్ల లేకుండా చేశారు. సీఎం, సి ఎస్ చెప్పడం వల్లనే నిధులు విడుదల చేశాం అని పీవీ రమేష్ గతంలో స్టేట్ మెంట్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు సంతకాలు 5 చోట్ల ఉన్నాయి. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్కి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు’’ అని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. చదవండి: ‘దొంగను పట్టుకుంటే ఎందుకు హడావిడి?’ -
పీవీ రమేశ్ స్టేట్మెంట్తోనే కేసు నడవలేదు: CID
సాక్షి, విజయవాడ: తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో కేసు పెట్టారని.. ఇది దిగ్భ్రాంతి కలిగే అంశమని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ వ్యాఖ్యానించడంపై ఏపీ సీఐడీ స్పందించింది. పీవీ రమేశ్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తోనే కేసు మొత్తం నడవడం లేదని సీఐడీ వర్గాలు బదులిచ్చాయి. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రమే. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయి. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి ఆధారాలున్నాయి. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లాం అని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేశ్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమే. ఇది దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుంది. నిధుల విడుదలలో తన దిగువ స్థాయి అధికారి చేసిన సూచనను పీవీ రమేశ్ పట్టించుకోలేదు. రూ.371 కోట్లు విడుదలచేసేముందు, అంతమొత్తం ఒకేసారి విడుదల చేయడం కరెక్టుకాదని ఆమె వారించారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్కు ముందుగా విడుదలచేద్దామని గట్టిగా సూచించారు. ఎక్కడో గుజరాత్లో చూసి వచ్చాం, అంతా కరెక్టు అనుకోవడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. ఈ అభ్యంతరాలను, సూచనలను పీవీ రమేశ్ పక్కనపెట్టారు. ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయి. పీవీ రమేశ్ చెప్పినట్టుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్డ్ చేయలేదు అని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి. -
LIVE Updates : చంద్రబాబు హౌజ్ అరెస్టుపై విచారణ రేపటికి వాయిదా
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. నిన్న టిడిపి నేతలు, ఎల్లో మీడియా హడావిడి చూస్తే.. ఈ రోజు కోర్టు ప్రారంభం కాకముందే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారని అంతా భావించారు, కానీ చంద్రబాబు తరపు లాయర్లు ఎలాంటి బెయిల్ పిటిషన్ కోర్టులో వేయలేదు. చంద్రబాబును జైల్లో వద్దు, గృహ నిర్భంధంలో ఉంచండి అంటూ బాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు 7.10PM - కేసు విచారణ రేపటికి వాయిదా ► ఏసీబీ కోర్టులో ఇవ్వాళ్టికి ముగిసిన వాదనలు 6.30pm - ఏసీబీ కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభం ► చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్ పై మళ్లీ వాదనలు ప్రారంభం ► ఏసిబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సిఐడీ తరపు న్యాయవాది ► చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత ఉందని చెప్పిన CID లాయర్ 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం 5.50pm - వాదనలకు విరామం ప్రకటించిన న్యాయమూర్తి 5.07pm - చంద్రబాబు తరపున వరుస పిటిషన్లపై కోర్టు ఆగ్రహం ► కోర్టులో ఎన్నో అంశాలుంటాయి ► ఒక పిటిషన్ వాదనలు పూర్తి కాకముందే మరో పిటిషనా? ► దేనికయినా ఒక ప్రొసీజర్ ఉంటుంది ► మిగతా కేసులు జాప్యం కావా? ► ఏ పిటిషన్ అయినా మధ్యాహ్నం 12లోపు వేయాలి ► నేరుగా పిటిషన్ వేసి వాదనలు వినాలనడం సరికాదు 5.06pm - బాబుకు మినహాయింపులేమీ వద్దు : పొన్నవోలు ► చంద్రబాబును హౌజ్ అరెస్ట్కు అనుమతిస్తే కేసును ప్రభావితం చేసే ప్రమాదం ► CRPCలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు ► మరో 2 కేసుల్లోనూ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు 5.05pm - చంద్రబాబుకు వెసులుబాటు ఇవ్వాలి : లూథ్రా ► చంద్రబాబుకు జైలులో ప్రమాదం ఉంది ► జైలులో కరుడుగట్టిన నేరగాళ్లు ఉంటారు ► చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది 4.50pm - కేసు డాక్యుమెంట్లు కావాలి : లుథ్రా ► స్కిల్ కుంభకోణం కేసుకి సంబంధించి పూర్తి వివరాలు కావాలి ►సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్లని పరిశీలించడానికి అనుమతించండి ►సెక్షన్ 207 ప్రకారం అనుమతి ఇవ్వాలి ►పిటిషన్ వేసిన లాయర్ సిద్దార్ద లూథ్రా 4.45pm - చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్పై క్లారిఫికేషన్ కోరిన ఏసీబీ కోర్టు ►సుప్రీంకోర్టులోని కొన్ని కేసులను ఉదహరించిన బాబు తరపు న్యాయవాదులు ►కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగిన న్యాయమూర్తి ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు ►త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశం 4.15pmచంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లుథ్రా ►చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారు ►చంద్రబాబుకు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉంది ►హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది ►గౌతం నవార్కర్ కేసు పరిశీలించండి ►హైకోర్టుకు వెళ్లి తెచ్చుకున్న భద్రత పెంపు ఆదేశాలు అమల్లో ఉన్నాయి ►చంద్రబాబును హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వాలి 3.30pm : AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి ►రాజమండ్రి సబ్ జైల్ 50 అడుగుల గోడ, అక్కడికి ఎవరు రాలేరు ►రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యూరిటీ ఎక్కడా ఉండదు ►అలాగే డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారు ►కాబట్టి చంద్రబాబుకు హౌజ్ అరెస్ట్ అవసరం లేదు ►చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుంది ►చంద్రబాబు ఆరోగ్యం బాగుంది ►చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. 3.20pm : అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ►చంద్రబాబు భద్రతకి ఎటువంటి ఇబ్బంధులు లేవు ►రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు కి గట్టిభద్రత కల్పించాం ►జైలులో చంద్రబాబుకి ప్రత్యేక గదితో పాటు సిసి కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది ►చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డిజి ఆదేశాల లేఖని మీ ముందు ఉంచుతున్నా ►జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడి భధ్రతా బాధ్యత ప్రభుత్వానిదే ►చంద్రబాబు కోరిన విధంగా కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు అందుతున్నాయి ►చంద్రబాబుకి భద్రత కొనసాగుతోంది ►గృహ నిర్బందం పిటిషన్ డిస్మిస్ చేయాలి ►ఈ పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ►చంద్రబాబు సాక్ష్యులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది 3:00pm 3గంటల తర్వాత చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ సిద్ధం చేసినట్టు టిడిపి వర్గాల్లో ప్రచారం జరిగింది. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారని, 437(1) ప్రకారం మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తారని, రెండు పిటిషన్లను న్యాయవాదులు ఒకేసారి దాఖలు చేయనున్నట్టు సమాచారం. మరో వైపుచంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయినట్టు టిడిపి వర్గాల సమాచారం. చంద్రబాబును కుటుంబ సభ్యులు రేపు కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటు రాజమండ్రిలోనే ఉన్న లోకేష్ బస్సులోనే ముఖ్య నేతలతో సమావేశం జరిపినట్టు సమాచారం. చంద్రబాబు అరెస్టు తర్వాతి పరిణామాలపై చర్చించిన టిడిపి నేతలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బయటపడ్డ ఆధారాలపై మంతనాలు జరిపారు. కొందరు సీనియర్లు లోకేష్తో కేసు బలంగా ఉందని చెప్పినట్టు సమాచారం. ACB Court Live Updates ►చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు వాదనలు ►చంద్రబాబు హౌజ్ అరెస్టు పిటిషన్ను తిరస్కరించాలన్న సీఐడీ కౌంటర్ పిటిషన్ ►రాజమండ్రి జైలులో పూర్తి భద్రత మధ్య చంద్రబాబు ఉన్నారు ►బాబును హౌజ్ అరెస్టులో ఉంచాల్సిన అవసరం లేదు ►ఆర్థిక నేరాల్లో ఉన్న నిందితుడికి హౌజ్ అరెస్ట్ అనేది అవసరం లేదు ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. సీఆర్పీసీలో హౌజ్ అరెస్ట్ అనేదే లేదు. బెయిల్ ఇవ్వలేదు కాబట్టే హౌజ్ రిమాండ్ కోరుతున్నారు. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్ కాపీలో పేర్కొంది. ► చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో అరెస్ట్ కోరుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ( ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్) వేశారు సిట్ తరపు న్యాయవాదులు. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. మరో కేసులో చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్? విజయవాడ ఏసీబీ కోర్టులో.. సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్ కోసం పీటీ వారెంట్(పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొంది సీఐడీ. ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్పై మధ్యాహ్నం 2.30కి వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్ను.. హౌజ్ అరెస్ట్గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై మధ్యాహ్నాం తర్వాత విచారణ జరగనుంది. ► చంద్రబాబు హౌజ్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్ స్పెషల్ జీపి న్యాయమూర్తిని కోరారు. దీంతో.. హౌజ్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ పిటిషన్పై విచారణ అనంతరమే ఆదేశాలేవైనా ఇస్తామని న్యాయమూర్తి చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేశారు. ► ఏఏజీ స్పందన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు. ఏసీబీ కోర్టు తీర్పు కాపీ ఇవాళ అందుతుంది. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశాం. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి.. హౌజ్ అరెస్ట్ పిటిషన్ పరిణామంపై స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరులేకపోయినా దర్యాప్తు తర్వాత పేర్లు చేర్చొచ్చు. FIR అనేది దర్యాప్తునకు మొట్టమొదటి అడుగు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం బయటపడినా , వాళ్ల పేర్లు చేర్చొచ్చు. FIR లో లేదు కాబట్టి ముద్దాయి కాదంటే , న్యాయసూత్రాలకు విరుద్ధం - ఈ కేసు ఏపీ ప్రభుత్వం పెట్టింది కాదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. ► చంద్రబాబును జైల్లో ఉంచడం ప్రమాదకరం - హౌస్ అరెస్ట్ పిటిషన్ పై మా వాదనలు వినిపిస్తాం - గతంలో వెస్ట్ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తాం - బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నాం : అడ్వకేట్ కౌన్సిల్ సిద్ధార్ద్ లూద్రా ► విజయవాడ కోర్టులో మరోసారి హౌజ్ అరెస్ట్ పిటిషన్ వేయనున్న లూథ్రా!. ఎన్ఎస్జీ సెక్యూరిటీ వీవీఐపీగా ఉన్న చంద్రబాబు నాయుడను హౌజ్ అరెస్ట్ చేయాలని, భద్రతా కారణాల వల్ల ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరే ఛాన్స్ కనిపిస్తోంది. ► ఏసీబీ కోర్టు తీర్పు కాపీ కోసం చంద్రబాబు లాయర్ల ఎదురుచూపులు. తీర్పులోని అంశాల ఆధారంగానే.. బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలా? హైకోర్టులో వేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఏసీబీ కోర్టుకు వచ్చిన చంద్రబాబు తరపు లాయర్లు విజయవాడ కోర్టుకు వచ్చిన సిద్ధార్థ్ లూథ్రా , ఇతర లాయర్లు. సీఐడీ కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపున తన వాదనలు వినిపించనున్న లూథ్రా. అలాగే బెయిల్ పిటిషన్ ఎక్కడ వేయాలన్నదానిపైనా లీగల్ టీంతో చర్చలు. సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి.. విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. స్కిల్ స్కాంలో ప్రధాన ముద్దాయి అయిన చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని, తద్వారా మరిన్ని వివరాలు రాబట్టగలిగే అవకాశం కల్పించాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును కోరనుంది. స్కిల్ స్కామ్ కేసుపై ఇవాళ మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా విచారణకు రానుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నాయి. అలాగే.. ఏ 1 ముద్దాయి చంద్రబాబుని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. దీనికి కౌంటర్గా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇక.. కస్టడీ పిటీషన్ పై విచారణ తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు హైకోర్టుని ఆశ్రయించే ఆలోచనలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ ని రిజెక్ట్ చేయాలని హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ, జైలుకు తరలించడం తో హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణకు తీసుకోరని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. దీంతో ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటిషన్ను దాఖలు చేయొచ్చని తెలుస్తోంది. -
ప్రభుత్వానికి రూ.300 కోట్ల నష్టం జరిగింది: సీఐడీ
-
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బాబుగారి ప్లాన్!
