Boy First Heart Transplant Surgery Successful In Tirupati Andhra Pradesh - Sakshi

AP: గుండె మార్పిడితో బాలుడికి పునర్జన్మ 

Feb 10 2023 5:02 AM | Updated on Feb 10 2023 8:55 AM

Boy first heart transplant surgery successful in Andhra Pradesh - Sakshi

శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చేయించుకున్న విశ్వేశ్వరకు వైద్య సదుపాయాలు అందిస్తున్న వైద్య సిబ్బంది

తిరుపతి తుడా: తిరుపతిలోని శ్రీపద్మావ­తి చిన్న­పిల్లల హృదయాలయం వైద్యులు నిరు­పేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. రాష్ట్రంలో ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను తొలిసారిగా చేపట్టిన రికా­ర్డును ఇక్కడి వైద్యులు సొంతం చేసుకు­న్నారు.

48 ఏళ్ల మహిళ గుండెను 15 సంవత్సరాల బాలుడికి అమర్చి శభాష్‌ అనిపించారు. టీటీడీ పరిధిలోని వైద్యుల కృషిని యావత్‌ ప్రజానీకం శభాష్‌ అంటూ కొనియాడుతోంది. గతంలో విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా 40 ఏళ్లు పైబడిన ముగ్గురికి గుండె మార్పిడి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో చేపట్టిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చరిత్ర సృష్టించింది. 

బ్రెయిన్‌ డెడ్‌ మహిళ నుంచి..
అన్నమయ్య జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఎం.విశ్వేశ్వరకు జనవరి 20న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేపట్టారు. విశాఖపట్నంకు చెందిన 48 ఏళ్ల మహిళ బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గుండెను గ్రీన్‌ చానల్‌ ద్వారా తిరుపతి తీసుకువచ్చి శ్రీపద్మావతి చిన్న పిల్లల హృద­యా­లయంలో బాలుడికి అమర్చారు.

ఆస్ప­త్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డితో కూడిన వై­ద్యుల బృందం విజయవంతంగా గుండె మా­ర్పిడి శస్త్ర చికిత్సను చేపట్టింది. 21 రోజుల­పాటు ఆస్పత్రి­లోని ప్రత్యేక వార్డులో ఆ బాలుడికి చికిత్సను అందించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు.

ఆదుకున్న ఆరోగ్యశ్రీ
అన్నమయ్య జిల్లాకు చెందిన నరసయ్య, రాధ దంపతులు సాధారణ రైతు కూలీ కుటుంబానికి చెందిన వారు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి సంతానమైన విశ్వేశ్వర గుండె పూర్తిగా క్షీణించి అనారో­గ్యానికి గురి కావడంతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకు­వచ్చారు. గుండెకు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ సోకి­నట్టు గుర్తించిన వైద్యులు గుండెమార్పిడి అనివార్యమని తేల్చారు.

విశా­ఖకు చెందిన సన్యాసమ్మ గుం­డెను బాలు­డికి అమర్చి పున­ర్జన్మను ఇచ్చారు. రూ.40 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు యుద్ధ­ప్రాతిప­దికన  ప్రభుత్వం రూ.10 లక్షలను విడుదల చేసింది. గుం­డె మార్పి­డి అనంతరం బాలుడిని పలకరించేందుకు వైద్యు­లు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ బా­లు­డు గోవింద నామస్మరణ చేస్తూ పుల­కించిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement