doctors
-
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్లోని బృందావన్కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
పిల్లాడు అన్నం తినడం లేదు.. వెంటనే ఓ చిప్స్ ప్యాకెట్ తాయిలమైపోతుంది. పాప మారాం చేస్తోంది.. మరో ఎరుపురంగు ప్యాకెట్ తారకమంత్రంగా పనిచేస్తుంది. బుజ్జాయి స్కూలుకు వెళ్తోంది.. ఆ బ్యాగ్లో పుస్తకాలు ఉన్నా లేకున్నా చిరుతిళ్ల ప్యాకెట్టు మాత్రం ఉండి తీరుతుంది. చిన్నారి బడి నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వీధి చివరి దుకాణంలో ఊరూపేరూ తెలియని రంగురంగుల ప్యాకెట్ వాడి నోరు మూయిస్తుంది. ఏ పదార్థంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారో తెలీని ‘ప్యాకెట్లు’ చిన్నారుల పాలిట విషంగా మారుతున్నాయి. ఈ తిను ‘బండారం’ తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఏ షాపు చూసినా చిరుతిళ్ల ప్యాకెట్ల తోరణాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడినా పిల్లలను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. జంక్ ఫుడ్ పేరిట నానా రకా ల పదార్థాలు పాన్షాపుల్లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకునే బొమ్మలతో పిల్లల నోరూరిస్తున్నాయి. కానీ ఇటువంటి చిరుతిళ్లు చిన్నారుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం తప్పదని చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన రింగ్స్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా జిల్లాలోని దుకాణాల్లో కనిపిస్తున్నాయి. రింగ్స్, ట్రాప్స్ అనే రకాలకు చెందిన రింగ్స్ చిప్స్ ఒడిశా నుంచి వస్తున్నాయని, ట్రాయ్ రింగ్స్ అనే రకం పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఎక్కువగా పాఠశాలలు ఉండే ప్రాంతాల్లో పాన్ షాపుల్లో రెండు, ఐదు రూపాయలకే ఈ చిరుతిళ్లు దొరుకుతుండడంతో.. అవి తినడం బాలలకు వ్యసనంగా మారిపోతోంది. ముప్పొద్దులా వీటినే తింటుండడంతో చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు రంగు ప్యాకెట్లు, నకిలీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జంక్ ఫుడ్స్కు దూరంగా ఉంచాలి పిల్లలను జంక్ఫుడ్స్కు దూరంగా ఉంచాలి. జింక్ ఫుడ్స్లో కెమికల్స్ ఉంటాయి. ఇవి తిన డం వల్ల చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తుంటాయి. పాణిపూరి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – జి.వేణుగోపాల్, చిన్నపిల్లల వైద్యుడు, సీహెచ్సీ, పాతపట్నంవిద్యార్థులు చదువుకు దూరం విద్యార్థులు పాఠశాలకు వచ్చేముందు చిప్స్, రింగ్స్ ప్యాకెట్లు తినుకుంటూ వస్తుంటా రు. పాఠశాలకు వచ్చి కడుపు నొప్పి, విరేచనాలు అంటూ మా కు చెబుతుంటారు. ఇంటికి విద్యారి్థని పంపిస్తుంటాము. మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలో సరిగా తినడం లేదు. చిరుతిళ్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – పొడ్డిడి కృష్ణారావు,హెచ్ఎం, ఎంపీపీ మెయిన్ పాఠశాల, పాతపట్నం(చదవండి: 10th Class Exams: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడిని అధిగమిద్దాం..గెలుపును అందుకుందాం!) -
మహిళలు అలాంటి డైట్ని పాటించకండి! వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల యువత స్మార్ట్గా, నాజుగ్గా ఉండటానికి ఇష్టపడుతోంది. అలా ఉండేందు కోసం వ్యాయామాల, కసరత్తులంటూ తెగ కష్టపడుతున్నారు. మరికొందరూ కఠినమైన డైట్ల పేరుతో నోరు కట్టేస్తుకుంటున్నారు. ఎలాగైన హీరోయిన్ మాదిరిగా స్లిమ్గా ఉండాలన్నదే అందరి ఆరాటం. ఏ మాత్రం కొద్దిగా బరువు పెరిగినా..ఏదో జరగకూడనిది జరిగినట్లుగా ఫీలవ్వుతున్నారు. అంతలా చిన్నా, పెద్దా..తమ బాడీపై శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో ఫాలో అయ్యే డైట్లు ఒక్కోసారి బరువు తగ్గడం ఎలా ఉన్నా..పలు ఆరోగ్య సమస్యలు తెచ్చు పెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ అలానే ఒక మహిళ స్లిమ్గా ఉండాలని అనుసరించిన డైట్ ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టిందో చూస్తే షాకవ్వుతారు. అంతేకాదండోయ్ వైద్యులు మహిళలందర్నీ అలాంటి డైట్ ఫాలో కావద్దని హెచ్చరిస్తున్నారు కూడా. అదెంటో చూద్దామా..శరీరంలో కొవ్వుని తగ్గించి శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడంపై ఆధారపడతారు. ఆ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మాంసాహారాన్ని తీసుకుంటుంటారు. అంటే ఇక్కడ మాంసాహారంతో కూడిన డైట్కి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఈ డైట్లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిక్కుళ్లు, నెట్స్ మినహాయించి మాంసం, పౌల్ట్రీ, గుడ్లు, సముద్ర ఆహారం, చేపలు, పాల ఉత్పత్తులు, నీటిని మాత్రమే తీసుకుంటారు. నిజానికి దీన్ని"జీరో కార్బ్" అని పిలుస్తారు. ఈ డైట్లో కార్బోహైడేట్స్ అనేవి ఉండవు. అయితే ఇది మహిళ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ కరణ్ రాజన్ అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేసి మరీ వివరించారు. ఇలా మాంసాహారంతో కూడిన డైట్ మహిళలకు పనికిరాదని చెప్పారుమహిళలు మాంసాహారం ఎందుకు తీసుకోకూడదంటే..డాక్టర్ కరణ్ షేర్చేసిన వీడియోలో ఒక మహిళ ఎనిమిది వారాలపాటు మాంసాహారమే తీసుకునే డైట్ని పాటించినట్లు వెల్లడించి. ఆమె ఆ వీడియోలో తాను ఎమనిది వారాల పాటు మాంసాహారమే తీసుకున్నట్లు చెబుతుంది. దీంతో ఆమె కొవ్వుని కోల్పోయి కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారినపడినట్లు చెబుతోంది. ముఖ్యంగా ఆమెకు పీరియడ్స్ ఆగిపోవడం జరిగిపోతుంది. అంటే పీసీఓఎస్ సమస్యలు వచ్చాయి. మొటిమలు తీవ్రమయ్యాయి. మాంసాహారం అధికంగా తీసుకుంటే మహిళల్లో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. ఎందుకంటే దీనిలో ఫైబర్ ఉండదు అది మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థనే తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. అదెలాగంటే..మొక్కల ఆధారిత ఆహారం జీవక్రియను ప్రభావితం చేసి శరీరంలోని వేస్ట్ని బయటకు పంపేస్తుంది.చెప్పాంటే డంపింగ్ పనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కాలేయం ఈస్ట్రోజెన్ను గట్లోకి పంపిస్తుంది. అయితే ఆహారంలో ఫైబర్ లేని కారణంగా దాన్ని బంధించి బయటకు పంపిచే అవకాశం లేకపోతుంది. దీంతో ప్రేగులే ఈస్ట్రోజన్ని తిరిగి గ్రహిస్తాయి. దీంతో ఈ జీవక్రియ సమస్య కాస్త చర్మంపై దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అధిక ఈస్ట్రోజన్ చర్మ సమస్యలు, హర్మోన్ల అసమతుల్యతకు దారితీసి మొటిమలకు కారణమవుతుందని అన్నారు. అంతేగాదు దీనితోపాటు మూడ్ స్వింగ్స్, ఆందోళన, మెదడు పనిచేయకపోవడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు డాక్టర్ కరణ్. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి మాంసాహారం డైట్ సైడ్ఎఫెక్ట్స్ ఇవ్వకపోవచ్చు. కానీ చాలామటుకు ఇది సరిపడదని తేల్చి చెప్పారు. హర్మోన్ల అసమతుల్యతకు, గట్ ఆరోగ్యానికి ప్రతిబంధకాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ డైట్ మానవ శరీరాన్ని జడత్వంగా మార్చేస్తుందని, చురుకుదనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. (చదవండి: పప్పు ధాన్యాలు తీసుకోకపోతే శరీరంలో సంభవించే మార్పులు ఇవే..!) -
‘గాంధీ’లో డ్యూటీకి డాక్టర్ల డుమ్మా.. మంత్రి రాజనర్సింహ సీరియస్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా పర్యటించారు. నేరుగా ఔట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. డాక్టర్ల హాజరుపై షీట్ తెప్పించుకుని పరిశీలించిన మంత్రి.. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి.. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని ఆదేశించారు. ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈని మంత్రి ఆదేశించారు.గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని.. మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డ్యూటీ సమయంలో డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పేదలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. -
ముంచుకొస్తున్న ఎండలు.. ముందు జాగ్రత్తలివే..
ఈ ఏడాది దేశంలో మార్చి నుంచే ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇలా మార్చి నుంచే ఎండలు మండిపోతే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని చాలా మంది ఇప్పటి నుంచే బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా హీట్ వేవ్స్ వస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ నేపధ్యంలో వేసవి కాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల నివారణకు వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..వేసవి కాలంలో డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా తరచూ నీటిని తాగుతుండాలి.రోజులో ఒకటి రెండుసార్లు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ని ఉపయోగించాలి. అలాగే నిమ్మరసం, మజ్జిగ /లస్సీ, పండ్ల రసాలతో పాటు ఇంట్లో తయారుచేసిన ఇతర పానీయాలలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి.బయటకు వెళ్లేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్పప్పుడు కూడా వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. అలాగే తప్పనిసరై బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగు, టోపీ, టవల్ వంటివి ఉపయోగిస్తూ నేరుగా శరీరానికి ఎండ తాకకుండా చూసుకోవాలి.ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన వార్తలను తెలుసుకోవాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు తప్పనిసరైతేనే బయటకు వెళ్లాలి.వేసవిలో ఉదయం వేళ కిటికీలు, కర్టెన్లను మూసివేయాలి. సాయంత్రం సమయంలో చల్లని గాలి లోపలికి వచ్చేవిధంగా కిటికీలను తెరిచివుంచాలి.శిశువులు, పిల్లలు, గర్భిణులు, ఆరుబయట పనిచేసేవారు, మానసిక అనారోగ్యం కలిగినవారు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్నవారు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వేడి వాతావరణంలోనికి వెళ్లినప్పడు వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటివారు డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలి.అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజ్లులో మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో వంట చేయడాన్ని తగ్గించాలి. ముందుగానే వంటపనులు పూర్తిచేసుకోవాలి. అలాగే వంట చేసే ప్రదేశంలో గాలి ఆడేందుకు తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.పార్క్ చేసిన వాహనాలలో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలివెళ్లకూడదు. ఎందుకంటే వాహనం లోపల ఏర్పడే ఉష్ణోగ్రత వారి ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుందనే సంగతిని గమనించాలి.ఎండల కారణంగా వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన తగ్గడం, వేగంగా శ్వాస తీసుకోవడం, అధికంగా గుండె కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆకర్షించే స్క్వేర్ వేవ్స్.. దగ్గరకు వెళ్తే అంతే సంగతులు -
కడుపులోనే శిశువు.. కాసేపటికే తల్లి
కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్లలో విషాదం నెలకొంది. -
చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?
దేశంలో ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఈ తరహాలో గుండెపోటు, స్ట్రోక్, గుండె, ధమనుల వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పాతికేళ్లలోపువారిలోనూ గుండపోటు కేసులు వెలుగు చూస్తున్నాయి. దీనికి కారణమేమిటి? వైద్యులు ఏమంటున్నారు?పురుషుల్లోనే అధికంఇండియన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం గత కొన్నేళ్లుగా 50 ఏళ్లలోపు వయసుగల వారిలో గుండెపోటు ముప్పు 50 శాతం, 40 ఏళ్లలోపు వారిలో 25 శాతం మేరకు పెరిగింది. అయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.. మహిళల్లో గుండెపోటు కేసులు చాలా తక్కువని తెలిపింది. పురుషులు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ధూమపానం, మద్యపానం అనేవి యువతలో హృదయ సంబంధ వ్యాధులకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ వ్యసనాల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఇది కరోనరీ హార్ట్ డిసీజ్కు దారితీస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది రక్త నాళాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.కారణాలివే..👇👉ఆహారపు అలవాట్లుఈ రోజుల్లో ప్రతి రంగంలోనూ పని ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో యువత తమ ఆహారపు అలవాట్లు, దినచర్యపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇది పలు రకాల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తోంది. జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని కారణంగా శరీరంలోని కేలరీల పరిమాణం పెరుగుతుంది. ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.👉అధిక పని ఒత్తిడిమానసిక ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణంగా నిలుస్తోంది. పని భారం అనేది నేరుగా రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా యువకులు, మధ్య వయస్కులు రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఎనిమిది గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.👉మధుమేహం యువతలో గుండె జబ్బులకు మధుమేహం (డయాబెటిస్) కూడా ఒక ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో డయాబెటిస్ రోగులు అత్యధికంగా ఉన్నారు. 2019లో భారతదేశంలో 7.7 కోట్ల మంది డయాబెటిక్ బాధితులు ఉన్నారని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2045 నాటికి డయాబెటిస్ రోగుల సంఖ్య 13 కోట్లకు పైగా పెరుగుతుందనే అంచనాలున్నాయి.జిమ్, డ్యాన్స్ సమయంలోనే ఎందుకంటే..అధికంగా శారీరక శ్రమ చేయడం వలన గుండె ధమనులలో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్ చీలిపోయే ప్రమాదం మరింతగా పెరుగుతుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేస్తున్న సందర్భంలో ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండెపోటు ముప్పు కూడా మరింతగా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా మేరకు, వారి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా నృత్యం చేసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నృత్యం చేసే సమయంలో హృదయ స్పందన పెరుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఊబకాయం కలిగివారు, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు ఎక్కువ స్టెప్స్ కలిగిన నృత్యం చేస్తున్నప్పుడు వారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్తపడండిఛాతీ, వీపు, గొంతు, దవడ లేదా రెండు భుజాలలో తరచూ నొప్పిగా అనిపిస్తుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే ఉన్నట్టుండి చెమటలు పడుతున్నా, ఊపిరి ఆడటం కష్టంగా అనిపించినా, రెండు అడుగులు కూడా వేయలేనంత నీరసంగా అనిపించినా వెంటనే వైద్య నిపుణులను కలుసుకోవాలి. ఇదేవిధంగా ఛాతీలో, ఉదరంలో గ్యాస్ ఏర్పడినా, విపరీతమైన అలసట లేదా తల తిరుగుతున్నట్లు ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీ నొప్పి, విశ్రాంతి లేకపోవడం, శ్వాస సమస్యలు లేదా వేగంగా శ్వాస తీసుకోవడం మొదలైనవి గుండెపోటు సంబంధిత లక్షణాలు కావచ్చని గుర్తించాలని, ఇటువంటి సందర్భాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు.గుండెలో సమస్యలు👉హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిగుండె కండరాలు గట్టిపడే జన్యుపరమైన రుగ్మత. దీని వలన గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయలేకపోతుంది.👉డైలేటెడ్ కార్డియోమయోపతి దీనిలో ఎడమ జఠరిక పెద్దదిగా, బలహీనంగా మారుతుంది. ఇది గుండెకు రక్తాన్ని సమర్థవంతంగా ప్రసరింపజేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.👉అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లాసియా దీనిలో కొవ్వు లేదా పీచు కణజాలం గుండె కండరాలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇది రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ప్రాణాంతక అరిథ్మియా ముప్పును మరింతగా పెంచుతుంది.ముందుగా చేసే పరీక్షలివే..👉ఎకోకార్డియోగ్రఫీ (ఎకో) గుండె పనితీరునంతటినీ అంచనా వేయడానికి చేసే గుండె సంబంధిత అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ ఇది.👉స్ట్రెస్/ట్రెడ్మిల్ పరీక్ష శారీరక శ్రమ చేసే సమయంలో గుండె ఎలా స్పందిస్తుందో ఈ పరీక్ష అంచనా వేస్తుంది. గుండె సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది.👉జెనెటిక్ పరీక్ష ఆకస్మిక గుండెపోటు, వారసత్వంగా వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు.👉హోల్టర్ పర్యవేక్షణ హోల్టర్ మానిటర్ అనేది హృదయ స్పందనను రికార్డ్ చేస్తుంది. ఇది గుండె సంబంధిత అసాధారణ సంకేతాలను తనిఖీ చేస్తుంది. బాధితులకు అవసరమైనప్పుడు వైద్యులు 24 గంటల హోల్టర్ పర్యవేక్షణను సూచిస్తుంటారు.వెంటనే ఏం చేయాలంటే..అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ అనేది ప్రాణాలను కాపాడుతుంది. సీపీఆర్ చేయడం ద్వారా మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. కణజాల మరణాన్ని కొంతసేపటి వరకూ నివారిస్తుంది. సీపీఆర్ అందని పక్షంలో ఐదు నిమిషాల్లో మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. ఎనిమిది నిమిషాల తర్వాత మరణం దాదాపు ఖాయమని వైద్యులు చెబుతున్నారు.అత్యవసర సేవలకు కాల్ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే పక్కనే ఉన్నవారు ఆ వ్యక్తిని కదిలిస్తూ ‘బాగున్నారా?’ అని గట్టిగా అడగాలి. వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయాలి. బాధితులు శ్వాస తీసుకుంటున్నాడా లేదా అనేది గుర్తించాలి. బాధితుడు శ్వాస తీసుకోకవడం లేదని గుర్తిస్తే అతని ఛాతీ మధ్యలో గట్టిగా వేగంగా అదమండి. నిమిషానికి 100 నుండి 120 సార్లు ఇలా చేయాలి. సీపీఆర్లో శిక్షణ పొందినవారు 30 కంప్రెషన్ల తర్వాత రెస్క్యూ శ్వాసలను అందించగలుగుతారు. శిక్షణ పొందనివారు ఛాతీ కంప్రెషన్లను కొనసాగించాలి. అదేవిధంగా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.ఇది కూడా చదవండి: Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు -
‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’
ముంబై: ఆ ప్రాంతంలోని ప్రజల్లో అకస్మాత్తుగా జట్టు రాలే సమస్య(Hair Loss) మొదలయ్యింది. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు.. ఇలా అందరూ దీని బారిన పడ్డారు. జుట్టూడుతున్న యువతీయువకులకు పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. దీంతో కొందరిలో వైరాగ్యం ప్రవేశించింది. గత డిసెంబరు నుంచి ఈ జనవరి వరకూ ఈ సమస్య ఇక్కడివారిని పట్టిపీడించింది. అయితే ఇప్పుడు వైద్య నిపుణులు దీనికి కారణాన్ని కనుగొనడంతో పాటు పరిష్కారాన్ని సూచించడంతో అక్కడివారింతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.జాతీయ సమస్యగా..మహారాష్ట్ర(Maharashtra)లోని బుల్ధానా జిల్లాలో అకస్మాత్తుగా జుట్టు రాలడం అనే సమస్య గత డిసెంబరులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దీనికి కారణమేమిటన్నది వైద్య నిపుణుల నివేదికలో వెల్లడయ్యింది. పంజాబ్, హర్యానాలలోని రేషన్ దుకాణాలు సరఫరా చేస్తున్న గోధుమలలో అధిక సెలీనియం ఉండటం, ఆ గోధుమలను స్థానికులు విరివిగా వినియోగించడమే దీనికి కారణమని వైద్య నిపుణుల నివేదిక పేర్కొంది. సెలీనియం అనేది నేలలో లభించే ఖనిజం. ఇది సహజంగా నీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల లభిస్తుంది. జీవక్రియలో కీలక పాత్ర పోషించే ఈ సెలీనియం మనిషికి తక్కువ మొతాదులో అందితే సరిపోతుంది.గుండు కొట్టించుకుని..గత ఏడాది డిసెంబర్, ఈ జనవరి మధ్య కాలంలో బుల్ధానాలోని 18 గ్రామాల్లోని 279 మంది అకస్మాత్తుగా జుట్టు రాలడం అంటే ‘అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్’(Acute onset alopecia totalis) సమస్యబారిన పడి, ఆస్పత్రులను ఆశ్రయించారు. కళాశాల విద్యార్థులు, యువతీ యువకులు ఈ సమస్యతో సతమతమయ్యారు. కొందరు వివాహాలు కుదరక ఇబ్బందులు పడ్డారు. కొందరైతే జట్టురాలే సమస్యకు పరిష్కారం లభించక గుండు చేయించుని, తమ ఇళ్లకే పరిమితమైపోయారు.వాంతులు, విరేచనాలు కూడా..ఈ సమస్యపై పలు ఫిర్యాదుల అనంతరం వైద్యాధికారులు బాధితుల నుంచి నమూనాలను సేకరించారు. వారు జుట్టురాలే సమస్యతో పాటు తలనొప్పి, జ్వరం, తల దురద, కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాల(Vomiting and diarrhea)తో కూడా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. రాయ్గడ్లోని బవాస్కర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పంజాబ్, హర్యానాల నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలే కారణమన్నారు.గోధుమలు మార్చడంతో..ఈ గోధుమల్లో సెలీనియం కంటెంట్ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. సాధారణంకంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం తీసుకోవడమే అలోపేసియా కేసులకు కారణమని ఆయన అన్నారు. ఈ నివేదిక దరిమిలా వైద్య నిపుణులు ఈ తరహా గోధుమల వినియగానికి స్వస్తి చెప్పాలని బాధితులకు సూచించారు. దీంతో కొంతమందిలో జుట్టురాలే సమస్య తగ్గి, ఐదారువారాల్లో తిరిగి జట్టు పెరగడం ప్రారంభమయినట్లు వైద్యులు గుర్తించారు. ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్కు 10 లక్షలమంది భారతీయులు -
‘సెల్’.. కిల్ యూ
సాక్షి, అమరావతి: ఇది డిజిటల్ యుగం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సెల్ ఫోన్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తోనే పని. చదువులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వస్తువులు కొనడానికైనా అన్నిటికీ ఫోన్లు, ల్యాప్టాప్లే ముఖ్య సాధనాలైపోయాయి. అయితే వీటి వినియోగం మితిమీరి వాటికి బానిసలుగా మారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి అతి వినియోగం మనిషి మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అతి వినియోగాన్ని నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలి.. సంతోషంగా జీవించాలి.. అని దేవుడిని ప్రార్థిస్తూ చాలా మంది ఉపవాసం పాటిస్తుంటారు. అదేవిధంగా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగాన్ని కొన్ని గంటలు, రోజులు వదిలేసి డిజిటల్ డిటాక్స్ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ విధానంతో మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడుతుందని, శారీరక ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కెనడాలోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయం డిజిటల్ డిటాక్స్పై అధ్యయనం చేయగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. సెల్ఫోన్, ఇంటర్నెట్ను అతిగా వినియోగించే 467 మందిని ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరికి రెండు వారాల పాటు సెల్ఫోన్, ఇంటర్నెట్ యాక్సెస్ లేకుండా చేశారు. డిజిటల్ డిటాక్స్కు ముందు, ఆ తర్వాత వారి మానసిక ఆరోగ్యం, శ్రద్ధ, సామర్థ్యాలను అంచనా వేశారు. 91 శాతం మందిలో డిటాక్స్ అనంతరం మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గినట్టు వెల్లడైంది. మొబైల్, ఇంటర్నెట్ యాక్సెస్ లేని వ్యక్తులు ముఖాముఖి సంభాషణలు, వ్యాయామం, చదవడం వంటి బహిరంగ కార్యకలాపాలను ఆస్వాదించడంలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.మెదడుకు రీచార్జ్భారతీయులు సగటున రోజుకు 7.3 గంటలు స్క్రీన్ చూడటానికి కేటాయిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గంటల తరబడి స్క్రీన్కు సమయాన్ని కేటాయించడంతో నిద్ర లేమి, ఒత్తిడి, ఆందోళన, నిరాశ తలెత్తడంతో పాటు, ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ చక్రాన్ని డిజిటల్ డిటాక్స్ విచ్ఛిన్నం చేస్తుంది. మెదడుకు విశ్రాంతి లభించి, రీఛార్జ్ అవుతుంది. స్క్రీన్ల నుంచి వచ్చే నీలి కాంతి (బ్లూ లైట్) దుష్ప్రభావాలు తగ్గిపోయి కంటికి మంచి నిద్ర దొరుకుతుంది. ఇంట్లో భార్యాభర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో ముఖాముఖి చర్చించుకొనే అవకాశం లభిస్తుంది. తద్వారా మనుషుల మధ్య బంధాలు బలపడి, మనస్పర్థలు తగ్గుతాయని మానసిక వైద్యులు వెల్లడిస్తున్నారు.డీటాక్స్ సమయంలో రన్నింగ్, జాగింగ్, జిమ్లో వ్యాయామాలు చేయడం, ఇంటి, తోట పనులు వంటి శ్రమకు కేటాయించడంతో బీపీ, షుగర్ వంటి జీవన శైలి జబ్బుల ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. -
గర్భవతిని చేశాడు.. బాలిక ఉసురు తీశాడు!
కాణిపాకం/పలమనేరు : బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తీవ్ర రక్తహీనతకు గురైంది. చివరికి ప్రాణాల మీదికొచ్చింది. వైద్యులు సిజేరియన్ చేసి బాలికను బతికించేందుకు విఫలయత్నం చేశారు. బిడ్డకు జన్మనిచ్చిన ఆ చిన్నారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ.ఒడ్డూరు గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పెంగరగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు నెలల కిందట బాలిక కడుపు పెరగడాన్ని గమనించి టీచర్.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికను బడికి పంపడం మాన్పించారు. శనివారం ఉన్నట్టుండి ఆ బాలికకు ఫిట్స్ రావడంతో తల్లిదండ్రులు బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు. ఆరు నెలల గర్భిణీ అయిన ఆ బాలిక రక్తహీనతతో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్త హీనత కారణంగా బాలిక ఊపిరితిత్తులకు ఉమ్మనీరు చేరిందని, బిడ్డను బయటకు తీస్తే తప్ప తల్లిని బతికించలేమని తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి.. వారి ఆదేశాల మేరకు బాలికకు సిజేరియన్ చేశారు. మగబిడ్డను బయటకు తీశారు. తల్లి పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వెంటిలేటర్ మీద శనివారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు నుంచి తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక ఆదివారం ప్రాణాలు విడిచింది. బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతోంది. పలమనేరు సీఐ నరసింహరాజు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఓ మాయలేడిని నమ్మి.. ఇదిలా ఉండగా, పాఠశాలకు సెలవు వచ్చినప్పుడల్లా ఓ మాయలేడి ఆ బాలికను ఆవుల మేతకు తీసుకెళ్లేదని, అక్కడ ఓ కామాంధుడి చేతిలో పెట్టేదని తెలిసింది. పూర్తి వివరాలను రెండ్రోజుల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. -
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. జీబీ సిండ్రోమ్ లక్షణాలు» ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించేదే జీబీఎస్. »మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. యాంటీబాడీస్ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్ అందక అవయవాలు అచేతనమవుతాయి.» మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతన మైతే కళ్లు కూడా మూయలేడు. »ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. » గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం వస్తుంది. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. »శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గినా జీబీఎస్ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్ రావటానికి ప్రధాన కారణమని గుర్తించారు.తక్కువ ఖర్చుతో చికిత్స ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం మేలు. –డాక్టర్ బి. చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
మహమ్మారి కాదు మామూలు వైరస్సే
సాక్షి, హైదరాబాద్: ‘హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ)’ విషయంలో జరుగుతున్న ప్రచారం హడలెత్తిస్తోందని... కానీ మరీ అతిగా భయాందోళన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 50, 60 ఏళ్లుగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని.. ఇది కరోనా తరహాలో మహమ్మారిలా మారే ప్రమాదం లేదని సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటివి వినియోగించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వైరస్కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని, తగిన అప్రమత్తతతో మసలుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.దేశంలో కేసుల నమోదుతో ఆందోళనచైనాలో హెచ్ఎంపీవీ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయన్న ప్రచారం.. దానికితోడు మన దేశంలోనూ ఆరు కేసులు నమోదయ్యాయన్న వార్తలతో జనంలో భయాందోళన వ్యక్తమవుతోంది. బెంగళూరు, చెన్నైలలో రెండు చొప్పున, అహ్మదాబాద్, కోల్కతాలలో ఒక్కో హెచ్ఎంపీవీ కేసు మాత్రమే నమోదయ్యాయి. మన దేశానికి సంబంధించి వైరస్ వ్యాప్తి అధికంగా లేకపోయినా, పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగకపోయినా.. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో దీనిపై ఆందోళనకర ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మరీ భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు, ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు.శ్వాస మార్గంలో వృద్ధి చెందే లక్షణంతో..కరోనా వైరస్ తరహాలోనే హెచ్ఎంపీవీ కూడా ‘ఆర్ఎన్ఏ’ రకం వైరస్. అందువల్ల దీనిలోనూ కరోనా తరహాలో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒంటి ఒప్పులు తదితర లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా మనం శ్వాస తీసుకునే మార్గం (రెస్పిరేటరీ ట్రాక్ట్)లోనే వృద్ధి చెందుతుందని... అంటే ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల తరహాలో కొన్నిరోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని వివరిస్తున్నారు. ఇది కలసి వచ్చే అంశమని పేర్కొంటున్నారు. వైరస్ ప్రధానంగా నోటి తుంపరలు, తుమ్ముల ద్వారా వెలువడే తుంపరల ద్వారా వ్యాపిస్తుందని... ఆ తుంపరలు పడిన చోట తాకడం, వైరస్ సోకినవారిని తాకడం ద్వారా ఇతరులకు విస్తరిస్తుందని స్పష్టం చేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వైరస్కు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు.ఆందోళన వద్దుకరోనాలా వ్యాప్తి చెందుతూ ఉత్పాతం సృష్టించే లక్షణం హెచ్ఎంపీవీకి చాలా తక్కువ. కరోనా సమయంలోలాగే తుమ్ములు, దగ్గు నుంచి వచ్చే తుంపర్లకు దూరంగా ఉంటూ, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటే ఈ వైరస్ వల్ల ప్రమాదం దాదాపుగా ఉండదు. పైగా ఇప్పుడు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. ఆందోళన అవసరం లేదు.– డాక్టర్ గురవారెడ్డి, సన్షైన్ హాస్పిటల్స్జాగ్రత్తలతో నివారణ సాధ్యమేచిన్నపాటి ముందు జాగ్రత్తలు పాటిస్తే చాలు హెచ్ఎంపీవీ వైరస్ను దాదాపుగా నివారించవచ్చు. మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రపర్చుకుంటూ ఉండాలి. వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉండాలి. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి సమయానికి వ్యాక్సిన్లన్నీ ఇప్పించాలి. పెద్దలు, వృద్ధులు జలుబు వంటి లక్షణాలున్నవారి నుంచి దూరంగా ఉండాలి.– డాక్టర్ జయచంద్ర, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తచైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. ఈ ఆర్ఎన్ఏ వైరస్ను 2001లో గుర్తించారు. అప్పటి నుంచి ఇది ఏటా చలికాలంలో చిన్న పిల్లలు, వృద్ధుల్లో సీజనల్ వైరల్ అనారోగ్యంగా కొనసాగుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులకు మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. – జీసీ ఖిల్నానీ, ఢిల్లీ ఎయిమ్స్ పల్మనరీ విభాగం మాజీ హెడ్అతిగా భయాందోళన అనవసరంహెచ్ఎంపీవీ వైరస్ గురించి అతిగా భయాందోళనకు గురికావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అయితే బయటికి వెళ్లినప్పుడు, గుంపుల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా వెల్లడైన అంశాల మేరకు ఈ వైరస్ చాలా స్వల్ప లక్షణాలు కలిగి ఉంటుంది. సాధారణ జలుబు మాదిరిగా ముక్కు కారడం, దగ్గు, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, గొంతునొప్పి, శ్వాస తీసుకునేప్పుడు ఈల వేసినట్టు శబ్దాలు రావడం, శరీరంపై దద్దుర్లు రావడం వంటి వాటి ద్వారా దీనిని గుర్తించవచ్చు. – డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద ఆస్పత్రిమహమ్మారిగా మారే ప్రమాదం లేదుఇది కోవిడ్ మాదిరిగా మహమ్మారిగా మారే ప్రమాదం అసలే లేదు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 ఏళ్లకుపైగానే ఇది వ్యాప్తిలో ఉంది. దీనివల్ల కేసులు పెరగొచ్చునేమోగానీ తీవ్రత అంత ఉండకపోవచ్చు. మనుషుల్లో యాంటీబాడీస్తోపాటు తగిన మేర రోగ నిరోధక శక్తి ఉంటే ఈ వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ కేసులు సీరియస్ కాకుండా రక్షణ ఉండవచ్చు. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ మెడిసిన్, గాంధీ ఆస్పత్రిహెచ్ఎంపీవీపై నిపుణుల కమిటీ⇒ నియమించిన వైద్య, ఆరోగ్య శాఖ⇒ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కేసూ లేదు⇒ ఎలాంటి భయాందోళనలు వద్దుసాక్షి, అమరావతి: చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) భారత్లోకి ప్రవేశించింది. గుజరాత్, బెంగళూరుల్లో వైరస్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ప్రకటించింది. కేరళలోనూ వైరస్ కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మైక్రోబయాలజిస్ట్, పీడియాట్రిక్స్, పల్మనాలజిస్ట్, ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్లతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ అధికారులతో ఈ అంశంపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కేసులు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్లు 10, వీఆర్డీఎల్ ల్యాబ్లు 9 సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి టెస్టులకు కావాల్సిన కిట్లు, యాంటీవైరల్ మందుల లభ్యతపై అంచనాలు తయారు చేయాలన్నారు. డీఎంఈ, డీహెచ్, సెకండరీ హెల్త్ ఇలా అన్ని విభాగాల అధిపతులు హెచ్ఎంపీవీ లక్షణాలకు సంబంధించిన కేసుల నమోదును క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు సూచించారు. వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేస్తామన్నారు. అప్రమత్తంగా ఉండండి: సీఎంహెచ్ఎంపీవీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం చంద్రబాబు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చి, వెళ్లే వారిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడ అనుమానం ఉన్నా పూర్తిస్థాయి పరీక్షలు జరపాలని ఆదేశించారు. -
శుభమస్తు.. ఆరోగ్య‘మస్త్’
కొత్త ఏడాది నాడు.. పెద్దలు దీవెనలిస్తారు.. ఫ్రెండ్స్ విషెస్ చెబుతారు .. పిల్లలకు కానుకలిస్తారు మరి పెద్ద పెద్ద డాక్టర్లో..? కొత్త సంవత్సరంలో ‘అందరికీ ఆరోగ్యమస్తు’ అని దీవిస్తూనే.. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహా–సూచనలను ‘కన్సల్టేషన్’గా అందిస్తున్నారు. దాన్నే సమగ్రంగా, సంక్షిప్తంగా, చిరు కానుకగా ప్రత్యేక పేజీ రూపంలో ‘సాక్షి’ అందిస్తోంది. ‘ఓమ్’ ప్రథమం గట్ బయోమ్జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. గతంలో జీర్ణవ్యవస్థ అనేది కేవలం జీర్ణం చేయడానికి ఉపయోగడపతుందని అనుకున్నారు. ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే జీర్ణవ్యవస్థలో కోటాను కోట్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయనీ, ‘గట్ బయోమ్’గా పేర్కొనే వీటి సమతౌల్యత వల్లనే మానసిక ఆరోగ్యం, వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వంటివన్నీ ఆధారపడి ఉంటాయని తెలిసింది.అంటే ఓ వ్యక్తి ఆహారం అరిగించడంలోనే కాకుండా, అతడు తినే పదార్థాల తీరు తెన్నులు అతడి మానసిక ఆరోగ్యాన్నీ, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్దేశిస్తుంటాయన్నమాట. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి. మంచి జీవనశైలిని అనుసరిస్తూ, పూర్తిగా సమతులాహారం తీసుకుంటూ ఉంటే గట్ బయోమ్ సమతౌల్యత బాగుంటుంది. మన భారతీయ సంప్రదాయ ఆహారంలో మొక్కలూ, వృక్షాల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకుంటుంటాం. అంటే... మనం తినే అన్నంలోనే కాయధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు పులవడానికి సిద్ధంగా ఉండే ఇడ్లీ, దోశలు, భోజనం చివర్లో పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయాటిక్ ఆహారాలను తీసుకుంటాం. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ను ఆరోగ్యకరంగా, సమతౌల్యంగా ఉండేలా చూస్తాయి. ఇటీవల మనం తీసుకుంటున్నప్రాసెస్డ్ ఫుడ్, చక్కెరతో చేసే తీపిపదార్థాల్లో ఇవి అంతగా ఉండవు. అందుకే మంచి సమతులాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిలో భాగంగా ఒంటికి తగినంత శ్రమ కలిగేలా తేలికపాటి వ్యాయామాలు, వేళకు కంటి నిండా నిద్రపోవడం వంటి చర్యలతో గట్ బయోమ్ సమతౌల్యత సమర్థంగా నిర్వహితమవుతూ ఉంటుంది. దీనివల్ల మంచి జీర్ణక్రియ, తిన్నది ఒంటికి పట్టడమే కాకుండా మంచి మూడ్ (భావోద్వేగాల) నిర్వహితమవుతుండటం, వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా, క్రియాశీలకంగా మారడం, పూర్తిస్థాయి భౌతిక, మానసిక ఆరోగ్యాల నిర్వహణ జరుగుతాయి. అందుకే స్వాభావికమైన, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పులవడానికి సంసిద్ధంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్, తేలికపాటి వ్యాయామాలతో గట్ బయోమ్ సమతౌల్యతతో నిర్వ‘హిత’మయ్యేలా చూసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ,సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ చైర్పర్సన్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీకదలికే ‘కీళ్ల’కంపోషకాలు తీసుకోవడానికి జాయింట్స్కు నోరు లేదు. అదెలాగంటారా? మన దేహంలోని ప్రతి కణానికీ రక్తం ద్వారా పోషకాలూ, ఆక్సిజన్ అందుతాయి. రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండటం వల్ల వాటికి నేరుగా న్యూట్రియెంట్స్ (పోషకాలు) అందుతాయి. కానీ, కీళ్ల విషయం వేరు. అవి రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండవు. మరి వాటికి పోషకాలు అందడమెలా? కీళ్లు ఎంతగా కదులుతుంటే అంతగా వాటికి పోషకాలు అందుతాయి. ఒకవేళ శరీరం కదలికలు మందగించి, కీళ్లలో కదలిక లేకపోతేనో?... అప్పుడు వాటికి పోషకాలు అందవు. నేరుగా రక్తప్రసరణ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కణాలకు ఉన్నట్లు వాటికి సప్లై ఉండదు కాబట్టే... వాటికి నోరు లేదు అన్నది. నోరున్న వాడు నోరు చేసుకు బతుకుతాడు. మరప్పుడు నోరు లేని కీళ్లు కష్టం చేసుకుని బతకాల్సిందే కదా. అందుకే కీలాడితే గానీ వాటికి బతుకాడదు. అందుకే కీళ్ల ఆరోగ్యం బాగుండాలంటే, వాటికీ పోషకాలు అందాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నమాట. ఇక మరోమాట... ఎవరిలోనైనా కీళ్లు బాగా అరిగిపోతే (అంటే కీళ్లపై ఉండే కార్టిలేజ్ అనే ΄పోర అరిగితే) అప్పుడు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది కీళ్లలోకి ఇంజెక్షన్ ఇస్తామంటూ పీఆర్పీలు, స్టెరాయిడ్స్ ఎక్కిస్తారు. అవి అందగానే నొప్పులన్నీ తగ్గుతాయి. దాంతో ఇంజెక్షన్తోనే నొప్పి అంతా తగ్గిపోయిందంటూ చాలామంది ఆనందపడతారు. అలాంటి ఇంజక్షన్స్ చేయమంటూ ఆర్థోపెడిక్ సర్జన్ల దగ్గరికి రోజూ పదుల సంఖ్యలో వస్తుంటారు. నాలుగో స్టేజీలో ఉన్న మోకాళ్ల ఆర్థరైటిస్కి ఏ డాక్టర్ అయినా పీఆర్పీ ఇంజెక్షన్ ఇస్తే అతడు డాక్టర్ కాదు... ఆపరేషన్ అంటే భయపడే అమాయకులైన పేషెంట్లను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. ఇంజెక్షన్ చేయడమనేది ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు మొదలు కాం΄ûండర్లూ చేయగలిగేదే. స్టెరాయిడ్స్ ఇవ్వడంతో తొలుత నొప్పులు ఉపశమించినట్లు కనిపించినా... ఆ తర్వాత అవి బోలుగా మారడం, తేలిగ్గా విరగడం జరుగుతుంది. మహామహా కీళ్లమార్పిడి నిపుణులు చిన్నపాటి ఇంజెక్షన్ చేయలేరా? ఎందుకు చేయరంటే బాధితుల పాలిట అదో ద్రోహం. వాళ్ల ఎముకల్ని గుల్ల చేసేసే ఓ అనైతిక (అన్ ఎథికల్) పద్ధతి. అందుకే కీళ్లు పూర్తిగా అరిగాక ఎవరైనా ఇంజెక్షన్స్తో మాన్పిస్తామంటే... వాళ్లు నొప్పి నివారణ మందులూ, స్టెరాయిడ్స్ కలిపి ఇంజెక్షన్ చేస్తూ, దీర్ఘకాలికంగా ఎముకల్ని గుల్ల గుల్ల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. -డాక్టర్ గురవారెడ్డి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల నిపుణులుమూత్ర పిండం బ్రహ్మాండంగా ఉండాలంటే..గతంలో పెద్దవయసు వారిలోనే కనిపించే చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారిలోనూ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ఆరోగ్య స్పృహ కారణంగా ముందుగానే చేయిస్తున్న వైద్య పరీక్షల వల్ల అనేక జబ్బులు బయటపడటమూ జరుగుతోంది. దీనివల్ల రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది... జబ్బులు బయటపడటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందనేది ఆందోళన కాగా... ఇక రెండో అంశం... ఆరోగ్యస్పృహ ఇంతగా పెరగకపోయి ఉంటే, అవి మరింత ముదిరాక బయటపడి ఇంకా సమస్యాత్మకంగా మారేవనే పాజిటివ్ అంశం.ఉదాహరణకు గతంలో మూత్రవ్యవస్థకు సంబంధించిన జబ్బుల్లోనూ కిడ్నీల్లో రాళ్లు, పెద్దవయసువారిలో మూత్ర విసర్జన కష్టం కావడం ఇక డయాబటిస్, హైపర్టెన్షన్ బాధితుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. కానీ ఇటీవల యుక్తవయసువారిలోనూ, ఆమాటకొస్తే చాలా చిన్నపిల్లల్లోనూ కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. మన ఆహారపు అలవాట్లు, కలుషిత వాతావరణం, జీవనశైలి మార్పులు వంటివి కారణాలు కావచ్చు. అయితే ఇప్పుడు ఓ ఆరోగ్య సమస్య వచ్చిందంటే... ఉదాహరణకు ‘కిడ్నీలో రాళ్లు’ సమస్యను తీసుకుంటే... ఇటీవల అత్యాధునికమైన వైద్య ప్రక్రియలూ, లేజర్లు, రొబోటిక్ సర్జరీలూ అందుబాటులోకి రావడంతో కోత, గాటూ లేకుండా, రక్తం చిందకుండా సర్జరీ చేస్తున్నామని అనుకోవడం తప్ప అసలివి రాకుండా చేసుకోవడానికి నివారణలేమిటి అనే ఆలోచనకు తావులేకుండా పోయింది. నిజానికి మనం ఆలోచించాల్సింది వ్యాధుల నివారణ గురించే. ఉదా: కిడ్నీలు, మూత్ర వ్యవస్థ విషయానికి వస్తే... రాళ్లు ఏర్పడటానికి ఆస్కారమిచ్చే ఆహారానికి దూరంగా ఉండటం, నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వంటి నివారణ చర్యల గురించి గురించి ఆలోచించాలి. సమాజంలో ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా పెరిగింది. వీటన్నింటికీ కారణం మన జీవనశైలిలోని మార్పులే. దీనికి తోడు మన జీవితాల్లో పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్) కూడా మరో ప్రధాన కారణం. దీనివల్లనే హైబీపీ, డయాబెటిస్... మళ్లీ వీటివల్లనే కిడ్నీ జబ్బులు... ఇలా ఓ చైన్ రియాక్షన్లా కొనసాగుతున్నాయి. ఇవన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతున్నాయని గ్రహించి మన లైఫ్స్టైల్ను పునర్నిర్వచించుకొని హెల్దీ జీవనశైలిని అనుసరించాలి. -డాక్టర్ మల్లికార్జున ఎండీ అండ్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీమీరు బరువైతే గుండె చెరువేగుండెను అందరూ పదిలంగా చూసుకోవాల్సిన అవసరముంది. అందుకు కొన్ని సూచనలు... ⇒ మనం మన ఒత్తిడి (స్ట్రెస్)కి కారణమైన అంశాలని చెబుతున్న వాటిల్లో 90 శాతం అంశాలు అంతగా ఒత్తిడికి గురిచేసేవే కాదు. అసలు స్ట్రెస్ కంటే... మనం దానికి భయపడుతున్న తీరే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పరిష్కార మార్గాలు ఆలోచిస్తే స్ట్రెస్ దానంతట అదే తగ్గిపోతుంది. ⇒ మహిళలకు ప్రత్యేకంగా చెబుతున్న విషయమేమిటంటే... నిత్యజీవితంలోని ఒత్తిడి (స్ట్రెస్) పురుషులకంటే మహిళలకే ఎక్కువగా హాని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. మహిళలు ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం గుండెకు మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ వల్ల గుండెకు కలిగే రక్షణ తొలగిపోతుంది కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచుకుంటూ, సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరముంది.ఇందుకోసం చేయాల్సిన పనులూ సులువు కూడా. మొబైల్ ఫోన్ను పరిమితంగా వాడితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే టెలివిజన్కే అంటిపెట్టుకొని ఉండటం. ఒకేచోట కూర్చుని అదేపనిగా వీటిని వాడుతుంటే స్థూలకాయం వస్తుంది. ఇది కేవలం గుండెకే కాదు... అనేక ఆరోగ్య అనర్థాలకు కారణం. ఆరోగ్యకరమైనవి తింటూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉంటే కేవలం గుండెజబ్బులే కాదు... ఇతర వ్యాధులూ తగ్గుతాయి. -డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ హాస్పిటల్స్ఈ ఎన్ టీ ‘తల’మానికంమన ముక్కు చెవులనూ, అలాగే మన తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే మెడ... వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ చెవుల సంరక్షణ కోసం... ∙అతి భారీ శబ్దాలు వినికిడి సమస్యను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి. ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలాచేయడం వల్ల అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాకపోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. ఇక ముక్కు ఆరోగ్యం కోసం... ⇒ అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకునేందుకు నీళ్లు తాగుతూ హైడ్రేటిడ్గా ఉండాలి. ⇒ ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్లో మరీ ఎక్కువ) సెలైన్ నేసల్ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. గొంతు ఆరోగ్యం (థ్రోట్ హైజీన్) కోసం... ⇒ స్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్య మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. ⇒గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి చిట్కా. మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితో పాటు ఈ చలి సీజన్లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయని గ్రహించాలి. -డాక్టర్ ఈసీ వినయ కుమార్ హెచ్ఓడీ అండ్ సీనియర్ ఈఎన్టీ సర్జన్, అపోలో హాస్పిటల్స్ఇంటి పని ఒంటికి మంచిదిమంచి వ్యాయామంతో ఇటు కీళ్లూ, అటు గుండె రెండూ ఒకేసారి ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ వ్యాయామాలు చేయడానికి తమకు సమయం లేదంటూ చాలామంది చెబుతుంటారు. ఈరోజుల్లో కొన్ని ఇంటి పనులు అందరూ చేయాలి. ముఖ్యంగా ఇంట్లోని ఇల్లాళ్లతో పాటు ఇంటి మగవాళ్లు కూడా. ఉదాహరణకు... తోటపనీ, వస్తువులు తేవడం, లేవగానే బెడ్షీట్స్ మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం, తుడవడం ఇవన్నీ ఇంట్లోని మహిళలు చేయాల్సిన పనులుగా చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ ఇవన్నీ చేస్తే కీళ్లకు కదలికలు సమకూరి వాటి ఆరోగ్యం మెరుగుపడటం, పోషకాలు అందడం జరుగుతాయి. ఇవే పనులు గుండెజబ్బుల ముప్పునూ తప్పిస్తాయి. అంటే ఒకే పనితో ఎన్నో ప్రమోజనాలుంటాయి.ఉదా: క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె బలంగా అవుతుంది. (కీళ్లు కూడా) అంతేకాదు... పది లక్షల సార్లు గుండె కొట్టుకుంటే కలిగే శ్రమను ఒక్కసారి చేసే వ్యాయామం దూరం చేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఒత్తిడీ, నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. చాలామంది పురుషులు ΄పోగతాగడం, మద్యంతాగడం తమ జన్మహక్కుగా భావిస్తారు. పైగా కొద్దిపాటి మద్యం గుండెకు మేలు చేస్తుందని సమర్థించుకుంటారు. కానీ... ΄పోగ, మద్యం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరచడానికి కొత్త సంవత్సరాన్ని ఒక సందర్భంగా తీసుకుంటారు. మీ నిర్ణయం ఏదైనా... అంటే వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, ΄పోగ, మద్యం వంటి అలవాట్లు మానేయడం... ఇవన్నీ వాయిదా వేయకండి. ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో మొదలుపెట్టండి. -డాక్టర్ గాయత్రి కామినేని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్, కామినేని హాస్పిటల్స్డబ్బు జబ్బుకు ‘బీమా’త్రలుగత కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యాన్సర్లు అలాగే లైఫ్స్టెల్ డిసీజెస్ అని పిలిచే హైపర్టెన్షన్, డయాబెటిస్ వంటివి విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. జబ్బు వచ్చాక చికిత్స ఎలాగూ తప్పదు. ఇప్పుడు వీటి చికిత్సల గురించి ఆలోచించడం కంటే అసలివి రాకుండా ఉండేలా నివారణ చర్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇదో మంచి సమయం. ప్రస్తుత కాలం చాలా అనిశ్చితంగా ఉంది. మన ఆర్థిక పరిస్థితుల్లోగానీ రోజువారీ కార్యక్రమాల్లోగానీ ఎలాంటి మార్పులు వస్తాయో తెలియని అనిశ్చితి. అందుకే మున్ముందు మనందరి ఆరోగ్యాల రక్షణ కోసం, చికిత్సల కోసం మెడికల్ ఇన్సూ్యరెన్స్ను సిఫార్సు చేస్తున్నాను. మీతో పాటు మీ కుటుంబమంతటికీ ఇన్సూ్యరెన్స్ వచ్చేలా పాలసీ తీసుకోండి. క్యాన్సర్లు వస్తే అయ్యే ఖర్చులకు బెంబేలెత్తడం కంటే అవి రాకుండా నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలు చాలా సులువైనవి. సమాజంలోని అందరూ... ముఖ్యంగా నలభై దాటిన ప్రతివారూ తరచూ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అయితే ప్రస్తుతం సాంకేతిక మార్పులతో అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అయ్యే ఖర్చు తడిసిమోపెడు కానుంది. ఆ ఖర్చులు తట్టుకోవాలంటే ఇన్సూ్యరెన్స్ ఒక మార్గం. వాటితో పాటు మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తూ నివారించుకోవడం మరో మార్గం. ఈ రెండు మార్గాలను ఎంచుకుని మనల్ని మనం అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా కాపాడుకోవడం మన చేతుల్లో ఉన్న పని. - డాక్టర్ బి. కిశోర్రెడ్డి ఎండీ అమోర్ హాస్పిటల్స్, అండ్ చీఫ్ ఆర్థో ఆంకాలజిస్ట్ అమోర్ హాస్పిటల్ఆరోగ్యానికి బోన్.. మెయిన్ఒక భవనం పడిపోకుండా స్థిరంగా ఉండాలన్నా, ఈ దేహం ఒంగిపోకుండా నిటారుగా నిలబడాలన్నా... చిత్రంగా ఈ రెంటికీ అవసరమైనది క్యాల్షియమ్. దాదాపు 30 ఏళ్ల వయసులో ఇది గరిష్టంగా ఉండి, ఆ తర్వాత అనేక అంశాల కారణంగా ఇది కొద్దికొద్దిగా తగ్గుతూ పోతుంటుంది. అయితే దాన్ని మరింత కాలం నిలుపుకుంటూ దేహపు ఫ్రేమ్ వర్క్ అయిన ఎముకల సాంద్రతను (బోన్ డెన్సిటీని) గరిష్టకాలం పాటు నిలుపుకోవాలంటే చేయాల్సింది చాలా సులువైన పనులే. మంచి సమతులాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడం. ఎముకల ఆరోగ్యాన్నీ, సాంద్రతనూ నిలుపుకోవడానికి తీసుకునే ఆహారంలోనూ రుచికరమైనవే ఎక్కువ. ఉదాహరణకు పాలు, వెన్న లాంటి డెయిరీ ఫుడ్స్; చిక్కుళ్లు, బెండకాయ, క్యాబేజీ, బ్రాకలీ లాంటి రుచికరమైన కూరగాయలు; టేస్టీగా ఉండే అంజీర్ లాంటి ఎండుఫలాలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్తో పాటు చాలామంది టేస్టీగా ఫీలై తినే చేపలు. ఇవి ఎముకలతో పాటు మొత్తం దేహ సంపూర్ణ ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అయితే వ్యాయామాలు లేకుండా కేవలం ఆహారాలు మాత్రమే ఎముకల సాంద్రత పెంచలేవు. అందుకే... నడక వంటి తమకు అనువైన వ్యాయామాలతో పాటు శ్రమ ఎక్కువగా చేయలేనివారు నడకతో పాటు ఇతరులు సైక్లింగ్, జాగింగ్, ఈత, తమకు ఇష్టమైన స్పోర్ట్స్ ఆడటం వంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తుంటే ఎముకలలోని క్యాల్షియమ్ చాలాకాలం పదిలంగా ఉంటుంది. -డాక్టర్ సుధీర్రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్మార్క్ హాస్పిటల్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికీ దిక్కులేదు
సాక్షి, అమరావతి: రోగులకు అవసరమైన మందులన్నింటినీ బయట తెచ్చుకోవాలంటూ రాస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో ఉండటం లేదని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు దఫాలుగా బయటే కొంటున్నాను నేను వాచ్మెన్గా పని చేస్తుంటాను. నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. ఆ తర్వాత కాళ్ల నొప్పులు ఉన్నాయి. దీంతో తరచూ ఆస్పత్రికి చెకప్కు వస్తుంటాను. గడిచిన మూడు దఫాలుగా నొప్పులకు వాడే మందులు లేవని బయటకు రాస్తున్నారు. ఏం చేస్తాం? అతి కష్టంగా కొనుగోలు చేయక తప్పడం లేదు. – గోవింద్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు, విజయవాడమందులన్నీ బయటకే రాస్తున్నారు మా నాన్న తిరుపతికి షుగర్ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఉదయం నుంచి రాత్రి వరకు డాక్టర్లు చూస్తున్నా.. ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. మందులు ప్రతిదీ బయటకే రాస్తున్నారు. మందులకే రూ.1,800 ఖర్చు అయింది. సాయంత్రం 7.30 గంటలకు నమ్మకం లేదని చెప్పారు. పెద్దాస్పత్రిని నమ్ముకుని వస్తే రోగిని పట్టించుకోకపోవడం దుర్మార్గం. – క్రాంతి కుమార్, గద్వాలషుగర్, బీపీ బిళ్లలకూ కటకట⇒ బీపీ, షుగర్, గ్యాస్ వంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్ట్సార్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీíÙయా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక బయట కొనుగోలు చేయాలని రోగులపైనే భారం మోపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేస్తున్న రోగుల బంధువులు ⇒ గుంటూరు జీజీహెచ్లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటిబయోటిక్స్, ఇన్సులిన్ ఇంజెక్షన్లకు తీవ్ర కొరత ఉంది. పిప్లాజ్, మోరోపెనెమ్ వంటి మరికొన్ని యాంటి బయోటిక్స్, నెబులైజేషన్ మాస్క్లు, ప్లాస్టిక్ యాప్రాన్లు అందుబాటులో లేవు. మల్టీ విటమిన్ మాత్రలు ఉండటం లేదు. న్యూరో, కిడ్నీ, కార్డియాలజీ, పీడియాట్రిక్ విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. ఎముకలు, గైనిక్ విభాగాల్లో స్పైనల్ నీడిల్స్, రోగులకు నొప్పి నుంచి ఉపశమనం కల్పించే బుటోర్పనాల్, ఫెంటానిల్, మత్తు ఇచ్చే ఇంజెక్షన్ల కొరత ఉంది. ⇒ విజయవాడ జీజీహెచ్లో ఎగ్జామినేషన్ గ్లౌజ్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, బ్లడ్ థిన్నర్, నొప్పులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందులు, ఇంజెక్షన్ల కొరత వేధిస్తోంది. మెట్రోజిల్–400ఎంజీ, సిట్రిజన్ హెచ్సీఎల్ 10 ఎంజీ, క్లోరో ఫినరమైన్ హెచ్సీఎల్, బి.కాంప్లెక్స్, ఐరెన్ పోలిక్ యాసిడ్, నియోమైసిన్ టాబ్లెట్స్ కొరత ఉంది. నుప్రోసిన్, సిల్వర్ సల్పోడైజన్, పేరా మెట్రిన్, డైక్లో సోడియం ఆయింట్మెంట్లు లేవు. సిప్రో ప్లాక్సిన్, జెంటామైసిన్, జెంటాప్లాక్స్ డ్రాప్స్ లేవు. పాంటాప్ ఇంజక్షన్ల కొరత ఉంది. డెలివరీ సర్జరీలకు, ఆపరేషన్ సమయంలో అవసరమైన మందులను, కిట్లను రోగులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుక్కు రావాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా ఆస్పత్రిలో ఫ్లూ్కనజోల్, హైవిస్కిన్ బ్యూటైల్ బ్రోమైడ్, లంబార్ పంక్చర్ (ఎల్పీ సూది), ఎల్పీ నీడిల్, విటమిన్ కే 1 ఇంజెక్షన్తో పాటు పలు యాంటీబయోటిక్స్ అందుబాటులో లేవు. లివర్ సిర్రోసిస్ రోగులకు వాడే బిలిరుబిన్ ఇంజక్షన్ కొరత ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు ఇచ్చే థ్రోంబలైజ్ ఇంజక్షన్స్ అందుబాటులో లేవు. ఇవన్నీ రోగులు బయటే కొంటున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజిలు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్షీట్స్, బెటాడియన్ సొల్యూషన్ కొరత ఉంది. ప్రోఫ్లాక్సిన్, గెటిఫ్లానిక్స్, జెంటామైసిన్, మాక్సీఫ్లాక్సిన్, మానసిక జబ్బులకు సంబంధించిన అమిజుల్రీ్ఫడే –200 ఎంజీ, లిథియం 450 ఎంజీ, క్వటియాపైన్ 25 ఎంజీ, క్లోజాఫైన్ 50 ఎంజీ, క్లోణజపం 0.5 ఎం.జీ., లోరాజెపామ్ 2 ఎం.జీ. మాత్రలు స్టాక్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పాంటాప్ మాత్రలు కూడా లేవు.⇒ విశాఖ కేజీహెచ్లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో ఉండటం లేదు. విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ ఆస్పత్రి, రాణి చంద్రమతిదేవి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ మందుల కొరత ఉంది. దెబ్బలు తగిలిన వారికి డ్రెస్సింగ్ చేయడానికి కిట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇన్సులిన్, ఫిట్స్ నివారణ కోసం వాడే మందులు, అన్ని రకాల బ్లీడింగ్ నివారణకు వాడే మందులు, పలు రకాల యాంటి బయోటిక్స్, హిమోగ్లోబిన్ పెంచే మందులు, వెంటిలేటర్స్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, కార్డియాలజీ సమస్యలకు వాడే మందుల కొరత తీవ్రంగా ఉంది. కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, తిమ్మిర్ల నియంత్రణ, రుతుక్రమంలో వచ్చే లోపాల నియంత్రణ, ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం, మలబద్ధకం, గాయాలు మానడం కోసం వాడే మందులు, గర్భాశయ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన మందుల కొరత వేధిస్తోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి. ⇒ కర్నూలు జీజీహెచ్లో యాంటిబయోటిక్స్ కొరత ఉంది. కార్డియాలజీ, న్యూరో, ఇతర సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. ⇒ కడప రిమ్స్లో అధిక రక్తపోటు బాధితులు వాడే రామిప్రిల్, అమాక్సిలిన్ 500 ఎంజీ, డోపామైన్ వంటి చాలా రకాల మందుల సరఫరా ఆగిపోయింది. రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ చేతిలో పట్టుకున్న ఈ వ్యక్తి పేరు వందనం. కృష్ణా జిల్లా సగ్గూరు స్వస్థలం. కూలి పనులే జీవనాధారం. కొద్ది రోజుల క్రితం ఇతని భార్యకు తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు పెట్టి చికిత్స చేయించే స్తోమత లేక ఉచిత వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్కు వచ్చారు. ఏవో పరీక్షలు చేయాలని.. ఆస్పత్రి బయట మెడికల్ స్టోర్లో రక్త నమూనాలు సేకరించే ట్యూబ్స్ కొనుక్కుని రావాలని సిబ్బంది చీటి రాసిచ్చారు. ఖర్చుల కోసం ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులో కేవలం రూ.వంద మాత్రమే అతని జేబులో ఉంది. ఆ డబ్బులోంచి మెడికల్ స్టోర్లో ట్యూబ్స్ కొనుకున్నాడు. ‘ఉచితంగా చికిత్స చేస్తారని పెద్దాస్పత్రికి వచ్చాం. ఇక్కడేమో మా చేతి నుంచే అవి కొనండి.. ఇవి కొనండి... అని చెబుతున్నారు. ఏం ఉచిత వైద్యమో.. ఏమో..’ అని వందనం ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంజక్షన్లకు రోజుకు రూ.2 వేలు మా నాన్న ఆళ్ల పెంటారావుకు కాలు, చేయి పడిపోవడంతో విజయవాడ ఆస్పత్రికి తీసుకొచ్చాం. డాక్టర్లు పరీక్షించి పెరాలసిస్ అని నిర్ధారణ చేశారు. ఇంజక్షన్లు, మందుల కొరత తీవ్రంగా ఉండటంతో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. పిరాసెటమ్ ఇంజక్షన్, సిటికొలైన్ ఇంజక్షన్లు, లెవోకార్టినిటైన్ టాబ్లెట్స్, మొడాఫినైల్ టాబ్లెట్స్ ఇక్కడ ఆస్పత్రిలో లేకపోవడంతో రోజుకు రూ.2 వేలు పెట్టి బయట కొంటున్నాం. – ఆళ్ల మహేష్, సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా ఈ ఫొటోలో కనిపిస్తున్న బాలింత పేరు జ్యోతి. అనంతపురం జిల్లా యాడికి మండలం వెంకటాంపల్లి గ్రామం. బత్తలపల్లి ఆస్పత్రిలో సిజేరియన్ జరిగిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. వైద్యం అందించడంలో భాగంగా గైనిక్ వైద్యులు.. పారాసిటమాల్ ఇంజెక్షన్లు, థైరోనార్మ్, పారాసిటమాల్ ఇన్ఫ్యూషన్ ఐపీ తదితరాలు కావాలని చెప్పారు. సర్వజనాస్పత్రిలో అవి లేకపోవడంతో గత్యంతరం లేక జ్యోతి కుటుంబీకులు బయట ప్రైవేట్ మందుల షాపులో కొనుగోలు చేశారు. రూ.2 వేల వరకు ఖర్చు అయ్యింది. మచిలీపన్నానికి చెందిన ఎం.కామేశ్వరరావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం చికిత్స కోసం గర్భిణి అయిన కుమార్తెను వెంట బెట్టుకుని విజయవాడ జీజీహెచ్కు వచ్చాడు. ఆస్పత్రికి రాకముందు 5గా ఉన్న అతడి క్రియాటిన్ లెవెల్, ఇప్పుడు 6.5 దాటింది. ఆస్పత్రిలో చూపించుకుంటే నోడోసిస్, ఆర్కామిన్ వంటి మాత్రలను బయట తెచ్చుకోవాలని రాశారు. సమస్య ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇక ఇంటికి వెళ్లిపోవాలంటూ వైద్యులు డిశ్చార్జి రాశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్గా పనిచేసే కామేశ్వరరావు కుమార్తె సిబ్బందితో వాదించింది. సమస్య తగ్గకుండానే ఎలా డిశ్చార్జి చేస్తారని ప్రశ్నించడంతో డిశ్చార్జి చేయలేదు. ఆ తర్వాత మలబద్ధకం నివారణ కోసం ప్రోక్టోలిసిస్ ఎనిమా 100 ఎంఎల్ బయట తెచ్చుకోవాలని చీటి రాసిచ్చారు. ‘వచ్చిన రోజు నుంచి మందులు బయట తెచ్చుకోవాలని చీటిలు రాసిస్తున్నారు. మందులు ఎలాగోలా తిప్పలు పడి కొనుగోలు చేస్తాం. వార్డుల్లో రోగులను పట్టించుకుంటే చాలు. ఇక్కడికి వచ్చాక మా నాన్నకు జబ్బు తగ్గాల్సింది పోయి... పెరిగింది’ అని కామేశ్వరరావు కుమార్తె వాపోయింది. -
గత సర్కారు ముందుచూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు చెక్ పెట్టడం కోసం 2019–24 మధ్య ఏకంగా 54 వేల వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది.ప్రివెంటివ్ కేర్లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్ల(ఎంవో)కు గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని 22.30 శాతం మేర ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా, కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్ర మే ఉన్నట్టు స్పష్టమైంది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది.ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమలు చేసింది. మరోవైపు పట్టణ పీహెచ్సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. కేరళ రాష్ట్రంలోని గ్రామీణ పీహెచ్సీల్లో సైతం 5.22 శాతం ఎంవోల కొరత ఉంది. కర్ణాటకలో 14.21 శాతం, తమిళనాడులో 11.58, తెలంగాణలో 36.27 శాతం మేర వైద్యుల కొరత ఉంది.ఉత్తరాదిలోని యూపీలో ఏకంగా 36.44 శాతం, బిహార్లో 34.62, గుజరాత్లో 17.69 శాతం వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో దేశం మొత్తం 46,692 నర్సు పోస్టులకు గాను 10,814 పోస్టులు(23.16 శాతం) ఖాళీగా ఉన్నాయి. యూపీలో 64.94 శాతం, బిహార్లో 35.59 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. ఏపీలో 4.74 శాతం పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నాడు ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ⇒ 2019–24 మధ్య వైద్యశాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఉద్యోగ విరమణలు, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ⇒ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలను ఇచ్చి మరీ పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు 61 శాతం దేశవ్యాప్తంగా కొరత ఉండగా, రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉండేది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులను సైతం అందుబాటులో ఉంచింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడించింది. దీంతో వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ అవ్వక ప్రజలకు వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
నిద్రలో పళ్ల సెట్ మింగిన విశాఖపట్నం వాసి
సాక్షి, విశాఖపట్నం: పళ్లు బాగా కదులుతున్నప్పుడు.. దంత వైద్యులు వాటిని తీసి, వాటి బదులు కృత్రిమ దంతాలు అమరుస్తారు. అలా అమర్చిన దంతాలు నిద్రలో ఉండగా ఊడిపోగా.. వాటిని మింగేశారో వ్యక్తి! అవి వెళ్లి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషయం గురించి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సీహెచ్ భరత్ తెలిపారు.“విశాఖపట్నానికి చెందిన 52 ఏళ్ల ఉద్యోగి సుమారు రెండు మూడేళ్ల క్రితం పళ్లు కట్టించుకున్నారు. దంతవైద్యులు ఆయనకు ఎప్పటికీ అతుక్కునే ఉండే పళ్ల సెట్ అమర్చారు. అయితే, అవి కూడా అప్పుడప్పుడు ఊడే ప్రమాదం ఉంటుంది. ఈయన నిద్రలో ఉన్నప్పుడు అలాగే అది ఊడిపోయింది. అప్పుడు ఆయన తెలియకుండానే దాన్ని మింగేయడంతో అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయింది.కుడి ఊపిరితిత్తి మధ్యభాగంలో ఇది ఇరుక్కుంది. అయితే అదే సమయంలో ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా పనిచేస్తుండడం, కుడి ఊపిరితిత్తిలోనూ పైన, కింది భాగాలు పనిచేయడంతో శ్వాస సంబంధిత సమస్యలు రాలేదు గానీ, లోపల ఫారిన్ బాడీ ఉండడంతో బాగా దగ్గు వచ్చింది. దీంతో రోగి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆయనకు ముందుగా ఎక్స్ రే, తర్వాత సీటీ స్కాన్ చేసి చూస్తే.. కుడివైపు ఊపిరితిత్తిలో పళ్ల సెట్ ఉందని తెలిసింది. దాంతో ఆయనకు జనరల్ ఎనస్థీషియా ఇచ్చి, రిజిడ్ బ్రాంకోస్కొపీ అనే పరికరం సాయంతో అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాం. దానికి రెండువైపులా లోహపు వస్తువులు ఉండడంతో వాటివల్ల ఊపిరితిత్తులకు గానీ, శ్వాస నాళానికి గానీ ఏమైనా గాయం అవుతుందేమోనని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది. ఒకవేళ అలా గాయమైతే అక్కడినుంచి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు దాదాపు నోటివరకు వచ్చిన తర్వాతే చిన్న గాయం అయ్యింది, దాన్ని కూడా వెంటనే సరిచేయడంతో ఎలాంటి ఇబ్బంది కాలేదు. పెద్ద పరిమాణంలో ఉండి, వంపుతో ఉన్న, పదునైన వస్తువులను తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కొపీ బాగా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఊరికి బంధువులొస్తున్నారుసాధారణంగా మన శరీరంలో ఏదైనా వస్తువు ఎక్కడైనా అమర్చాల్సి వస్తే.. అలాంటి వాటికి కొంత జీవనకాలం ఉంటుంది. ఆ తర్వాత అవి ఎంతో కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల అలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేతప్ప, ఒకసారి వేశారు కాబట్టి జీవితాంతం అవి అలాగే బాగుంటాయని అనుకోకూడదు. ముఖ్యంగా పళ్ల సెట్ కట్టించుకునేవారు ఎప్పటికప్పుడు దంతవైద్యులను సంప్రదిస్తూ దాన్ని చూపించుకోవాలి. ఇలా నిద్రలో మింగేసి, అది ఎక్కువకాలం ఉండిపోతే లోపల దానిచుట్టూ కండ పెరిగిపోయి, ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ భరత్ తెలిపారు. -
Year Ender 2024: గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్.. నిత్యం ఇవే వార్తలు
హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హృద్రోగాల బారినపడి ఏటా లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2024 కూడా గుండె ఆరోగ్యానికి సవాలుగా నిలిచింది. గుండెపోటు, గుండె ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది లక్షలాదిమంది మృతిచెందారు.కరోనా మహమ్మారి తర్వాత భారత్లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో గుండె జబ్బులు అధికంగా నమోదవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. 2024లో తీవ్రమైన గుండె సమస్యల కారణంగా మన దేశంలో లక్షలాది మంది మృతిచెందారు. 2024, ఫిబ్రవరి 20న ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ (59) గుండెపోటుతో మరణించారు. రితురాజ్.. హిట్లర్ దీదీ తదితర టీవీ షోలలోనటించారు. అదేవిధంగా నటి కవితా చౌదరి కూడా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె ఉడాన్ తదితర సీరియళ్లలో నటించారు. టీవీ నటుడు, మోడల్ వికాస్ సేథి కూడా 48 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో కన్నుమూశారు.గుండెపోటుతో పాటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు ఈ ఏడాది అందరిలోనూ ఆందోళనను పెంచాయి. 2024 జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను చూసేందుకు వచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అధ్యక్షుడు అమోల్ కాలే(47) గుండెపోటుతో మరణించారు. కాగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనేవి రెండు వేర్వేరు స్థితులు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో అడ్డంకి ఏర్పడిన కారణంగా, గుండెకు రక్త ప్రసరణ అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో గుండెపోటు వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ స్థితిలో గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది.కరోనా ఇన్ఫెక్షన్, మరణాల ముప్పును తగ్గించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషించింది. అయితే ఈ టీకా గుండెపోటుతో పాటు మరణాల కేసులు పెరిగాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవని, ఎలాంటి సమస్యలు తలెత్తవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని, అందుకే ముందస్తుగా గుండెపోటు వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెపోటు వచ్చిన బాధితునికి వెంటనే సీపీఆర్ అందించడం ద్వారా అతని ప్రాణాలు కాపాడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. గుండె జబ్బుల ముప్పును నివారించడానికి సరైన జీవనశైలిని అనుసరించడం, పోషక ఆహారాన్ని తీసుకోవడం రక్తపోటును, షుగర్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై కారు అదుపు తప్పి డివైడర్ను దాటి, అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఓ వివాహ వేడుకకు హాజరైన వైద్య విద్యార్థులు కారులో సైఫాయికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.మృతుల్లో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మొరాదాబాద్లోని బుద్ధ విహార్కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..