ప్రతీ సందర్భాన్నీ తన రాజకీయ అవసరానికి వాడుకోవడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. చివరికి భారీ స్కామ్కు పాల్పడి అరెస్ట్ అయిన ప్రస్తుత సందర్భాన్ని కూడా తనకు అనుకూలంగా మలచుకోవడానికే చంద్రబాబు చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఏదో పైకి మొక్కుబడిగా మీడియా ముఖంగా చెప్పిన బాబు.. అందుకు భిన్నంగా వ్యవహరించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేసేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని సీఐడీ దర్యాప్తులో తేలిన తర్వాత అరెస్ట్ చేస్తే, అందులో సానుభూతిని సంపాదించుకోవడం చూస్తున్నాడు. నంద్యాలలో చంద్రబాబను అరెస్ట్ చేసిన తర్వాత విజయవాడ కోర్టుకు తరలించే క్రమంలో పెద్ద హైడ్రామే నడిచింది. చంద్రబాబు వయసు, హోదా దృష్ట్యా హెలికాప్టర్లో తరలిస్తామని చంద్రబాబుకు సీఐడీ సూచన చేయగా, హెలికాప్టర్లో తరలింపు వద్దని చంద్రబాబు నిరాకరించడమే కాకుండా తన కాన్వాయ్లోనే వస్తానంటూ పట్టుబట్టారు. దాంతో చేసేది లేక చంద్రబాబు కాన్వాయ్లోనే విజయవాడకు తరలించేందుకు అంగీకరించింది సీఐడీ. ఇక్కడ చంద్రబాబు ఉద్దేశం ఏమిటో క్లియర్గా అర్ధం అవుతోంది. ఎలాగోలా ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సానుభూతి పొందాలనే తపనే కనిపించింది బాబు గారిలో.. దానిలో భాగంగా తనను తీసుకెళ్లే కాన్వాయ్ను అడ్డుకోవాలంటూ టీడీపీ శ్రేణులకు, పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా దాని ద్వారా వచ్చిన మైలేజ్ పొందాలని ప్లాన్ చేసుకున్నారు చంద్రబాబు. అందుకే ఆకాశ మార్గం గుండా కాకుండా రోడ్డు మార్గంలోనే వెళదామని పట్టుబట్టడానికి ప్రధాన కారణం. ఇలా తనను రోడ్డు మార్గంలో తీసుకెళ్లే సమయంలో ఆందోళనలకు దిగాలని పిలుపునిచ్చారు బాబుగారు. అదే సమయంలో తమకు తెలియకుండా రూటు మార్చుతున్నారంటూ ఎల్లో మీడియా వార్తలు ఇవ్వసాగింది. ఒకవేళ చంద్రబాబును విజయవాడకు తీసుకెళ్లే క్రమంలో రూట్ మార్చాలంటే ఎల్లో మీడియా పర్మిషన్ అవసరమా? అనే ప్రశ్న తలెత్తక మానదు. చంద్రబాబును ఎలా తీసుకెళ్లాలన్నది పోలీసులకు తెలియదా?, ఎక్కడకు తీసుకెళుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఉన్నప్పుడు.. ఎలా తీసుకెళుతున్నారు అనే విషయం అనవసరం. ఇటువంటి హైప్రొఫైల్ కేసులో అరెస్ట్లు జరిగినప్పుడు ఎలా తీసుకెళుతున్నారనే రూట్ మ్యాప్ అనేది తెలియకపోవడమే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎంత పకడ్బందీగా చంద్రబాబును అధికారులు తరలించే యత్నం చేసినప్పటికీ టీడీపీ శ్రేణులు పలుమార్లు కాన్వాయ్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడం గమనార్హం. దాంతో ఏ ఇతర వాహనాన్ని చంద్రబాబు కాన్వాయ్కు సమీపంగా రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మరొకవైపు కాన్వాయ్లో 108 ఉన్నా.. అంబులెన్స్ లేదంటూ తప్పుడు వార్తలు ఇచ్చింది ఎల్లో మీడియా. అరెస్ట్ చేసి తీసుకెళుతుంటే ఎన్ని వాహనాలు ఉండాలో కూడా ఎల్లో మీడియా చెప్పేస్తుంది. అసలు ఎన్ని వాహనాలు ఉండాలు అన్నది పోలీసులు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది కానీ ఎల్లో మీడియా, టీడీపీ శ్రేణులో చెప్పినట్లు నడవదు. -
చంద్రబాబే ప్రధాన సూత్రధారి: ఏపీ సీఐడీ
సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ ప్రకటించింది. శనివారం చంద్రబాబు నాయుడు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను సీఐడీ అదనపు డీజీ సంజయ్ మీడియాకు తెలిపారు. ఇవాళ ఉదయం ఆరుగంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశాం. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆయన ప్రధాన నిందితుడు. ఈ స్కామ్లో ప్రధాన కుట్రదారుడు.. ఫైనల్ బెనిఫిషీయరీ కూడా చంద్రబాబే. దర్యాప్తులోనూ ప్రధాన నిందితుడు చంద్రబాబే అని తేలింది. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశాం. ఈ స్కాంలో మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది. ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో.. నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీకి నిధులు మళ్లించారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. అందుకే.. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశాం. ► ఈ స్కామ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు మాయం చేశారు. ఈడీ, జీఎస్టీ ఏజెన్సీలు కూడా ఈ స్కామ్పై దర్యాప్తు చేశాయి. ► 2014లో ఏపీ ఉన్నత విద్యామండలి.. సీమెన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఎంవోయూ తర్వాత.. అదే ఏడాది జులైలో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యింది. గంటా సుబ్బారావు సీఈవోగా వ్యవహరించారు. ఉద్దేశపూర్వకంగానే గంటా సుబ్బారావుకి సీఈవోతో పాటు ఎండీ, ఉన్నత విద్యా మండలి సలహాదారుగా, సీఎం సలహాదారుగా పదవులు కట్టబెట్టారు. ► ఈ ఒప్పందానికి డిజైన్ టెక్ ప్రదాన సూత్రధారి. డిజైన్ టెక్ కి సంబంధించిన భాస్కర్ భార్య అపర్ణ యూపీ క్యాడర్ స్కిల్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా వచ్చారు. ► సీమెన్స్ నుంచి 90 శాతం నిధులు విడుదల కాకపోయినా.. రూ. 371 కోట్లను ఏపీ ప్రభుత్వం తమ వాటాగా విడుదల చేసింది. ఆర్ధిక శాఖ, సీఎస్ అభ్యంతరాలని సైతం పట్టించుకోలేదు ► రూ. 58 కోట్ల సాఫ్ట్ వేర్ ని.. మూడు వేలకోట్ల ప్రాజెక్ట్ గా చూపించారు నారా లోకేష్ పాత్రపైనా విచారణ.. ప్రభుత్వ ధనం ఎవరిరెవరి ఖాతాల్లోకి అక్రమంగా మళ్లాయో సిఐడి దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడి తనయుడు నారాలోకేష్ పాత్రపైనా సీఐడీ విచారణ జరుపుతోంది. అలాగే.. కిలారు రాజేష్ పాత్రపై కూడా సీఐడీ విచారణ చేస్తోంది. వీటితో పాటు ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలలో కూడా లోకేష్ పాత్రపై లోతైన దర్యాప్తు సాగుతుంది ► కుంభకోణంలో కీలక వ్యక్తి అయిన డిజైన్ టెక్ కి చెందిన మనోజ్ విదేశాలకి పారిపోయాడు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కూడా అమెరికా పారిపోయాడు. విదేశాల్లో ఉన్న నిందితులను తీసుకొచ్చేందుకు ఇంటర్పోల్ సాయం కోరతాం. విదేశాల్లో తలదాచుకున్న ఈ నిందితులది ఈ స్కామ్లో కీలక పాత్రగా గుర్తించాం. ► ప్రభుత్వ ధనాన్ని పలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి. విచారణలో అదే వెల్లడైంది. అందుకే నంద్యాలలో అరెస్ట్ చేశాం. హెలికాఫ్టర్లో ప్రయాణానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. అందుకే ఆయన సొంత వాహనంలోనే విజయవాడ రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్నాం. విజయవాడ చేరుకున్నాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరు పరుస్తాం. మరిన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబు కస్టడీ అవసరం అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. -
బాబు ఆరోపణలకు సజ్జల కౌంటర్
సాక్షి, గుంటూరు: ఎలాంటి దురుద్దేశాలు లకుండా పాదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. స్కిల్డెవలప్మెంట్ స్కాంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యాక.. రాజకీయ దురుద్దేశాలతోనే తనను అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై సజ్జల స్పందించారు. ఎఫ్ఐఆర్ లేదు.. నోటీసులు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అన్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి అరెస్ట్ గురించి ఆయన మాట్లడుతున్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో తన పేరు లేదంటూ దబాయిస్తున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, ఈ కేసు చాలా బలంగా ఉంది. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్ఆఐర్ నమోదు అయ్యిది. 2021 డిసెంబర్లో(9-12-2021) సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కానీ, 2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం.. రూ.241 కోట్లు డైవర్ట్ అయ్యిందని బయటపెట్టింది. ఎఫ్ఐఆర్ కంటే ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్ బయటపడింది. స్కాంలో అప్పటి సీఎం పాత్ర ఉందనే బలమైన సాక్ష్యాలు సీఐడీ దగ్గర ఉన్నాయి. షెల్ కంపెనీల ద్వారా నిధులు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్కు ముందే స్కామ్ బయటపడింది. తేదీ లేని ఎంవోయూ కుదర్చుకున్నారు. జీవో ప్రకారం ఏదీ జరగలేదు.. అన్నీ పక్కకు పెట్టారు. ఇది 100 శాతం అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కాం అయిపోయింది. ఎంవోయూ అయ్యాక ఉన్నతాధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నోట్ఫైల్స్లో కూడా అధికారులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిజైన్టెక్ ద్వారా హవాలా డబ్బు టీడీపీ వాళ్ల ఖాతాల్లోకి వెళ్లిందని సీఐడీ గుర్తించింది. చంద్రబాబు ఆదేశాల ప్రకారమే స్కాం జరిగిందని గుర్తించి ఆధారాలు చూపించి మరీ దర్యాప్తు చేస్తోంది సీఐడీ. 2018లోనే విజిల్ బ్లోయర్ ద్వారా స్కామ్ బయటపడింది. చాలా రాష్ట్రాల్లో ఈ స్కామ్పై ఏజన్సీలు దర్యాప్తు చేశాయి. తన హయాంలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతిగా దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు. ఆరోపణలున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం సాధారణం. అయినా.. రెండేళ్లుగా సాగుతున్న దర్యాప్తు కేసులో ఇప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించకపోతే ఎలా?. స్కామ్లో దర్యాప్తే జరుగుతోంది.. రాజకీయాలు కాదు. రాజకీయ దురుద్దేశమే ఉంటే అరెస్ట్కు ఇన్ని రోజులు ఎందుకు సమయం పడుతుంది?. డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్లిందనేది తేలడానికి టైం పట్టింది. బెనిఫీషియరీ కూడా చంద్రబాబే అని తేలడంతో అరెస్ట్ చేశారు. ఆయన్నేదో కరుణానిధిని అరెస్ట్ చేసినట్లు అర్ధరాత్రి ఏమీ అరెస్ట్ చేయలేదు. పకడ్బందీగా ప్లాన్ చేసిన స్కామ్ కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు అని సజ్జల పేర్కొన్నారు. -
చంద్రబాబు అరెస్ట్.. వాట్ నెక్స్ట్
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ. శనివారం ఉదయం నంద్యాలలో హైడ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆపై విజయవాడకు తరలించే యత్నం చేసింది. తన కాన్వాయ్లోనే వస్తానని చెప్పడంతో ఏపీ అధికారులు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు వెంట కాల్వ శ్రీనివాసులు ఉన్నారు. తొలుత విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబును తరలిస్తారని సమాచారం. ఆపై సీఐడీ పోలీసులు, మూడో అదనపు జిల్లా కోర్టులో చంద్రబాబు నాయుడ్ని హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉదయం పది గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వ్యవహరించనున్నారు. ఇక నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో పెద్ద డ్రామానే నడిచింది. తొలుత సీఐడీ అధికారులతో చంద్రబాబు, ఆయన లాయర్లు వాదనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి అడ్డుకునే యత్నం చేశారు. అయితే అధికారుల వివరణతో చివరకు అరెస్టుకు అంగీకరించారాయన. ఆపై శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కార్యకర్తలు అక్కడి నుంచి పంపించివేసి.. చంద్రబాబును విజయవాడకు తరలించారు. -
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
చంద్రబాబు ఐటీ స్కాంపై రంగంలోకి ఏపీ సీఐడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాంపై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మూలాలు ఒకే చోట ఉన్నాయన్న దానిపై విచారణకు సన్నద్ధమైంది. రెండు స్కాంలో ఒకే వ్యక్తులు ఉండటంపై విచారణకు సిద్ధమైంది. ఐటీ స్కాంలో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేశ్ పార్ధసాని, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడు యోగేష్ గుప్తాకు ఏపీ సీఐడీ నోటీసులుజారీ చేసింది. వీరిద్దరిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి.. కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ వ్యహహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీశాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు స్కాంలో భారీగా డబ్బు అందుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్పై అభియోగాలు మోపింది. రెండు స్కాంల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కాంలో ఉన్నవారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది. దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపై కూడా దృష్టి పెట్టనుంది. త్వరలో దుబాయికి విచారణ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’ -