ఒక కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కష్టం. అలాంటిది ఒక కుటుంబంలో మొత్తం 140 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. ఇలా ఎక్కడోగానీ జరగదు. తరతరాలు ఓకే వృత్తిని కుటుంబ వారసత్వంగా కొనసాగిస్తూ.. ప్రతి తరంలో ఒక వ్యక్తి దాన్ని అనుసరించడం విశేషం. ఇలా ఐదు తరాలు వైద్య వృత్తినే అనుసరించారు. ఆ ఇంటికి వచ్చిన కోడలు కూడా డాక్టరే అయ్యి ఉండాలట. అంతేగాదు ఐదు తరాలుగా ప్రతి ఒక్క సభ్యుడు డాక్టర్గా ఉన్న ఏకైక కుటుంబంగా అరుదైన రికార్డుని దక్కించుకుంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..డిల్లీకి చెందిన సబర్వాల్ కుటుంబం ఈ ఘనతను దక్కించుకుంది. ఇదంతా వారి ముత్తాత లాలా జీవన్మల్ నుంచి మొదలయ్యిందని డాక్టర్ రవీంద్ర సబర్వాల్ చెబుతున్నారు. లాహోర్లో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్న లాలా జీవన్ముల్ ఒకరోజు మహాత్మా గాంధీ ఆరోగ్యం, విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటం విన్నాడట. ఇక అప్పుడే ఆయన ఆస్పత్రిని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట. అంతేగాదు తన నలుగురు కుమారులు బోధిరాజ్, త్రిలోక్ నాథ్, రాజేంద్ర నాథ్, మహేంద్ర నాథ్ లను మెడిసిన్ చదివించాలని భావించాడట. అలా వారి కుటుంబంలో 1902లో తొలి డాక్టర్గా బోధిరాజ్ ఈ వృత్తిని చేపట్టారు. అదే ఏడాది పాకిస్తాన్లోని జలాల్పూర్ జట్టన్లో జీవన్ ఆసుపత్రిని నిర్మించారు. ఆయన అక్కడ వైద్యుడిగా సేవలందించారు. అప్పటి నుంచి ఈ వృత్తిని కుటుంబంలోని తదుపరి తరం చేపట్టాలని, అలాగే వైద్య విద్యనభ్యసించిన వధువునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విభజన సమయంలో లాహోర్ నుంచి ఢిల్లీకి తరలి వెళ్లాల్సి వచ్చింది ఈ కుటుంబం.ప్రస్తుతం ఢిల్లీలో ఆ కుటుంబానికి మొత్తం ఐదు ఆస్పత్రులు ఉన్నాయి. అంతేగాదు కరోల్ బాగ్, ఆశ్రమం, వసంత్ విహార్లో వాటికి సంబంధించిన వివిధ శాఖలు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి తరం డాక్టర్ కావడంతో ఆస్పత్రి కారిడార్ కూడా పెరుగుతూ వచ్చింది. అంతేగాదు ఆ కుటుబంలోని తొలి డాక్టర్ భోధిరాజ్ హయాం నుంచి.. తర్వాతి తరం మెడిసిన్ నాల్లోవ సంవత్సరం చదువుతుండగానే.. ఒక సరికొత్త స్టెతస్కోప్ను అందజేయడం ఆచారంగా పాటిస్తారట. దీన్ని వాళ్లు ఆశీర్వాదంగా భావిస్తారట. ఈ మేరకు నేత్ర నిపుణుడు డాక్టర్ వికేష్ సబర్వాల్ మాట్లాడుతూ..డాక్టర్ బోధిరాజ్ కుటుంబ సభ్యులందర్నీ వైద్యులుగా తీర్చిదిద్దేలా గట్టిగా కృషి చేశారని చెప్పారు. తమకు అరటిచెట్టుకు ఇంజెక్షన్లు ఇవ్వడం నుంచి ప్రాక్టీస్ చేయించినట్లు తెలిపారు. ఆఖరికి డిన్నర్ టేబుల్ సంభాషణల్లో కూడా ఆస్పత్రి గురించే మాట్లాడటం, చర్చలు జరుగుతాయని అన్నారు. అలాగే తమ పిల్లలు ఆపరేషన్ థియేటర్ లోపలే హోంవర్క్లు చేస్తారని గర్వంగా చెప్పారు. ప్రమాద బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలియగానే తమ కుటుంబం అప్రమత్తమైపోతుందని చెబుతున్నారు. ఎవ్వరూ వ్యతిరేకించ లేదా..?కుటుంబంలో ప్రతి ఒక్కరినీ డాక్టర్గా మార్చే నినాదాన్ని ఎవ్వరు వ్యతిరేకించి లేదా అంటే..? వారి ఆలోచనని మార్చడంలో కుటుంబం పూర్తిగా విజయం సాధించిందని అంటారు ఆ కుటుంబ సభ్యులు. ఎవ్వరైనా తాము వేరే కెరీర్ని ఎంచుకుంటాం అనగానే కుటుంబ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారట. అదికూడా ఆస్పత్రిలోనే సమావేశమై నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తామని చెబుతోంది ఆ కుటుంబం. ఇక కుమారుల్లో ఒకరు బయోకెమిస్ట్ చేసిన భార్యను వివాహం చేసుకుంటే..ఆమెను పదేపదే మెడిసిన్ చదవమని చెప్పడంతో..ప్రస్తుతం ఆమె అమెరికాలో డాక్టర్గా స్థిరపడిందని చెబుతున్నారు నాలుగోతరం కోడలు డాక్టర్ గైనకాలజిస్ట్ శీతల్. ఇక ఆ కుటుంబంలోని ఆరవతరం సమర్వీర్ అనే 11 ఏళ్ల బాలుడు కూడా తనని తాను డాక్టర్ సమర్వీర్గా పరిచయం చేసుకోవడం విశేషం. అయితే తమ కుటుంబంలోని ఆరవ తరం దియా సబర్వాల్ అనే 21 ఏళ్ల అమ్మాయి తమ కుటుంబ వారసత్వ వృత్తికి విరుద్ధమైన రంగాన్ని ఎంచుకుని ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్లలో డబుల్ డిగ్రీని పూర్తి చేసిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అలాగే 16 ఏళ్ల ఆర్యన్ కూడా ఇలానే వేరే రంగం(క్రికెట్) అంటే మక్కువ..కానీ నానమ్మ కుటుంబ వారసత్వం వృత్తినే ఎంచుకోమని బలవంతం చేస్తోందని చెబుతున్నాడు. ఇలా ఒక నినాదంతో కుటుంబం అంతా ఒక తాటిపై నిలబడి ఆ వృత్తినే చేపట్టడం అంత ఈజీ కాదు కదా..!.(చదవండి: తొలిసారిగా వృద్ధుడికి ట్రిపుల్-ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్..!) -
గం‘జాయింట్’గా కొడదామా?
‘హాయ్ మామా.. బాగా గ్యాప్ వచ్చింది. జాయింట్ కొడదాం పద..’.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మాటలివి..‘ఏం స్ట్రెస్రా బాబూ ఇది. టార్గెట్లతో తలపగిలిపోతోంది. చలో బయటికి వెళ్లి కాస్త స్కోర్ చేసొద్దాం’.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంభాషణ ఇది.... వాళ్లు ఏదో టీ తాగడానికో, టిఫిన్ చేయడానికో వెళ్లడం లేదు. గంజాయి తాగేందుకు వెళదామని కోడ్ భాషలో చెప్పుకొంటున్నారు. ఇక్కడా, అక్కడా అని కాదు హైదరాబాద్ మహా నగరంలో చాలా చోట్ల ఈ గంజాయి కల్చర్ కనబడుతోంది. కొందరిలో ఇదో సోషల్ స్టేటస్గా మారింది. నగరంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వివిధ పోలీసు విభాగాల మధ్య కొరవడిన సమన్వయాన్ని గంజాయి విక్రేతలు ఆసరాగా తీసుకుని, మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సాక్షి, హైదరాబాద్: గంజాయి మహమ్మారి రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ మత్తుకు బానిస అవుతున్న వారి జాబితా క్రమంగా పెరుగుతోంది. గతంలో కొన్నివర్గాలకే పరిమితమైన గంజాయి.. ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దాకా పాకింది. పెద్ద పెద్ద ఆస్పత్రుల వైద్యులు సైతం గంజాయి మత్తుకు బానిస అవుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి చెందిన కొందరు వైద్యులు గంజాయి వాడుతున్నట్టు తెలియడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మందలించి వదిలేయడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించింది. మత్తు దందాలపై ఉక్కుపాదం మోపాలని పోలీస్, ఎక్సైజ్, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు బహిరంగంగానే ఆదేశాలు జారీ చేశారు. కానీ వివిధ విభాగాల మధ్య తగిన సమన్వయం లేకపోవడం, కొందరు అధికారులు దీనిని సీరియస్గా తీసుకోకపోవడం, గంజాయి సరఫరా దారులు కొత్తకొత్త మార్గాలు అనుసరిస్తూ, వినియోగదారులనే విక్రేతలుగా మారుస్తుండటం వంటివి గంజాయి దందా యథేచ్ఛగా సాగిపోవడానికి దారితీస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వాడుతున్న వారి సంఖ్య 10లక్షల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. దందాలోకి దిగుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి వాడకం క్రమంగా పెరుగుతోంది. తొలుత ఒకరిద్దరితో మొదలయ్యే ఈ వ్యసనం స్నేహితుల మధ్య విస్తరిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్లకు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం గంజాయి విక్రేతలుగా మారుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలకు ఒకింత తలనొప్పిగా మారింది. ఈజీ మనీకి గంజాయి మార్గం! చాలా మంది కష్టపడకుండా డబ్బులు వస్తుండటంతో (ఈజీ మనీ) గంజాయి అమ్మకాలకు దిగుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల (ఏఓబీ)కు వెళితే ఏడెనిమిది వేల రూపాయలకే రెండు కిలోల గంజాయి దొరుకుతుంది. దాన్ని హైదరాబాద్ వరకు తెస్తే.. ఆ రెండు కిలోల ప్యాకెట్ రూ.15 వేలకు కొంటారు. అదే ఒక్కో కిలో గంజాయిని 10 గ్రాముల చొప్పున 100 ప్యాకెట్లు చేసి.. ఒక్కో ప్యాకెట్ను రూ.300 చొప్పున అమ్ముతారు. అంటే కిలోకు రూ.30 వేలు వస్తాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్ను రూ.15 వేలు పెట్టి కొంటే.. దాన్ని విక్రయించడం ద్వారా..రూ.45 వేలు మిగిలించుకుంటారు. ఇలా ఈజీ మనీ కోసం కొందరు గంజాయి అమ్మకంలోకి దిగుతున్నారు. నియంత్రణపై హడావుడికే పరిమితం హైదరాబాద్లో గంజాయికి ప్రధానంగా ధూల్పేట్, నానక్రామ్గూడ, సీతాఫల్మండి, ఫతేనగర్ హబ్లుగా ఉండేవి. ఇప్పుడు చాలా ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. అంగోరి భాయ్, గాంజా కిశోర్, సునీతభాయ్, ముఖేశ్సింగ్, దీపు, సట్టా కిశోర్, రౌడీ గోపాల్, రౌడీ విశాల్ వంటి 25 మంది వరకు గంజాయి విక్రేతలు ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. వారు 30, 40 కిలోల చొప్పున గంజాయి తెప్పించి.. రిటైల్గా విక్రయించేవారికి సరఫరా చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు సమాచారం అందుతున్నా పైపైన హడావుడికే పరిమితం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గంజాయి కట్టడిలో టీజీ నార్కోటిక్స్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వంటి విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా గంజాయి స్మగ్లర్లకు కలిసి వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఓబీ టు నార్త్ ఇండియా.. వయా తెలంగాణ! ఏఓబీ (ఆంధ్రా– ఒడిశా బార్డర్), ఛత్తీస్గఢ్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో పండించే గంజాయిని.. ఉత్తర భారతదేశంతోపాటు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు తెలంగాణ కారిడార్గా మారిందనే విమర్శలు ఉన్నాయి. స్మగ్లర్లు రైలు, రోడ్డు మార్గాల్లో పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ రవాణా చేస్తున్నారు. టీజీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, స్థానిక పోలీసులు, డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో తరచూ గంజాయి పట్టుబడుతోంది. ఇలా పట్టుబడుతున్నది స్వల్పమేనని, అంతకు ఎన్నో రెట్లు తరలుతోందని సమాచారం. ఇక వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ గంజాయి ఏజెంట్లు నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారని.. వారి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని తెలిసింది. డ్రగ్స్పై ఫోకస్ పెరగడంతో గంజాయి వైపు.. కొకైన్, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్, ఎక్సైజ్ ఫోకస్ పెరగడంతో.. చాలా మంది తక్కువ ధరకు, వెంటనే అందుబాటులో ఉండే గంజాయివైపు దృష్టి పెడుతున్నారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని లేబర్ కాలనీలు, రాజీవ్ గృహకల్ప, సైదాబాద్లోని సింగరేణి కాలనీ, ధూల్పేట్, జీడిమెట్ల, చింతల్, సూరారం కాలనీ, దుండిగల్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లో గంజాయి వాడకం విస్తృతంగా పెరిగింది. గోల్కొండ, లక్ష్మీనగర్, ఎల్బీనగర్లతోపాటు హాస్టళ్లు ఎక్కువగా ఉన్న అమీర్పేట్, ఎస్సార్నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్రోడ్, ఇతర పార్కులు వంటి చోట్ల గంజాయి విక్రయాలు సాగుతున్నట్టు తెలిసింది. శిక్షల భయం లేకపోవడంతో.. గంజాయి కేసులలో నిందితులపై శిక్షలు సరిగా లేకపోవడంతో వారిలో భయం ఉండటం లేదన్న వాదనలు ఉన్నాయి. కిలోకుపైన గంజాయి పట్టుబడితేనే దాన్ని కమర్షియల్ క్వాంటిటీగా గుర్తిస్తారు. ఆ కేసులలోనే కఠిన శిక్షలుంటాయి. ఈ క్రమంలోనే గంజాయి సప్లయర్లు చిన్నచిన్న ప్యాకెట్లలో విడివిడిగా సరఫరా చేస్తున్నారు. వారు పట్టుబడినా బలమైన కేసులు ఉండటం లేదు. సరైన దర్యాప్తు లేని కారణంగా కూడా చాలా వరకు కేసులు వీగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులకు చిక్కిన గంజాయి విక్రేతలు.. బెయిల్పై వచ్చాక మళ్లీ దందా మొదలుపెడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ నేరం చేస్తున్నవారిపై పీడీ యాక్ట్ తరహాలో.. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్’ చట్టాన్ని నమోదు చేస్తున్నారు. దీనితో రెండేళ్ల వరకు బెయిల్ లభించే అవకాశం ఉండదు. అంతేగాక స్థానిక కోర్టుల అనుమతితో ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ (సఫెమా)’ ప్రయోగించేందుకూ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. దోషులుగా తేలినవారి ఆస్తులను జప్తు చేయవచ్చు. గతేడాది నమోదైన నాలుగు కేసుల్లో నిందితులకు చెందిన రూ.8 కోట్లు విలువైన ఆస్తులను టీన్యాబ్ జప్తు చేసింది. గంజాయి చాక్లెట్లు... రాజస్థాన్, ఒడిశా నుంచి గాంజా, బంగ్ చాక్లెట్లు హైదరాబాద్ వస్తున్నాయి. కూరగాయలు, పండ్ల రవాణా వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. ఒక్కో చాక్లెట్ను రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ టీమ్ 5 కిలోల బరువు గల 2,000 గాంజా బంగ్ చాక్లెట్స్ స్వా«దీనం చేసుకుంది. నాలుగు కేసులు రిజిస్టర్ చేసింది. -
Supreme Court: దుష్ప్రభావాలు రాయడం కుదరదు
న్యూఢిల్లీ: ఆయా ఔషధాల సైడ్ఎఫెక్ట్లనూ మందుల చీటీలో పేర్కొనేలా వైద్యులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జాకబ్ వడక్కన్చెరీ అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ను దాఖలుచేశారు. ‘‘రోగులకు వైద్యులు సూచించిన ఔషధం గురించి, దాని సానుకూల ప్రభావంతోపాటు దుష్ప్రభావాలపైనా అవగాహన ఉండాలి. ఆ మేరకు వైద్యులు మందుల చీటీలో వాటిని తప్పకుండా ప్రస్తావించాలి’అంటూ జాకబ్ వేసిన పిటిషన్ను మే 15వ తేదీన ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ప్రతి చీటీపై ప్రతి ఒక్క మందు సైడ్ఎఫెక్ట్లను రాయడం ఆచరణలో సాధ్యంకాదు. ఒకవేళ రాస్తూపోతే వైద్యుడు ఒకరోజుకు పది, పదిహేను మందికి మించి చూడలేదు. చివరకు వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదయ్యే ఛాన్సుంది ’’అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘దుష్ప్రభావాలపై ముందే హెచ్చరిస్తే మంచిది. లేదంటే అవన్నీ వైద్యసేవల్లో నిర్లక్ష్యం లెక్కలోకి వెళ్తాయి. ముందుగా వైద్యులు తమ వద్ద ఉదాహరణలతో కూడిన నమూనాపత్రాన్ని ఉంచుకుంటే మంచింది’అని వాదించారు. ‘‘అలా చేస్తే దాని విపరిణామాలు పెద్దవై చివరకు వైద్యులకు కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కష్టాలు పెరుగుతాయి. మేం అలా చేయలేం’’అంటూ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. -
‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!