మార్గదర్శి మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్లలో.. మూడు రోజులుగా జరిగిన తనిఖీల్లో కొత్తతరహాలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయని ఏపీ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో సీఐడీ అధికారులతో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. మార్గదర్శి అక్రమాలను బయటపెట్టడంతో పాటు ఇలాంటి చిట్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపు ఇచ్చారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్లలో జరిగిన సోదాల్లో.. మరిన్ని లొసుగులు బయటపడ్డాయి. వేలంపాటలోనూ అవకతవకలు కనిపించాయి. సెక్షన్ 17 ప్రకారం.. చిట్ఫండ్ స్టార్టింగ్లోనే కస్టమర్ల సంతకాలు సేకరిస్తున్నారు. డిపాజిటర్లకు బదులు.. ఏజెంట్లు, మేనేజర్లు వేలంపాటలో పాల్గొంటున్నారు. బాధితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు. షూరిటీ సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారు. ప్రజలకు, చందాదారులకు ఇలాంటి అవకతవకలను తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఈ సమాచారం తీసుకెళ్లడంలో మీడియా కూడా సహకరించాలని ఆయన కోరారు. సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. మార్గదర్సి అక్రమాలపై డిపాజిట్ దారులు ఫిర్యాదు చేశారని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ► మార్గదర్సి చిట్ ఫండ్ లో చేరకుండానే సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆధార్ ఆధారంగా అతనికి తెలియకుండానే వేలం పాడారు. చీరాల వన్ టౌన్ పిఎస్ లో 283/23 కేసుగా నమోదు చేశాం. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం ప్రదర్శించారు. ► అనకాపల్లి పిఎస్ లో కూడా మరో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. 4.60 లక్షలు చిట్ రావాల్సి ఉండగా కేవలం 20 రూపాయిలు మాత్రమే వెంకటేశ్వర రావుకి ఇచ్చి మోసం చేశారు ► రాజమండ్రి టూ టౌన్ లో బాధితుడు కోరుకొండ విజయకుమార్ ఫిర్యాదు మేరకు మార్గదర్సి రాజమండ్రి బిఎంపై 179/23...409,420 సెక్షన్ లగా కేసు నమోదు చేశాం ఈ మూడు కేసులలో బ్రాంచ్ మేనేజర్లని అరెస్ట్ చేశాం. ఎఫ్ఐఆర్ వివరాలు కోఆర్డినేషన్ నంబర్ కి పంపాం అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ తెలిపారు. రికార్డులు చూపించమంటే కొందరు మేనేజర్లు పారిపోయారని తెలిపారాయన. సీఐడీ ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్ లో తరహాలోనే మార్గదర్శి కుంభకోణం అని సీఐడీ ఎస్సీ అమిత్ బర్దార్ తెలిపారు. శారదా కుంభకోణం తర్వాత చిట్స్ చట్టంలో మార్పులు చేసినా.. మార్గదర్శిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. డిపాజిట్ దారులు కానివారి డాక్యుమెంట్స్ ఉపయోగించి అక్రమాలకి పాల్పడ్డారు. డిపాజిట్ దారులకి తెలియకుండా మార్గదర్సి చిట్ ఫండ్స్ వేలంపాటలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కేసులో డిపాజిట్ దారుడికి తెలియకుండానే అతనిని మరో డిపాజిట్ దారుడికి ష్యూరిటీగా పెట్టారు. చిట్ ఫండ్ యాక్ట్ సెక్షన్ 22 ప్రకారం ఫోర్ మెన్లకి నిర్దిష్టమైన విధులువున్నాయి. డిపాజిట్ దారులకి అవగాహన కల్పించాల్సిన ఫోర్ మెన్ లు మోసం చేస్తున్నారని తెలిపారాయన. చిట్ ఫండ్ మోసాలు, అక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తవ్వేకొద్దీ మార్గదర్శి అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. చందాదారులకు తెలియకుండానే డబ్బు కాజేస్తున్నారు. చిట్ఫండ్ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి నిధులు సేకరించింది. బ్రాంచ్ మేనేజర్లు తమకేమీ తెలియదని చెబుతున్నారు. రికార్డ్ చూపించమంటే కొందరు పారిపోయారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర రికార్డ్ లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. మార్గదర్శిపై ఇప్పటిదాకా వందకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వాట్సాప్ ద్వారాఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 9493174065 అని అధికారులు తెలిపారు. -
ఆందోళనలో మార్గదర్శి చందాదారులు
తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వారికి సైతం చెల్లింపులు చెల్లించని వైఖరిని మార్గదర్శి అవలంభిస్తోంది. దీంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అధికారిక తనిఖీల్లో మార్గదర్శి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడోరోజూ మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సోదాలలో డిపాజిటర్ల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. బ్యాంక్ ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు జప్తు చేశారు. ఇవాళ్టి తనిఖీలలో మరిన్ని అక్రమాలు బయటపడొచ్చనే భావిస్తున్నారు. ఆ వర్గానికి మాత్రమే చెల్లింపులా? ఇప్పటికే తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వాళ్లకు మార్గదర్శి యాజమాన్యం చెల్లింపులు చెల్లించలేదు. అదే సమయంలో కాల పరిమితి ముగిసినా ప్రైజ్మనీ అందించని పరిస్థితి ఉంది. దీంతో మార్గదర్శి చందాదారుల్లో ఆందోళన నెలకొంది. చందాదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది మార్గదర్శి. దీంతో చందాదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి తెస్తున్న ఓ సామాజికవర్గం వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామోజీకి దెబ్బ! చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదే సమయంలో.. మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టింది. నిధుల మళ్లింపు పాపం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు కాబట్టి. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదొక్కటే దారి రామోజీ పాపం ఫలితంతో.. 50 వేల మంది చందాదారుల సొమ్ము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ‘అగ్రిగోల్డ్’ తరహాలో మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణపైనా సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
రామోజీ, శైలజాకిరణ్ మళ్లీ డుమ్మా
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజాకిరణ్ మరోసారి సీఐడీ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు హాజరు కావాలని సీఐడీ రెండోసారి నోటీసులు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారు. తద్వారా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించే ప్రసక్తే లేదన్న వైఖరిని పునరుద్ఘాటించారు. కేంద్ర చిట్ ఫండ్ చట్టం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల నిధులను మళ్లించిన కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు రామోజీరావు, శైలజాకిరణ్కు నోటీసులు జారీ చేశారు. వీరు ఈ నెల 16న (బుధవారం) విచారణకు హాజ రు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ విచారణకు హాజరుకాలేదు. సీఐడీ దర్యాప్తునకు రామోజీరావు, శైలజాకిరణ్ ముఖం చాటేయడం ఇది రెండోసారి. ఈ కేసులో గుంటూరు సీఐడీ కార్యాలయంలో జూలై 5న విచారణకు హాజరు కావాలని గతంలో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్తోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు కూడా కేవలం మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు మాత్రమే విచారణకు హాజరయ్యారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగానే తాము చేశామని వారు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కానీ రామోజీరావు, శైలజాకిరణ్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. తాము విచారణకు హాజరయ్యే పరిస్థితుల్లో లేమని సీఐడీ కార్యాలయానికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు. మళ్లీ కూడా అదే వైఖరి రామోజీరావు, శైలజాకిరణ్కు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని సీఐడీ ఈ నెల 9న నోటీసులు జారీ చేసింది. ఈసారీ వారిద్దరూ విచారణకు ముఖం చాటేశారు. ఈ కేసులో రామోజీరావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఓసా రి, శైలజాకిరణ్ను రెండుసార్లు సీఐడీ అధికారులు విచారించారు. ఆ విచారణ సమయంలో ఇంటి గేట్లు ఉద్దేశ పూర్వకంగా తెరవకుండా అధికారులను వేచి చూసేలా చేశారు. ఆపై విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. కాగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన చందాదారుల నిధులు మళ్లించినందున.. అంటే నేరం ఆంధ్రప్రదేశ్లో జరిగినందున వారిద్దరినీ రాష్ట్రంలోనే విచారించాల్సి ఉంది. అందుకే ఏపీలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
రామోజీ, కిరణ్, శైలజలపై ప్రాథమిక ఆధారాలున్నాయి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీపై ‘ఈనాడు’ పత్రిక ప్రచురిస్తున్న అసత్య, తప్పుడు కథనాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు న్యాయస్థానం స్పందించింది. ఈ ఫిర్యాదులో నిందితులపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించారని వెల్లడించింది. ఈ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో నన్నపనేని విశ్వప్రసాద్, హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఎం.నరసింహారెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసులు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు గుంటూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సీహెచ్.రాజగోపాలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 25న రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్లతో సహా మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు విచారణ మొదలవుతుంది. ఈనాడు తప్పుడు, విష కథనాలపై ఫిర్యాదు.. మార్గదర్శి అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీపై ఈనాడు వరుసగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇందులో సీఐడీపై పలు అసత్య, నిరాధార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఈనాడు, రామోజీరావు తదితరులపై గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డికి అప్పగించింది. దీంతో గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 4న కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతోపాటు ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్ఐఆర్లు, రామోజీరావు, కిరణ్ల వాంగ్మూలం, శైలజా కిరణ్ రిమాండ్ రిపోర్టులు తదితరాలను అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి దీన్ని మరో న్యాయమూర్తికి పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సీహెచ్ రాజగోపాలరావు గురువారం విచారణ జరిపారు. సీఐడీ మనోస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు కథనాలు.. ఫిర్యాదుదారు తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారం చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్ఫండ్లో చేసిన తనిఖీల్లో ఆ సంస్థ అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయన్నారు. దీంతో వాటిపై చిట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సీఐడీ విచారణ మొదలు పెట్టిందన్నారు. సీఐడీ చట్టప్రకారమే నడుచుకుంటున్నా దాని మనో, నైతిక స్థైర్యాలు దెబ్బతీసేలా ఈనాడు యాజమాన్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని కోర్టుకు నివేదించారు. సీఐడీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఈనాడు ఇలా చేసిందన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ఈనాడు యాజమాన్యం చేస్తున్న పనులకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెడుతూ న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరువు, ప్రతిష్టలు ఎవరికైనా ఒకటేనని, వాటిని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ముందుకు రాకపోతే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలిపారు. ‘ప్రభుత్వాలను నిలబెట్టేది మేమే.. కూల్చేది మేమే’ అన్నట్లు ఈనాడు యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సుధాకర్రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ఈనాడు తప్పుడు, విష కథనాల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. -
రామోజీ, శైలజకు మరోసారి నోటీసులు
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్లను చేర్చింది ఏపీ సీఐడీ. ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు -
మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు: ఛీటింగ్ ‘మార్గం' మూత!