కుటుంబంలో ఒకరు డాక్టర్ అవడం సాధారణంగా చూస్తుంటాం. ఇద్దరు డాక్టర్లు ఉండటమూ మనకు తెలుసు. ఆ ఇంట్లో మాత్రం నలుగురు కుమార్తెలూ డాక్టర్లే! టైలరింగ్ చేస్తూ కూతుళ్లను డాక్టర్లు చేయడానికి తపించారు రామచంద్రం – శారద దంపతులు. వారి కలలు నిజమై ఇప్పుడు ఆ ఇల్లే వైద్యుల నిలయంగా మారి΄ోయింది. సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్కు చెందిన కొంక రామచంద్రం (శేఖర్), శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. రామచంద్రం – శారద టైలరింగ్ చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. ఇదంతా సాధారణమే! కానీ వీరి నలుగురు కుమార్తెలు డాక్టర్లే కావడమే విశేషం. ఒకరు వైద్యవిద్య పూర్తిచేయగా, మరొకరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. ఇంకో ఇద్దరు కుమార్తెలు ఈ ఏడాది మెడిసిన్లో సీట్లు సాధించారు. ‘నలుగురు కూతుళ్లేనా..’ అని హేళనలు ఎదుర్కొన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తమ పిల్లల ఎదుగుదలను చూసి గర్వపడుతున్నారు.ఒక్కరైనా డాక్టర్ కావాలని..రామచంద్రం, శారద ఇద్దరూ కలిసి రోజంతా కష్టపడితే రూ.800 వస్తుంది. దీంతో వారి కుటుంబం గడవడమే కష్టమైనా నలుగురు పిల్లలను చక్కగా చదివించాలని తపించారు. రామచంద్రం సోదరుడు రాజు 1992లో ఫిట్స్తో మృతిచెందగా, రామచంద్రం 14 ఏళ్ల వయసులో ఆయన తల్లి మల్లవ్వ గొంతు కేన్సర్తో మరణించింది. సరైన సమయంలో తాము గుర్తించక΄ోవడంతోనే సోదరుడు, తల్లిని కోల్పోవాల్సి వచ్చిందని... కుటుంబంలో ఒక్కరికైనా డాక్టర్ అయి ఉంటే వాళ్లు బతికేవారని అనుకునేవాడు. నలుగురు కూతుళ్ల లో పెద్ద కూతురు మమత ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆ తర్వాత ఆమె చెల్లెళ్లూ అదే బాట పట్టారు.చదువులోనూ కవలలే..రోహిణి, రోషిణి ఇద్దరు కవలలు... 2023 నీట్ రాసిన రోహిణి 443(పెద్ద కూతురు), రోషిణి 425(చిన్న కూతురు) మార్కులు సాధించారు. రోహిణికి ఓ ప్రై వేట్ మెడికల్ కళాశాలలో సీటు వచ్చినా చెల్లి రోషిణికి సీటు రాక΄ోవడంతో ఒత్తిడికి గురవుతుందని అక్క సీటు వదులుకుంది. ఆపై ఇద్దరు లాంగ్టర్మ్ శిక్షణతో ప్రిపేర్ అయ్యారు. దీంతో 2024 నీట్లో రోహిణి 536 మార్కులు, రోషిణి 587 మార్కులు సాధించారు. ఇప్పుడు రోషిణికి(చెల్లి) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకేదగ్గర చదువుకోవాలని అక్క కోసం జగిత్యాల మెడికల్ కళాశాలలో సీట్లు తీసుకున్నారు. నాన్న కల నాకు లక్ష్యమైందిడాక్టర్ చదవాలన్నది మా నాన్న కల. ఆ కల నాకు లక్ష్యం అయ్యింది. 2018–2024లో ఎంబీబీఎస్ విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో పూర్తిచేశా. గైనిక్ లేదా జనరల్ మెడిసిన్ పీజీ చేయాలని అనుకుంటున్నా. మా అమ్మనాన్నలు ఎన్ని ఇబ్బందులు పడినా మాకు ఏనాడూ లోటు రాకుండా చూసుకున్నారు. – డాక్టర్ మమత, ఎంబీబీఎస్(7009)అక్క చూపిన దారిఇంటర్మీడియెట్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎంబీబీఎస్ చదవలేనేమో అని, డిప్రెషన్కు లోనయ్యాను. హైదరాబాద్లో చదువుతున్నప్పటికీ ఇంటి నుంచే వెళ్లి పరీక్షలు రాసి వచ్చేదాన్ని. ఇప్పుడు కరీంనగర్లోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. అక్క నా ముందున్న దారిని క్లియర్ చేయడంతో మేం సాఫీగా నడుస్తున్నాం. జనరల్ మెడిసిన్ పూర్తి చేసి పేదలకు సేవలు అందిస్తాను.– మాధురి, ఎంబీబీఎస్, ఫైనల్ ఇయర్(7012)మేం ఇద్దరం ఒకే కళాశాల లో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం సంతోషంగా ఉంది. మా అక్కలే మాకు రోల్ మోడల్. అమ్మానాన్న ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా చదువుపై మాకు ఉన్న ఇష్టాన్ని గుర్తించి కాదనలేదు. అక్కలిద్దరూ మాకు సరైన గైడెన్స్ ఇచ్చారు. – రోహిణి, రోషిణి, ఎంబీబీఎస్, మొదటి సంవత్సరం(7011)నలుగురు ఆడపిల్లలని, వారిని హైదరాబాద్లో చదివిస్తున్నామని చాలామంది సూటి;yటీ మాటలు అనేవారు. అయినా కుంగిపోకుండా పిల్లలను ఉన్నత స్థానంలో చూడాలకున్నాం. టైలరింగ్ చేస్తూ వచ్చే కొద్ది డబ్బుతోనే పిల్లలను లోటు లేకుండా పెంచాం. అప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు మా నలుగురు కూతుర్లు మెడిసిన్ చేస్తుంటే సరస్వతీ పుత్రికలు అని మెచ్చుకోవడంతో మా బాద, కష్టమంతా మర్చి΄ోతున్నాం. మాది పేద కుటుంబం. పిల్లల చదువు నిమిత్తం ఎవరైనా దాతలు సాయం చేస్తే వారు ఉన్నత చదువులకు మార్గం ఏర్పడుతుంది.– రామచంద్రం, శారద – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఫోటోలు: కె సతీష్,ఈ సరస్వతీ పుత్రికలకు అండగా నిలవాలనుకునే వారు 98499 54604 ను సంప్రదించవచ్చు. (చదవండి: సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!) -
డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్
కోల్కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ— ANI (@ANI) October 12, 2024 జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు. -
మళ్లీ ‘డెంగీ’ పంజా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, చికున్గున్యా, మలేరియా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి విష జ్వరాలు తిరిగి విజృంభిస్తున్నాయి. మరోవైపు దగ్గు, జలుబు బాధితుల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇటీవలి వానలతో నీళ్లు నిలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో దోమలు స్వైర విహారం చేయడం, వాతావరణంలో మార్పులు వంటివి దీనికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. హైదరాబాద్లో డెంగీ ప్రతాపం ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో 9,254 డెంగీ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో హైదరాబాద్లో అత్యధికంగా 2,731 డెంగీ కేసులు, తర్వాత మేడ్చల్ జిల్లాలో 700 కేసులు నమోదైనట్టు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యంత తక్కువగా 24 డెంగీ కేసులు నమోదైనట్టు పేర్కొంది. అయితే అధికారికంగా నమోదు కాని డెంగీ కేసులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటాయని అంచనా. మరోవైపు ఇదేకాలంలో తెలంగాణవ్యాప్తంగా 397 చికున్గున్యా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్లో ఏకంగా 204 కేసులు రికార్డయ్యాయి. ఇక 229 మలేరియా కేసులు నమోదవగా.. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 67 కేసులు ఉన్నాయి. డెంగీ, చికున్గున్యా తదితర విష జ్వరాల కేసులు చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే నమోదవుతున్నాయి. మొత్తం డెంగీ కేసుల్లో 8,409 కేసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవగా.. ప్రైవేట్లో 845 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనేక ప్రైవేట్ ఆస్పత్రులు డెంగీ, చికున్గున్యా కేసుల వివరాలను సరిగా అందజేయకపోవడమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి. తమ వద్దకు వస్తున్న ప్రతీ 10 జ్వరం కేసుల్లో ఇద్దరు, ముగ్గురికి చికున్గున్యా లక్షణాలు ఉంటున్నట్టు వైద్యులు చెప్తుండటం గమనార్హం. రాష్ట్రంలో 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలు రాష్ట్రంలో డెంగీ ముప్పున్న 2,071 డెంగీ హైరిస్క్ ప్రాంతాలను వైద్యారోగ్యశాఖ ఇప్పటికే గుర్తించింది. గతంలో నమోదైన డెంగీ కేసుల ఆధారంగా ఈ ప్రాంతాలను నిర్ధారించింది. ప్రస్తుతం డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసింది. అలాగే 42 డెంగీ పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిల్లో సౌకర్యాలు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా.. అందులో 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్ యూనిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల్లోనూ శానిటైజేషన్, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమలు రాకుండా చర్యలు తీసుకునేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లాలని.. దోమల ఉత్పత్తిని నివారించే చర్యలు, అవగాహన చేపట్టాలని సూచించారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాధిపతులంతా ఆస్పత్రులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఒకేసారి రకరకాల జ్వరాలు ఈ ఏడాది రకరకాల వైరల్ జ్వరాలు కలిపి ఒకే సమయంలో దాడి చేస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. కొందరిలో డెంగీ, చికున్గున్యా రెండూ కూడా ఉంటున్నాయని అంటున్నారు. ఇక నడివయసువారు, వృద్ధుల్లో చికున్గున్యా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. ఏదైనా సరైన పరీక్షలు చేయించుకుని.. వ్యాధిని స్పష్టంగా నిర్ధారించుకుని, చికిత్స పొందాలని స్పష్టం చేస్తున్నారు. డెంగీకి కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటివి సరిపోవని.. ఐజీఎం పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. -
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ
కోల్కతా: కోల్కత ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది డాక్టర్లపై ఆర్టీ కర్ హాస్పిటల్ అంతర్గత కౌన్సిల్ బహిష్కరణ వేటు వేసింది. ఆస్పత్రిలో బెదిరింపులు, వేధింపులు, ర్యాగింగ్, మనీ లాండరింగ్కు పాల్పడినట్లు సదరు డాక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ డాక్టర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని సమిష్టిగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 10 మంది వైద్యుల బహిష్కరణతో పాటు, ఇంటర్న్లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహా మొత్తం 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బహిష్కరణ వేటుపడిన డాక్టర్లలో సౌరభ్ పాల్, ఆశిష్ పాండే (సీబీఐ అరెస్టు చేసిన), అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు ఉన్నారు. ఈ డాక్టర్లు తమ హాస్టల్ను ఖాళీ చేయడానికి అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు. మరోవైపు.. బహిష్కరణకు గురైన డాక్టర్ల పేర్లు రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను సమీక్షించవచ్చు లేదా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.చదవండి: కోల్కతా బాధితురాలి విగ్రహావిష్కరణ -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్విస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్రేట్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పీహెచ్సీ వైద్యులు ఉదయాన్నే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇన్సర్విస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిసరాల్లో నిరసన తెలపడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని వైద్యులు తెగేసి చెప్పారు. సీఎంను కలవడానికి ఇంత మందిని అనుమతించబోమని, ఇద్దరు మాత్రమే రావాలని పోలీసులు చెప్పారు. పోలీసుల షరతుకు అంగీకరించి, ఇద్దరు వైద్యులే సీఎంను కలిశారు. మిగిలిన వైద్యులందరూ అక్కడే రోడ్డుపై గంటల తరబడి పడిగాపులు కాశారు. జీవో రద్దు చేయం వైద్యుల ప్రతినిధులు సీఎంను కలిసి జీవో 85 రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, జీవో 85ను రద్దు చేయడం కుదరదని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది. జీవోలో సవరణకు ఇప్పటికే సానుకూలత తెలిపామని అన్నట్లు సమాచారం. జీవో రద్దుకు పట్టుబడితే కుదరదని సున్నితంగా హెచ్చరించినట్టు వైద్యులు చెప్పారు.ఇన్సర్విస్ కోటా కుదించిన బాబు సర్కారు పీజీ వైద్య విద్యలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లుగా సేవలందించే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్సర్వీస్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. గత ప్రభుత్వం క్లినికల్ పీజీ కోర్సుల్లో 30 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం క్లినికల్లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 30 శాతానికి ఈ కోటా కుదించింది. దీంతో 2023–24లో క్లినికల్లో 389, నాన్–క్లినికల్లో 164 పీజీ సీట్లు పొందిన వైద్యులు, ఇప్పుడు క్లినికల్లో 270, నాన్ క్లినికల్లో 66 చొప్పున సీట్లను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి వైద్యులు ఉద్యమం చేపట్టారు. 15వ తేదీ నుంచి పీహెచ్సీల్లో వైద్య సేవలకు సైతం దూరంగా ఉన్నారు. -
జీవో 85ను రద్దు చేయండి
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో నంబర్ 85ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీల) వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వానికి ఏపీ పీహెచ్సీ వైద్యుల సంఘం లేఖ రాసింది. ‘నిర్దేశిత పరీక్షకు కేవలం 20 రోజుల ముందు ప్రభుత్వం ఇన్సరీ్వస్ కోటాను కుదిస్తూ నిర్ణయం తీసుకుని జీవో 85ను జారీ చేసింది.దీంతో మాకు న్యాయపరమైన మార్గం చూసుకునే అవకాశం లేకుండాపోయింది. జీవో 85పై మేము జూలై 23న వైద్య శాఖ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమరి్పంచాం. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి లోకేశ్లకు వినతిపత్రాలు సమర్పించాం. గత 50 రోజులుగా మా బాధను చెబుతూనే ఉన్నాం. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆందోళన బాటపట్టాం. జీవో 85 రద్దు చేసి.. ఇప్పటికే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు మరిన్ని పీజీ సీట్లు ఇవ్వడం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. మా డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించండి’ అని ప్రభుత్వాన్ని పీహెచ్సీ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు శనివారం కూడా తమ నిరసన కొనసాగించారు. పీజీలో ఇన్ సర్వీస్ కోటాను కుదించడాన్ని ఖండిస్తూ జీవో నంబర్ 85ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట వైద్యులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. -
వంద రోజుల్లో వైద్యులను రోడ్డుపై నిలబెట్టారు
సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం వైద్యులను రోడ్ల మీదకు లాగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు మండిపడ్డారు. వంద రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేశామని ప్రకటనలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం కోవిడ్లో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యులను అవమానాలకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున వైద్యులను నియమించి, పీహెచ్సీలను బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం వైద్యులపై వేధింపులకు దిగుతోందన్నారు. వైద్య విద్యలో ఇన్సర్వీస్ కోటా కుదింపునకు సంబంధించిన జీవో 85కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్వో కార్యాలయాల ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేపట్టారు. విజయవాడలో నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వైద్యులందరు తమ జిల్లాలకు గురువారం వెళ్లిపోయినట్లు పీహెచ్సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యూనస్మీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే సోమవారం ఛలో విజయవాడ 2.0 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు చర్చలు నిర్వహించిన్పటికీ తమ డిమాండ్లు నెరవేరలేదని, మళ్లీ చర్చలకు పిలిచి, డిమాండ్లను నెరవేర్చే వరకూ విజయవాడలో నిరసన తెలుపుతామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి డీఎంహెచ్వో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై కేసులు పెడతామని డీఎంహెచ్వోలు బెదిరించారని చెప్పారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా శనివారం కూడా డీఎంహెచ్వోల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కలిసి వేధింపులకు పాల్పడిన డీఎంహెచ్వోల కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పారు.సమస్యలు పరిష్కరించే వరకు నిరసనప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారంఅయ్యే వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు. -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు. వైద్యులను అవమానించిన పోలీసులుధర్నా చౌక్లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు -
నేడు పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ యూనస్మీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించబోమని స్పష్టం చేశారు. -
సీఎం మమతా బెనర్జీతో మరోసారి వైద్యుల బృందం భేటీ
డాక్టర్ల సమస్యను కొలిక్కి తెచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొద్ది సేపటి క్రితమే డాక్టర్లతో భేటీ అయ్యారు.కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రి అభయ ఘటనపై సీఎం మమతా బెనర్జీతో వైద్యుల బృందం మరోసారి భేటీ అయ్యింది. మమతా బెనర్జీ ఇంటికి బస్సులో చేరుకున్న డాక్టర్లు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. చర్చలు పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేస్తోంది వైద్యుల బృందం. అభయ ఘటనలో సీబీఐ అధికారుల విచారణ నిస్పక్షపాతంగా, వేగంగా జరగాలని కోరుతున్నారు. వ్యవస్థల వైఫల్యం ప్రభుత్వం దృష్టిపెట్టాలని, కేసును తప్పుదారి పట్టించిన హెచ్ఓడీలను తొలగించాలని కోరుకుంటున్నారు. డీసీపీతో పాటు పోలీసు అధికారులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ను రద్దు చేయాలని, వైద్యుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఆందోళన చేస్తున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నారు. ఇదీ చదవండి : గుంజీలు తీసిన విద్యార్థినులకు అస్వస్థత -
‘టీ’ తాగాలంటూ దీదీ ఆహ్వానం.. వద్దని ఖరాఖండిగా చెప్పిన డాక్టర్లు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వైద్యులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ వైద్యులు ‘టీ’ తాగేందుకు రావాలని కోరారు. అందుకు వైద్యులు ఒప్పుకోలేదు. అభయ ఘటనలో న్యాయం చేస్తేనే.. తాము టీ తాగేందుకు అంగీకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీని ఆమె నివాసంలో కలిసిన ప్రతినిధి బృందంలోని డాక్టర్ అకీబ్ మాట్లాడారు. కాళీఘాట్ వద్ద చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ మమ్మల్ని వారి నివాసానికి పిలిచారు. ఆహ్వానం మేరకు మేం అక్కడి వెళ్లాం. విజ్ఞప్తి మేరకు వైద్యుల బృందానికి, సీఎం దీదీతో జరిపే చర్చలు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఆ తర్వాత సీఎం బయటికి వచ్చి టీ తాగమని మమ్మల్ని అభ్యర్థించారు. కాని జూనియర్ డాక్టర్లు మాకు న్యాయం చేస్తేనే టీ తాగుతామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని చెప్పి వెనుదిరిగినట్లు అకీబ్ వెల్లడించారు.కాగా, ఆర్జీ కార్ ఆస్పత్రిలో అభయపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ కోల్కతా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలను విరమించి విధుల్లోకి చేరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా జూడాలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చివరికి ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో జూడాల సమ్మె కొనసాగుతుంది.ఇదీ చదవండి : నేను ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది -
వైద్యుల నిరసన... చలో విజయవాడ
-
నేటి నుంచి ఏపీ పీహెచ్సీలలో వైద్య సేవలు బంద్
-
వైద్యులతో చర్చలు.. ఆహ్వానించిన సీఎం మమతా బెనర్జీ
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో అభయ ఘటనపై ఆందోళన చేస్తున్న వైద్యుల డిమాండ్లపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. వైద్యులతో గురువారం సాయంత్రం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు 15 సభ్యుల వైద్యుల ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించింది. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ లేఖ రాశారు.చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ రాసిన లేఖలో వైద్యుల ప్రతినిధి బృందం సంఖ్య 15 మందికి మించకూడదు. పారదర్శకతను కొనసాగిస్తూ ప్రభుత్వానికి, వైద్య ప్రతినిధుల మధ్య జరిగే సమావేశాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఇదీ చదవండి : మాటలు చెప్పడం కాదు మోదీజీ -
‘అమ్మ’ అనే అబద్ధాన్ని నవ మాసాలు మోసింది
జనగామ: ఆమెకు పెళ్లయి మూడేళ్లు అయ్యింది. ఎంతకూ పిల్లలు పుట్టడం లేదు. అంతా ఏమనుకుంటారోనని తనలో తానే కుమిలిపోయింది. మానసికంగా కుంగిపోయింది. ఎలాగైనా ఈ అపవాదు నుంచి తప్పించుకోవాలనుకుంది. ఓ రోజు తాను గర్భం దాల్చినట్లు ఇంట్లో వారికి చెప్పింది. నమ్మకం కుదిరేలా కొద్దిరోజుల తర్వాత కడుపు చుట్టూ బట్టలు కట్టుకోవడం ప్రారంభించింది. నెలకోసారి ఆస్పత్రిలో చూపించుకుంటున్నట్టు కుటుంబసభ్యుల్ని నమ్మించింది. తొమ్మిది నెలలు అలాగే నెట్టుకొచ్చింది. చివరికి ప్రసవం కోసం అంటూ ఆస్పత్రికి వచ్చి శిశువు టాయ్లెట్లో జారి పోయిందని విలపిస్తూ చెప్పింది. అలా బయట పడదామని అనుకుంది. కానీ అంతా పరిశీలించిన వైద్యులు, సిబ్బంది చివరకు అదంతా ఉత్తదేనని తేల్చారు. ఈ విచిత్ర ఘటన బుధవారం జనగామ ఎంసీహెచ్లో జరిగింది. నెలనెలా ఆస్పత్రికెళుతున్నానంటూ.. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని ఓ తండాకు చెందిన మహిళ.. గత ఏడాది డిసెంబర్లో జనగామ చంపక్ హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అంటూ వచ్చింది. వైద్యులు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. తర్వాత గత జూలైలో మరోసారి ఆస్పత్రికి వచి్చంది. గర్భవతినని చెప్పడంతో గైనిక్ వైద్యులు హార్ట్ బీట్, స్కానింగ్ తదితర పరీక్షలు చేసుకుని రావాలని సూచించగా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. కానీ ఇంట్లో వారికి నెలనెలా పరీక్షల కోసం ఎంసీహెచ్కు వెళుతున్నట్టు చెప్పేది. బుధవారం డెలివరీ డేట్ అని చెప్పి కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. గైనిక్ డాక్టర్ ఆమెను పరీక్షించే సమయంలో వాష్రూమ్కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. ఇరవై నిమిషాల తర్వాత బోరున విలపిస్తూ బయటకు వచ్చింది. మూత్ర విసర్జన చేస్తుండగా శిశువు టాయ్లెట్లోకి జారి పోయిందని చెప్పింది. వెంటనే వైద్యులు, సిబ్బంది అప్రమత్తమై టాయ్లెట్ను పరిశీలించారు. ఎలాంటి రక్తపు మరకలు కన్పించలేదు. దీంతో టాయ్లెట్కు అనుబంధంగా ఉన్న డ్రైనేజీ పైపులైన్లను పరిశీలించారు.శిశువు జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు మహిళను ప్రశ్నించారు. స్కానింగ్ రిపోర్టు ఏదంటూ గట్టిగా నిలదీశారు. దీంతో తనకు గర్భం రాలేదని, ఎంతకూ పిల్లలు పుట్టకపోవడంతో ఇలా చేశానంటూ ఆ మహిళ చెప్పింది. అయితే అప్పటికే ఆ మహిళ కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అన్ని పరీక్షలూ చేసి ఆమె గర్భం ధరించలేదని, అంతా ఉత్తదేనని నిర్ధారించారు. సదరు మహిళతో పాటు భర్తను సఖి కేంద్రానికి తరలించగా సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ దామోదర్రెడ్డి తెలిపారు. పిల్లలు పుట్టడం లేదనే బాధతో, అమాయకత్వంతో ఆ మహిళ అలా చేసిందని వైద్యులు వ్యాఖ్యానించారు. -
సుప్రీం డెడ్లైన్ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్ డాక్ట్టర్లు
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగుతోంది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్యవిద్య విభాగం డైరెక్టర్ రాజీనామా కోసం వారు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు.నేటి విచారణకు హాజరు కండిబుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొంటున్న 51 మంది వైద్యులకు ఆర్జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం నోటీసులిచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోకి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుంచి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది.చర్చల ఆహా్వనాన్ని తిరస్కరించిన జుడాలు సమ్మె విరణమ కోసం చర్చలకు రావాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహా్వనాన్ని జూనియర్ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహా్వనంలో వాడిన భాష అభ్యంతరకమని పేర్కొన్నారు. ‘‘10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావొచ్చు’ అంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి వారికి మెయిల్ పంపారు. ‘‘ఈ భాష డాక్టర్లకు అవమానకరం. పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేం రాజీనామా కోరుతున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి ద్వారా పంపారు. ఇది మాకు అవమానమే. అందుకే దానికి స్పందించలేదు’’ అని జుడాల నేత డాక్టర్ దేబాశిష్ హల్దార్ అన్నారు. చర్చల నిమిత్తం జూడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7.30 దాకా సచివాలయంలో వేచిచూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.సందీప్ ఘోష్ కస్టడీ పొడిగింపుఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 23వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్ అలీ, సన్నిహితులు బిప్లవ్ సిన్హా, సుమన్ హజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది.వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడం తెలిసిందే. -
ఆందోళనలతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. అభయ ఘటనపై త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రాజధాని కోల్కతాలో ‘ది బెంగాల్ జూనియర్ డాక్టర్ ఫ్రంట్’ ఆందోళనకు పిలుపునిచ్చింది. సంఘం పిలుపు మేరకు బుధవారం రాత్రి వైద్యులు రోడ్డెక్కారు. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు లైట్లన్ని ఆర్పేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ఫోన్ లైట్లు వెలిగించారు. దీంతో కోల్కతా మొత్తం చీకటిమయమైంది.రాత్రి 9 గంటలకు నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన విక్టోరియా మెమోరియల్, రాజ్ భవన్తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు వైద్యురాలికి అండగా నిలిచారు. లైట్లు ఆఫ్ చేసి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంఘీభావం తెలిపేందుకు రాజ్భవన్లో లైట్లు ఆఫ్ చేశారు. కొవ్వొత్తులతో వీధుల్లోకి వచ్చారు.కోల్కతాలో శ్యాంబాజార్, మౌలాలి, న్యూ టౌన్ బిస్వా బంగ్లా గేట్, రాష్బెహారీ క్రాసింగ్, బెహలా, గరియా, బల్లిగంజ్, హజ్రా క్రాసింగ్, జాదవ్పూర్ 8బీ బస్ స్టాండ్తో పాటు బస్టాండ్తో సహా ప్రముఖ కూడళ్ల వద్ద నిరసనలు జరిగాయి. వాతావారణ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలో అభయ తల్లిదండ్రులు పాల్గొన్నారు.మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లైట్ దేర్ బి జస్టిస్..లెట్ దేర్ బీ జస్టిస్ పేరుతో పిలుపునిచ్చిన ఆందోళనతో ఢిల్లీలోనూ నిరసనలు జరిగాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి, ఎయిమ్స్ వైద్యులు క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. న్యాయం ఆలస్యం కాకుండా కేసును త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సందీప్ ఘోష్ అరెస్ట్అభయ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సందీప్ ఘోష్ను సీబీఐ అరెస్ట్ చేసింది. దాదాపు 15 రోజులుగా ఘోష్ను విచారించిన సీబీఐ అధికారులు సోమవారం(సెప్టెంబర్ 02) అరెస్ట్ చేశారు. సందీప్ ఘోష్ ఫిబ్రవరి 2021 -సెప్టెంబర్ 2023 మధ్య ఆర్జీ కార్ ప్రిన్సిపల్గా పనిచేసే సమయంలో మృతదేహాలను అక్రమంగా విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాల అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థులను లంచాల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. -
పల్లెకు వెళ్లేడాక్టర్లకు రెట్టింపు వేతనం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలకే పరిమితమవుతున్న డాక్టర్లను పల్లెలకు పంపించే దిశగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చే డాక్టర్లకు రెట్టింపు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల వైద్యులు గ్రామాల వైపు ఆకర్షితులవుతారని, తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే వేతనానికి రెట్టింపు (100 శాతం) ప్రోత్సాహకం, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి పనిచేస్తే 125 శాతం ప్రోత్సాహకం ఇవ్వాలని అధికారులకు మంత్రి చెప్పినట్లు తెలిసింది. మెడికల్కాలేజీలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీ, పీహెచ్సీలలో వైద్య సేవలు అందించే డాక్టర్లు అందరికీ ఈ ప్రోత్సాహకాన్ని వర్తింపజేస్తారు. వీటికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఒడిశా మోడల్ పల్లెల్లో పనిచేసే డాక్టర్ల కంటే హైదరాబాద్లో పనిచేసే వారికి హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె అలవెన్సు) ఎక్కువ వస్తుంది. అంతేకాదు నగరంలో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసేవారూ ఉన్నారు. కొందరు సొంత ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా అదనంగా ఆదాయం సమకూర్చుకుంటున్నారు. పిల్లల చదువుల కోసం మరికొంత మంది నగరానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా అనేక కారణాలతో గ్రామాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి డాక్టర్లు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పలుమార్లు వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రోత్సాహక పథకంపై వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తదితరులతో అధ్యయనం చేయించారు. ఒడిశాలో రాష్ట్ర రాజధాని నుంచి ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి ఒక స్లాబ్ నిర్ణయించి, బేసిక్ పేపై 25 నుంచి 150 శాతం వరకూ ప్రోత్సాహకం ఇస్తున్నారు. దీంతో డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై అధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు. దీంతో ఇదే పద్ధతిని రాష్ట్రంలోనూ అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. జిల్లాలకు వెళితే క్వార్టర్లు కూడా..జిల్లాలకు వెళ్లే డాక్టర్లకు ఆయా ఆసుపత్రుల్లో క్వార్టర్లు నిర్మించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లోని డాక్టర్లకే క్వార్టర్లు ఉన్నాయి. అయితే కొత్తగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకు కూడా క్వార్టర్లు నిర్మించాలని మంత్రి అధికారులకు సూచించారు. పీహెచ్సీల్లోని డాక్టర్లు గ్రామాల్లో కాకుండా సమీపంలో ఉన్న మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు వెళ్లి రావొచ్చు కాబట్టి వారికి క్వార్టర్లు అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చారు. అయితే క్వార్టర్లు నిర్మించి ఇవ్వడం వల్ల డాక్టర్లు నిరంతరం అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ అందుబాటులో లేడనే అభిప్రాయం కూడా ఉండదని మంత్రి భావిస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీల్లో పనిచేసేది స్పెషాలిటీ డాక్టర్లు కాబట్టి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి.వీరికి ప్రోత్సాహకాలు ఇచ్చి పల్లెలకు పంపడం వల్ల అక్కడే స్పెషాలిటీ సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాల్లో డాక్టర్లను పూర్తి స్థాయిలో నియమించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు. దీనివల్ల 75% వైద్య సేవలు జిల్లాలకే పరిమితం అవుతాయని, హైదరాబాద్పై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. -
IMA: ‘న్యాయం కోర్టుకు వదిలేసి.. వెంటనే విధుల్లో చేరండి’
ఢిల్లీ: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు , వైద్య సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే పశ్చిమబెంగాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తిరిగి విధుల్లో చేరాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసింది.‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ ఘటన దేశంలో ఉన్న ప్రతిఒక్కరి మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను దేశం తన కుమార్తెగా భావించింది. అయితే మొత్తం మెడికల్ కమ్యూనిటీ సుప్రీంకోర్టుకు ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. వెంటనే విధుల్లోకి చేరి.. వైద్యసేవలు ప్రారంభించండి. న్యాయం జరగటం గురించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వదిలేయండి. రోగుల సంరక్షణ, భద్రత వైద్య వృత్తి ప్రధాన విధి. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. డాక్టర్ల రక్షణ కోసం జాతీయ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డాక్టర్లు తమను నమ్మాలని.. వైద్యం నిలిపివేయవద్దని ఇప్పటికే సుప్రీం కోర్టు తెలియజేసింది’ అని లేఖలో పేర్కొంది.ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. నిందితులకు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించి సాక్ష్యాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లు, వైద్య సిబ్బందికి మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు భారీగా నిరసనలు చేపట్టారు. మరోవైపు.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
Kolkata: పోలీస్ కమిషనర్ రాజీనామా కోరుతూ రెండో రోజూ ర్యాలీ
కోల్కతా: కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో యవ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన దేశమంతటినీ కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలోని వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండవ రోజున కూడా నిరసన చేపట్టిన వైద్య విద్యార్థులు లాల్బజార్లోని కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. దీనిలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సోమవారం రాత్రంతా విద్యార్థులు బీబీ గంగూలీ వీధిలో నిరసన చేపట్టారు. ఈ నేపధ్యంలో బీబీ గంగూలీ స్ట్రీట్లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.జూనియర్ డాక్టర్లు వెన్నెముక అస్థిపంజరం, ఎర్ర గులాబీలను చూపుతూ ర్యాలీలో నిరసన చేపట్టారు. నిరసన చేపట్టిన వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ‘కోల్కతా పోలీసులు మమ్మల్ని చూసి భయపడిపోయారు. వారు మమ్మల్ని ఆపడానికి తొమ్మిది అడుగుల ఎత్తయిన అడ్డంకులు పెట్టారు. లాల్బజార్కు వెళ్లి పోలీసు కమిషనర్ను కలిసేందుకు అనుమతించే వరకు మా నిరసన కొనసాగుతుంది. అప్పటి వరకు మేం ఇక్కడే ధర్నా చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు. -
ఐవీఎఫ్తో... సంతానం సఫలం
రాష్ట్రంలో దాదాపు 15 శాతం మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నట్లు ఓ సర్వే చెబుతోంది. హైదరాబాద్లో కూడా లైఫ్స్టైల్ మారడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అందులోనూ సంతానలేమి అనేది ప్రముఖంగా చెప్పుకోవచ్చు. జంక్ఫుడ్, ఎక్కువసేపు కూర్చుని చేసే డెస్క్ జాబ్ల కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో జన్యుపరంగా కూడా ఇన్ఫెరి్టలిటీ సమస్యలు వస్తున్నాయని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. చాలామందిలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి నిద్ర, ఎక్సర్సైజ్లు కనుక చేస్తే సంతానలేమి అనేది పెద్ద సమస్య కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల దేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్లో పెరుగుతున్న మెట్రో పాలిటన్ కల్చర్ కారణంగా సంతానలేమి సమస్య ఉత్పన్నం అవుతోందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఒత్తిడి వల్ల కూడా.. మహిళల్లో కనిపించే ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడి, హార్మోన్లలో సమతుల్యత దెబ్బతినడం వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇంప్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే.. శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతనం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సంతానలేమి నిర్ధారణ ఇలా? సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణా పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాది పాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెరి్టలిటీ అంటారు. మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోరుకున్నప్పుడు ఏడాది పాటు ప్రయతి్నంచినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఏయే చికిత్స అందజేస్తారు..అండం సరిగా పెరగనప్పుడు, అది పెరగడానికి క్లోమిఫిన్, లెట్రోజ్ వంటి కొన్ని రకాల మాత్రలు, వాటి మోతాదులను క్రమంగా పెంచుకుంటూ వాడాలి. కొందరికి గొనాడోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ అవసరమవుతుంది. అండాశయాలలో పీసీఓడీ కారణంగా అండాలు పెరగకపోతే లాప్రోస్కోప్ ఆపరేషన్ ద్వారా, పీసీఓడీలోని నీటితిత్తుల్లో కొన్నింటిని పేల్చడం అవసరం. దీన్నే ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. ఇక అండాశయంలో నీటితిత్తులు, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యలను కూడా లాప్రోస్కోపిక్ ప్రక్రియ ద్వారా తొలగించి, ఆ తర్వాత గర్భం వచ్చేందుకు అవసరమైన చికిత్స అందించాలి. థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని తగ్గించే మందులు వాడాలి. అప్పుడు హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భధారణకు అవకాశాలు మెరుగుపడతాయి.ఎవరికి చికిత్స అవసరం.. మహిళకు ప్రతినెలా నెలసరి సక్రమంగా వస్తూ, రెండేళ్ల పాటు ప్రయతి్నంచాక కూడా అప్పటికీ గర్భం రానివారికీ, అలాగే ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకుంటున్నప్పుడు.. ఆ దంపతులు డాక్టర్ను సంప్రదించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం మంచిది.గర్భాశయంలో లోపాలు సాధారణంగా గర్భాశయంలో లోపాల వల్ల గర్భం దాల్చలేని వారు దాదాపు 10% నుంచి 15% వరకూ ఉంటారు. గర్భాశయంలో లోపాలు కూడా అనేక కారణాల వల్ల కలుగుతుంటాయి. గర్భాశయ ముఖద్వారంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పూత ఉన్నా, అక్కడ స్రవించే స్రావాలు చిక్కగా ఉన్నా, గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉన్నప్పుడు వీర్యకణాలు గర్భసంచి లోపలికి ప్రవేశించలేకపోవచ్చు. కొంతమందిలో యోని ద్రవాల్లో ఆమ్లగుణం మరీ ఎక్కువగా ఉంటే అవి వీర్యకణాలను చైతన్యరహితం చేస్తాయి. ఐవీఎఫ్ ప్రక్రియ పనిచేస్తుందిలా.. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పు డాక్టర్లు ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తారు. ఈ ప్రక్రియలో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన అండాలను సేకరించి, పురుషుడి నుంచి స్వీకరించిన శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలదీకరణం చెందిస్తారు. ఈ ఫలదీకరణ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధిచెందుతాయి. ఇందులో నుంచి ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. మిగతా పిండాలను శీతలీకరించి పక్కన పెట్టుకుంటారు. ఆరు వారాల తర్వాత అ్రల్టాసౌండ్ పరీక్ష చేసి, ఆమెలో గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే శీతలీకరించిన పిండాల్లో మరోదాన్ని గర్భంలోకి ప్రవేశపెడుతారు.ఆహారపు అలవాట్లే కారణం.. ప్రస్తుతం యువతీ, యువకుల్లో ఆహారపు అలవాట్లు సంతానలేమి సమస్యలకు కారణం అవుతున్నాయి. మితిమీరిన ఆల్కహాల్, సిగరెట్ తాగడంతో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. గర్భాశయంలో లోపాలు, అండాశయాల్లో బుడగలు (పీసీఓడీ), వీర్యకణాల సంఖ్య తగ్గడం, చలనం లేకుండా పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిచేసుకుని, ఆరోగ్యకరమైన జీవన విధానంతో సంతానలేమి సమస్యలకు దూరం కావచ్చు. – జలగం కావ్యా రావు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్పురుషుల్లోనూ సమస్యలు.. స్త్రీలతో పాటు పురుషుల్లో కూడా పలు సమస్యలు ఉంటాయి. పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా ఉండటం అతిపెద్ద సమస్య. సరైన మందులు ఇవ్వడంతో పాటు సరైన జీవన విధానం పాటిస్తే వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో అసాధారణమైన వీర్య కణాలు ఉంటాయి. వాటిలో లోపాలు ఉంటాయి. సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకుంటే వాటి నాణ్యత పెరుగుతుంది. ఇక, కొందరిలో వీర్యకణాల కదలిక తక్కువగా ఉంటుంది. అప్పుడు వీర్యక ణాలు అండంతో ఫలదీకరణ చెందవు. ఈ సమస్యను కూడా మందులతో తగ్గించవచ్చు. -
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
బలవంతంగా సిజేరియన్.. శిశువు మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుర్చిలోనే ప్రసవించిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా మరో ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గ్యారకుంట్లపాలెం గ్రా మానికి చెందిన చెరుకుపల్లి నాగరాజు భార్య శ్రీలత మూడో కాన్పు కోసం ఈ నెల 21న ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం పడుతుందని వేచిచూడాలని సలహా ఇచ్చారు. ఇటీవల ఆసుపత్రిలో కుర్చిలోనే ప్రసవించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన డాక్టర్తోపాటు అయిదుగురు నర్సింగ్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ శనివారం గైనిక్ వార్డులోని వైద్యులంతా మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తికి నోటీసులు అందజేసి విధులు బహిష్కరించారు. దీంతో గైనిక్ వార్డులో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందు బాబు బాగున్నాడని చెప్పి.. శనివారం సాయంత్రం వరకు నర్సులు మినహా డాక్టర్లు లేకపోవడంతో విసిగి వేసారిన గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులకు బయల్దేరారు. ఈక్రమంలోనే శ్రీలతను భర్త నాగరాజు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కిస్తుండగా ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది అడ్డుకుని బలవంతంగా కా న్పుల వార్డుకు తరలించారు. మీరు బయటకు వెళ్లిపోతే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడి లోపలకు తీసుకు పోయి సేవలందిస్తామని సూచించారు. రాత్రి 9.30 సమయంలో శ్రీలతకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే అప్పటికే పుట్టిన బాబు మృతి చెందినట్లు తెలిసింది. అయితే ముందుగా బాబు బాగున్నాడని వైద్యులు చెప్పారని, ఆ తరువాత చనిపోయినట్లు చెప్పారని బంధువులు పేర్కొన్నారు. డాక్టర్ల నిర్వాకంపై బంధువులు అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. బాబు శరీరంపై గాయాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మరణించాడని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించి కేసు పెట్టాలని సూచించడంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తిని వివరణ కోరగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, జిల్లా కలెక్టర్కు జరిగిన ఘటనపై వివరించామని తెలిపారు. -
ముక్కలైన చేయికి పునర్జన్మ
శివమొగ్గ: రెండు ముక్కలైన చెయ్యికి శస్త్ర చికిత్స చేసి వైద్యులు మళ్లీ ఒక్కటి చేశారు. ఈ అరుదైన సంఘటన శివమొగ్గ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగింది. ఓ సామిల్లో పనిచేసే కారి్మకుడు (35) చేయి రంపంలోకి చిక్కి రెండు ముక్కలైంది. వెంటనే అక్కడున్నారు విడిపోయిన చేతిని ఐస్బాక్స్లో పెట్టుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శస్త్రచికిత్స చేసిన తెగిన చేతిని ఎముకలు, మాంసంతో పాటు కలిపారు. తరువాత వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించి బాగు కావడంతో డిశ్చార్జి చేశారు. అతని చెయ్యి త్వరలోనే మామూలుగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చేతన్, ఎముకల వైద్యుడు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ వాదిరాజు కులకరి్ణ, మూకర్ణప్ప, సంతో‹Ù, అర్జున్ ఈ శస్త్రచికిత్స చేశారు. -
అభయ కేసు... కోర్టులో నిందితుడి యూటర్న్!
కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులోని ప్రధాని నిందితుడు సంజయ్రాయ్తో పాటు మరో ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో పాలిగ్రాఫ్ పరీక్షకు నిందితుడు సంజయ్ రాయ్ సమ్మతించడంతో ఆయనతోపాటు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, నలుగురు జూనియర్ డాక్టర్లు, ఓ పౌర వాలంటీర్కు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. కానీ పాలిగ్రాఫ్ పరీక్షకు సీబీఐ ఇంకా తేదీని ఇంకా నిర్ణయించలేదు.అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతించారని సంజయ్రాయ్ను సీబీఐ కోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. దీనికి అతను సమాధానం చెబుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను నిర్దోషినని చెప్పాడు. తనెలాంటి తప్పు చేయలేదని. కావాలనే ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. .ఈ పాలిగ్రాఫ్ పరీక్షతో ఆ విషయం బయటపడుతుందని ఆశిస్తున్నానని కోర్టుకు తెలిపాడు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది.అయితే ఇప్పటి వరకు పోలీసులు విచారణలో సీబీఐ దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు సంజయ్ రాయ్.. ఇప్పుడు న్యాయస్థానంలో యూటర్న్ తీసుకొని, తాను ఏ నేరం చేయలేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. సైకో అనాలసిస్లోనూ సంజయ్ రాయ్ చేసిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించినట్లు వెల్లడైన సంగతి విదితమే.మరోవైపు కోల్కతాలో వైద్యుల ఆందోళనలు విరమించాలని బెంగాల్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. రోగుల సంరక్షణకు ఆటంకం కలుగుతోందని, ఆందోళనలో ఉన్న జూనియర్ వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది."మెడికల్ కాలేజీలలో వైద్య సేవలకు రెసిడెంట్ వైద్యులు వెన్నెముక. వారు లేకపోవడం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తృతీయ, మాధ్యమిక ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సేవలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నిరసన తెలుపుతున్న వైద్యులను విధుల్లోకి రమ్మని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ నారాయణ్ స్వరూప్ నిగమ్ పేర్కొన్నారు. -
అప్పుడు కరోనా.. ఇప్పుడు డెంగీ
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రపంచాన్ని వణికించింది. దాని బారిన పడి లక్షలాది మంది మృత్యువాతపడ్డారు. కోట్లాది మంది ఆసుపత్రులపాలయ్యారు. అనేక కుటుంబాలను కోవిడ్ ఛిన్నా భిన్నం చేసింది. అటువంటి వైరస్ పీడ విరగడైంది. కానీ కరోనా తర్వాత ఇప్పుడు డెంగీ... భారత్ సహా దక్షిణా సియా దేశాలను వణికిస్తోంది. డెంగీ ప్రాణాంతకమై నదిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఈ మేరకు తాజాగా నివేదిక విడుదల చేసింది. మొత్తం 47 రకాల జబ్బులపై పరిశోధన చేసి వాటిపై నివేదిక రూపొందించింది. అందులో ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న మొదటి 10 వ్యాధుల పేర్లను విడుదల చేసింది. అందులో భారత్లో డెంగీ, నిఫా, పోలియో, డిప్తీరియా, జికా వైరస్, ఫుడ్ పాయిజనింగ్, రేబిస్ వంటివి ఉన్నాయని పేర్కొంది.ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న వాటిల్లో అంటువ్యాధులు 80 శాతం, ప్రకృతి వైపరీత్యాలు 3 శాతం, రసాయన పరమైనవి 1 శాతం, మిగిలినవన్నీ కలిపి 16 శాతంగా ఉన్నాయి. అంటువ్యాధులే ప్రధానంగా ప్రజారోగ్యానికి పెనుసవాళ్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే బులెటిన్లలో కోవిడ్ తర్వాత డెంగీపైనే అత్యధికంగా అలర్ట్ బులెటిన్లు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఎబోలా ఉందని వెల్లడించింది. 2023లో ఇండియాలో మళ్లీ కలరా కేసులు వెలుగుచూశాయని తెలిపింది. డెంగీ, కలరా విజృంభి స్తున్నాయనీ... జాగ్రత్తగా ఉండాలని... మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించింది.దక్షిణాసియాలో డెంగీనే ప్రమాదకరంభారత్ వంటి దేశాల్లో డెంగీ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దక్షిణాసియా రీజియన్లో డెంగీనే ప్రధానమైనదిగా పరిణమించిందని పేర్కొంది. బంగ్లాదేశ్లో 2002తో పోలిస్తే 2023లో డెంగీ కేసులు 4.8 రెట్లు పెరిగాయి. అక్కడ మరణాలు 9.3 రెట్లు పెరిగాయి. అలాగే థాయ్లాండ్లో కేసులు 2.3 రెట్లు పెరగ్గా మరణాలు 2.5 రెట్లు పెరిగాయి. వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, ఎండలు... తదితర కారణాల వల్ల కూడా డెంగీ ముప్పు పెరుగుతోంది. ఎప్పుడు వర్షాలు కురుస్తా యో.. ఎప్పుడు తీవ్రమైన ఎండలు ఉంటా యో తెలియని పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల అందుకు అవసరమైన ఏర్పా ట్లు కూడా సరిగ్గా చేసే పరిస్థితి ఉండటంలేదు. ఆకస్మిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దోమల సంతతి వృద్ధి చెందుతోంది. మరోవైపు పట్టణీ కరణ పెరగడంతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. నగరీకరణ వల్ల జనం గుంపులుగా ఉండటం... నీటి నిల్వ, మౌలిక సదు పాయాలు లేకపోవడం, నిర్మా ణాలు ఎక్కువకావడం...తదితర కారణాలతో డెంగీ త్వరగా పాకుతోంది. డెంగీ ఒకసారి మొదలైతే అది సులువుగా వ్యాపిస్తుంది.27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులుసోమాలియా, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ సహా 27 దేశాల్లో ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో మయన్మార్, సూడాన్ సహా 10 దేశాలు ప్రజారోగ్యంలో సమస్యాత్మకంగా ఉన్నా యి. సామాజిక సమస్యల కారణంగా ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న దేశాలు కెమరూన్, మయన్మార్, సిరియా. కాగా, ఇన్ఫ్లూయెంజా కేసు లు బంగ్లాదేశ్లో 2023 ఆగస్టులో, థాయ్లాండ్లో అక్టోబర్లో వెలుగుచూశాయి. నిఫా వైరస్ కేసులు బంగ్లాదేశ్, కేరళలో 2023లో నమోదయ్యాయి. 2023లో కేరళలో ఆరు నిఫా కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. థాయ్లాండ్, ఇండోనేసియాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి.ఇంకా ఆ సంస్థపైనే ఆధారం.. ఏదైనా ప్రజారోగ్య సమస్య తలెత్తితే వాటిని ముందస్తుగా గుర్తించడంలో భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుక బడుతున్నాయి. ఆయా దేశాల్లోని ప్రజా రోగ్య సంస్థలు ప్రమాదాన్ని పసిగట్టడంలేదు. 2004–08 మధ్య ఇండియా వంటి దేశాల్లో ప్రజారోగ్య సమస్యలు తలెత్తితే వాటిలో 93 శాతం మొదటగా గుర్తించి అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థే. అలాగే 2009–13 మధ్య 63 శాతం, 2014–18 మధ్య కాలంలో 84 శాతం, 2019–23 వరకు 91 శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థే వాటిని గుర్తించి అప్రమత్తం చేసింది. అమెరికా వంటి దేశాల్లో సగటున 60–70 శాతం వరకు సంఘటనలను ఆయా స్థానిక ప్రభుత్వాలే గుర్తించి అలర్ట్ అవుతున్నాయి. కానీ మనలాంటి దేశాల్లో అటువంటి వ్యవస్థ నేటికీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.ఇద్దరిలో ఒకరికి డెంగీ రిస్క్ప్రపంచంలో 2022తో పోలిస్తే 2023లో కోవిడ్ మరణాలు 90 శాతం తగ్గాయి. అయితే ఇప్పుడు భారత్లో డెంగీ వ్యాప్తి పెరిగింది. దేశంలో నిర్మాణాలు జరుగుతున్న 6 శాతం ప్రాంతాల్లో డెంగీ వ్యాప్తి జరుగుతోందని గుర్తించారు. వలసల వల్ల కూడా డెంగీ వ్యాప్తి విస్తరిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులోనూ ప్రజారోగ్య సమస్యలు పెరుగుతాయని, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పరిశోధన దశలో ఉంది. – డాక్టర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ -
డాక్టర్ల భద్రతపై కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనతో డాక్టర్ల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కాలేజీల్లో స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ ఆడిట్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ ఎలా ఉందనేది పరిశీలిస్తారు. స్పేస్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. స్పేస్ఆడిట్తో పాటు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో డాక్టర్ల భద్రతపై మాక్డ్రిల్స్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, అనుమతి లేనివారికి రాత్రివేళ ఆస్పత్రిలో ఉండేందుకు నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. రాత్రివేళ డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది, విజిటర్స్ను కాపాడేందుకు తగిన ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించింది. రోగి సహా ఎవరైనా హింసాత్మకంగా లేదా బెదిరింపు ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు కోడ్ గ్రే అమలు చేయాలని ప్రభుత్వం కోరింది. -
కోల్కతా ఘటన: ప్రధానికి 70 మంది ‘పద్మ’ వైద్యుల లేఖ
కోల్కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. తాజాగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.కోల్కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. మరోవైపు కోల్కతా పోలీసులు ఆగస్టు 18 నుండి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
కోల్కతా డాక్టర్ కేసు: ఇద్దరు డాక్టర్లు, బీజేపీ నేతకు నోటీసులు
కోల్కతా: కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్దఎత్తున నిసన తెలియజేస్తున్నారు. అయితే మరోవైపు.. హత్యాచార ఘటనప తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై కోల్కతా పోలీసులు ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్బజార్లోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హత్యాచారం కేసు దర్యాప్తు, పోస్ట్మార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి.. ఈ ఘటను సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం, శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్ట్మార్టం నివేదిక తెలిజేస్తోందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. హత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ, లాకెట్ ఛటర్జీపై కోల్కతా పోలీసులు ఆరోపణలు చేశారు. బాధితురాలి పేరు, చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. పోలీసులు చేసిన నోటీసులపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘కోల్కతా పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం కంటే సోషల్ మీడియా పోస్ట్లను చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’అని ఆరోపించారు.ఇక.. ఇప్పటికే జూనియర్ డాక్టర్పై వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని కోల్కతా పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. -
తెలంగాణ రాష్ట్రమంతా ఓపీ బంద్
సాక్షి నెట్వర్క్: కోల్కతాలో యువ డాక్టర్పై హత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ వైద్య సేవలు నిలిచిపోయాయి. మెడికల్ కాలేజీలు, జిల్లా కేంద్రాల్లో పలు రూపాల్లో డాక్టర్లు, వైద్యసిబ్బంది నిరసన వ్యక్తం చేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా చేశారు. పెద్దఎత్తున డాక్టర్లు, వైద్య సిబ్బంది, రాజకీయనేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పొల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ తాను ఒక ఎంపీగా ఇక్కడకు రాలేదని ఓ వైద్యురాలిగా తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధతో ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఆమె డాక్టర్లకు హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఉరి తీసినా తప్పు లేదన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాదరావు మాట్లాడుతూ డాక్టర్లకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలతోపాటు భద్రత కల్పించాలన్నారు. అనేక చట్టాలు ఉన్నా, వాటి అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. చట్టాల పటిష్ట అమలుతోనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధానకార్యదర్శి డాక్టర్ విజయ్రావు, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్కే.యాదవ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ దయాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓపీ మినహా అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. అసలే రోగాల సీజన్ కావడంతో ఓపీకి వచ్చిన వారంతా డాక్టర్ల కోసం ఎదురుచూశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వైద్యుల ధర్నా వైద్యులు, వైద్య విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లా వైద్యులు డాక్టర్ బీఎన్.రావు, రఘురామన్, విజయ్మోహన్రెడ్డి, రమణాచారి, చల్మెడ, ప్రతిమ మెడికల్ కళాశాల డాక్టర్లు, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు. పాలమూరులో భారీ ర్యాలీ ఐఎంఏ, ప్రభుత్వ జూనియర్ వైద్యుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ కలెక్టర్కు రాఖీ కట్టిన రిమ్స్ జూడాలు ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ వైద్యులు కలెక్టర్ రాజర్షి షాకు రాఖీలు కట్టి రక్షణ కల్పించాలన్నారు.వరంగల్లో నిరసన వెల్లువ వరంగల్లో వైద్యులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. జూనియర్ వైద్యులు ఓ పక్క విధులు బహిష్కరించి నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న క్రమంలో వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నర్సింగ్ విద్యార్థులు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేఎంసీ ప్రధానగేటు వద్ద నిరసన తెలిపారు. -
ఏ వాస్తవాలు దాచడానికి?
లక్షలాది మంది భారతీయ మహిళల లాగే, నేను ఆగ్రహంతో రగిలిపోయాను, విచారంతో కుంగిపోయాను. ఒక యువతిని తన పని ప్రదేశంలో బహుశా ఆమెకు తెలిసిన పురుషులే క్రూరంగా హింసించి చంపారనే ఆలోచన నన్ను వెంటాడుతోంది. కోల్కతా యువ వైద్యు రాలిపై లైంగిక దాడి ఘటనలో, ఆమె శవం గురించి ఇప్పుడు మనకు తెలిసిన భయానక వివరాలను నేను చెప్పలేను. అర్ధనగ్నంగా కనిపించింది. ఆమె కాళ్లు విరిగిపోయాయి. ఆమె జననాంగాలు, రెండు కళ్ల నుంచి విపరీతంగా రక్తస్రావం అయ్యింది. తల నుంచి పాదాల వరకు రక్త సిక్త గాయాలయ్యాయి. ఈ సాక్ష్యం సామూహిక అత్యాచారం అని వైద్యులు నమ్ముతున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని చూడటానికి మూడు గంటలు వేచిచూడాల్సి వచ్చిన తండ్రి ఈ వివరాలను పంచుకున్నారు. ఆ తండ్రిగా మిమ్మల్ని ఊహించుకోండి. అది మీ బిడ్డ గురించి మీకు ఉన్న చివరి జ్ఞాపకం అని ఆలోచించండి.కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన, సంస్థా గతంగా స్త్రీల పట్ల ఉన్న ద్వేషానికీ, దుర్మార్గానికీ భయంకరమైన ఉదాహరణ. అత్యాచారం తర్వాత ఏమి జరిగిందనేది మరింత అసహ్యకరమైనది. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు నేరాన్ని మరింతగా పెంచాయి.ఈ కేసును అర్థం చేసుకోవాలంటే, మనం వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఇప్పుడు తొలగించబడిన సందీప్ ఘోష్ అనే వ్యక్తి గురించి మాట్లాడాలి. మొదట, మెడికల్ కాలేజీ అధిపతిగా, దాడి జరగడానికి ఆయనే జవాబుదారీగా ఉంటాడు. ప్రత్యేకించి ఇది బయటి వ్యక్తి చేసిన పని కాదనీ, కాలేజీ లోపలి వారు చేసిన పనేననీ వైద్యులు చెబుతున్నారు. 36 గంటల షిఫ్ట్ ముగించు కున్న తర్వాత బాధితురాలు విశ్రాంతి తీసుకుంటున్న సెమినార్ హాల్ ఎక్కడ ఉందో బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేదని వైద్యులు సూచిస్తున్నారు. లైంగిక దాడికి, హత్యకు గురైన రాత్రి బాధితురాలి కారును కూడా ధ్వంసం చేశారని నిరసన తెలిపిన వైద్యులు చెబుతున్నారు.ఆమెకు ఏదో తెలిసివుండటం వల్ల ఆమె నోటిని శాశ్వతంగా మూసివేశారా? సందీప్ ఘోష్ మొదట తన వ్యాఖ్యలలో ఆమెను నిందించాడు. ఆ రాత్రి సమయంలో సెమినార్ హాల్లో ఆమె ఉండటాన్ని తప్పు పట్టాడు. ఆ నిర్లిప్తత సరిపోనట్లు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అధికారులు ఆమె కుటుంబానికి తమ కుమార్తె ఆత్మహత్యతో చనిపోయిందని చెప్పారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని నయవంచన. అసలు ఆమె కుటుంబంతో ఘోష్ వ్యక్తిగతంగా ఎందుకు సమాచారం పంచుకోలేదు? పైగా మౌనంగా ఉండేందుకు పోలీసులు తమకు డబ్బు ఇవ్వజూపారని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, యువ వైద్యురాలు తన కుమార్తె లాంటిదని ఆయన ఆ తర్వాత పేర్కొన్నప్పటికీ,ఈ అంశంపై ఘోష్ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. వెంటనే ఆయన పోలీసులను ఎందుకు పిలిపించలేదు? కోల్కతా హైకోర్టు కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తనపై ఈ ప్రశ్ననే లేవ నెత్తింది.ఈ విచిత్రమైన ప్రతిస్పందనలు సాక్ష్యాలను తారుమారు చేశాయనే అనుమానాలను మరింతగా పెంచాయి. నేరం జరిగిన స్థలానికి చాలా సమీపంలో సాధారణ నిర్మాణపని, మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు చూపించే వీడియో కనిపించింది. ఫోరె న్సిక్స్ కోసం ఆ ప్రాంతాన్ని రింగ్ ఫెన్స్ చేయాలని ఘోష్ అను కోలేదా? తన మొత్తం ఆలోచన అంతా సాక్ష్యం ఎట్టి పరిస్థితు ల్లోనూ దొరకకూడదనే కోణంలో ఉండిందా?ఇంత దారుణ ఘటన నేపథ్యంలో ఘోష్ను కనీసం పదవి నుండి తొలగిస్తారని మీరు అనుకుంటారు. బదులుగా ఏమి జరిగిందో ఊహించండి. ఆయన మరొక మెడికల్ కాలేజీకి అధిపతిగా బదిలీ చేయబడ్డారు. అయితే ఈ కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆయన కార్యాలయానికి తాళం వేసి ఉంచడమే కాకుండా, అతగాడి కొత్త మాయవేషాలను ప్రారంభించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మరో ఉద్యోగం ఎందు కిచ్చారు? అంతే కాదు, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు... ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి... విద్యార్థులతో మాట్లాడటానికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి వచ్చి ఘోష్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిలిపివేయమని కోరినట్లు పశ్చిమ బెంగాల్ మీడియా నివేదించింది.ఘోష్ను అంత శక్తిమంతంగా మార్చింది ఏమిటి? ఆయన గతంలో వివాదాల మధ్యనే మూడుసార్లు బదిలీ చేయబడ్డాడు. విద్యార్థులు, వైద్యులు ఆయన్ని ఒక విధమైన స్థానిక మాఫియాగా పేర్కొంటారు. ఎట్టకేలకు అతడిని హైకోర్టు తొలగించింది. అతని పక్షాన వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని ఎందుకు పంపారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇతర ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి దుండగులను ఎవరు పంపారు?బాధితురాలి పట్ల వ్యవహరించిన విధంగానే తమపై కూడా అత్యాచారం చేస్తామని ఆకతాయిలు బెదిరించారని నర్సింగ్ సిబ్బంది నాతో అన్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయా రనీ, దీంతో తమను తామే రక్షించుకోవలసి వచ్చిందనీ నేను మాట్లాడిన యువ మహిళా వైద్యులు చెప్పారు. ఆకతాయిలు ఎమర్జెన్సీ గదిని ధ్వంసం చేయడంతో సహా కనుచూపు మేరలో ఉన్నవన్నీ ధ్వంసం చేయడాన్ని వాళ్లు చూశారు. బోల్తా పడిన ఆంబులెన్స్ని చూశారు. హాస్టల్లోకి ప్రవేశించడానికి పురుషులు పైపులు, గోడల మీదుగా పైకి ఎగబాకటం చూశారు.ఈ ఆకతాయిలు ఎవరనేది బయటపడినప్పటికీ, ఈ దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిపర మైన కలల కోసం స్త్రీలు వెయ్యిమంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. వారి పని ప్రదేశం కూడా సురక్షితంగా లేక పోతే, ఉద్యోగాల్లో చేరేలా అది మహిళలకు ప్రేరణనివ్వలేదు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కోల్కతా ఘటన: వైద్యుల సమ్మెకు మెడికవర్ హాస్సిటల్స్ మద్దతు
హైదరాబాద్, సాక్షి: కోల్కతా యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ పిలుపుతో ఒక్కరోజు సమ్మెను పాటించారు. ఈ క్రమంలో సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించింది మెడికవర్ హాస్పిటల్స్. ఐఎంఏ సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత , చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది . యావత్ భారతావని దిగ్భాంతికి లోనైంది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి’’ అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశమంతా ఇవాళ ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత బాధాకరమైంది . ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కరించాం’’ అని అన్నారు మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ..‘‘ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం . ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది , భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి , ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’’ అన్నారు. -
దేశంలో వైద్య సిబ్బంది భదత్ర కోసం కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: కోల్కతా యువవైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనలతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపేసి 24 గంటల సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ఫెడరేషన్,ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధులు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారుల్ని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా హామీ ప్రకటన వెలువడింది. ‘‘వైద్య రంగానికి చెందిన ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. తమపై జరుగుతున్న దాడులపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత, రక్షణ కల్పన ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించదు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనేది ఆ కమిటీ మాకు సూచిస్తుంది. దానిని బట్టి విధివిధానాలను రూపొందిస్తాం. ఇప్పటికే దేశంలో 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ చట్టాల్ని రూపొందించినట్లు మా దృష్టికి వచ్చింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని తన ప్రకటనలో ఆరోగ్య మంతత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో.. ఒకవైపు దేశంలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరసనలకు దిగిన వైద్యులు తమ విధులకు హాజరు కావాలని తన ప్రకటనలో విజ్ఞప్తిచేసింది. వారం కిందట పశ్చిమ బెంగాల్ కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిని అత్యంత కిరాతంగా లైంగిక దాడి జరిపిన హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్య రంగ సిబ్బంది నేరుగా నిరసనలు తెలుపుతుండగా.. ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్టుల ద్వారా ఘటనను ఖండిస్తూ వస్తున్నారు. -
ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీ బంద్
-
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ హత్యపై పెల్లుబికుతున్న ఆందోళనలు
-
రేపు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేత : ఫోర్డా
కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఓ మహిళా జూనియర్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు నిరసనగా వైద్యుల సంఘం ‘ది ఫెడరరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)’ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 12 (సోమవారం) నుండి దేశంలోని అన్ని ఆసుపత్రులలో పలు రకాల వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 9న ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఓ మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (PGT) డాక్టర్ హత్యకు గురయ్యారు. ఆమెకు సంఘీభావంగా వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వైద్యురాలి హత్యని రాజకీయం చేయకుండా నిందితుల్ని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫోర్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసింది. 🚨 We shall begin our Nationwide agitation from tomorrow! (Monday 12th August)We stand with our beaten, manhandled, deeply hurt colleagues of R G Kar Medical College, Kolkata. We urge authorities to not make it political and color it bad- It’s humanity which is at stake here.… pic.twitter.com/pPg2ifpBqI— FORDA INDIA (@FordaIndia) August 11, 2024తక్షణ చర్య: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. నిరసనకారులకు రక్షణ: జూనియర్ వైద్యులి మరణంపై న్యాయం చేయాలని కోరుతూ నిరసన చేస్తున్న వైద్యుల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూదని హామీ ఇవ్వాలి. సత్వర న్యాయం, పరిహారం: హత్యకు గురైన వైద్యుని కుటుంబానికి సత్వర న్యాయం, తగిన పరిహారం అందించాలి. మెరుగైన భద్రతా ప్రోటోకాల్లు: అన్ని ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కఠినమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసి, అమలు చేయాలని వైద్యుల సంఘం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. నిపుణుల కమిటీ ఏర్పాటు: సెంట్రల్ హెల్త్కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ను వేగవంతం చేయడానికి వైద్య సంఘాల ప్రతినిధులతో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. అని డిమాండ్ చేస్తూ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఖండిస్తున్న వైద్యులు కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన దారుణాన్ని దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న డాక్టర్లు ఖండిస్తున్నారు. జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కేరళలోని వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు, మెడికల్ టీచర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిరసనలు తెలపనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల అధ్యాపకుల సంఘం కేజీఎంసీటీఏ వైద్యుల్ని హత్యను త్రీవంగా ఖండించింది. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొంటున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా నైట్ డ్యూటీ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డ్యూటీ వర్క్లో భాగమైన మహిళా వైద్యుల భద్రత ఎప్పుడూ ఆందోళన కలిగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పనిని నిర్భయంగా నిర్వర్తించగలిగేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ఆయా ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంది. -
బంగ్లాదేశ్ బాధితులకు భారతీయ వైద్యుల సేవలు
బంగ్లాదేశ్లో నివసిస్తున్న పలువురు భారతీయ వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికన్నా తమ కర్తవ్యమే ముఖ్యమని భావిస్తూ, దేశంలో జరిగిన అల్లర్లలో గాయపడినవారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న భారతీయ వైద్యులు రాజధాని ఢాకాలోనే ఉంటూ వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు.మీడియాతో పలువురు వైద్యులు మాట్లాడుతూ ఢాకాలోని పలు ఆసుపత్రులు అల్లర్ల భాధితులతో నిండిపోయాయని, వారికి సేవలు అందించడమే తమ కర్తవ్యమన్నారు. బాధితుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రులపై భారం మరింతగా పెరిగిందన్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో తాము ఇక్కడే ఉంటామన్నారు. పాత ఢాకాలోని ఒక ఆస్పత్రికి చెందిన వైద్యుడు ఫోన్లో మాట్లాడుతూ నిరసనకారులు, పోలీసుల మధ్య తాజా ఘర్షణల తరువాత మృతుల సంఖ్య పెరిగిందన్నారు. బాధితులకు సేవలు అందించేందుకు తాము రోజుకు 17 నుండి 18 గంటలు పని చేస్తున్నామన్నారు.గుజరాత్కు చెందిన మరో వైద్యుడు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని, అయితే తాము డిగ్రీ పూర్తి చేసే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడుతామని ప్రమాణం చేశామని, దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కష్ట సమయంలో బాధితులకు సేవ చేయడమే తమ కర్తవ్యమన్నారు. -
శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్చేస్తే..!
అత్యవసర శస్త్ర చికిత్స చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ భయానక ఘటన యూఎస్లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..యూకేకి విశ్వవిద్యాలయ విద్యార్థి చార్లీ విన్సెంట్ యూఎస్లో న్యూ హాంప్షైర్లోని వేసవి శిబిరంలో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆరోజు అధిక సూర్యరశ్మీ అతని కాళపై పడటంతో కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. చివరికి వడదెబ్బకు ురై ఆస్పత్రిపాలయ్యాడు. అక్కడ వైద్య పరీక్షలో అతడికి న్యూమోనియా ఉన్నట్లు నిర్థారించారు. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ క్రమంలో అతడికి స్ట్రోక్ రావడం ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం జరిగింది. వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందనే అనుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడి గుండె యథాస్థితికి వచ్చిన పనిచేయడం ప్రారంభమయ్యింది. ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు. దీనిని కార్డియోమొగలీ అని పిలుస్తారని వైద్యులు అన్నారు. అంటే ఇక్కడ గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ 20 ఏళ్ల యువకుడిని దాదాపు ఏడు రోజుల పాటు ప్రేరేపిత కోమాలో ఉంచి చికిత్స అందించారు. మొదట్లో వైద్యులు భయపడిపోయారు. ఎందుకంటే.. ఇక్కడ ఆ వ్యక్తి గుండె, మూత్రపిండాల మార్పిడి అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువని భావించారు వైద్యులు. అలాంటిది అనూహ్యంగా అన్ని అవయవాలు అద్భుతంగా కోలుకుని పనిచేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు వైద్యులు. ఈ మేరకు అతడి చికిత్స అందించిన వైద్యులు మాట్లాడుతూ..ఒకానొక సమయంలో చార్లీ బతికే అవకాశాలు లేవని అనిపించేలా ఉత్కంఠగా ఉంది పరిస్థితి. అతడు అద్భుతంగా తిరిగి కోలుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిదని అన్నారు. సదరు బాధితుడు చార్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించాడు.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
లాలూకు ఎయిమ్స్లో వైద్య పరీక్షలు
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గత రాత్రి(మంగళవారం) ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగానే ఉంది. దీంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.లాలూ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. అక్కడి వైద్యుల ఆయనకు చికిత్స అందించారు. తరువాత అతని ఆరోగ్యం పరిస్థితి కుదుటపడింది. లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు రాత్రంతా ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం.లాలూ ప్రసాద్ యాదవ్కు బీపీ పెరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ వైద్యుడు రాకేష్ యాదవ్ తెలిపారు. 2022లో లాలూకు సింగపూర్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఆయన చాలా కాలంగా మధుమేహం, అధిక రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత లాలూ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్గా మారి, ఎన్నికల సమయంలో వేదికపై నుంచి ప్రసంగాలు కూడా చేశారు. -
Chandipura Virus: గుజరాత్, రాజస్థాన్లలో ప్రమాదకర వైరస్ కలకలం
అంత్యంత ప్రమాదకర చాందిపురా వైరస్ ఇప్పుడు గుజరాత్ను దాటి రాజస్థాన్లోకి ప్రవేశించింది. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో చాందిపురా వైరస్ కేసులు నమోదైన దరిమిలా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వారా బ్లాక్లోని రెండు గ్రామాలలో చాందిపురా వైరస్ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖేర్వాడా బ్లాక్లోని నల్ఫాలా, అఖివాడ గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారినపడి హిమ్మత్నగర్లో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు గ్రామాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందినవారు ఉపాధి కోసం గుజరాత్ సరిహద్దు ప్రాంతాలకు వలస వెళుతుంటారు. ఈ వైరస్ బారినపడిన చిన్నారులలో ఒకరు మృతి చెందారని తాజా సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం గుజరాత్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఈ వైరస్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపింది. చాందిపురా వైరస్ దోమలు, పురుగులు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
ఇడియెట్ సిండ్రోమ్ అంటే ఏంటి? మీకూ ఉందేమో చెక్ చేసుకోండి!