అతిపెద్ద కార్పొరేట్ మోసంమార్గదర్శి చిట్ఫండ్స్ దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మార్కెట్లో పేరుందని చెప్పుకున్నప్పటికీ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్ కుంభకోణంలో ఎన్రాన్ కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో సీఐడీ మరో కీలక చర్య తీసుకుంది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్ కేంద్ర చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల డబ్బులను మళ్లించి అనుబంధ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులపై కొరడా ఝళిపించింది. ప్రధానంగా మార్గదర్శి చిట్ఫండ్స్కు ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయా ఎంటర్ ప్రైజస్లో ఉన్న వాటాలను అటాచ్ చేయాలని నిర్ణయించింది. రామోజీరావు వ్యాపార సామ్రాజ్యంలో ఇవే ప్రధాన విభాగాలు కావడం గమనార్హం. మరోవైపు మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన ఏడు కేసుల్లో రెండింటిలో సీఐడీ న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. సీఐడీ ఐజీ సీహెచ్.శ్రీకాంత్తో కలసి శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్ఫండ్స్ పేరిట రామోజీరావు, శైలజా కిరణ్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. నిబంధన ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి పెట్టిన పెట్టుబడులను సీఐడీ అటాచ్ చేస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు రూ.1,035 కోట్లను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీని అనుమతినిస్తూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఉషాకిరణ్ మీడియా లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో వాటాలను అటాచ్ చేసేందుకు హోంశాఖ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్ఫండ్స్ పేరిట ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న 88.50 శాతం వాటాతోపాటు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్లో 44.55 శాతం వాటా అటాచ్ కానుంది. ఆ సంస్థల్లో ప్రధాన వాటాలను సీఐడీ అటాచ్ చేయనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతించాలని సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసింది. న్యాయస్థానం అనుమతితో వాటిని అటాచ్ చేయనుంది. రెండు కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చిట్ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించిన మార్గదర్శి చిట్ఫండ్స్పై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. వాటిలో రెండు కేసుల్లో న్యాయస్థానంలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజా కిరణ్, ఏ–3 మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లు (ఫోర్మెన్)తోపాటు మొత్తం 15 మందిపై క్రిమినల్ కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం, విశ్వాస ఘాతుకానికి పాల్పడటం, రికార్డులను తారుమారు చేయడం తదితర నేరాలతోపాటు ఏపీ డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఏడు కేసుల్లో రెండింటిలో చార్జ్షీట్లు దాఖలు చేసింది. మిగిలిన కేసుల్లో కూడా త్వరలోనే చార్జ్షీట్లు దాఖలు చేయడంతోపాటు చట్టపరంగా తదుపరి చర్యలు చేపడతామని సీఐడీ ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. సీఐడీ విచారణకు గైర్హాజరై రామోజీరావు, శైలజా కిరణ్ దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు. ఈ అంశంతోపాటు చార్జ్షీట్ దాఖలు తరువాత చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చందాదారులకు తెలియకుండా.. న్యాయస్థానం కళ్లుగప్పి మార్గదర్శి చిట్ఫండ్స్కు చెందిన 23 చిట్టీ గ్రూపుల మూసివేతకు సంబంధించి రాష్ట్ర చిట్ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొందరు పిటిషన్లు దాఖలు చేయడం వెనుక లోగుట్టు బయటపడింది. న్యాయస్థానంలో పిటిషన్లు వేసిన కొందరు చందాదారులకు అసలు తమ పేరుతో అవి దాఖలైన విషయమే తెలియదని వెల్లడైంది. కొన్ని పత్రాలపై చందాదారుల సంతకాలు తీసుకుని ఇతరులే పిటిషన్లు దాఖలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చినట్లు అమిత్ బర్దర్ తెలిపారు. తమ పేరిట పిటిషన్లు దాఖలైన విషయమే తెలియదని పలువురు వెల్లడించినట్లు చెప్పారు. అది న్యాయస్థానాన్ని మోసం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పత్రాలు అందచేసి సంతకాలు చేయాలని కోరితే మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు క్షుణ్నంగా చదవాలన్నారు. పూర్తిగా చదవకుండా సంతకాలు చేయవద్దని సూచించారు. మూతపడ్డ ‘మార్గదర్శి’ వెబ్సైట్ ఆర్థిక అక్రమాలకు పాల్పడి పీకల్లోతు కూరుకుపోయిన మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా తమ వెబ్సైట్ను మూసివేసింది. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల్లో వాటాల అటాచ్మెంట్కు ప్రభుత్వం అనుమతించినట్లు సీఐడీ ఎస్పీ అమిత్ బర్దన్ వెల్లడించిన కాసేపటికే మార్గదర్శి చిట్ఫండ్స్ తమ వెబ్సైట్ను మూసివేయడం గమనార్హం. మార్గదర్శి డాట్కామ్ పేరుతో నిర్వహిస్తున్న వెబ్సైట్ శుక్రవారం సాయంత్రం నుంచి ఓపెన్ కావడం లేదు. వెబ్సైట్పై క్లిక్ చేయగా ‘నిర్వహణ పరమైన అంశాలతో వెబ్సైట్ అందుబాటులో లేదు. త్వరలోనే పునరుద్ధరిస్తాం’ అనే సందేశం కనిపిస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్కు సంబంధించిన అధికారిక సమాచారం అంతా అందులోనే ఉంటుంది. హఠాత్తుగా వెబ్సైట్ పనిచేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడుల వివరాలను గోప్యంగా ఉంచేందుకే వెబ్సైట్ను మూసివేసినట్లు భావిస్తున్నారు. -
రామోజీరావు, శైలజా కిరణ్లకు సీఐడీ నోటీసులు
సాక్షి, విజయవాడ: మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్లు విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. జూలై5వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది. గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్కి హాజరు కావాలని సీఐడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు ఉండగా, ఏ-2గా శైలజా కిరణ్లు ఉన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది సీఐడీ.ఈ నెల మొదటివారంలో ఏ-2గా ఉన్న శైలజా కిరణ్ను సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. శైలజా కిరణ్ నివాసంలోనే ఆమెను సీఐడీ విచారించింది. కాగా, విచారణ కోసం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ . ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు. శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. చదవండి: రామోజీ రాసిందే రశీదు! -
శైలజా కిరణ్ను మరోసారి విచారించాల్సి ఉంది: సీఐడీ
Updates: శైలజా కిరణ్ను మరోసారి విచారించాల్సి ఉందని సీఐడీ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే నోటీసులిస్తామని సీఐడీ డీఎస్సీ రవికుమార్ తెలిపారు. నేటి విచారణలో కొంతమేర సమాధానాలు మాత్రమే ఇచ్చారని, అందుచేత మరోసారి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. అనారోగ్యం సమస్య ఉందనడంతో శైలజాకిరణ్ను వైద్యులు పరీక్షించారని సీఐడీ డీఎస్పీ పేర్కొన్నరు. ► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈరోజు(మంగళవారం) ఈ కేసులో ఎ-2లో ఉన్న మార్గదర్శ ఎండీ శైలజా కిరణ్ను సుదీర్ఘంగా విచారించారు. నేటి ఉదయమే శైలజా కిరణ్ ఇంటికి చేరుకున్న అధికారులు సుమారు 10 గంటల పాటు ఆమెను విచారించారు. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు సీఐడీ అధికారులు. ►మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎ-2గా ఉన్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు గత ఎనిమిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఐవో రవికుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. విచారణలో సీఐడీ ఎస్పీలు హర్షవర్ధన్రాజు, అమిత్ భర్ధర్లు పాల్గొన్నారు. ఒక మహిళా ఏసీపీ సహా మొత్తం 30మంది అధికారులు విచారణలో పాల్గొన్నారు. మార్గదర్శి ఖాతాదారుల నగదు దారి మళ్లింపుపై విచారణ చేపట్టారు. నిబంధనలు ఉల్గంఘనలపై సీఐడీ ప్రశ్నిస్తోంది విచారణ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న మార్గదర్శి చైర్మన్ రామోజీరావును సీఐడీ ఇప్పటికే ప్రశ్నించింది. ► మార్గదర్శి కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి ఫండ్స్ దారి మళ్లింపుపై విచారణ జరుగుతుండగా.. నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్నారు. విచారణను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి సీఐడీ ప్రశ్నిస్తోంది. సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని రామోజీరావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్ఫండ్ కేసులో ఎండీ శైలజా కిరణ్ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. రామోజీ గ్రూప్ కంపెనీలకు ఫండ్స్ మళ్లించినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే అటాచ్ చేసింది దర్యాప్తు సంస్థ. మార్గదర్శికి సంబంధించిన రూ. 798.50 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు, చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్స్ గ్రూప్లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. గత విచారణ సందర్భంగా రామోజీరావు(ఫైల్) నగదు ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని గుర్తించిన సీఐడీ.. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే అటాచ్మెంట్ నిర్ణయం తీసుకుంది. చిట్ఫండ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై పలుమార్లు ఇప్పటికే సోదాలు జరిపిన విషయం తెలిసిందే. చదవండి: మార్గదర్శి కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయండి -
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు. కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఈ మేరకు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ తరపున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్ మరొకటని తెలిపారు. 1944 ఆర్డినెన్స్ ప్రకారం తన పిటిషన్పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. చదవండి: మరోసారి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. -
రామోజీరావు, శైలజా కిరణ్ల సీఐడీ విచారణ.. కీలక ఆధారాలు లభ్యం?
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. చిట్ఫండ్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి నిధులు మళ్లించడంపై ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజతోపాటు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లపై సీఐడీ అధికారులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజాకిరణ్ను హైదరాబాద్లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణలో కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. స్థానిక రెవిన్యూ అధికారులను పిలిచిన సీఐడీ బృందం.. రెవిన్యూ అధికారుల పంచ్ విట్నెస్ తో సీజింగ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. సీఐడీ ఎస్పీ అమిత్ బర్ధర్ ఆధ్వర్యంలో.. సీఐడీ లీగల్ అడ్వైజర్ సమక్షంలో రామోజీ, శైలజ విచారణ జరిగింది. ఇప్పటికే నలుగురు అరెస్ట్ కాగా, దర్యాప్తులో భాగంగా రామోజీరావు, శైలజను విచారించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది సీఐడీ. మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు విస్తృతంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చిట్ఫండ్ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్ సోదాల్లో భారీగా అక్రమాలు గుర్తించారు అధికారులు. మార్గదర్శి రికార్డులన్నీ అక్రమేనని తేల్చిన సీఐడీ.. ఆ మేరకు విచారణకు సిద్ధమైంది. బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతో పాటు చిట్ గ్రూప్లకు చెందిన ఫామ్ 21ని కూడా మార్గదర్శి సమర్పించలేదు. మొత్తంగా ఏడు మార్గదర్శి బ్రాంచ్ల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు సీఐడీ అధికారులు. దీనిలో భాగంగానే రామోజీరావు, శైలజాకిరణ్లను విచారించడానికి సిద్ధమైంది. ఈ మేరకు రామోజీరావు, శైలజాకిరణ్లకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. నేడు విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 120 బి, 477 రెడ్విత్ 34, కేంద్ర చిట్ఫండ్స్ చట్టం–1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో సీఐడీ అధికారులు నలుగురు మార్గదర్శి చిట్ఫండ్స్ మేనేజర్లను అరెస్టు చేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్లో చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా మళ్లించడం ద్వారా రామోజీరావు యథేచ్ఛగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ చిట్ఫండ్స్ చట్టం–1982, రిజర్వ్బ్యాంకు చట్టం, ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో, హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో డిసెంబరులో నిర్వహించిన సోదాలతో ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. చదవండి: ‘మార్గదర్శి’ డాక్యుమెంట్లే సీజ్ -
అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. హైదరాబాద్లోని నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్ లభించింది. నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇందులో మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్లు సమాచారం. దీని ప్రకారమే మనీ రూటింగ్... తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు జరిగినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల నివాసాల్లో రెండో రోజు ఏపీ సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబుస్, కొండాపూర్లోని కోళ్ల లగ్జరియా విల్లాస్లోని నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. -
మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ముగిసిన సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: అమరావతి భూ కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 150 ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోలుపై సీఐడీ ఆరాతీస్తోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చెందిన మాదాపూర్లోని ఎన్ స్పైరా సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేపట్టారు. మిలాంట్ టవర్ పదో అంతస్తులో ఉన్న ఆ కార్యలయంలో రెండు రోజులపాటు కొనసాగిన ఈ సోదాలు బుధవారం ముగిశాయి. ఈ మేరకు ఎన్ స్పైరా సంస్థలో కీలక పత్రాలు, హార్డ్డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ సంస్థల నుంచి రామృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లిన్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 10 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు. -
AP: పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఏపీ కేడర్కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఐపీఎస్–1993 బ్యాచ్కు చెందిన ముగ్గురు అడిషనల్ డీజీలకు డీజీపీ ర్యాంక్ ఇచ్చింది. వారిలో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్, డిప్యూటేషన్పై కేంద్ర సర్వీస్లో ఉన్న మహేష్ దీక్షిత్, అమిత్గార్గ్ ఉన్నారు. ఐపీఎస్–1998 బ్యాచ్కు చెందిన మహేష్ చంద్రలడ్డాకు అడిషనల్ డీజీగా పదోన్నతి కల్పించింది. లడ్డా ప్రస్తుతం డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులో ఉన్నారు. డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులో ఉన్న ఎస్.శ్యామ్సుందర్, గుంటూరు రేంజ్ డీజీ సీఎం త్రివిక్రమవర్మ, ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజులకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పదోన్నతి కల్పించింది. విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ కోయ ప్రవీణ్, డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులో ఉన్న భాస్కర్ భూషణ్, ఏపీ డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఉన్న ఆర్ఎన్ అమ్మిరెడ్డికి డీఐజీ(సూపర్ టైమ్ స్కేల్)గా, విజయనగరం ఎస్పీ ఎం.దీపిక, ఏసీబీ ఎస్పీ బి.కృష్ణారావు, సీఐడీ ఎస్పీ అమిత్బర్దర్లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్(సెలక్షన్ గ్రేడ్)కు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. వీరందరి పదోన్నతులు 2023, జనవరి ఒకటో తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. చదవండి: (Araku MP: మొదట రైతు బిడ్డ.. తరువాతే ఎంపీ!) -
ఏబీఎన్ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి చానల్ పాత్రికేయుడు పర్వతనేని వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజులపాటు విచారించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రపన్నారనే అభియోగాలపై కొన్ని నెలల కిందట నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్లపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల టీవీ 5 మూర్తిని సీఐడీ అధికారులు విచారించారు. అదే కేసులో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి చానల్ పాత్రికేయుడు వెంకటకృష్ణను సీఐడీ అధికారులు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం, మంగళవారం దాదాపు 15 గంటలపాటు విచారించారు. చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు) -
నారాయణను విచారిచేందుకు సీఐడీకి అనుమతిచ్చిన హైకోర్టు
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారాయణను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతిచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో నారాయణను సీఐడీ విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా సీఐడీ విచారణకు సహకరించాలని టీడీపీ నేత నారాయణను హైకోర్టు ఆదేశించింది. చదవండి: (వైఎస్సార్సీపీ నుంచి గోపీకృష్ణ సస్పెన్షన్) -
అయ్యన్న పాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు: డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉండగా అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్తో బీసీలకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కులంకార్డు అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?. తప్పచేసిన వారిపై చర్యలు తీసుకోకూడదా అన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. చదవండి: (అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
AP High Court: ఏబీఎన్, టీవీ 5లకు గట్టి షాక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు విచారణకు రావాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఏబీఎన్ వెంకట కృష్ణ, టీవీ 5 మూర్తిలకు గట్టి షాక్ తగిలింది. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ నోటీసులు చెల్లవని, వాటిని కొట్టేయాలన్న వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే సీఐడీ విచారణ పరిధిపై వారు లేవనెత్తిన అభ్యంతరా లన్నింటినీ కొట్టేసింది. ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు ఒకదాని కొకటి పొరుగు పోలీస్స్టేషన్లు అవుతాయని తేల్చిచెప్పింది. అందువల్ల సీఐడీ నోటీసులు చట్ట నిబంధనలకు లోబడే ఉన్నాయని, అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. విచా రణకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు సంబంధించి వెంకటకృష్ణ, మూర్తిల వ్యక్తిగత హాజరు నిమిత్తం ఓ తేదీని ఖరారు చేసి ఆ విషయాన్ని రాతపూర్వకంగా వారికి తెలియచేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ సందర్భంగా వారిపై కఠిన చర్యలేవీ తీసుకోవ ద్దని సూచించింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని.. అందుకు విరుద్ధంగా వ్య వహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తీర్పునిచ్చారు. కుట్రలో భాగంగానే వ్యాఖ్యలు.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా సీఎం జగన్, పలు కులాలను అవమాన పరిచేలా, విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్, టీవీ 5 చానెళ్లపై సీఐడీ గతేడాది సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించి ఎఫ్ఐఆర్ను కొట్టేయడంతో పాటు దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఏబీఎన్, టీవీ 5 చానెళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు సైతం దర్యాప్తును నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సీఐడీకి రాష్ట్రం మొత్తం ఓ పోలీస్స్టేషన్ అవుతుందని, అందువల్ల దానికి పొరుగు పోలీస్స్టేషన్ అంటే తెలంగాణ సీఐడీ అవుతుందని తేల్చిచెప్పారు. సెక్షన్ 160(1), సెక్షన్ 2(ఎస్)లను కలిపి చదివితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీస్స్టేషన్లు ఒకదానికొకటి పొరుగు పోలీస్స్టేషన్లు అవుతాయన్నారు. దీని ప్రకారం పిటిషనర్లకు సీఐడీ ఇచ్చిన నోటీసులు చట్ట నిబంధనలకు లోబడి ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చే పరిధి సీఐడీకి లేదంటూ పిటిషన్లు.. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ వెంకటకృష్ణ, మూర్తిలకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ వెంకటకృష్ణ, మూర్తి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించగా, మూర్తి తరఫున పీవీజీ ఉమేశ్, వెంకటకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కేసు ఏపీలో నమోదు చేశారని, పిటిషనర్లు మాత్రం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని, అందువల్ల వారికి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులు ఎంతమాత్రం చెల్లవని పోసాని, ఉమేశ్ వాదించారు. అయితే ఈ వాదనలను ఏజీ శ్రీరామ్ తోసిపుచ్చారు. ఒక్కో పోలీస్స్టేషన్కు నిర్దిష్ట భౌగోళిక పరిధులు నిర్ణయించడం జరుగుతుందని, అలాగే సీఐడీకి రాష్ట్రం మొత్తాన్ని ఓ పోలీస్స్టేషన్గా పరిగణించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తం ఓ పోలీస్స్టేషన్ అయినప్పుడు ఏపీ సీఐడీకి దగ్గర్లో ఉన్న పోలీస్స్టేషన్ అంటే తెలంగాణ అవుతుందని తెలిపారు. -
ఐటీడీపీ పేరుతో చింతకాయల విజయ్ చేసే పని అదా?: మేరుగ నాగార్జున