గూగుల్ చేసి చూడకు. రాసిచ్చిన మందులు వాడు’ అని డాక్టర్ పేషెంట్తో చెప్పాల్సి వస్తోంది. కారణం -ప్రిస్కిప్షన్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ మందులను గూగుల్ చేసి వాటి గుణాలు, సైడ్ ఎఫెక్ట్లు, వాటిని ఏయే జబ్బులకు వాడతారు అన్నీ పేషెంట్ తెలుసుకోవడమే. తెలుసుకున్న తర్వాత ఎన్నో డౌటానుమానాలు తెచ్చుకొని కొన్ని మందులు వాడకపోవడం, కొన్ని డోస్ తగ్గించమనడం ఇలా చేస్తూ ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేసే స్వభావానికి ‘ఇడియట్ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. కొన్ని నెలల క్రితం ఒక యువతి కిడ్నీలు ఫెయిలయ్యే స్థితిలో హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు మందులు పని చేయని స్థితిని గమనించారు. కారణం ఆమె యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పినప్పుడల్లా తండ్రి ఇంటర్నెట్లో చూసి మందులు తెచ్చి వాడటమే. అతను డాక్టర్ని కలవాలనుకోలేదు. డాక్టర్ కంటే గూగుల్ని నమ్మాడు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతకమైతే తిరిగి డాక్టరే రక్షించాల్సి వచ్చింది గూగుల్ కాదు.డాక్టర్కు తెలుసు డాక్టర్లు తమ డాక్టర్ పట్టా కోసం ఐదేళ్లు చదువుతారు. ఆ తర్వాత తర్ఫీదు అవుతారు. ఆ తర్వాత ప్రాక్టీసు మొదలెడతారు. దేహ గుణాలు, మందు గుణాలు పేషెంట్ను బట్టి జబ్బును బట్టి తమ అనుభవం కొద్దీ రాస్తారు. పేషెంట్ను కాపాడటమే డాక్టర్ లక్ష్యం. గతంలో డాక్టర్ రాసింది పేషెంట్లు నమ్మకంగా ఫాలో అయ్యేవారు. మహా అయితే మందుల షాపువాణ్ణి ఈ మందులు మంచివేనా అని అడుగుతారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. విస్తృతంగా వచ్చిన ఇంటర్నెట్ వల్ల ప్రతి దాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం, ప్రతి దాన్నీ సందేహించే స్వభావం ఏర్పడ్డాయి. డాక్టర్ రాసిన మందులను తమ ఇష్టానుసారం మార్చు కుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చదివి బెంబేలు పడి కొన్ని వాడటమే లేదు. పైగా మందుచీటిని తిరిగి తీసుకొచ్చి ప్రశ్నలతో వేధిస్తున్నారు. పేషెంట్ల ఇలాంటి రుగ్మతకు డాక్టర్లు పెట్టిన పేరే ‘ఇడియట్ సిండ్రోమ్’!శంక వద్దంటున్నారుఇటీవల సీఎస్ మంజునాథ్ అనే వైద్యుడు ‘మీ గూగుల్ పరిజ్ఞానంతో అయోమయానికి గురై... నా మెడికల్ డిగ్రీని శంకించకండి’ అంటూ బోర్డు పెట్టుకున్న దృశ్యం వైరల్ అయ్యింది. ఆయన దగ్గరే కాదు... ఈ తరహా బోర్డులు మరెన్నో ఆసుపత్రుల్లో కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో వంటలూ, వార్పులూ, కామెడీ ఎంత చూసినా పర్లేదు. కానీ వ్యాధులూ, వైద్యాలు చూస్తూ తమ జబ్బులతో తామే పేషెంట్లు చెలగాటాలాడుతున్నారని డాక్టర్ల ఆవేదన. ‘ఈ మందును ఎక్కువ వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయట’ అంటూ డాక్టర్లకే వైద్యం నేర్పుతున్నారు. ‘పానీపూరీ, ఫాస్ట్ఫుడ్డూ తినేప్పుడు ఇలాగే సైడ్ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారా’ అంటూ డాక్టర్లు చీవాట్లు పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. నిజానికి ‘పేషెంట్’ అనే మాటకు ‘రోగి’ అన్న పదం అంత గౌరవప్రదంగా లేదంటూ ‘బాధితుడు’ అని వాడటం పరిపాటి అయ్యింది. ఇడియెట్ సిండ్రోమ్ వల్ల పేషెంట్ల చేతిలో డాక్టర్లు బాధితులవుతున్నారనేది వైద్యుల ఆవేదన.నెట్ జ్ఞానం సరికాదు...‘ఇడియట్ సిండ్రోమ్’తో రోగులు వైద్యుల్ని ప్రశ్నించడం, సొంతవైద్యం చేసుకోవడం సరికాదు. ఇంటర్నెట్ సమాచారంతో వ్యాధి నిర్ధారణ సమంజసం కాదు. నెట్ చూసి మందులు వాడితే ఒక్కోసారి ప్రాణాలమీదికి రావచ్చు. వైద్యాన్ని వైద్యుడు తన పరిజ్ఞానంతో, అనుభవంతో, నైపుణ్యంతో వ్యాధి నిర్ధారణ చేసి, ఏయే మందులు ఏయే మోతాదులో వాడాలో నిర్ణయిస్తాడు. గూగుల్ సమాచారంతో ఎవరికి వారు నిర్ధారణలూ, మందుల నిర్ణయాలూ సరికాదని తెలుసుకోవాలి.- డాక్టర్ పావనీ ప్రియాంక కార్యదర్శి, ఐఎంఏ, తెనాలి డాక్టర్ షాపింగ్వాస్తవానికి వ్యాధి ఏమిటనేది అనుభవంతో కూడిన వైద్యులు, ఎన్నో కోణాల నుంచి పరిశోధన, ఎన్నో పరీక్షలు చేశాక నిర్థారణ చేస్తారు. తర్వాత తగిన మోతాదులో మందులిస్తారు. అప్పుడు ‘ఈ ఫలానా ఇంజెక్షనే ఎందుకు? దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్ ఉందిగా’ అంటూ అడుగుతున్న పేషెంట్లు... అంతటితో ఆగకుండా... ఆ డాక్టర్ను వదిలి మరో డాక్టర్ దగ్గరికి మరో ఒపినీయన్, ఇంకో ఒపీనియన్ అంటూ తిరుగుతున్నారు. ఇలా తిరగడాన్నే వైద్య పరిభాషలో ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. దీని తర్వాత సొంతంగా మందుల్ని కొని వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న దాఖలాలూ ఉన్నాయి. దీనికి పరాకాష్ట ఇటీవల ఓ భర్త ఇంటర్నెట్ చూస్తూ పురుడు పోస్తూ తన భార్య మరణానికి కారణమయ్యాడు. అందుకే ‘ఇడియట్ సిండ్రోమ్’ ధోరణి వద్దంటున్నారు. – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి. -
గుండె ఆరోగ్యం కోసం ఉపయోగపడే బెస్ట్ ఆయిల్స్ ఇవే..!
గుండె ఆరోగ్యంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, సరిగ్గా పనిచేయడానికి తోడ్పడే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఆహారంలో ఉపయోగించే వంట నూనెలు మన గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని సూచిస్తుంటార. చాలా మందికి గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి నూనెలు తీసుకోవడం మంచిదనేది తెలియదు. అయితే బాలీవుడ్ నటి మాధరీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఐదు బెస్ట్ నూనెలు గురించి వెల్లడించారు. అవెంటో తెలుసుకుందామా..!డాక్టర్ శ్రీరామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే బెస్ట్ నూనెల గురించి షేర్ చేసుకున్నారు. కార్డియోథొరాసిక్ సర్జన్ అయిన ఆయన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ఐదు వంట నూనెల గురించి సవివరంగా తెలిపారు. ఆయన గుండె ఆరోగ్యానికి సిఫార్సు చేసిన ఐదు వంటనూనెలు ఏంటంటే..రైస్ బ్రాన్ ఆయిల్వేరుశెనగ నూనెఆవాల నూనెఆలివ్ నూనెనువ్వుల నూనెఈ నూనెలలో ప్రతి ఒక్కదాని వినియోగం వల్ల పొందే ప్రయోజనాలెంటంటే..రైస్ బ్రాన్ ఆయిల్ఈ నూనెలో అసంతృప్త కొవ్వులు అధికంగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది లిపిడ్ ప్రొఫైల్లను మెరుగుపరిచి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.వేరుశెనగ నూనెదీని వల్ల గుండెకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే విటమిన్ ఈ ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించి, గుండెను ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఆవాల నూనెఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులకు ప్రసిద్ధి చెందింది. ఇందులో ఒమేగా -3 ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ముఖ్యమైనవి. ఆవనూనెలోని విటమిన్ ఈ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి.ఆలివ్ నూనెఇది గుండెకు దాని ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఆలివ్ ఆయిల్లో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఒలీక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్ (హెచ్డిఎల్) స్థాయిలను పెంచి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డిఎల్)ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో పాలీఫెనాల్స్, విటమిన్ ఈ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ రెండూ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆలివ్ నూనె మెడిటరేనియన్ డైట్లో ప్రధానంగా ఉపయోగిస్తార కూడా. నువ్వుల నూనెఈ నూనెలో పాలీఅన్శాచురేటెడ్, మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సెసమోల్, సెసమిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి. నువ్వుల నూనెలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. View this post on Instagram A post shared by Dr. Shriram Nene (@drneneofficial) (చదవండి: 45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్ సీక్రెట్ ఇదే..!) -
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం
మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులున్నారు. జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. పూణె మున్సిపల్ అధికారులు వైరస్ నివారణకు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలోని 46 ఏళ్ల డాక్టర్ జికా వైరస్ బారిపడ్డారు. ఇది రాష్ట్రంలో జికా వైరస్ తొలికేసుగా గుర్తించారు. అనంతరం ఆ వైద్యుని కుమార్తె(15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్గా వచ్చాయి. ఈ నాలుగు కేసులు నమోదైన దరిమిలా అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే జికా వైరస్ సోకిన వీరందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. కాగా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ను తొలిసారిగా 1947లో ఉగాండాలో కనుగొన్నారు. -
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్లా చుట్టి స్టెతస్కోప్లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్గా స్టెతస్కోప్తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
ఎంబీబీఎస్కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
టెన్షన్.. టెన్షన్!
కర్నూలు (హాస్పిటల్): వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టెన్షన్ ఉంటోంది. పిల్లలకు చదువుపై టెన్షన్. ఇన్టైమ్లో హోమ్ వర్క్ చేయడం, చెప్పిన పాఠాలు అర్థం చేసుకోవడం, హోమ్వర్క్ చేయకపోతే టీచర్ కొడుతుందేమోనని భయం వారిది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం యువత టెన్షన్. ఉద్యోగం వస్తేనే అమ్మాయిని ఇస్తారనేది ఇంకో టెన్షన్. ఇలా ఉద్యోగం లేక, పెళ్లి కాని యువత చాలామందే ఉన్నారు. తీరా ఉద్యోగం వచ్చాక ఆయా సంస్థలు, ఉన్నతాధికారులు ఇచ్చే లక్ష్యాలు నెరవేర్చాలంటే మరో టెన్షన్. వీకెండ్ వస్తే ఇంట్లో భార్యాపిల్లల ఇష్టాలు తీర్చేందుకు అవసరమైన డబ్బు లేదనేది మరికొందరి టెన్షన్. పిల్లలు పెద్దయ్యాక వారికి వివాహాలు చేయడం మరో టెన్షన్. దీంతోపాటు ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయాలు, వారి ఆలనాపాలనా చూసేవారు కరువు కావడం, అందరూ ఉన్నా అనాథలు కావడం ఇంకో టెన్షన్. ఇలా ఎవరి స్థాయిలో వారికి టెన్షన్ ఉంటోంది. ఈ క్రమంలో టెన్షన్తో పాటు ఆందోళన, డిప్రెషన్ వస్తున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు ఇటీవల మానసిక వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓపీ పెరుగుతోంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజూ 75 నుంచి 90 మంది వరకు రోగులు వస్తుండగా.. అందులో 40 శాతం కొత్తవారు ఉండటం గమనార్హం. వీరిలో 40 నుంచి 50 శాతం వరకు ఆందోళన, కుంగుబాటు(డిప్రెషన్)కు గురై చికిత్స కోసం వస్తున్న వారే ఉంటున్నారు. వీరు గాక నగరంలోని ప్రైవేటు మానసిక వైద్యుల వద్దకు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 220 నుంచి 250 మంది దాకా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు సైకోసొమాటిక్ (శారీరక, మానసిక) జబ్బులతో బాధపడే వారే ఎక్కువ. దీంతోపాటు 30 శాతం మద్యం, సిగరెట్ అలవాట్లు, 20 నుంచి 30 శాతం మంది తీవ్రమైన మానసిక సమస్యలు (స్క్రిజోఫీనియా, మానియా, డిల్యూషన్ డిజార్డర్లు, బైపోలార్, సివియర్ డిప్రెషన్)తో వస్తున్నారు. వృద్ధుల్లో 5 శాతం మంది నిద్రలేమి, మతిమరుపు సమస్యలతో వస్తున్నారు. చిన్నపిల్లల్లోనూ 5శాతం మంది మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. 2021లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక జబ్బుల విభాగానికి ఓపీ 15,942, ఇన్పేషెంట్లుగా 92 మంది చికిత్స పొందగా.. 2022లో ఈ సంఖ్య ఓపీలో 19,475కి, ఇన్పేòÙంట్లు 175కి, 2023లో ఓపీ 20,323, ఇన్పేòÙంట్ల సంఖ్య 245కు పెరిగింది. నిద్ర లేకపోవడంతోనే సమస్యలు కొంతమంది కొద్దిపాటి సమయం లభించినా కూర్చున్న చోటే ఒక కునుకు తీస్తారు. మరికొందరు అర్ధరాత్రి దాటినా కళ్లు తెరుచుకుని అటూఇటూ చూస్తూనే ఉంటారు. ఇంకొందరు నిద్రపట్టక నిశాచర జీవుల్లా రాత్రిళ్లు ఊరంతా చుట్టేస్తుంటారు. పట్టణాల్లో అధికంగా రాత్రివేళ టీ స్టాల్స్ వద్ద ఇలాంటి వారే మనకు కనిపిస్తుంటారు. ఎప్పుడో తెల్లవారుజామున మూడు, నాలుగు సమయంలో వీరు ఇళ్లకు చేరుకుని నిద్రించి, మరునాడు ఉదయం 10 గంటల వరకు లేవడం లేదు. దీనికి మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, ఆందోళనతో పాటు శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా ఆహారం తీసుకోవడం, ఎక్కువగా మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మరుసటిరోజు శరీరం ఉత్సాహంగా గడిపేందుకు సహకరించడం లేదు. నిరుత్సాహం, నిస్సత్తువ ఆవహిస్తున్నట్టు ఉంటుంది. ఫలితంగా వీరికి గ్యాస్ట్రబుల్, గుండె దడ, ఊబకాయం, మలబద్దకం, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తుతాయి. మానసిక ఆరోగ్యానికి సూత్రాలు » ఇష్టమైన పనులు చేయాలి » బాధలు, కష్టాలను కుటుంబసభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి » భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకూడదు » ఉదయాన్నే వాకింగ్ చేయడం, ధ్యానం, యోగా చేయాలి. దీనివల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిడి అదుపులోకి వస్తాయి. » వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర, సినిమాలు, షాపింగ్కు వెళ్లాలి. » అందుబాటులో ఉంటే రోజులో ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయాలి. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు »తెలివి తక్కువ, బుద్దిమాంద్యంతో కూడిన మానసిక వ్యాధులు » చదువుపై ఏకాగ్రత లేకపోవడం, ఎక్కువగా బయట తిరగటం, బంధువులతో కలవలేకపోవడం, తనలోకంలో తానుండటం » చదువులో వెనుకబడటం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లకు గురవడం నిద్రలో మల, మూత్ర విసర్జనాలు చేయడం తినకూడని పదార్థాలు తినడం (ఉదా: మట్టి, సున్నం మొదలైనవి)మానసిక వ్యాధుల లక్షణాలు» ఆందోళన, భయం, గుండెదడ, అధికంగా చెమట పట్టడం, కాళ్లు, చేతులు వణకడం » గుండె ఆగినట్లు అనిపించడడం, ఛాతినొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, భయం, ఆందోళన » అనవసర ఆలోచనలు మళ్లీ మళ్లీ రావడం, అనవసర పనులు మళ్లీ మళ్లీ చేయడం, చేతులు అదే పనిగా కడగటం » అకస్మాత్తుగా మాట రాకపోవడం, కాళ్లు చేతులు పడిపోవడం, మూర్ఛలాగా రావడం » విచారంగా, పనిలో ఉత్సాహం లేకపోవడం » ఆకలి, నిద్ర లేకపోవుట, ఆత్మహత్య చేసుకోవాలనిపించడం » మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గటం, ప్రవర్తనలో మార్పు, సంధి ప్రేలాపనలు » అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల అలవాటు » మూర్ఛ వ్యాధితో వచ్చే మానసిక, దీర్ఘకాక వ్యాధులతో బాధలు, పక్షవాతం తర్వాత వచ్చే మార్పులు » తనలో తాను నవ్వుకోవటం, మాట్లాడుకోవడం, చెవిలో మాటలు వినబడటం, ఇతరులను అనుమానించడం, భర్తలేక భార్య శీలాన్ని శంకించడం » ఎక్కువగా మాట్లాడటం, తిరుగుట, అతి ఆనందం, అతి ధైర్యం లేదా అతికోపం, అతిగా డబ్బు ఖర్చు చేయడం » పూనకాలు రావటం, తనకు తాను గుర్తుకు లేకుండా తిరుగుట » ముసలితనంలో వచ్చే అనారోగ్య సమస్యలు » అనవసరంగా భయాలు, అనుమానాలు పెంచుకోవడం » అకస్మాత్తుగా గతంలో జరిగిన ఘటనలు మరిచిపోవడం » బహిష్టు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు » కాన్పు ముందు, తర్వాత వచ్చే మానసిక మార్పులు »ఆకలి లేకపోవడం, నాజూకుతనానికై తినకపోవడం, అదుపు లేకుండా తినడం »కలత నిద్ర, నిద్ర పట్టకపోవడం, నిద్రలో నడవటం, మాట్లాడటం, మూత్రవిసర్జన చేయడం, భయంకర కలవరింతలు, అతి నిద్ర, నిద్రలో పళ్లు కొరకడం » నిగ్రహ శక్తి కోల్పోవడం, జూదానికి బానిసవటం, పరుల వస్తువులను అపహరించడం, అదే పనిగా షాపింగ్ చేయడం మానసిక రోగుల సంఖ్య పెరిగిందికొంతకాలంగా మానసిక వ్యాధుల విభాగానికి బాధితులు ఎక్కువగా వస్తున్నారు. ఈ సంఖ్య ఏటా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్–19 పరిస్థితుల అనంతరం మానసిక వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల, జన్యుపరంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, సమాజంలో పలు కారణాల వల్ల స్క్రిజోఫీనియా, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అన్నిరకాల మానసిక సమస్యలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నాం. – డాక్టర్ గంగాధర్నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల విభాగం, జీజీహెచ్, కర్నూలు -
పుణె పోర్షే కేసు: ఇవేం ట్విస్టులు బాబోయ్!
గుద్దింది ఎవరు?.. మైనరేనా? డ్రైవరా?పోయింది మాత్రం రెండు ప్రాణాలుప్రమాదానికి కారణం ఆ మైనరే!పైగా మద్యం సేవించి ఉన్నాడుతండ్రి బిల్డర్.. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తిఅందుకే కేసును తారుమారు చేసే ప్రయత్నాలుఈ క్రమంలోనే రోజుకొక ట్విస్ట్ తెరపైకి పుణె పోర్షే కారు ప్రమాదం.. రోజుకో ట్విస్ట్తో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. తాజాగా నిందితుడైన మైనర్ రక్త నమూనాల రిపోర్టులను తారుమారు చేసినందుకు పోలీసులు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. సాసూన్ ఆస్పత్రిలోని డా. అజయ్ తావ్రే, డా. శ్రీహరి హార్నర్ పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎందుకంటే..ప్రభుత్వ ఆస్పత్రిలో డా. అజయ్ తావ్రే ఫొరెన్సిక్ హెడ్గా పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు నిందిత మైనర్ బాలుడు తన స్నేహతులతో మద్యం చేవించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా కన్పించిన విషయం తెలిసిందే. అయితే మైనర్ బాలుడి రక్త పరీక్షలో మాత్రం మద్యం సేవించనట్లుగా లేకపోవటం, ఆ రిపోర్టు నెగిటివ్ రావటం గమనార్హం. దీంతో రక్త నమూనాలను తారుమారు చేసిన ఇద్దరు డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.అంతకు ముందు పుణె పోలిసు కమిషనర్ అమితోష్ కుమారు మాట్లాడారు. ‘మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదు. మైనర్ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉంది. మైనర్,అతని స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇరుకైన వీధిలో నంబర్ ప్లేట్ లేని కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. అందుకే మేము దీనిపై దృష్టి పెట్టాము. అతను పూర్తిగా అవగాహనతో ఉన్నాడు. తన చర్యల వల్ల ఎదుటువారి ప్రాణాలు పోతాయని తెలుసు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్ను పరీక్ష చేయించాము. రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయి’అని అమితోష్ కుమారు తెలిపారు.పోలిసులు వివరాల ప్రకారం.. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదు. రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్ రావటం గమనార్హం. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. డీఎన్ఏ టెస్ట్లో సాంపిళ్లు వేరుగా ఉన్నాయి. మైనర్ రక్త నమూనా మరోక వ్యక్తి రక్త నమూనాతో తారుమారు అయింది.దీంతో మైనర్ రిపోర్టులో నెగటివ్ వచ్చింది.ఆదివారం (మే 26): ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్ అంగీకరించేందుకు డ్రైవర్ కుటుంబానికి.. మైనర్ తాత పెద్దమొత్తంలో డబ్బు, బహుమతులు ఆశ చూపించారని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. తాము చెప్పినట్లే నడుచుకోవాలని అతడిని బెదిరించారని తెలిపారు. బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.శనివారం( మే 25):రోడ్డు ప్రమాదం ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. అలా ఈ కేసులో మూడో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.శుక్రవారం( మే 24): ప్రమాదం గురించి వైర్లైస్ కంట్రోల్రూమ్కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.#PorscheAccident: #Pune Police Obtain CCTV Showing Teenager Frequently Drove Cars#Pune Police have acquired #CCTV footage revealing that a teenager involved in a recent Porsche accident often drove cars. pic.twitter.com/SO2qoALTzA— Punekar News (@punekarnews) May 27, 2024గురువారం( మే 23): పోర్షే కారు ప్రమాద ఘటన జరిగినప్పుడు కారును నడిపింది తమ డ్రైవర్ అని మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. అయితే, కేసు నుంచి మైనర్ను తప్పించేందుకే డ్రైవర్ను ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.బుధవారం( మే 22): రోడ్డు ప్రమాదానికి ముందు ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ బాలుడు కేవలం 90 నిమిషాలకు పబ్బులో రూ. 48 వేలు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు.మంగళవారం( మే 21): రోడ్డు ప్రమాదం కేసులో పోర్షే కారు నడిపిన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్టు కింద ఆయనపై నమోదైన కేసు ఆధారంగా ఔరంగాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సోమవారం( మే 20): తన ర్యాష్ డ్రైవింగ్తో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న నిందుతుడైన మైనర్కు 15 గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులు చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ఆదివారం(మే 19): ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. ఓ బైక్ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా అనే ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
హైపర్టెన్షన్కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
నిజ జీవితంలోని కొన్ని ఘటనలు సినిమా సీన్లను తలపిస్తాయి. ఇటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఉత్తరాఖండ్లోని రిషికేశ్కు సంబంధించినది. ఈ వీడియోలో ఆసుపత్రిలోకి పోలీసుల వాహనం దూసుకువెళ్లడం కనిపిస్తుంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.రిషికేశ్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తమవాహనంతో సహా ఆసుపత్రిలోనికి దూసుకువచ్చారు. ఆ నిందితుడు అదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడని పోలీసులకు ఫిర్యాదు అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆసుపత్రిలోకి వాహనంతో సహా వచ్చిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేసి, అదే వాహనంలో తీసుకువెళ్లారు.దీనికి ముందు ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆస్పత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోనికి వచ్చి, నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.The cops drove their car inside AIIMS Rishikesh.pic.twitter.com/rZDkCvHipM— Divya Gandotra Tandon (@divya_gandotra) May 22, 2024 -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్పూర్లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్పూర్లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉందని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మరోసారి ఆయనకున్న జంతు ప్రేమను నిరూపించుకున్నారు.త్రిపురలోని కైలాషహర్ ప్రాంతంలో ఒక ఏనుగు అనారోగ్యంతో బాధపడుతోంది. దానికి సహాయం చేయాలని అనంత అంబానీని కోరారు. దీనికి సంబంధించిన వీడియో 'కుంతల సిన్హా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి అనంత్ అంబానీ స్పందించారు.అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు సహాయం చేయడానికి అనంత్ అంబానీ.. వైద్యుల బృందాన్ని అక్కడకు పంపారు. వైద్యుల బృందం సుమారు 3500 కిమీ ప్రయాణించి అనారోగ్యంతో ఉన్న ఏనుగుకు చికిత్స చేశారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.Hats off to #AnantAmbani who acted promptly to save life of elephant and sent #Vantara medical team within 24 hours to Tripura.#Jamnagar #animallove pic.twitter.com/nvva96W6wm— AkashMAmbani (@AkashMAmbani) May 12, 2024 -
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ ఐదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా అనుకోకుండా చిన్న ఎల్ఈడీ బల్బు మింగాడు. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బల్బు బాలుడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లు డాక్టర్లు గుర్తించారు.బాలుడు దగ్గుతుండడంతో పాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆపరేషన్ చేసి బల్బు తీయడానికి డాక్టర్లు ప్రయత్నించారు. రెండుసార్లు బ్రాంకోస్కోపి సర్జరీ చేసినప్పటికీ బల్బు బయటికి తీయడం వీలు కాలేదు. దీంతో డాక్టర్లు బాలుడి ఛాతి ఓపెన్ చేసి సర్జరీ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.మేజర్ సర్జరీ అని భయపడ్డ తల్లిదండ్రులు బాలుడిని శ్రీరామచంద్ర మిషన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు సీటీ స్కాన్తో బల్బును గుర్తించి బ్రాంకోస్కోపి సర్జరీ ద్వారా తీసివేశారు. దీంతో బాలుడి ఆరోగ్యం కుదుటపడింది. బాలుడు త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్లు తెలిపారు. -
నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
పరోటాలు దగ్గర నుంచి పిజ్జా, బర్గర్, కేక్స్, గులాబ్ జామున్, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను మైదాతోనే తయారు చేస్తారు. ఆఖరికి సాయంత్రం వేళ్ల టీ తాగుతూ తినే బిస్కెట్లు, సమోసాల్లో కూడా మైదా ఉంటుంది. రోగులకు ఇచ్చే బ్రెడ్లలో కూడా మైదా ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో ఏదో రకంగా తెలియకుండానే మైదాను తీసుకుంటున్నాం. అలాంటిది మరీ మైదా మంచిదికాదని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం? వైద్యులు ఏమంటున్నారు ? ఎవరెవరు తినకూడదు అంటే.. మైదాని ఎలా తయారు చేస్తారంటే.. బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు. అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారనిని న్యూట్రీషియన్లు వివరించారు. గోధమ రవ్వకు, మైదాకు తేడా ఏంటంటే.. బ్రాన్ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. అందువల్ల మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని చెప్పి మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. తెలుపు రంగుకి కారణం.. మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు. బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి. బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు మైదా వల్ల షుగర్ వస్తుందా.. మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు. నిజానికి అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనదని గ్రహించాలి. అందువల్ల ఈ రెండింటిని పోల్చకూడదు. మైదాలో ఏముంటాయంటే.. ‘గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుందని చెబుతున్నారు న్యూటిషియన్లు. (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?) -
సీఎం జగన్ దాడిపై డాక్టర్ సంచలన విషయాలు
-
సీఎం జగన్కు తీవ్ర గాయం.. విశ్రాంతి అవసరం: వైద్యులు
సాక్షి, విజయవాడ: బస్సు యాత్రలో జరిగిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై తీవ్ర గాయమైందని, గాయానికి మూడు కుట్లు వేశామని జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. సీఎం జగన్ ముఖంపై వాపు ఉందని, విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు వైద్యులు సూచించారు. సీఎం జగన్పై హత్యాయత్నం ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్కు చికిత్స అందించారు. ఎడమ కంటి కనుబొమ పైభాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, మందులను ప్రిస్క్రైబ్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది ‘మీరు జాగ్రత్తగా ఉండండి అన్నా’ అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్కు కనుబొమ పైభాగాన లోతైన గాయమైనట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. ఆది, సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఆస్పత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్కుమార్, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాశ్ ఉన్నారు. కాగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. నేడు యాత్రకు విరామం యాత్ర ముగిశాక గాయానికి చికిత్స చేయించుకోవటం కోసం ముఖ్యమంత్రి జగన్ నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. అక్కడకు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా చేరుకుని ఆసుపత్రిలో ఆయనకు తోడుగా ఉన్నారు. వైద్యులు గాయాన్ని పరీక్షించాక, వైఎస్ జగన్కు లోకల్ అనస్తీషియా ఇచ్చి.. కుట్లు వేశారు. కొంత విశ్రాంతి అవసరమని సూచించారు. చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. ఆదివారం నాడు బస్సు యాత్రకు విరామంగా ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. -
చాక్లెట్లా? మందులా..? కాంబినేషన్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై విశ్వాసంతో రోగులు వారి వద్దకు వెళుతుంటారు. చిన్నాచితకా అనారోగ్య సమస్యల్ని సైతం వారికి చెప్పుకుంటారు. కానీ కొందరు డాక్టర్ల అవగాహన రాహిత్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది. అవసరం లేకున్నా ఎడాపెడా మందులు రాస్తున్నారని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశోధనలో వెలుగు చూసింది. దేశంలో పేరెన్నికగన్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రులు మొదలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు రాస్తున్న ప్రిస్కిప్షన్లలో నిబంధనల అతిక్రమణ జరుగుతున్నట్లు పరిశోధన తేల్చింది. ఈ మేరకు ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజేఎంఆర్లో తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. పీజీ విద్యార్థుల నుంచి అనుభవజ్ఞుల వరకు.. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్లు ఏ మేరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్న దానిపై ఐసీఎంఆర్ పరిశోధన చేసింది. మొత్తం 4,838 ప్రిస్కిప్షన్లను అధ్యయనం చేసింది. ఇందులో 55 శాతం ప్రిస్కిప్షన్లు మాత్రమే నిబంధనల మేరకు ఉన్నాయని, 45 శాతం ప్రిస్కిప్షన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. 9.8 శాతం ప్రిస్కిప్షన్లలో పూర్తిగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేసింది. జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ, సైకియాట్రీ, ఆర్థో, ఛాతీ, డెంటల్, సూపర్ స్పెషాలిటీలకు చెందిన అన్ని విభాగాల్లో డాకర్లు రాసిన ప్రిస్కిప్షన్లలో ఈ రకంగా నిబంధనల అతిక్రమణ జరుగుతుంది. ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన ప్రిస్కిప్షన్లు రాసిన వారిలో పీజీ విద్యార్థులు మొదలు నాలుగు నుంచి 18 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు కూడా ఉండటం గమనార్హం. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రిస్క్రిప్షన్లలో సగటున నాలుగు మందులు అనవసరంగా రాసినట్లు పరిశోధనలో గుర్తించారు. జలుబుకు ఇన్ని మందులా..! సాధారణ జలుబుకు కూడా డాక్టర్లు ఇష్టారాజ్యంగా మందులు రాసేస్తున్నారు. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం.. జలుబు, తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మాంటిలూకాస్ట్+లివోసిట్రిజిన్, పారసిటమాల్, డెక్స్ట్రోమితార్పాన్,రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ ఈ నాలుగు మందులు అధికంగా వాడుతున్నారు. ఇందులో మాంటెలుకాస్ట్+లివోసిట్రిజిన్, రాబిప్రజోల్+డోమ్పెరిడోన్ మందులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిని అనవసరంగా రాస్తున్నారు. ఈ కాంబినేషన్లు నిబంధనలకు విరుద్ధం. ఈ రెండు నిషేధిత జాబితాలో కూడా ఉన్నాయి. వీటివల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బీపీ, షుగర్, మలేరియా, కీళ్ల నొప్పులు, మైగ్రెయిన్, కడుపులో మంట, అజీర్తి, పిప్పిపళ్లు, చెవిపోటు, టీబీ, పోస్ట్ కోవిడ్కు సంబంధించిన జబ్బుల్లో అత్యధికంగా నిబంధనల అతిక్రమణ జరుగుతోంది. అజిత్రోమైసిన్, ర్యాంటిడిన్, ట్రిప్సిన్ వంటివి కూడా ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. ప్రిస్కిప్షన్లలో వీటిని ఎడాపెడా రాసేసుస్తున్నారు. చెవికి, శ్వాసకోశానికి కూడా ఒకేరకమైన మందులు వాడుతున్నారు. నొప్పి మందులతో పాటు ఎసిడిటీ మందులు ఎందుకు? నొప్పి మందుల వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎసిడిటీ రిస్క్ ఉన్న వారికే ఆయా మందులు రాయాలి. కానీ అందరికీ రాస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తేలికపాటి ఆహారం తీసుకుంటే సరిపోయే వారికి కూడా ఎసిడిటీ మందులు రాస్తున్నారు. ఎసిడిటీకి సంబంధించి పాంటోప్రొజోల్, రాబిప్రజోల్+డోంపెరిడోన్ అనే మందులు అత్యంత దుర్వినియోగానికి గురవుతున్నాయి. 21.9 శాతం ప్రిస్కిప్షన్లు అనవసరంగా రాసినట్లు నిర్ధారించారు. కాంబినేషన్ మందుల కింద అనవసరంగా రాస్తున్నారు. రియాక్షన్లు..దుష్ప్రభావాలు కీళ్ల నొప్పులకు సెరాసోపెప్టిడేజ్ అనే మందు రాస్తున్నారు. కానీ ఇది పనిచేస్తుందో లేదో స్పష్టత లేదని ఐసీఎంఆర్ తేల్చింది. కర్ణభేరి ఇన్ఫెక్షన్లకు వాడే సెఫిక్జిమ్ అనే మందు మొదటి ప్రాధాన్య మందు కాదు. కానీ అధికంగా వాడేస్తున్నారు. బీపీ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించి మందులను అనవసరంగా రాస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆయా మందులు వాడటం వల్ల మందుల ఖర్చు పెరుగుతుంది. డ్రగ్ రియాక్షన్లకు కారణమవుతున్నాయి. చర్మంపై మచ్చలు వస్తున్నాయి. కాంబినేషన్లో రెండు మూడు మందులు రాయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. డోసులు ఎక్కువ తక్కువ! నిబంధనల అతిక్రమణలో మందులు అధికంగా, అనవసరంగా రాయడమే కాదు...డోసులు తక్కువ లేదా ఎక్కువ ఉండటం కూడా జరుగుతోంది. మందులు ఎన్ని రోజులు వాడాలి, రోజుకు ఎన్నిసార్లు వాడాలన్న దానిపైనా ప్రిస్క్రిప్షన్లు సరిగా ఉండటం లేదు. అలాగే ఫార్ములేషన్లో తప్పులు జరుగుతున్నట్లు నిర్ధారించారు. డయాబెటిక్ మందులు, హార్మోన్ మందులు, రక్తాన్ని పలుచన చేసే మందులు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయి. బీపీ, షుగర్, ఫిట్స్ రోగాలకు వాడే మందుల్లో సరైన కాలపరిమితిపై స్పష్టత ఇవ్వడం లేదు. డాక్టర్లకు అవగాహన కల్పించాలి ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులో 40 శాతం మందుకే వెచ్చిస్తున్నారు. మందుల వినియోగం శాస్త్రీయంగా జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 344 మందుల కాంబినేషన్లను నిషేధిత జాబితాలో చేర్చింది. వీటి మీద డాక్టర్లకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. ఐసీఎంఆర్ తీసుకువచ్చిన స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కేవలం వెబ్సైట్కే పరిమితం అవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వైద్యంలో మనం నాణ్యతను పెంచగలం. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రభుత్వ బోధనా వైద్యుల జాతీయ అనుసంధానకర్త -
జర జాగ్రత్త.. అవి ఓఆర్ఎస్లు కాదు.. ప్యాకేజ్డ్ జ్యూస్లే!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య డీహైడ్రేషన్. అయితే దీని చికిత్సకు తక్షణ పరిష్కారంగా బాధితులు మెడికల్ షాపుల నుంచి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్)ను పోలిన వాటిని వాడుతూ మరింత అనారోగ్యం పాలవుతున్న ఉదంతాలు హైదరాబాద్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోంది. దీనికి కారణం బాధితులు వినియోగించినవి నిజమైన ఓఆర్ఎస్లు కాకపోవడమేనని వైద్యులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం నగరవాసులు వినియోగిస్తున్న వాటిలో అనేకం నిజానికి ఓఆర్ఎస్లు కావని... అవి కేవలం ప్యాకేజ్డ్ పండ్ల రసాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేమితో వాటిని వినియోగించడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయమే.. ఆకస్మిక అనారోగ్యం తద్వారా నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల శరీరం నుంచి లవణాలు,నీరు అధికంగా కోల్పోవడాన్నే డీహైడ్రేషన్గా పేర్కొంటారు. ఈ పరిస్థితి ఏర్పడడం వల్ల శరీరంలో రక్తసరఫరా తగ్గిపోతుంది. అది అనంతరం ఫిట్స్ రావడానికి లేదా కిడ్నీ ఫెయిల్ కావడం వంటి తీవ్ర సమస్యలకు కూడా దారితీయొచ్చు. ఈ ప్రమాదాల్ని నివారించడానికి బాధితులకు వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వాలని వైద్యులు సూచిస్తుంటారు. డీహైడ్రేషన్ ద్వారా మనం కోల్పోయిన నీటిని, లవణాలను భర్తీ చేసేదే ఓఆర్ఎస్. అలవాటులో పొరపాటుగా... కానీ భాగ్యనగరంలో అనేక మంది డీహైడ్రేషన్కు గురవగానే ఓఆర్ఎస్లుగా భావించి వాటిని పోలిన పేర్లతో ఉండే వాటిని వినియోగిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో కనిపించే వాటిని ఓఆర్ఎస్ఎల్ అని, రీబ్యాలెన్స్ విట్ ఓఆర్ఎస్ మొదలైన పేర్లతో కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే వీటిని ఓఆర్ఎస్గా వాడకూడదని చిన్న అక్షరాల్లో ఓ మూలకు రాస్తుండటంతో చాలా మంది వాటిని గమనించక ఓఆర్ఎస్గా భావించి వాడుతున్నారు. రివర్స్ రిజల్ట్... పండ్ల రసాలను ఓఆర్ఎస్గా భ్రమింపజేసేలా లేబుల్ అతికించి విక్రయించడంపై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి అధిక చక్కెరను కలిగి ఉంటాయని, అతిసారాన్ని తగ్గించే బదులు మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. చక్కెర శాతం అధికంగా ఉండే జ్యూస్ల వాడకం వల్ల మనం ఏ ప్రయోజనం ఆశించి వాటిని తీసుకుంటున్నామో వాటికి పూర్తి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అంటే విరేచనాలు, వాంతులు మరింతగా పెరుగుతాయని వివరిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా కీలకం... కేవలం డబ్ల్యూహెచ్ఓ ఫార్ములాను అనుసరించి తయారైన ఓఆర్ఎస్లనే వాడాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఓపీ) వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం తయారైన ఓఆర్ఎస్లో సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, పొటాíÙయం క్లోరైడ్, ట్రైసోడియం సిట్రేట్ మాత్రమే ఉంటాయని... కాచి చల్లార్చిన లీటర్ నీటిలో ఈ మిశ్రమాన్ని కలిపి 24 గంటల వ్యవధిలో తాగితే డయేరియా వల్ల కలిగే నిర్జలీకరణాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కల్పించాలి.. ఈ సమస్యపై కొన్నేళ్లుగా రకరకాల వేదికలపై పోరాడుతున్నా. అసలైన ఓఆర్ఎస్ను పోలిన లేబుల్స్తో ఉన్న ప్యాకేజ్డ్ జ్యూస్లను వాడటం వల్ల చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. దీనిపై వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలు -
Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..
ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్ ఫుడ్కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గానుగ నూనె బెటరా అంటే.. గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ. అయితే, ఎక్స్పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్ను వేరుచేస్తారు. అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే. ఏది బెటర్ అంటే.. చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్ను కొద్దిగా తీసుకోవచ్చు. వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు 450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..) -
5,348 పోస్టుల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలో 11, ఆయుష్ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 34, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు. వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు ► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 351, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 193, స్టాఫ్నర్స్– 31 ► డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ పరిధిలోజూనియర్ ఎనలిస్ట్ – 11 ► ఆయుష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (ఆయుర్వేద)– 6, టెక్నికల్ అసిస్టెంట్ (యునాని) – 8, లెక్చరర్ (ఆయుర్వేద) –1, లెక్చరర్ (హోమియో) –10, మెడికల్ ఆఫీసర్ (యు) లీవ్ రిజర్వుడు–1 ► ఐపీఎంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్– 4, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 లోకల్ క్యాడర్ –6, లేబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్–2 స్టేట్ క్యాడర్ –1, లేబరేటరీ అటెండెంట్ స్టేట్ క్యాడర్– 7, వ్యాక్సినేటర్ –1, స్టాఫ్నర్స్–1, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) –1, జూనియర్ అనెలిస్ట్ (లోకల్ క్యాడర్)–2, జూనియర్ అనెలిస్ట్ (స్టేట్ క్యాడర్) – 11 ► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్ టెక్నీషియన్–6, డెంటల్ హైజినిస్ట్– 3, ఈసీజీ టెక్నీషియన్ – 4, ఈఈజీ టెక్నీషియన్ – 5, అనెస్థిషియా టెక్నీషియన్ – 93, ఆడియో విజువల్ టెక్నీషియన్ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్– 18, బయో మెడికల్ ఇంజనీర్–14, బయో మెడికల్ టెక్నీషియన్– 11, డెంటల్ టెక్నీషియన్– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్– 19, ఆప్తోమెట్రిస్ట్– 20, స్టెరిలైజేషన్ టెక్నీషియన్–15, ఫిజియోథెరపిస్ట్–33, అసిస్టెంట్ ప్రొఫెసర్లు– 555, నాన్ మెడికల్ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ లెక్చరర్– 5, పర్ఫ్యూజనిస్ట్–3, లైబ్రేరియన్–14, ఫిజికల్ డైరెక్టర్ – 5, క్లినికల్ సైకాలజిస్ట్ – 2, స్పీచ్ పాథాలజిస్ట్– 1, చైల్డ్ సైకాలజిస్ట్– 21, ఇమ్యునోలజిస్ట్–1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు–80, మెడికో సోషల్ వర్కర్ (గ్రేడ్–2)– 95, స్టాఫ్నర్సులు–1,545, స్టాటిస్టిషియన్–20, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2) – 125, ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్–2)– 420 ► తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఫిజియోథెరపిస్ట్– 13, ఏఎన్ఎంలు– 85, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు– 617, స్టాఫ్నర్సులు– 332, డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు – 6, ల్యాబ్ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్ (గ్రేడ్–2)– 66 ► ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్ సర్జరీ –1, ఈఎన్టీ– 1, గైనిక్ అంకాలజీ– 2, మెడికల్ ఆంకాలజీ (పీడియాట్రిక్ మెడికల్ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్ అంకాలజీ –1, న్యూక్లియర్ మెడిసిన్– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ – 2, రేడియోలాజికల్ ఫిజిక్స్ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్ అంకాలజీ – 6, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్–1. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్) – 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (అనెస్థీషియా)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సైటో పాథాలజీ)– 2, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పాథాలజీ) –2, లెక్చరర్ (న్యూక్లియర్ అంకాలజీ) – 1, లెక్చరర్ (న్యూక్లియర్ మెడిసిన్/న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్)– 3, బయోమెడికల్ ఇంజనీర్ – 2, స్టాఫ్నర్స్–80, ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్–2 – 8, మౌల్డ్ టెక్నీషియన్ – 1, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్ ఇమేజింగ్)– 5, థియేటర్ అటెండెంట్లు–5, డెంటల్ టెక్నీషియన్ –1, ఈసీజీ టెక్నీషియన్– 2, ల్యాబ్ టెక్నీషియన్– 8, మెడికల్ ఫిజిసిస్ట్– 5, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్– 3, రేడియోగ్రాఫర్ సీటీ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ మమోగ్రఫీ టెక్నీషియన్–1, రేడియోగ్రాఫర్ ఎంఆర్ఐ టెక్నీషియన్– 2, రేడియోగ్రాఫర్ ఆర్టీ టెక్నీషియన్– 5, రేడియోగ్రాఫర్–6, సోషల్ వర్కర్–6. -
మమతా బెనర్జీ గాయంపై వైద్యుల అనుమానాలు
సాక్షి, కోల్కతా : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడలేదని, గుర్తు తెలియని అంగతకులు వెనుక నుంచి నెట్టడం వల్ల ఆమె తల, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు ఎస్కేఎం ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 7.30 గంటలసమయంలో మమతా బెనర్జీ కాళీగట్లో తన నివాసంలో కింద పడ్డారు. అయితే సిబ్బంది అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలోని వుడ్బర్న్ వార్డ్లో చేర్చారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీదీ నుదిటిపై 3కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేశారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సిఫార్సు మేరకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రాత్రి 9:45 గంటలకు, ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట్లో పడిపోవడం వల్లే గాయమైందని అందరూ అనుకున్నారు. కానీ మమతా బెనర్జీ తీవ్ర గాయాలు పాలు కావడం వెనుక కోట్ర దాగినట్లు సమాచారం. ఎస్ఎస్కేఎం డైరెక్టర్ మణిమోయ్ బంద్యోపాధ్యాయ ఈ సంఘటనకు గల కారణాల్ని వెల్లడించారు. సీఎం తనకు తానుగా పడిపోవడం వల్ల జరిగే గాయాలకంటే.. ఆమె వెనుక నుంచి ఎవరో బలవంతంగా నెట్టడం వల్లే నుదిటికి, ముక్కుకి గాయాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణాల్ని నిర్ధారించలేదు. ఈ సందర్భంగా ఈసీజీ, సిటిస్కాన్ చేసినట్లు చెప్పిన ఆయన.. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆస్పత్రిలో ఉండాలని సూచించామని, కానీ ఆమె ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడినట్లు తెలిపారు. ఇక శుక్రవారం వరకు ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు మమత కోడలు, తృణమూల్ కౌన్సిలర్ కజారీ బెనర్జీ దీదీకి గాయాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీదీ పడిపోయింది అని విన్నాను. ఎవరో నెడితేనే తీవ్రగాయాయ్యాయని అన్నారు. కాగా, గురువారం సాయంత్రం, దివంగత తృణమూల్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆమె కాళీఘాట్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న దక్షిణ కోల్కతాలోని గరియాహట్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమె కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. -
Hyderabad: కిడ్నీలో 418 రాళ్లు!
లక్డీకాపూల్: కేవలం 27 శాతం మాత్రమే కిడ్నీ పనితీరు ఉన్న ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి ఏఐఎన్యూ వైద్యులు ఏకంగా 418 రాళ్లను తొలగించారు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయడం మరో విశేషం. 60 సంవత్సరాల వయస్సు గల మహేష్ కిడ్నీలో అసాధారణ సంఖ్యలో రాళ్లు ఉండటంటతో కిడ్నీ పనితీరు దెబ్బతినింది. ఆయనకు సంప్రదాయ శస్త్రచికిత్స కంటే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ కె.పూర్ణచంద్రారెడ్డి, డాక్టర్ గోపాల్ ఆర్.టక్, డాక్టర్ దినేష్ నేతృత్వంలోని బృందం నిర్ణయించింది. అందుకోసం పెర్క్యుటేనియస్ నెఫ్రోలితోటమీ (పీసీఎన్ఎల్) పద్ధతిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పరికరాలతో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా కిడ్నీలోకి ఒక సూక్ష్మ కెమెరా, లేజర్ ప్రోబ్లను పంపారు. ఆ కెమెరా చూపించిన దృశ్యాలతో రాళ్లన్నింటినీ తొలగించగలిగారు. దీనివల్ల పెద్ద కోత అవసరం లేకపోవడంతో పాటు రోగికి నొప్పి అంతగా ఉండకపోవడం, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం దాదాపు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం వైద్య బృందం ప్రతి ఒక్క రాయినీ తొలగించి రోగికి ఊరట కలి్పంచింది. అద్భుతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునిక పరికరాలు ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించాయి. దీంతో కిడ్నీ అతడి పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. ఇలా చిన్న రంధ్రం పెట్టి, దాని ద్వారానే మొత్తం 418 రాళ్లను తొలగించడం వైద్యపరమైన నైపుణ్యానికి ప్రతీక. వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఉప్పు తక్కువగా, నీళ్లు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలని ఏఐఎ¯Œన్యూ వైద్య నిపుణులు సూచించారు. -
గంట ఆగిన గుండె... మళ్లీ కొట్టుకుంది!
ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం అపేసింది.. ఇంకేముంది చనిపోయాడని అనుకున్నారందరూ. ఎలక్ట్రిక్ షాకిస్తే (డిఫిబ్రిలేషన్) గుండె మళ్లీ కొట్టుకుంటుందేమో అని ఆశించారు. వైద్యుల సాయంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 షాకులిచ్చారు. అయినా... ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకున్న వైద్యులు.. అంతా అయిపోయిందని బంధువులకు చెప్పాలని అనుకుంటున్న సమయంలో జరిగిందో అద్భుతం! పదిహేడు వరుస షాకులకూ స్పందించని ఆ గుండె మళ్లీ లబ్ డబ్ అనడం ప్రారంభించింది! ఏమా అద్భుతం.. ఎక్కడ జరిగింది? కారణాలేమిటో తెలిశాయా? ఇవేనా మీ అనుమానాలు. తీర్చుకోవాలంటే చదివేయండి మరి!!! గత ఏడాది జూన్లో యూకేలో జరిగిందీ ఘటన. ముప్ఫై ఒక్క ఏళ్ల పిన్న వయసులో బెన్ విల్సన్ రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె పనిచేయకుండా ఉండే పరిస్థితిని అనుభవించాడు. మొదటిసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వైద్యులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. వరుసగా 11 షాకులిచ్చారు. ఇందుకు దాదాపు 40 నిమిషాల సమయం పట్టింది. హమ్మయ్యా బతికిపోయాడులే అనుకునేంతలోపే... విల్సన్కు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. వైద్యులు మళ్లీ డీఫిబ్రిలేటర్తో షాకులివ్వడం మొదలుపెట్టారు. పదంటే పది నిమిషాల్లో ఏకంగా ఆరు షాకులిచ్చారు. అప్పటిగానీ విల్సన్ గుండె సాధారణ స్థితికి రాలేదు.!! అంతేనా.. విల్సన్కు బాగైందా? అంటే అక్కడే ఇంకో ట్విస్టు ఉంది. పదిహేడు షాకులు తిన్న గుండె బాగా బలహీనంగా ఉండింది. పైగా గుండె పనిచేస్తోంది కానీ... మెదడుకు రక్తప్రసరణ జరగడం లేదు. పోనీ చికిత్స చేద్దామా అంటే తట్టుకునేంత శక్తి గుండెకు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ దశలో వైద్యులు ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నారు. విల్సన్ను కోమాలోనే ఉంచేద్దామని తీర్మానించారు. కోమాలోనే మెదడుకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేశారు. ఇలా ఐదు వారాలపాటు చికిత్స అందించిన తరువాత కానీ విల్సన్ మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ తర్వాత నెమ్మమదిగా నడవడం, మాట్లాడే సామర్థ్యాన్ని తిరిగి పొందాడు. ప్రస్తుతం అతను కొద్దిపాటి జ్ఞాపకశక్తి సమస్యలను తప్పించి చాలావరకు అతని ఆరోగ్యం మెరుగుపడింది. ఈ మేరకు అతడి భార్య రెబెక్కా హోమ్స్ మాట్లాడుతూ .. ఆ సమయంలో తాను విల్సన్ పక్కనే ఉండిపోయానని, "డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ ఆఫ్ మి" అనే మా పాటను పాడుతూ ఉన్నానని నాటి విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. తన దిండుపై తాను ఉపయోగించే స్ప్రేని కొట్టి..అతడు తన కోసం కొన్న టెడ్డీని అతడి పక్కనే ఉంచి వెనక్కి వచ్చేయి విల్సన్ అంటూ అతడివైపే చూస్తూ ఉండిపోయానని చెప్పుకొచ్చింది. తన ప్రేమే అతడిని ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడేలా చేపిందని ఆనందంగా చెబుతోంది. అతను తనను ఎంతగానో ప్రేమించేవాడిని, ఈ కష్టకాలంలో అతడి పక్కనే ఉండి ఆ ప్రేమనంత తాను తిరిగి అతడికి అందించానని ఉద్వేగంగా చెప్పింది రెబెక్కా. ఏదీఏమైన ఈ ఘటన మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. (చదవండి: ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే మాంసం ఏదో తెలుసా! భారత్లో ఏది ఇష్టపడతారంటే..) -
వైద్య ఆరోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ (ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదు) విధానాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేపడుతోంది. వైద్య విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. దీనిలో భాగంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్(ఏపీవీవీపీ) పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (సీఏఎస్ఎస్) పోస్టుల భర్తీకి బుధ, శుక్రవారాల్లో ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ.. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాల్లో పోస్టులను బుధవారం భర్తీ చేయనున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, ఈఎన్టీ, ఆప్తమాలజీ, పాథాలజీ విభాగాల్లో పోస్టుల భర్తీకి శుక్రవారం వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం తాడేపల్లిలోని సెకండరీ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించే వాకిన్ రిక్రూట్మెంట్కు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హాజరవ్వాల్సి ఉంటుంది. శాశ్వత, కాంట్రాక్ట్, కొటేషన్ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి స్పెషలిస్ట్ వైద్యులు ముందుకు రాకపోతుండటంతో కొటేషన్ విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి ఎంత వేతనం కావాలో వైద్యులు కొట్ చేయవచ్చు. ఆ కొటేషన్లను పరిశీలించి వైద్యులు కోరినంత వేతనాలను ఇచ్చి మరీ ప్రభుత్వం వైద్యులను నియమిస్తోంది. పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/, https://hmfw.ap.gov.in వెబ్సైట్లను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని అర్బన్ హెల్త్, వెల్నెస్ సెంటర్లలో 189 పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేసన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. భర్తీ చేసే పోస్టుల్లో 102 మెడికల్ ఆఫీసర్లు, 87 స్టాఫ్ నర్సు పోస్టులు ఉన్నాయన్నారు. బుధవారం నుంచి మార్చి 10వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు https://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక సమగ్ర నోటిఫికేషన్ను https://apmsrb.ap.gov.in/msrb, https://dme.ap.nic.in వెబ్సైట్లను అభ్యర్థులు సంప్రదించాల్సి ఉంటుంది. -
Seoul: సౌత్కొరియాలో డాక్టర్ల పోరుబాట.. పేషెంట్ల విలవిల
సియోల్: సౌత్ కొరియాలో డాక్టర్లు వారం రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కోర్సుల్లో ఏడాదికి 2 వేల సీట్లు పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ విధులను కూడా బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో పేషెంట్లు డాక్టర్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని సియోల్లోని 5 పెద్ద ఆస్పత్రుల్లో ఇప్పటికే షెడ్యూల్ అయిన సగం సర్జరీలు రద్దవుతున్నాయి. దీనిపై దేశ వైద్యశాఖ సహాయ మంత్రి పార్క్ మిన్సూ స్పందించారు. డాక్టర్ల ప్రాథమిక కర్తవ్యం పేషెంట్ల ప్రాణాలు కాపాడటమని, నిరసనల కంటే వారు ఈ విషయానికే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పనిచేసే చోటే ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల వల్ల ఇప్పటివరకు 7813 మంది డాక్టర్లు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, ఇందుకే మరింత మంది డాక్టర్లు అవసరమని చెప్పారు. అయితే స్టే ఎట్ వర్క్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచే బదులు వారి వేతనాలు, పని ప్రదేశంలో సౌకర్యాలు పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిండం కోసమే మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుతున్నామని ప్రభుత్వం చెబుతుంటే ఏప్రిల్లో జరిగే సాధారణ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్టంట్ ప్లే చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ఇదీ చదవండి.. అలెక్సీ నావల్ని కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
సత్తా పోతున్న సంజీవనులు!
ప్రాణాలు నిలపాల్సిన ఔషధం కాస్తా మనం చేస్తున్న తప్పుల వల్ల ఆ సామర్థ్యాన్ని కోల్పోతే? మానవాళికి అది మహా ప్రమాదమే. యాంటీ బయాటిక్స్ వినియోగంలో మనం తరచూ చేస్తున్న తప్పుల వల్ల ఆ పరిస్థితే దాపురిస్తోందని నిపుణులు మరోసారి హెచ్చరిస్తున్నారు. యాంటీ బయాటిక్స్ అతిగా వాడడం, లేదంటే నిర్ణీత మోతాదులో సరిగ్గా వాడకపోవడం వల్ల చివరకు ఆ ఔషధాలకు కొరుకుడుపడని ప్యాథోజెన్లు వృద్ధి చెందుతున్నాయి. ఆ నేపథ్యంలోనే అర్హత గల వైద్యులు రాసిచ్చిన మందుల చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను విక్రయించవద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా అభ్యర్థించింది. అలాగే, యాంటీ బయాటిక్స్ వాడాల్సిందిగా రాసినప్పుడు అందుకు కారణాల్ని సైతం పేర్కొనాల్సిందిగా వైద్యులకు పిలుపునిచ్చింది. యాంటీ బయాటిక్స్ వాడకంలో వివేకంతో వ్యవహరిస్తేనే, మందులకు లొంగని వ్యాధికారక జీవులను అరికట్టవచ్చని మరోసారి నొక్కిచెప్పింది. కొత్త యాంటీ బయాటిక్స్ పరిశోధన, అభివృద్ధి అనేది పరిమితంగానే ఉన్నందున ఔషధ వినియోగంపై తక్షణం అప్రమత్తం కావాలన్న సూచన అందరికీ ఓ మేలుకొలుపు. బ్యాక్టీరియా నిర్మూలనకు ఉద్దేశించిన ఔషధాలపై సదరు సూక్ష్మజీవులే విజయం సాధించడం, వాడే మందుల వల్ల అవి చావకపోగా పెరగడమనేది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య. దీనికే వైద్యపరిభాషలో ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్’ (ఏఎంఆర్) అని పేరు. ఈ ఏఎంఆర్ వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఔషధాలకు నిరోధకత ఏర్పడ్డ ఇన్ఫెక్షన్లతో అదనంగా మరో 49.5 లక్షల మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి. ఏఎంఆర్ వల్ల ఇన్ఫెక్షన్ల నివారణ, చికిత్స కుంటుబడడమే కాక, దీర్ఘకాలిక అనారోగ్యం పెరిగి, ప్రాణానికి ప్రమాదవుతుంది. బలం పెరిగిన ఈ ఇన్ఫెక్షన్లకు ముకుతాడు వేయాలంటే బాగా ఖరీదైన రెండో శ్రేణి ఔషధాలే దిక్కు. వాటి ఖరీదు ఎక్కువ గనక, సామాన్యులకు చివరకు చికిత్సే అందని దుఃస్థితి. పొంచివున్న ఈ ప్రమాదానికి ఇప్పుడు కేంద్ర స్థానం మన దేశమేనట! ఇదే పరిస్థితి కొన సాగితే, 2050 నాటికి ఒక్క భారత్లోనే 20 లక్షల మంది చనిపోతారని అంచనా. క్యాన్సర్, రోడ్డు ప్రమాదాలు కలిపి సంభవించే మరణాల కన్నా ఈ సంఖ్య ఎక్కువ. ఇది ఆందోళనకరమైన అంశం. అరుదుగానే వాడాల్సిన వివిధ రకాల యాంటీ బయాటిక్స్ను పెద్ద మొత్తంలో మన దేశంలో యథేచ్ఛగా ఉపయోగిస్తున్నట్టు 2022 నాటి లాన్సెట్ అధ్యయనం తేల్చింది. వీటన్నిటి వల్లే, డాక్టర్ చీటీ లేకుండా యాంటీ బయాటిక్స్ను షాపుల్లో నేరుగా రోగులకు అమ్మవద్దని ఆరోగ్య శాఖ ఇప్పుడు నొక్కిచెప్పింది. ఏఎంఆర్ విజృంభించకుండా అడ్డుకొనేందుకు వీలుగా సరైన రీతిలో యాంటీ బయాటిక్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఈ ప్రయత్నం హర్షణీయం. యాంటీ బయాటిక్స్ 1945 నాటి ‘ఔషధాలు, సౌందర్య పోషకాల నిబంధనల’ ప్రకారం షెడ్యూల్ హెచ్ కిందకొస్తాయి. అంటే, రిజిస్టర్ చేసుకున్న మెడికల్ ప్రాక్టిషనర్ చీటీ రాస్తే తప్ప, వాటిని మందుల షాపుల్లో అడిగినవారందరికీ ఇవ్వరాదు. శక్తిమంతమైన యాంటీ బయాటిక్స్నైతే ‘షెడ్యూల్ హెచ్1’లో చేర్చారు. ఈ రెండు షెడ్యూల్స్లోని ఔషధాలను డాక్టర్ సిఫార్సుతోనే ఫార్మసీలలో విక్రయిస్తే పెద్ద చిక్కు తప్పుతుంది. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలన్నదే ఇప్పుడు ఆరోగ్యశాఖ ప్రయత్నం. ఏఎంఆర్ వల్ల మామూలు మందులు బ్యాక్టీరియాపై పని చేసే సత్తాను కోల్పోతాయనీ, ఫలితంగా సాధారణ అనారోగ్యాలు సైతం చివరకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే హెచ్చరించింది. చాప కింద నీరులా నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఈ ఏఎంఆర్ మహమ్మారి నవజాత శిశువుల నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారికైనా, జీవితంలో ఏ దశలోనైనా ప్రాణాపాయమే. కాబట్టి, రోగికీ, వైద్యుడికీ మధ్య పరస్పర విశ్వాసం, సత్సంబంధాలు అవసరం. అప్పుడే ఔషధ వినియోగం సక్రమంగా జరుగుతుంది. నిజానికి, యాంటీ బయాటిక్స్ దుర్వినియోగమే కాక ఇతర కారణాలూ ఏఎంఆర్కు ఉన్నాయి. శుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం, జనంలో చైతన్యం లేకపోవడమూ ఏఎంఆర్కు దోహదం చేస్తాయని నిపుణుల మాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపడం ప్రభుత్వాల తక్షణ బాధ్యత. మన దగ్గర వాడుతున్న యాంటీ బయాటిక్స్ ‘నిర్ణీత మోతాదు కాంబినేషన్’ (ఎఫ్డీసీ)లు చాలావాటికి అనుమతులు లేవు. కొన్నయితే నిషేధానికి గురైనవి. భారత్, ఖతార్, బ్రిటన్లలో అధ్యయనం జరిపిన పరిశోధకులు ఈ సంగతి తేల్చారు. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా అమ్ముతున్న 58 శాతం యాంటీ బయాటిక్స్ ఎఫ్డీసీలు తమ లెక్కలో ‘సిఫార్సు చేయరాదు’ అనే జాబితాలో ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ కుండబద్దలు కొట్టింది. అలాగే, వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనా అనేది నిర్ధారించకుండానే కొందరు వైద్యులు అతి జాగ్రత్తతో యాంటీ బయాటిక్స్ ఇస్తున్న కేసులూ లేకపోలేదు. మనం కళ్ళు తెరిచి, అవగాహనతో అడుగులు వేయాల్సిన సందర్భమిది. అసలంటూ ఏఎంఆర్పై అవగాహన పెంచేందుకు ఆరోగ్య శాఖ 2016లోనే ప్రయత్నం చేయకపోలేదు. కొన్ని మందులపై నిలువునా ‘ఎర్ర రంగు గీత’ వేయించి, డాక్టర్ చీటీ లేకుండా అవి వాడవద్దని చెప్పింది. ఎనిమిదేళ్ళలో ఆ ప్రయత్నం ఏ మేర ఫలించిందో తేల్చి, లోటుపాట్లు సరిదిద్దాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి నెలకొల్పిన ఏఎంఆర్ నిఘా, పరిశోధక వ్యవస్థను పటిష్ఠం చేయాలి. అన్నిటి కన్నా ముందుగా ఔషధ దుర్వినియోగ నివారణకై డాక్టర్లు, ఫార్మసిస్టులు, ఫార్మా కంపెనీలు, సామాన్య జనం, సర్కారు కలసికట్టుగా నిలవాలి. సంజీవనులైన ఔషధాలే సత్తా కోల్పోతున్నాయంటే, అది మన స్వయంకృతాపరాధమని గ్రహించి, ఇకనైనా మారాలి. -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. -
బ్రెడ్ని ఫ్రిజ్లో పెడుతున్నారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
బ్రెడ్ని మిగతా ఆహార పదార్థాల్లానే ఫ్రిజ్లో పెడుతుంటారు చాలమంది. అయితే ఇలా ఫ్రిజ్లో పెట్టిన బ్రెడ్ని ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిందటూ చాలా షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎలా ప్రిజ్లో ఉంచిన నిల్వ బ్రెడ్ మంచిది? ఎలా ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది? నిజానికి బ్రెడ్ వంటివి ఎక్కువ తీసుకోవద్దని డాక్టర్లు చెబుతుంటారు. వాటిలో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని, పైగా బేక్ చేసే బేకరీ పదార్థాలని అస్సలు వద్దనే చెబుతారు. అలాంటిది ప్రిజ్లో నిల్వ ఉంచిన బ్రెడ్ని మాత్రం తీసుకుంటే మంచిదని వైద్యులు ఎలా చెబుతున్నారు?. పైగా పరిశోధనలో ఇలాంటి బ్రెడ్ తీసుకున్న వారిలో మంచి ఫలితం కనిపించిందంటూ ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు పోషకాహార నిపుణుడు డాక్టర్ అమీ షా. ఎందువల్ల మంచిందంటే..? తాజా వైట్ బ్రెడ్ కంటే నిల్వ ఉంచిన బ్రెడ్ మంచిది. అదికూడా ఫ్రిజ్లో నిల్వ ఉన్నది మంచిదని అంటున్నారు. ఇలా ఫ్రీజర్లో నిల్వ ఉండటం వల్ల గ్లైసమిక్ ఇండిక్స్ తగ్గి ఆరోగ్యకరమైన స్టార్చ్గా మారుతుందని చెబుతున్నారు. ఇలా నిల్వ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన గట్ బ్యాక్టీరియా దీని వల్ల లభిస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై 2008లో జరిపిన పరిశోధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని షా చెప్పారు. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ యూనివర్సిటీ పరిశోధన బృందం దీని గురించి సుమారు 22 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న పదిమంది పురుషులు, మహిళలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారికి ఇంట్లో తయారు చేసిన బ్రెడ్, మార్కెట్లో దొరికే బ్రెడ్లను వేర్వేరుగా నిల్వ చేసి ఇచ్చారు. కొందరికి తాజా బ్రెడ్ ఇవ్వగా, మరికొందరికి నిల్వ చేసింది ఇచ్చారు. మిగతా వారికి నిల్వ ఉంచి, రోస్ట్ చేసింది ఇచ్చారు. తాజాగా ఇంట్లో తయారుచేసిన బ్రెడ్తో పోలిస్తే, బ్రెడ్ను నిల్వ చేసి రోస్ట్ చేసినప్పుడూ బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా మార్కెట్లో కొన్న వైట్ బ్రెడ్తో పోలిస్తే బ్రెడ్ని రోస్ట్ చేసిందే బెటర్ అని తేలింది. అలాగే ఈ బ్రెడ్ని కూడా నిల్వ చేసి రోస్ట్ చేసి తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని చెప్పారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిదని అన్నారు. ఇలా ఈ నిల్వ ఉండటం వల్ల వాటిలో కిణ్వన ప్రక్రియ జరిగి శరీరానికి అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా అంది షుగర్ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం వైట్ బ్రెడ్ని తినేందుకు జంకకండి. చక్కగా తెచ్చుకుని ఒక రాత్రి ఫ్రిజ్లో పెట్టి రోస్ట్ చేసుకుని హాయిగా ఆస్వాదించండి. View this post on Instagram A post shared by Dr. Amy Shah (@fastingmd) (చదవండి: మసాలా దినుసులు ఘాటు పోకూడదంటే..ఇలా స్టోర్ చేయండి!) -
ఛత్తీస్గఢ్లో పెరుగున్న కరోనా కేసులు
ఛత్తీస్గఢ్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 24 మందికి కరోనా సోకింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా బాధితులు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు చెందిన వారని సమాచారం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో గత 24 గంటల్లో కొత్తగా 11 మందికి కరోనా సోకింది. దీంతో రాజధానిలో కరోనా బాధితుల సంఖ్య 51కి చేరింది. ఇక్కడ ఇప్పటికే 40 మంది కరోనా బాధితులు ఉండగా, ఇప్పుడు ఈ సంఖ్య 51కి పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. రాష్ట్రంలోని పారిశ్రామిక నగరం రాయ్ఘర్ కరోనా కేసులలో రెండవ స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 131కి చేరింది. కాగా 31 మంది కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 4182 శాంపిల్స్ను పరీక్షించారు. -
AP: ‘పెద్ద’ భరోసా..!