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. పచ్చమీడియా వ్యవహారశైలి కూడా అలాగే ఉందన్నారు. చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచకవాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను పెట్టే పోస్టులు ఎంతో దారుణంగా ఉంటాయన్నారు. వాటిపై సీఐడీ విచారణ చేస్తుంటే అదికూడా తప్పు అనేలాగా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ఎల్లోమీడియా జర్నలిజం చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పోలీసులు విజయ్ ఇంటికి వెళ్తే వీరంతా గగ్గోలు పెడుతున్నారు. సీఐడీ వారు దొంగని పట్టుకోవటానికి వెళ్తే తప్పా?. ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్ధిస్తారా?. మహిళల మాన, ప్రాణాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఐటీడీపీ అనే దాంట్లో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు. అలాంటి వ్యక్తులను ఎల్లోమీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తుంది?. వీరి అఘాయిత్యాలపై ప్రతిఘటనగా మావాళ్లు ఎవరైనా పోస్టులు పెడితే తట్టుకోలేకపోతున్నారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలకు చంద్రబాబు, లోకేష్లు సమర్ధిస్తున్నారు. వీరంతా రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని' మంత్రి ప్రశ్నించారు. 'దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చిన జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారు. చింతకాయల విజయ్ కంటే ఎక్కువగా మేము మాట్లాడతాము, తిడతాము. కానీ మాకు సంస్కారం ఉండబట్టి అలా చేయడంలేదు. టీడీపీ వారికి అసలు సిగ్గు అనేది లేదు. చింతకాయల విజయ్ అనే వ్యక్తిపై చట్టం తనపని తాను చేసుకుంటుంది. మహిళలపై సీఐడీ దౌర్జన్యం అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు' అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. చదవండి: (వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు) -
Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు
ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ.. అవినీతికి తావులేని రాజకీయాలకు పనిచేసే పార్టీ తమదని హడావుడి చేసే జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్నాయుడు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోర్జరీ, బ్యాంకు గ్యారంటీలతో తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డంగా బుక్కైన జేపీ నాయుడు వ్యవహారం జిల్లా జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జేపీ వివాదాస్పద వ్యవహార శైలిపై సర్వత్రా చర్చ సాగుతోంది. తొమ్మిదేళ్ల్ల కాలంలో అతడిపై 9 కేసులు నమోదై కొన్ని కేసులు ముగిసిపోగా, మరికొన్ని విచారణ దశలోనూ, ఇంకొన్ని కోర్టుల్లో వివిధ దశల్లోనూ ఉన్నాయి. సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అక్కడ చెరువుల్లో చేప, రొయ్యల పిల్లలు పెంచడానికి వీలుగా టెండర్లు ఆహ్వానించింది. ఈ క్రమంలో భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు, అతని బృందం టెండ ర్లు దాఖలు చేసి దక్కించుకున్నాకా బ్యాంకు గ్యారంటీ, ఫెర్ఫార్మెన్స్ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్ను తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని 9 జిల్లాలో జేపీ నాయుడు అండ్ టీం టెండర్లు దక్కించుకుంది. ఈ క్రమంలో జయప్రకాష్ నాయుడు పాలకొల్లులోని ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీలను తీసుకుని, తీసుకున్న డాక్యుమెంట్లను పూర్తిగా ఫోర్జరీ చేసి గ్యారంటీ విలువను పూర్తిగా పెంచి బ్యాంకు సిబ్బంది సంతకాలు, నకిలీ స్టాంపులతో తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించారు. విచారణలో ఇదంతా వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం టెండర్ రద్దు చేయడంతో పాటు జేపీ నాయుడు అతని బృందంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించి సీఐడీకి కేసు అప్పగించినట్టు సమాచారం. ఈ క్రమంలో జయప్రకాష్ నాయుడు వ్యవహార శైలి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన జేపీపై 2014 నుంచి ఇప్పటివరకు భీమవరం వన్టౌన్, టూటౌన్, పాలకోడేరు, వీరవాసరం పోలీస్స్టేషన్లల్లో 9 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ముగిసిపోగా, మిగతా కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. చదవండి: (బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్) కబ్జాలు.. హత్యాయత్నాలు భీమవరం 32వ వార్డులో గాదిరాజు నాగేశ్వరరాజు జగన్నాథరాజుకు చెందిన 10 సెంట్ల భవనాన్ని శ్రీరామరాజు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిలో జయప్రకాష్నాయుడు కలు గచేసుకుని భవనం తనదేనని, యజమాని రికార్డులో తన పేరు నమోదు చేయాలని కోరారు. అయితే అప్పటికే గాదిరాజు నాగేశ్వరరాజు పేరు రికార్డుల్లో ఉండటంతో జయప్రకాష్ యత్నం విఫలమైంది. దీంతో నాగేశ్వరరాజు తల్లి జయప్రకాష్నాయుడుకు సంబంధించి వెంకటపతిరాజుకు రిజిస్ట్రేషన్ చేసిందని నకిలీ పత్రాలు సృష్టించి జయప్రకాష్ అనుచరులైన పృధ్వీరాజ్, మురళీకృష్ణలను సాక్ష్యులుగా పెట్టుకుని 2014 గణపవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో వెంకటపతిరాజు పేరుతో రిజిస్ట్రేషన్కు యత్నించారు. ఈ సమాచారంతో నాగేశ్వరరాజు కోర్టులో కేసు దాఖలు చేయడంతో పాటు భీమవరం టూటౌన్ స్టేషన్లో కేసు పెట్టారు. ►ఇదే రీతిలో ప్రభుత్వ భూమి కబ్జాకు జేపీ ప్రత్యేక స్కెచ్ గీశారు. వీరవాసరంలోని 10వ వార్డుకు చెందిన వలవల రామకృష్ణ అనే వ్యక్తి 439/1 సర్వే నంబర్లో 34 సెంట్ల భూమి దాదాపు 45 ఏళ్లుగా తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్ను క డుతున్నారు. దీనిపై జేపీ టీం దృష్టి పెట్టి 2017 జూన్ 24న స్థలంలోకి ప్రవేశించి పాకలు వేసే ప్రయత్నం చేసి అడ్డుకోబోయిన రామకృష్ణపై దౌర్జన్యం చేశారని వీరవాసరం పోలీస్స్టేషన్లో 113/2017తో జేపీపై కేసు నమోదై కొనసాగుతోంది. ►అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇద్దరితో కోర్టులో కేసులు వేయించి ఒకరికి అనుకూలంగా వచ్చాక ఆ భూమి తమదేనని మరొకరికి అమ్మేస్తూ అడ్డగోలు రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా జేపీ చేస్తున్నారు. ►వీరవాసరానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావు ఇంటి ప్రహరీ నిర్మిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి ధ్వంసం చేయడంతో పాటు కుటుంబసభ్యులపై హత్యాయత్నం చేశారు. ఈ వ్యవహారంలో జయప్రకాష్నాయుడుది కీలకపాత్ర ఉందని అతనిపై క్రైం నంబర్ 157/2022 కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. -
ఎంపీ రఘురామపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. రఘురామకృష్ణంరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్లోని దిల్కుష్ గెస్ట్హౌస్లో సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి -
అప్రూవర్గా మారిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్.. నారాయణ ప్రోద్బలంతోనే..
సాక్షి, అమరావతి: టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థుల భవిష్యత్తో ఆడుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నారాయణ విద్యాసంస్థల కేంద్రంగానే పేపర్ లీకేజీకి కుట్ర జరిగినట్లు గుర్తించారు. పోలీస్ కస్టడీలో నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి నిజాలు వెల్లడించారు. మాజీ మంత్రి నారాయణ ప్రోద్భలంతోనే పేపర్ లీక్ చేసినట్లు విచారణలో వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ ఒప్పకున్నారు. గిరిధర్ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని కొండాపూర్లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారుగా తెలుస్తోంది. వీరు అంతా కూడా గతంలో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వేరే కావడం విశేషం. చదవండి: (ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ) -
ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్ అయ్యారు. కొండాపూర్లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత 4 రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో సీఐడీ దూకుడు
-
‘నియో’తో సైబర్ నేరాలకు అడ్డుకట్ట..ఏమిటి ఈ ‘నియో’?
విజయవాడలోని సుబ్బారావు ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో లింక్ మీద క్లిక్ చేయగానే.. ఆయన నెట్ బ్యాంకింగ్ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు తమ ఖాతాకు మళ్లించేసుకున్నారు. విశాఖపట్నంలోని అప్పలనాయుడుకు ఆగంతకులు ఫోన్ చేసి ఆయనకు బ్యాంకు రుణం మంజూరైందని చెప్పారు. ఆయన ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పమన్నారు. ఆ విషయం నిజమేనని భావించిన అప్పలనాయుడు తన ఫోన్కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పారు. అంతే ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు తమ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. నెల్లూరుకు చెందిన దివ్యశ్రీ ఆన్లైన్ షాపింగ్ చేస్తుండగా ఆమె ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ను కాపీ చేసి వచ్చిన నంబర్కు పంపించాలని ఆగంతకులు కోరారు. ఆమె మెసేజ్ను ఫార్వర్డ్ చేయగానే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.లక్ష నగదును తమ ఖాతాకు మళ్లించుకున్నారు. – సాక్షి, అమరావతి ఈ మూడు సందర్భాల్లోనూ బాధితులు తాము మోసపోయామని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితుల బ్యాంకు ఖాతాలున్న బ్యాంకులకు సమాచారం ఇచ్చేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అప్పటికే సైబర్ నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్డ్రా చేసేసుకున్నారు. వారు బ్యాంకుకు ఇచ్చినవి కూడా తప్పుడు చిరునామాలే. దీంతో బాధితులు తాము కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందలేకపోయారు. ఇలా నెట్బ్యాంకింగ్, ఇ–కామర్స్, ఓటీపీ మోసాలు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ‘నియో’ పేరిట ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది. బాధితులు తాము మోసపోయాని గుర్తించిన 24 గంటల్లోగా ఈ పోర్టల్ను సంప్రదిస్తే.. కాలయాపన లేకుండా వెంటనే సంబంధిత బ్యాంకు ఖాతాను స్తంభింపజేసి బాధితులు కోల్పోయిన నగదును వారికి తిరిగి చెల్లించేలా చేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో ఈ పోర్టల్ను ప్రారంభించనున్నారు. అఖిల భారత స్థాయిలో నెట్వర్క్ సైబర్ ఆర్థిక నేరస్తులు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండి మోసాలకు పాల్పడుతున్నారు. వారి ఆటకట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసులు కూడా జాతీయస్థాయిలో ఓ ప్యానెల్ను రూపొందించారు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సైబర్ పోలీసు విభాగాలు సమన్వయంతో వ్యవహరిస్తాయి. దీనికోసం యూపీఐ గేట్వేలు, ఇ–పేమెంట్ పోర్టళ్లు, తదితర సంస్థలతో సైబర్ పోలీసు విభాగాలను అనుసంధానించారు. తద్వారా ఆన్లైన్ మోసాలను అరికట్టడంలో ఆయా సంస్థలను కూడా జవాబుదారిగా చేయనున్నారు. సీఐడీ విభాగం ఇప్పటికే ‘నియో’ పోర్టల్ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సాంకేతిక అంశాలతో సహా ఈ పోర్టల్ పనితీరు సంతృప్తికరంగా ఉందని నిర్ధారించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియో పోర్టల్ను ప్రారంభిస్తారు. ఏమిటి ఈ ‘నియో’? సైబర్ ఆర్థిక నేరాల బాధితులు ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర సీఐడీ విభాగం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్.. ‘నియో’. నెట్ బ్యాంకింగ్, ఇ–కామర్స్, ఓటీపీ మోసాలను సమర్థంగా అరికట్టేందుకు ఈ పోర్టల్ దోహదపడుతుంది. ఈ పోర్టల్ను పకడ్బందీగా నిర్వహించేందుకు సీఐడీ విభాగం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించింది. ఈ పోర్టల్ ఇలా పనిచేస్తుంది.. బాధితులు తాము మోసపోయామని గుర్తించిన 24 గంటల్లోగా సంప్రదించడానికి టోల్ఫ్రీ నంబర్ 155260ను అందుబాటులోకి తెచ్చారు. ఆ కాల్ సీఐడీ ప్రధాన కార్యాలయంలోని నియో పోర్టల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. ఆ వెంటనే ఫిర్యాదుదారు పేరిట ప్రత్యేక ఐడీ నంబర్ను ఇస్తారు. ఆ వెంటనే బాధితుల బ్యాంకు ఖాతాలోని నగదు బదిలీ అయిన బ్యాంకును సీఐడీ అధికారులు సంప్రదిస్తారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఆ ఖాతా నుంచి నగదు విత్డ్రాకు అవకాశం లేకుండా చేస్తారు. అనంతరం నియో పోర్టల్ సిబ్బంది ఆ ప్రత్యేక ఐడీ నంబరుతో నమోదైన ఫిర్యాదును బాధితుల నివాస ప్రాంతంలోని పోలీస్స్టేషన్కు బదిలీ చేస్తారు. ఆ కేసు విచారణ, న్యాయ ప్రక్రియ పూర్తి చేశాక కోర్టు ద్వారా బాధితులకు కోల్పోయిన మొత్తాన్ని చెల్లిస్తారు. -
ఫైబర్గ్రిడ్.. మదర్ ఆఫ్ స్కామ్స్!
సాక్షి, అమరావతి: ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిని కుంభకోణం అనడం కంటే.. మదర్ ఆఫ్ స్కామ్స్ అన టం కరెక్టు అని పేస్ పవ ర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమి టెడ్ ఎండీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రంగా విమర్శించారు. టెండర్ వేసిన సమయంలో తాను వైఎస్సార్సీపీ సభ్యుడిని కూడా కాదని, ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు కోసం పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున టెండర్ వేశానన్నారు. కానీ, ఎటువంటి అర్హతలేని, బ్లాక్లిస్ట్లో ఉన్న టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్గ్రిడ్ మొదటి దశ పనుల కోసం చేపట్టిన రూ.329 కోట్ల టెండరు ఎంపికలోనే పెద్ద స్కాం జరిగిందన్నారు. ఆ తర్వాత సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2లకు సంబంధించి మొత్తం రూ.3,113 కోట్లకు టెండర్లు పిలిచారని.. ఈ వ్యవహారంలో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడిందని ఆయన వివరించారు. వీటన్నింటిపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ టెండర్కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. టెండరు వెనుక పెద్ద కుట్ర ‘అర్హతలేని టెరాసాఫ్ట్కు ఫైబర్ గ్రిడ్ టెండరు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్రే నడిచింది. టెరాసాఫ్ట్ కన్సార్టియం నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రైస్బిడ్లు వేశారు. మాకు అన్ని అర్హతలు ఉన్నా పక్కన పెట్టారు. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేటే లిమిటెడ్ తరఫున నేను టెండర్ వేశాను. కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ గ్రిడ్ స్కాంకు పాల్పడింది. టెండరు ఖరారుకు 2 నెలల ముందు బ్లాక్లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్కు దొడ్డిదారిన క్లియరెన్స్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పారదర్శకంగా టెండర్లు ఈ–ప్రొక్యూర్మెంట్ వేదికగా ఫైబర్గ్రిడ్ టెండర్లు పిలిచారు. బిడ్డర్ తప్పనిసరిగా కంపెనీగా ఉండాలి అనే నిబంధన ఉంది. ఆ కంపెనీకి ఆ రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఏ కంపెనీ కూడా బ్లాక్లిస్ట్ అయి ఉండకూడదు. నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయి. వీటిలో మూడు కంపెనీలకు అర్హత లేదు. కానీ, ఆ మూడు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డాయి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించినా వాటిని అనర్హులుగా గుర్తించలేదు. టెరాసాఫ్ట్ సంస్థ బ్లాక్లిస్టులో ఉంటే పట్టించుకోలేదు. దొడ్డిదారిన బ్లాక్లిస్ట్ను ఎత్తివేయించుకున్నారు. అదే వైఎస్ జగన్ సీఎం అయ్యాక టెండర్ల విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ఏకంగా చట్టం తెచ్చారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఎప్పుడూ కనిపించనేలేదు. పాత్రధారులు, సూత్రధారులను శిక్షించాలి నిజానికి.. ఫైబర్ గ్రిడ్ తొలిదశ ప్రాజెక్టు రూ.329 కోట్లు అని చెప్పారు. ఇదికాక.. సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2కు సంబంధించి మూడు టెండర్లను పిలిచి వారికి అనుకూలమైన కంపెనీలకే కట్టబెట్టారు. ప్రాజెక్టు మొదటి దశ టెండర్లలోనే ఇంత స్కామ్ జరిగినప్పుడు, మిగిలిన మూడు టెండర్లలో ఎంత కుంభకోణం జరిగిందో ఊహించుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతగల పౌరుడిగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్గ్రిడ్ కుంభకోణంలోని వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులను, అప్పటి అధికారులను, వారి వెనకున్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలను కఠినంగా శిక్షించాలి. ఆ రోజు మా కంపెనీకి రావాల్సిన టెండర్లు మాకు దక్కకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి’. -
సీఐడీ విచారణకు హాజరైన టీడీపీ నేత దేవినేని ఉమా
-
సీఐడీ డీఎస్పీ లక్ష్మి అనుమానాస్పద మృతి
సాక్షి, బెంగళూరు: సీఐడీ డీఎస్పీ వి.లక్ష్మి బుధవారం రాత్రి నాగరబావిలోని స్నేహితుని ఇంట్లో సందేహాస్పద రీతిలో ఉరివేసుకుని మృతిచెందారు. కొంతకాలం కిందట రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు వరుసగా ఆత్మహత్యలు, అనుమానాస్పద రీతిలో మరణించడం, ప్రభుత్వాలపై విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. డీఎస్పీ గణపతి మృతి కేసులో మాజీ హోంమంత్రి జార్జ్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తోంది. ఇంతలోనే మరో డీఎస్పీ ఉరికి వేలాడడం పోలీసు శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరుకునపెట్టేదిగా మారింది. లక్ష్మి తండ్రి మాట్లాడుతూ తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. అదుపులో స్నేహితులు లక్ష్మి తండ్రి వెంకటేశ్ డీసీసీ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణవార్త తెలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆమె మరణంపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. లక్ష్మి భర్త నవీన్తో ఏ వివాదాలు లేవని, లక్ష్మి స్నేహితుల మీదే సందేహం ఉందని చెప్పారు. విందు ఇచ్చిన బీబీఎంపీ కాంట్రాక్టర్ మనోహర్, మరో ఐదుగురిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హోంమంత్రి బసవరాజ బొమ్మై స్పందిస్తూ డీఎస్పీ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఏం జరిగింది? 2014 బ్యాచ్కు చెందిన రాష్ట్ర పోలీసు సర్వీసు అధికారి అయిన లక్ష్మి మూడేళ్ల కిందట సీఐడీలో నియమితులయ్యారు. బుధవారం రాత్రి నాగరబావిలోని వినాయక లేఔట్ ఉంటున్న స్నేహితుని ఇంట్లో విందుకు వెళ్లారు. ఒకవైపు విందు జరుగుతుండగా, ఆమె కొంతసేపటికి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలకొట్టి చూడగా ఉరి వేసుకుని కనిపించినట్లు స్నేహితులు తెలిపారు. అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: (పెళ్లయినా మరదలిపై కన్నేసి.. ఎంత పనిచేశాడంటే..!) భర్తతో గొడవలు? 2012లో నవీన్ అనే వ్యక్తిని లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సర్వీసులో చేరిన తర్వాత కోణనకుంటెలోని నివాసంలో దంపతులిద్దరూ కాపురమున్నారు. నవీన్ హైదరాబాద్లోని అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండేళ్లుగా వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగడం లేదని సమాచారం. ఈ విషయమై లక్ష్మి బాధపడుతున్నారు. మూడురోజుల కిందట నాగరబావిలోని స్నేహితుని ఇంటికి దంపతులిద్దరూ వెళ్లారు. రెండు రోజుల క్రితం నవీన్ హైదరాబాద్కు వెళ్లిపోయాడు. మరోవైపు లక్ష్మి మద్యపానానికి అలవాటు పడినట్లు, గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యయత్నానికి కూడా పాల్పడినట్లు తెలిసింది. -
బెంగళూరులో సీఐడీ డీఎస్పీ లక్ష్మి ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం నెలకొంది. సీఐడీ మహిళా డీఎస్పీ లక్ష్మీ(33) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారంరాత్రి 10.30 ప్రాంతంలో స్నేహితురాలి నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోలార్ జిల్లాలోని మలూరు తాలుకా మాస్తి గ్రామానికి చెందిన లక్ష్మీ.. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2014లో నిర్వహించిన సీఐడీ ఎగ్జామ్లో లక్ష్మీ ఉత్తీర్ణత సాధించారు. శిక్షణ అనంతరం 2017లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో డీఎస్పీగా పని చేస్తున్నారు. అయితే తన స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లిన లక్ష్మి.. అక్కడ గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతకి లక్ష్మి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టడంతో ఉరివేసుకుని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. కాగా, ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్న లక్ష్మికి సంతానం కలగలేదు. సంతానం కలుగలేదన్న నిరాశతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. -
CMRF నకిలీ చెక్కుల కేసు విచారణ ప్రారంభించిన ఏపీ సీఐడీ
-
శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
-
శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
సాక్షి, నాగర్కర్నూల్: శ్రీశైలం పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ బృందం దర్యాప్తును ముమ్మరంగా చేసింది. విచారణలో భాగంగా నిన్న మరోసారి శ్రీశైలం వెళ్లిన సీఐడీ బృందం నేడు (శుక్రవారం) సంఘటన స్థలంలో పనిచేస్తున్న ఉద్యోగులను విచారిస్తోంది. ఇప్పటికే ప్రమాద ఘటనపై పలు ఆధారాలు సేకరించిన బృందం సభ్యులు ప్రమాద ఘటనపై శాఖా పరమైన విచారణ పూర్తి చేసింది. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డ ఉద్యోగుల నుంచి పవర్ ప్లాంట్కు సంబంధించిన విషయాలు, ప్రమాద కారణాలను సేకరిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రమాద జరిగిన తీరు, కారణాలపై సీఐడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. బ్యాటరీ మార్చే క్రమంలో ప్రమాదం! కాగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదం ఘటనపై శ్రీశైలం ప్లాంట్ ఇంచార్జ్ ఉమా మహేశ్వర చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం.. ఆగస్టు 20 వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ప్రాజెక్టులో ప్రమాదం జరిగింది. హైడ్రో పవర్ టన్నెల్లో పని జరుగుతున్న సమయంలో సడన్గా మెషీన్లో ప్రమాదం సంభవించింది. ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ప్రాజెక్టులో బ్యాటరీలు అమర్చడానికి వచ్చిన అమర్ రాజ కంపెనీకి చెందిన ఇద్దరు మెకానిక్లు కూడా ఉన్నారు. టర్బైన్ వేగం పెరగడం వల్ల ప్యానెల్ యూనిట్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన పవర్ హౌస్ జనరేటర్లు. కేబుల్, ప్యానెల్స్, బ్యాటరీ చేంజ్ చేసేటపుడు న్యూకిలెన్స్ న్యూట్రల్గా మారకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని సీఐడీ బృందం ప్రాథమిక అంచనాకొచ్చింది. (చదవండి: 15 రోజుల్లో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ) -
నిమ్మగడ్డ లేఖ ఎస్ఈసీ ఆఫీస్లో తయారు కాలేదు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ ఆఫీస్లో తయారుకాలేదని నిర్దారణ అయింది. ల్యాప్ టాప్, డెస్క్ టాప్లను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణలు.. ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని తేల్చారు. ఈ మేరకు సీఐడీ అధికారుల చేతికి ఫోరెన్సిక నివేదిక అందింది. (చదవండి : రమేష్ కుమార్ లేఖను లెక్కతేల్చే పనిలో సీఐడీ) ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు. ఆ లేఖను ముందుగానే తయారుచేశారని.. అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్డ్రైవ్లో ఆ లేఖ రమేష్ కుమార్ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు. కాగా, రమేశ్ కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను రమేష్ కుమార్ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని విజయసాయిరెడ్డి అన్నారు. (చదవండి : నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం) -
కదులుతున్న డొంక
ప్రొద్దుటూరు టౌన్ : తీగ లాగితే డొంక కదులుతోంది. చేనేత సొసైటీల్లో ఉన్న సభ్యుల వివరాల ఆధారంగా వారి గ్రామాలకు వెళ్లి సీఐడీ అధికారుల విచారణ ప్రారంభించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఈశ్వరరెడ్డినగర్లోనే కాక జిల్లాలోని పలు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో విచారణ చేపట్టారు. గురువారం ఈశ్వరరెడ్డినగర్లో సీఐడీ అధికారులు పరిశీలించారు. సొసైటీల్లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా లేవు. వారి చిరునామలు తెలుసుకోవడాని ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డోర్ నంబర్లు లేకుండా కేవలం పేరు, ప్రాంతం పేరు ఉండటం, ఒకే పేరుతో చాలా మంది చేనేతలు ఉండటం కూడా వారికి తలనొప్పిగా మారింది. మాకు సొసైటీ అధ్యక్షులు ఎవరో తెలియదు.. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తమకు సొసైటీ గురించి కానీ.. అందులో మేము సభ్యులమనే విషయం కానీ ఇంత వరకు తెలియదని చెప్పారు. దీంతో బోగస్ సొసైటీల అవినీతి ఏపాటిదో అర్థం అవుతోంది. చాలా ఏళ్లుగా ఫలానా సొసైటీలో మీరు ఉన్నారా, లివరీ రకం బట్ట నేశారా అన్న సీఐడీ అధికారుల ప్రశ్నలకు తమకు తెలియదని సమాధానం ఇస్తున్నారు. దీంతో వారి ఆధార్ కార్డు నకలు తీసుకొని సంతకాలు చేయించుకుంటున్నారు. సొసైటీల్లో సభ్యులమని ఏడాదికో, ఆరు నెలలకో సమావేశాలకు పిలుచుకెళ్లి రూ.200, రూ.500 డబ్బులు ఇచ్చేవారు తప్ప మాకు ఏ పాపం తెలిదన్న విషయాన్ని కూడా చేనేతలు కొందరు సీఐడీ అధికారులతో చెబుతున్నారు. రూ.500 ఇస్తాం.. సీఐడీ అధికారుల విచారణ నేపథ్యంలో బోగస్ సొసైటీలు నిర్వహిస్తున్న వారు చేనేతల వద్దకు వచ్చి మీ ఆధార్ కార్డు నకలు ఇచ్చి, పేపర్పై సంతకం పెడితే రూ.500 ఇస్తామని మభ్యపెడుతున్నట్లు చెబుతున్నారు. మాకు ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పోతుందని, అయినా ఇప్పుడు ఎందుకు సంతకాలు పెట్టాలని నిలదీస్తుండటంతో వెనుదిరుగుతున్నట్లు చేనేతలు అంటున్నారు. జమ్మలమడుగు బీసీ కాలనీలో.. జమ్మలమడుగు రూరల్ : బోగస్ సొసైటీలపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. పట్టణంలోని బీసీ కాలనీలో అక్షయ వీవర్స్ కో–ఆపరేటివ్ ప్రొడక్షన్, సేల్స్ సొసైటీ లిమిటెడ్లో రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా బీసీ కాలనీలో ఉన్న చేనేత కార్మికులతో మాట్లాడారు.సొసైటీ గురించి ఆరా తీయగా.. తమకు తెలియదని, అయితే ఎప్పుడో ఒకసారి తమతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు. తమకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని చేనేత కార్మికులు సీఐడీ అధికారులకు వివరించారు. ఇటీవల ఏమైనా ప్రభుత్వ పథకాలు వచ్చాయా అని అధికారులు అడిగారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద 24వేల రూపాయలు తమ ఖాతాలలో జమ అయ్యాయని కార్మికులు తెలిపారు. సొసైటీ నుంచి ఎటువంటి పథకాలు తమకు అందలేదని దాదాపు 70మంది తెలిపారు. జమ్మలమడుగు మండల పరిధిలోని మోరగుడిలో చాలా వరకు బోగస్సొసైటీలే ఉన్నట్లు గుర్తించారు. వాటి గుట్టును రట్టుచేసే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో చేనేత సొసైటీ నిర్వాహకుల్లో గుబులు మొదలైంది. మా కుటుంబంలో ముగ్గురు పేర్లు ఉన్నాయంట నా పేరు వలసాల కృష్ణదాస్. మేము మండల పరిధిలోని ఈశ్వరరెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాం. 40 ఏళ్లుగా మా కుటుంబం చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తోంది. మేము ఇప్పటి వరకు ఏ సొసైటీల్లో సభ్యులుగా లేము. కానీ సీఐడీ అధికారులు మా ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలు డబ్బు అందిందా అని అడిగారు. వచ్చిందన్నాను. మీరు చాలా ఏళ్లుగా శ్రీరాం సొసైటీలో సభ్యులుగా ఉన్నారా అని అడిగారు. మాకు ఆ సొసైటీ ఎక్కడ ఉందో, అధ్యక్షుడు ఎవరో తెలియదు అని చెప్పాం. తనకు తెలియకుండా సొసైటీలో ఎలా సభ్యునిగా చేర్చారని సీఐడీ అధికారులను అడిగాను. మా అన్న, మా తండ్రి పేర్లు సభ్యులుగా ఉన్నట్లు కూడా తెలిసింది. బోగస్ సొసైటీల్లో మా పేర్లు చేర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం. -
అమరావతి భూ అక్రమాలపై సీఐడీ విచారణ ముమ్మరం
-
ప్రత్తిపాటి, నారాయణలపై కేసులు
సాక్షి, అమరావతి/మంగళగిరి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన సీఐడీ అధికారులు టీడీపీకి చెందిన మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు తాడికొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ నరసింహారావులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుల్లారావు, నారాయణ, నరసింహారావులపై ఐపీసీ సెక్షన్ 320, 506, 120/బిలతోపాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి గురువారం మంగళగిరిలో మీడియాకు వివరాలు వెల్లడించారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు.. 761 ఎకరాల కొనుగోలు రాజధాని రాకముందే రంగంలోకి దిగిన బెల్లంకొండ నరసింహారావు అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా లాక్కుంటుందని భయపెట్టాడు. నరసింహారావు తన పేరిట ఉన్న 99 సెంట్ల అసైన్డ్ భూమిని బలవంతంగా రాయించుకుని భూ సమీకరణ కింద పరిహారం కూడా పొందినట్లు వెంకటపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి సీఐడీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టగా ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉందని ఆధారాలు ఉండటంతో ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు రాజధానిలో 761 ఎకరాలు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో నిర్ధారణ అయింది. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.38,56,84,000 ఉంటుందని తేలింది. (చదవండి: తెల్లబోయే దోపిడీ) తెల్ల రేషన్కార్డుదారుల పేరుతో బినామీలు కొన్న భూములు ►అమరావతి మండలంలో 131 మంది తెల్ల రేషన్ కార్డుదారులు 129 ఎకరాలు కొన్నారు. ►పెదకాకాని మండలంలో 43 మంది 40 ఎకరాలు కొన్నారు. ►తాడికొండలో 188 మంది 190 ఎకరాలు కొన్నారు. ►తుళ్లూరులో 238 మంది 242 ఎకరాలు కొనుగోలు చేశారు. ►మంగళగిరిలో 148 మంది 134 ఎకరాలు కొన్నారు. ►తాడేపల్లి మండలంలో 49 మంది తెల్ల రేషన్కార్డు దారులు 24 ఎకరాలు కొనుగోలు చేశారు. ►797 తెల్ల రేషన్ కార్డుదారుల్లో 268 మందికి పాన్ కార్డు ఉంది. ►761 ఎకరాల రిజిస్ట్రేషన్ విలువ రూ 38.50 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.220 కోట్లకుపైగా ఉంటుంది. నాలుగు బృందాలతో విచారణ.. ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు వెలికి తీసేందుకు సీఐడీ అధికారులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం అసైన్ట్ భూములపై విచారిస్తుండగా మరో బృందం తెల్ల రేషన్ కార్డులపై దర్యాప్తు జరుపుతోంది. రాజధాని ప్రకటనకు ముందు భూములు కొన్నవారికి సంబంధించి మరో బృందం వివరాలు సేకరిస్తుండగా నాలుగో బృందం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై అందిన ఫిర్యాదులను విచారిస్తోంది. (చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!) (చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..) -
మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు
సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావు సహా స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని సదరు మహిళా ఫిర్యాదు చేయడంతో వారిపై సెక్షన్ 420, 506,120(బి) కేసులను నమోదు చేసి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. (చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ) విచారణలో ఆసక్తికర విషయాలు: మాజీ మంత్రులపై ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంతో 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తిచామని మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు. (చదవండి: అమరావతిని చుట్టేశారు) అమరావతిలో 129 ఎకరాల భూమిని 131 మంది, పెద్దకాకానిలో 40 ఎకరాల భూమి 43 మంది, తాడికొండలో120 ఎకరాలను 188 మంది తెల్ల రేషన్ కార్డుదారుల పేరుపై రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కాగా తుళ్లూరులో 133 ఎకరాల భూమిని 148 మంది తెల్ల కార్డుదారులు కొనుగొలు చేయగా, మంగళగిరిలో 133 ఎకరాలను 148 మంది కొన్నారని, తాడేపల్లిలో 24 ఎకరాల భూమిని, 49 మంది కొనుగొనులు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ కేసులో విచారణను మరింత వేగవంతం చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. (చదవండి: తెల్లబోయే దోపిడీ) -
ఏపీ సీఐడీకి రెండు స్కోచ్ అవార్డులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అధికారులు అమలు చేస్తున్న ఈ-లెర్నింగ్, పీసీఆర్ డాష్ బోర్డు విధానానికి రెండు స్కోచ్ అవార్డులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు ఒక అవార్డు దక్కాయి. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్కుమార్ అందుకున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం తదితర చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తూ సీఐడీ నిర్వహిస్తున్న ఈ లెర్నింగ్ ప్రోగ్రాంకు స్కోచ్ అవార్డు లభించింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు పలు పౌర హక్కులను పర్యవేక్షించే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్(పీసీఆర్) డాష్ బోర్డు పనితీరుకు మరో అవార్డు దక్కింది. దీనితోపాటు ప్రొజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు మరో స్కోచ్ అవార్డు దక్కింది. మూడు స్కోచ్ అవార్డులు అందుకున్న అధికారులకు అభినందనలు తెలుపుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
బ్లూ ఫ్రాగ్ విచారణపై స్పందించిన డీజీపీ
-
బ్లూ ఫ్రాగ్ కాదు.. ఎల్లో ఫ్రాగే!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరా వెబ్సైట్ను హ్యాక్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2018లో ఒక్క ఏడాదిలోనే ‘మన శాండ్’ యాప్ ద్వారా లక్ష ట్రక్కుల ఇసుకను బ్లాక్ చేసినట్టు సీఐడీ పోలీసులకు ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. ఈ ఇసుక ఎక్కడికి చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ఆ ఇసుకను ఎవరి కోసం బుక్ చేశారో అన్న వివరాలు స్పష్టంగా లేవని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. టీడీపీ వ్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ప్రజల సమాచారాన్ని సేకరించిన ఈ సంస్థ గత ఆరునెలలుగా ఏయే కార్యకలాపాలు నిర్వహించిందనే దానిపై కూడా విశ్లేషిస్తున్నారు. సర్వర్లలో సమాచార విశ్లేషణకు ప్రత్యేక బృందాలు రాష్ట్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ను బ్లాక్ చేసి కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తున్నట్టు బ్లూ ఫ్రాగ్పై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక సరఫరాకు సంబంధించి ‘మన శాండ్’ యాప్ను బ్లూ ఫ్రాగ్ నిర్వహించేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇసుక సరఫరా విధానాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్(రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ )ను బ్లాక్ చేశారని, లబి్ధదారులు చెల్లించే డబ్బులు కూడా మళ్లింపు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి గత రెండ్రోజులుగా విచారణ చేపట్టారు. బ్లూ ఫ్రాగ్కు చెందిన 14 సర్వర్ల సమాచారాన్ని క్రోఢీకరిస్తున్నారు. సర్వర్లలో సమాచారం ఎక్కువగా ఉండటంతో విశ్లేషణకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. సీజ్ చేసిన సమాచారాన్ని పరిశీలన నిమిత్తం ఎప్పటికప్పుడు సైబర్ క్రైంకు పంపిస్తున్నారు. గత మూడేళ్లలో బ్లూ ఫ్రాగ్ నిర్వహించిన మన శాండ్ అప్లికేషన్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒక్క ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లింపులు? టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని నదీతీరం వెంబడి ప్రధాన ఇసుక ర్యాంపులు బ్లూఫ్రాగ్ నిర్వహణలోనే ఉండేవని తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపుల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని కూడా బ్లూ ఫ్రాగ్ సరఫరా చేసేదని సమాచారం. అప్పట్లో ఒక ఏడాదిలో రూ.6 కోట్ల జీఎస్టీ చెల్లించిన వైనంపైనా సీఐడీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 2018 సెపె్టంబర్ నుంచి 2019 జనవరి వరకు జీఎస్టీ చెల్లింపులో జాప్యంపై రూ. 1.5 కోట్ల జరిమానా చెల్లించినట్టు వెల్లడైంది. క్లౌడ్ డేటాను పరిశీలిస్తున్నాం బ్లూ ఫ్రాగ్ ప్రభుత్వ వెబ్సైట్ను హ్యాక్ చేసి ఇసుక కొరత ఉన్నట్టు చూపించిందనే ఫిర్యాదులు వచ్చాయి. వాటికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. బ్లూ ఫ్రాగ్ రూపొందించిన అప్లికేషన్ల క్లౌడ్ డేటాను పరిశీలించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇసుక కొరత లేనప్పటికీ ఉన్నట్టు వెబ్సైట్లో చూపించారా? ర్యాంపులో ఇసుక ఉన్నా లేనట్లు చూపించారా? వంటి అనేక అనుమానాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. పీవీ సునీల్ కుమార్, సీఐడీ ఏడీజీ అది టీడీపీ సంస్థే అది బ్లూ ఫ్రాగ్ కాదు.. ఎల్లో ఫ్రాగ్ అని ఎన్నికల ముందే తేలిపోయిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో గురువారం మాట్లాడుతూ సరిగ్గా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేశారనే ఆరోపణలపై బ్లూ ఫ్రాగ్పై కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ‘అది తెలుగుదేశం పారీ్టకి చెందిన సంస్థే... అందులో అనుమానం లేదు.. అయితే ఇప్పుడు ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్సైట్ను హ్యాక్ చేయడం, కృత్రిమ కొరతను సృష్టించిందన్న ఆరోపణలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయి’ అని మంత్రి చెప్పారు. కన్నబాబు