కడుపు కింద భాగంలో జిస్ట్ అనే కణితి సమస్యతో బాధపడుతున్న విజయవాడకు చెందిన సునీల్కు గత మార్చిలో గుంటూరు జీజీహెచ్లో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తైంది. బాధితుడికి చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర కణితి ఉన్నట్లు జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తించారు. మెడికల్ జర్నల్స్ ప్రకారం ప్రపంచంలో ఇటువంటి కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయి. అరుదైన ఈ సమస్యకు ఎలా ఆపరేషన్ చేయాలో నిర్దిష్ట విధానాలు లేకున్నా జనరల్ సర్జరీ విభాగం వైద్యులంతా చర్చించుకుని సాహసోపేతంగా నిర్వహించారు. సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు పెద్దాస్పత్రి అంటే విజయవాడ జీజీహెచ్! 2019కి ముందు వరకూ ఇక్కడ న్యూరో విభాగంలో వైద్యులు అరకొరగా ఉండటంతో సేవలపై తీవ్ర ప్రభావం పడేది. రోజంతా కలిపినా కేవలం వంద లోపే ఓపీలు నమోదు అయ్యేవి. ఐపీలు అంతంత మాత్రంగానే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూరో విభాగంలో మంజూరైన పోస్టులన్నింటిలో వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన చికిత్సలను సైతం ఉచితంగా అందించేలా మందులు, సదుపాయాలను సమకూర్చింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 250 వరకూ ఓపీలు నమోదు అవుతున్నాయి. పడకలన్నీ ఫుల్గా ఉంటున్నాయి. ఒక్క న్యూరో మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను అందుబాటులోకి తేవడంతో పాటు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చింది. సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో పెద్దాస్పత్రిపై విశ్వాసం పెరిగింది. 2018–19లో 9,202 మేజర్ సర్జరీలు నిర్వహించగా 2022–23లో ఏకంగా 51 శాతం అదనంగా అంటే 13,095 సర్జరీలు జరగడం గమనార్హం. 2018–19లో 3.85 లక్షల ల్యాబ్ టెస్ట్లు చేయగా 2022–23లో 5.83 లక్షల టెస్ట్లు చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు.. సీఎం జగన్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. రోగుల తాకిడికి సరిపడా వైద్యులు, సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. విజయవాడ జీజీహెచ్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గతంతో పోలిస్తే రోగుల సేవల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సర్జరీల్లో పెరుగుదల ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో బోధనాస్పత్రుల్లోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా పోయింది. ఆపరేషన్ థియేటర్లలో అధునాతన వైద్య పరికరాలు సమకూరడంతో సర్జరీలు పెరిగాయి. 2022–23లో ఏకంగా 3,45,482 మైనర్, 1,50,592 మేజర్ సర్జరీలను నిర్వహించారు. 2023–24లో జూలై నెలాఖరు నాటికి 2.04 లక్షల మేజర్ సర్జరీలు జరిగాయి. టీడీపీ హయాంలో 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు మాత్రమే జరిగాయి. గతంతో పోలిస్తే 73.05 శాతం మైనర్, 52.56 శాతం మేజర్ సర్టరీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాబ్లను బలోపేతం చేయడంతో ఏటా కోటికిపైనే ల్యాబ్ టెస్ట్లు జీజీహెచ్లలో చేపడుతున్నారు. 2021–22లో 1.06 కోట్లు, 2022–23లో 1.32 కోట్ల మేర ల్యాబ్ టెస్ట్లు ఉచితంగా నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటికే 70 లక్షల టెస్ట్లు పూర్తి అయ్యాయి. ► 2021–22లో బోధనాస్పత్రుల్లో 49.32 లక్షల ఓపీ సేవలు నమోదు కాగా గతేడాది 83.16 లక్షలకు పెరిగాయి. ఐపీ సేవల్లో 33.63 శాతం పెరుగుదల నమోదైంది. ► డబ్ల్యూహెచ్వో ప్రమాణాలతో కూడిన 608 రకాల మందులను ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది. 530కిపైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తుండగా మిగిలినవి స్థానిక ఫార్మా కంపెనీల ద్వారా అందిస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ల నిర్వహణకు అవసరమయ్యే రీ ఏజెంట్స్ (రసాయనాలను) సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా ప్రారంభించింది. ► నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. బోధనాస్పత్రుల్లో అదనపు వార్డులు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ల నిర్మాణం చేపట్టారు. గతంలో రూ.40 మాత్రమే ఉన్న డైట్ చార్జీలను రూ.80కు పెంచడం ద్వారా రోగులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. చక్కగా ఆపరేషన్ చేశారు 20 ఏళ్ల క్రితం గుండె కవాటం చెడిపోయింది. నా కుమార్తె సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా మందులతోనే కాలం గడిపా. రానురాను సమస్య పెరగడంతో గత ఆగస్టులో కర్నూలు జీజీహెచ్లో అడ్మిట్ అయ్యా. సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్రెడ్డి ఆపరేషన్ చేశారు. మైట్రల్ వాల్వ్ రీ ప్లేస్మెంట్, కార్డల్ ప్రిజర్వేషన్ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆపరేషన్ చక్కగా చేశారు. నర్సింగ్ సేవలు చాలా బాగున్నాయి. వారి చొరవతో చకచకా కోలుకోగలిగా. సాధారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంటే అందరూ తెలియని భయానికి లోనవుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. వసతులు బాగున్నాయి. అనుభవజ్ఞలైన వైద్యులు, సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారు. – వెంకట రెడ్డి, ప్రజా పరిరక్షణ ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రైవేట్కు మించి సేవలు.. నాన్న అనారోగ్యం బారిన పడటంతో విజయవాడ జీజీహెచ్కు తీసుకొచ్చాం. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించారు. నర్సులు, వైద్య సిబ్బంది రోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ తరహాలో సేవలుండవు. – జి. రవి, ఎండపల్లి, ఏలూరు జిల్లా సేవలు వినియోగించుకోవాలి బోధనాస్పత్రుల్లో ఎంతో అనుభవజ్ఞలైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. అరుదైన జబ్బులకు ఇక్కడ చికిత్సలు అందుతున్నాయి. ప్రభుత్వం సౌకర్యాలను మెరుగుపరిచింది. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అనవసర వ్యయ ప్రయాసలకు గురి కావద్దు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అరుదైన సర్జరీలు అలవోకగా చేసేందుకు వసతులున్నాయి. కోత, కుట్లు లేకుండా చిన్న గాటుతో సర్జరీలు చేస్తున్నారు. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
సైగల చికిత్స
మూగ, వినికిడి సమస్య ఉన్న ఆ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. అదీ పూర్తి ప్రసవ సమయానికి రెండు నెలల ముందుగానే. కవలల్లో పేగు సమస్యతో అబ్బాయి చనిపోయాడు. ఇక ఇప్పుడు పాప ఒక్కత్తే ఆశాజ్యోతి. కేవలం 450 గ్రాముల బరువుతో మనుగడ అవకాశాలు తక్కువ. పాపను ఎలాగైనా దక్కించుకునేందుకు ఏ విధంగానైనా ఆమెను బతికించుకునేందుకు పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి అయ్యింది.] కనీస సంభాషణల కోసం కష్టపడి పదిరోజుల్లోనే సైగల భాషనూ, సంజ్ఞాశాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో విజయ సాధించారు అక్కడి కొందరు డాక్టర్లూ, నర్సులు. ఆ పాప ఇప్పుడు బతుకు బ్యారియర్స్ను బద్దలు కొట్టింది. నాలుగు నెలల వయసుకే అనేక అడ్డంకుల్ని అధిగమించింది. జీవన సమరంలో తొలి విజయం సాధించింది. విజయవంతంగా మనుగడ పోరాటం సాగిస్తోంది. హైదరాబాద్కు చెందిన దంపతులు రాజ్కుమార్ వయసు 55 ఏళ్లు. భాగ్యమ్మకు 47. ఇద్దరూ మూగవారు. వినికిడి, మాట సమస్యలున్నాయి. అప్పటికే ఓ చిన్నారిని కోల్పోయారు. ఎలాగైనా తమకు సంతానం కావాలని కోరిక. ఎట్టకేలకు భాగ్యమ్మ గర్భవతి అయ్యింది. తన 47వ ఏట ప్రసవించింది. కానీ 28 వారాలకే ప్రీమెచ్యూర్గా పుట్టిన పిల్లలు. అంటే ఏడునెలలకే జరిగిన ప్రసవం. రెండు నెలలు ముందుగానే ప్రసవం కావడంతో కవలలు బాగా తక్కువ బరువుతో పుట్టారు. బాబు కేవలం 900 గ్రాములు. పాప బరువు మరీ తక్కువ. కేవలం 450 గ్రాములు!! మరో ఆసుపత్రిలో ప్రసవం తర్వాత... పుట్టీ పుట్టగానే ఆ బిడ్డలకు కొన్ని సమస్యాత్మకమైన రుగ్మతలు ఉండటంతో తల్లినీ, బిడ్డను కొండాపూర్లోని కిమ్స్–కడల్స్ నియోనేటాలజీ విభాగంలో చేర్చారు. ఆ విభాగం డైరెక్టర్ డాక్టర్ అపర్ణ నేతృత్వంలో చికిత్స మొదలుపెట్టారు. బాబుకు నెక్రొటైజింగ్ ఎంటరోకొలైటిస్ అనే పేగుల సమస్య ఉండటంతో శస్త్రచికిత్స తప్పలేదు. కానీ బాబు దక్కలేదు. ఎన్నో వైద్య ప్రక్రియల తర్వాత, మరెన్నో నోముల తర్వాత పండిన పంట అది. ఒడి నిండినట్టే నిండిందిగానీ... ఒడిబియ్యంలో సగం జారిపోయింది. పాప తల్లిదండ్రుల వయసుపరంగా, లేదా మరేరకంగా చూసినా ఆ బంగారు తల్లిని కాపాడుకోక తప్పని పరిస్థితి. కొంగున మిగిలింది సగం బంగారమే కావడంతో ఇప్పుడా కొంగుబంగారం మరీ మరీ అపురూపం. కానీ పాప బరువు అరకిలో కంటే మరో 50 గ్రాములు తక్కువే. వైద్యసిబ్బందికి ఇదో సవాల్గా మారింది. తొలినాళ్లలో కుటుంబ స్నేహితుడి సాయంతో సంభాషణలు... పాప తల్లిదండ్రులిద్దరూ మూగ, వినికిడి సమస్యలున్నవారైనప్పటికీ వైద్యులకు వారితో సంభాషించడం తప్పదు. తొలి నాళ్లలో రాజ్కుమార్కు తెలిసిన ఓ అబ్బాయే ఆ దంపతులకూ, వైద్య సిబ్బందికి మధ్య సంజ్ఞావారధిగా నిలబడ్డాడు. అతడో కాలేజీ విద్యార్థి. సంజ్ఞల భాష (సైన్ లాంగ్వేజ్) తో సంభాషణలు జరిపేవాడు. కొన్నాళ్ల సెలవు తర్వాత రాజ్కుమార్ తన విధులకు హాజరవ్వక తప్పనిస్థితి. తండ్రి ఆఫీసులో, తల్లి ఆసుపత్రిలో. సంజ్ఞల వారధి తన చదువుల్లో, తన పనుల్లో మరో చోట. అయినప్పటికీ ఎలాగోలా పేపర్ల మీద రాసిచూపుతూనో, వీడియోకాల్స్ ద్వారానో సంభాషణలు కొనసాగుతున్నాయి. ఇంతలో ఇంటర్ప్రెటర్గా ఉన్న వ్యక్తికి పరీక్షలు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన తొలినాళ్లలో రాజ్కుమార్ కొందరు వైద్యసిబ్బందికి సంకేతభాష (సైన్ లాంగ్వేజీ) నేర్పించేందుకు కొంత ప్రయత్నించారు. అప్పుడెవ్వరికీ దాని అవసరం అంతగా ఉన్నట్లు తోచలేదు. కానీ ఇప్పుడు తప్పని స్థితి! ఇక డాక్టర్లూ, వైద్యసిబ్బందీ సంభాషించక తప్పలేదు... పాపకు జరిగే వైద్య పరీక్షల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి. చిన్నారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ, చేపట్టాల్సిన విధానాల్ని తల్లికి వివరించాలి. పాలు పట్టాల్సినప్పటి ప్రక్రియలను, ఆహారమివ్వాల్సిన తీరుతెన్నులను, బిడ్డను తల్లిగుండెలకు దగ్గరగా ఉంచేందుకు అనుసరించాల్సిన ‘కంగారూ కేర్’ ప్రక్రియల్ని విపులీకరించాలి. ఇందుకు ఇరువురికీ అర్థమ్యే భాష కావాలి. కానీ ఎలా? పది రోజుల్లో అవసరమైనమేరకు శిక్షణ... తొలినాళ్లలో రాజ్కుమార్ తమకు కొన్ని బేసిక్స్ నేర్పడానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. అంతే... చిన్నారిని కాపాడుకునేందుకు అవసరమైన మేరకు సైన్ లాంగ్వేజ్ను ఆయననుంచే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు మెడికల్ టీమ్లోని కొందరు. మొత్తం పది మంది వైద్యబృందంలో కొందరు డాక్టర్లు, మరికొందరు నర్స్లూ, ఇంకొందరు సహాయక వైద్య సిబ్బంది సంజ్ఞాభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. దాదాపు పదిరోజుల్లో సైగల భాషలోని అల్ఫాబెట్స్, సంఖ్యలూ, రోజులూ, వారాల పేర్లు, ఇతర వివరాలను కష్టపడి నేర్చుకున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నారు. తొలి విజయం ఆ మృత్యుంజయురాలిదే... గత ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి దాదాపు మూడు నెలల పాటు (సరిగ్గా చెప్పాలంటే 79 రోజులు) ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేవలం 450 గ్రాములున్న ఆ చిన్నారి క్రమంగా 1200 గ్రాములకు చేరింది. నవంబరులో డిశ్చార్జ్ నాటికి ఆ పాప బరువు 1800 గ్రాములు. మనుగడ పోరాటంలో తొలి అవరోధాలన్నింటినీ అధిగమించింది... బతుకుకు అడ్డంకి లేని బరువు సాధించింది. ప్రస్తుతం తనకు 4 నెలల వయసు. డాక్టర్ల అంచనాల ప్రకారం... అందరిలాగే మరో మూడు–నాలుగు నెలల్లో ముద్దుమాటలు (బ్యాబ్లింగ్స్) మొదలుపెట్టాలి. అందుకు వైద్యపరంగా ఎలాంటి అవరోధాలూ, అడ్డంకులూ లేవు. ప్రస్తుతానికి... ముందు ముద్దులు మూటగడుతోంది. మున్ముందు మాటలు దండగట్టాల్సి ఉంది. – యాసీన్ మేము, మా సిబ్బంది అవసరమైన మేరకు సైన్లాంగ్వేజీలో పరిజ్ఞానం సంపాదించాం... పాపను రక్షించుకునేందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోక తప్పలేదు. కొందరిలో కొత్తభాషను నేర్చుకునే పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటివారు ఇతరులకు నేర్పారు. ఇలా ఆ టీమ్లోని పదిమంది డాక్టర్లలో ఐదారుగురు, నర్సుల్లో నలుగురైదుగురు, ఇతర సిబ్బందిలో మరికొందరు... తల్లిదండ్రులకు అవసరమైన మేరకు వివరాలను సూచించేంతగా సైన్లాంగ్వేజీలో ప్రాక్టీస్ సాగించారూ, నైపుణ్యం సాధించారు. చిన్నారిని బతికించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో కంటి పరీక్షలూ, న్యూరో... ఇలా అన్ని రకాల పరీక్షలూ నిర్వహించాం. మరీ ముఖ్యంగా వినికిడి పరీక్షలు. ఆ చిన్నారిలో ఎలాంటిలోపాలూ లేవు. అన్నీ నార్మల్. – డాక్టర్ అపర్ణ, క్లినికల్ డైరెక్టర్–నియోనేటాలజీ -
బరువు తగ్గడం కోసం కార్బోహైడ్రేట్లను తగ్గించేస్తున్నారా?
చాలామంది బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తీసుకోవడమే మంచిదని గట్టిగా విశ్వసిస్తారు. అయితే వైద్యులు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే కార్బోహైడ్రేట్ దూరం చేసినంత మాత్రం శరీరంలోని కొలస్ట్రాల్ ఎంతమాత్రం తగ్గిపోదని అంటున్నారు. దీని వల్లే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మేలని అంటున్నారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువుగా ఉండే తృణ ధాన్యాలు, మొక్కల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టిపెడితే సులభంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఈ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అధిక బరువు సమస్యకు చెక్పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు అంటే.. చక్కెరకు సంబందించిన పదార్థాలు, పాస్తాలు, రొట్టెలు కాకుండా తీసుకుంటే బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సమ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు హార్వర్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు లక్షకు పైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. కొందరికి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మిగతావారికి పూర్తిగా కార్బోహ్రైడేట్ లేని శుద్ధి చేసిన పదార్థాలు, మాంసం వంటివి ఇచ్చారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వారి ఆరోగ్యం గురించి డేటా ట్రాక్ చేశారు. దానిలో తక్కవ కార్బోహైడ్రేట్ ఉన్న హెల్తీ ఆహారాన్ని తీసుకున్నవారు బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు కనిపించాయని, మిగతా వారిలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. పైగా ఇలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయని అన్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు... బరువు తగ్గుతారు మధుమేహం అదుపులో ఉంటుంది రక్తపోటు నార్మల్గా ఉంటుంది గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
యంగ్ స్ట్రోక్
విజయవాడకు సమీపంలోని పెనమలూరుకు చెందిన ఆటోడ్రైవర్ వెంకట్ (38)కు ఇటీవల ఆకస్మికంగా కాలు, చేయి చచ్చుబడిపోయాయి. విజయవాడలోని యనమలకుదురుకు చెందిన నగరపాలక సంస్థ డ్రెయినేజీ విభాగ ఉద్యోగి రాజేష్ (42) విధుల్లో ఉండగా.. చేయి చచ్చుబడింది. క్షణాల్లోనే గుర్తించిన స్థానికులు వెంకట్, రాజేష్లను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తక్షణమే సీటీ స్కాన్ చేసిన వైద్యులు వారు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడినట్టు గుర్తించారు. వెంటనే త్రోంబొలైసిస్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. వైకల్యం రాకుండా ఇద్దరినీ కాపాడగలిగారు. సాధారణంగా 55–60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) సంభవించేది. ఇటీవల కాలంలో 45 ఏళ్లలోపు వారిలో ఈ కేసులు అధికమవుతున్నాయి. లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల కాలంలో స్ట్రోకింగ్ యంగ్ (45 ఏళ్లలోపు వారిలో బ్రెయిన్ స్ట్రోక్) కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలకు వస్తున్న వారిలో స్ట్రోకింగ్ యంగ్ కేసులు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కదలిక లేని జీవన విధానం.. తీవ్రమైన వత్తిళ్లు.. రక్తం, రక్తనాళాల్లో లోపాలు.. ధూమపానం.. హెరాయిన్ లాంటి మత్తు పదార్థాల వినియోగం.. వంశపారంపర్య కారణాలు 30 ఏళ్లకే బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతున్నాయి. 25% ‘స్ట్రోకింగ్ యంగ్’ కేసులే ఒకప్పుడు వయస్సు 55, 60 ఏళ్ల వారు బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యేవారు. కానీ.. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్న వారిలో 25 నుంచి 30 శాతం మంది 30–45 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రిలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు బ్రెయిన్ స్ట్రోక్తో వస్తున్నారు. స్ట్రోక్ తీవ్రతను బట్టి జనరల్ మెడిసిన్, ఏఎంసీ, న్యూరాలజీ విభాగాల్లో చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్తో వస్తున్న వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడం వలన వచ్చే స్ట్రోక్ (ఇస్కిమిక్) 80 శాతం మంది, రక్తనాళాలు చిట్లిపోయి (హెమరైజ్డ్) 20 శాతం మంది ఉంటున్నారు. గోల్డెన్ అవర్లో గుర్తించడం ముఖ్యం ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్కు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. లక్షణాలను గుర్తించి.. నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే స్ట్రోక్ కారణంగా వైకల్యం బారినపడకుంటా వైద్యులు కాపాడగలుగుతున్నారు. ఇస్కిమిక్ స్ట్రోక్ వచి్చన వారికి త్రోం»ొలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రక్తంలోని పూడికలు కరిగేలా చేస్తున్నారు. ముఖం, చేయి, కాలు ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత ఏర్పడటం, అకస్మికంగా గందరగోళం ఏర్పడటం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటిచూపు మందగించడం, తల తిరగడం, బ్యాలెన్స్ తప్పడం, ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. స్ట్రోక్కు కారణాలివీ పెద్ద వయసుల వారిలో రక్తపోటు, మధుమేహం స్ట్రోక్కు కారణమవుతోంది. అయితే.. 45 ఏళ్లలోపు వారిలో హోమోసిస్టీన్, సికిల్ సెల్ అనీమియా, రక్తంలో జన్యుపరమైన లోపాలు, హెరాయిన్ వంటి డ్రగ్స్ వినియోగం, మితిమీరిన మద్యపానం, ధూమపానం, ప్రమాదాల్లో తలకు గాయాలైన వారిలో ఎక్కువగా స్ట్రోక్ వస్తున్నట్టు వైద్యులు చెపుతున్నారు. వీరితో పాటు కదలిక లేని జీవన విధానం కారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి స్ట్రోక్కు గురవుతున్న కేసులూ ఉంటున్నాయి. మహిళల్లో హార్మోన్స్ ఇబ్బందులు, రక్తనాళాల్లో లోపాల కారణంగా స్ట్రోక్ రావచ్చంటున్నారు. గుండె లోపాలు ఉన్న వారిలోనూ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. యువకుల్లోనూ కేసులు ఇటీవల 45 ఏళ్లలోపు యువత బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతోంది. స్ట్రోక్ కేసుల్లో 25% యువతే ఉండటం గమనార్హం. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడినవారు 4 గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుంటే వైకల్యం లేకుండా కాపాడవచ్చు. – డాక్టర్ దారా వెంకట రమణ, న్యూరాలజిస్ట్, జీజీహెచ్ -
మళ్లీ మాస్క్ తప్పనిసరి.. ఆదేశాలు జారీ!
పంజాబ్లో కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్- 1 వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి పంజాబ్ ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రులు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గుండె, మధుమేహం, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సలహా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రజలు వైద్య సహాయం కోసం, 104కు డయల్ చేయాలని కోరింది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని చేతి రుమాలుతో కప్పుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. సబ్బు నీటితో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని తెలియజేసింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకడాన్ని నివారించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దని ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులను కోరింది. అలాగే బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇది కూడా చదవండి: 30న ప్రధాని మోదీ అయోధ్య రాక.. భారీ రోడ్ షోకు సన్నాహాలు! -
వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. వైద్యులు ఏమన్నారంటే
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కొత్త వైరస్ సోకి.. ఎంజీఎం కోవిడ్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. అంతేగాక నగరానికి చెందిన మరో ముగ్గురిని సైతం అనుమానితులుగా గుర్తించినట్లు వాట్సాప్లో సమాచారం చక్కర్లు కొట్టింది. దీంతో రోగులు, అటెండెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా కరోనా భయంతో ఆసుపత్రి సిబ్బంది నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని పాటిస్తున్నట్లు సమాచారం. మాస్క్లు లేకుండా ఎవరిని లోపలికి రావొద్దని సెక్యూరిటీ చెబుతున్నారు. ఆసుపత్రిలో కరోనా కేసులు నమోదయ్యాయన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇదిలా ఉండగా కోవిడ్ పాజిటివ్పై వార్తలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు ఎంజీఎం కొవిడ్ వార్డులో ఎలాంటి అనుమానితులు గానీ, కరోనా జేఎన్1 లక్షణాలు ఉన్న వారు గానీ నమోదు కాలేదని స్పష్టం చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలను అనుసరించి 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ -
మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి!
భారత్లో మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆదివారం కొత్తగా మరో 335 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,701కి పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తాజాగా ఐదుగురు మృతి చెందారు. కరోనాతో కన్నుమూసినవారిలో నలుగురు కేరళకు చెందినవారు కాగా, ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. కరోనా కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 కేసులు కేరళలో నమోదయ్యాయి. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.50 కోట్లు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. కోవిడ్ -19 కారణంగా ఇప్పటివరకు 5,33,316 మంది మరణించారు. కోవిడ్-19 మరణాల రేటు 1.19 శాతం. డిసెంబర్ 8న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకుళంలో పాజిటివ్ కేసు కనుగొన్నామని ఐసీఎంఆర్డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ మీడియాకు తెలిపారు. కాగా రాష్ట్రంలో బయటపడిన కోవిడ్ సబ్-వేరియంట్ జేఎన్.1 విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. కొత్త వేరియంట్ గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేసిన భారతీయ ప్రయాణికురాలిలో నెలరోజుల క్రితమే సబ్-వేరియంట్ని గుర్తించారని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇది కూడా చదవండి: ఈ ఏటి మేటి మహిళలు వీరే! -
18 ఏళ్లుగా తలలో బుల్లెట్తో జీవిస్తున్న వ్యక్తి..చివరికి..
ఓ వ్యక్తికి తన ప్రమేయం లేకుండానే పదేళ్ల వయసులో తలలోకి బుల్లెట్ దిగింది. ఆ తర్వాత నుంచి ఆ బాలుడి దుస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయింది. అలా దాదాపు 18 ఏళ్లు గడిపాడు. సంప్రదించని ఆస్పత్రిలేదు. ప్రతి ఒక్కరు బుల్లెట్ తీయడం కష్టమనే చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా విపరీతమైన తలనొప్పి, చెవి ఇన్ఫెక్షన్లతో దుర్భర జీవితాన్ని గడిపాడు. చివరికి బెంగళురు ఆస్పత్రి వైద్యులు అతడు ఎదుర్కొన్న నరకం నుంచి విముక్తి కలిగించారు. ఇంతకీ అతడికి తలలో ఎలా బుల్లెట దిగింది? ఎవరా వ్యక్తి అంటే..! యోమెన్కి చెందిన సలేహ్ అనే 29 ఏళ్ల వ్యక్తి తలలో సమారు 3 సెంటీమీటర్ల బుల్లెట్ ఉంది. అతనికి పదేళ్ల ప్రాయంలో ఉండగా.. రెండు ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో ఓ బుల్లెట్ అతడి చెవిలోకి దూసుకుని తలలోని ఎడమవైపు ఎముకలోకి దిగిపోయింది. దీంతో అతనికి విపరీతమైన రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు గానీ ఆ బుల్లెట్ని మాత్రం తీయలేకపోయారు వైద్యులు. ఎందుకంటే? అది చెవిలోపలకి వెళ్లడం, పైగా దాని ముందర భాగం తలలోపలకి ఉండటం కారణంగా తీయడం వైద్యులకు కష్టంగా మారింది. దీంతో గాయం తగ్గేందుకు మాత్రమే మందులు ఇచ్చి పంపించేశారు సలేహ్ని. అప్పటి నుంచి సుమారు 18 ఏళ్లుదాక ఆ బుల్లెట్తోనే జీవించాడు. ఆ తర్వాత అతడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ బుల్లెట్ కారణంగా చెవి వినికిడిని కోల్పోయాడు. పైగా చెవి ఇన్ఫెక్షన్లు, తలనొప్పితో నరకయాతన అనుభవించాడు. అతడికి ఇద్దరు సోదరులు, చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం సలేహ్కి 29 ఏళ్లు. అతడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బుల్లెట్ అతడి తల నుంచి ఎప్పుడు పోతుందా అనుకునేవాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి విసిగిపోయిన సలేహ్ స్నేహితుల ద్వారా బెంగళూరులోని ఆస్టర్ ఆస్పత్రి గురించి తెలుసుకుని మరీ ఎంతో ఆశతో వెళ్లాడు. అయితే వైద్యుల పలు టెస్ట్లు చేసి అసాధ్యం అని తేల్చేశారు. ఎందుకంటే? బుల్లెట్ సరిగ్గా చెవి లోపల ఎడమవైపు ముఖ్యమైన టెంపోరల్ ఎముక లోపల వాస్కులర్ నిర్మాణాలకు దగ్గరగా ఉంది. ఇది శస్ర చికిత్సకు అది పెద్ద సవాలు. అందువల్లే వైద్యులు రిస్క్ చేసే సాహసం చేయలేకపోయారు. అయితే వైద్యులు ఆ బుల్లెట్ కరెక్ట్గా ఏ ప్రదేశంలో ఉందో తెలిస్తే తీయడం ఈజీ అని గుర్తించారు. అందుకోసం కాంట్రాస్ట్ సీటీ యాంజియోగ్రఫీని ఎంచుకుంది. టూ డైమెన్షియల్ ఎక్స్రే సాయంతో బుల్లెట్ స్థానాన్నిగుర్తించి విపరీతమైన రక్తస్రావం కాకుండా సులభంగా తొలగించారు వైద్యులు. సర్జరీ చేస్తున్నంత సేపు అనుమానంగానే ఉందని అన్నారు వైద్యులు. ఎట్టకేలకు ఈ శస్త్రచికిత్సతో అతడికి తలనొప్పి తగ్గింది. అలాగే స్పష్టంగా వినిపిస్తోంది కూడా. అంతేగాదు పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే సలేహ్ యెమెన్కి తిరిగి వెళ్లిపోయాడు కూడా. (చదవండి: ఆల్కహాల్ తీసుకున్నప్పుడల్లా అలా అవుతుంటే అలర్జీ అనుకుంది! కానీ చివరికి..) -
మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!
ఇటీవల కాలంలో చాలా అరుదైన ఘటనలు జరుగుతున్నాయి. వైద్యుల సైతం రోగుల స్థితిని చూసి కంగుతింటున్నారు. మొన్నటికి మొన్న స్కానింగ్లో పెద్దపేగులో సజీవంగా ఉన్న ఈగను చూసి విస్తుపోయారు. అది మరువకమునుపే చైనాలో మరో వింత ఘటన చోటు చేసుకుంది. వైద్యులు సైతం ఇదేలా సాధ్యం అని షాకయ్యారు.! అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన ఓ మహిళ భరించలేని కళ్ల దురదతో బాధపడింది. ఇది సాధారణమైన సమస్యగానే భావించి వైద్యులను సంప్రదించలేదు. ఒక రోజు ఆ బాధను తట్టుకోలేక కళ్లను గట్టిగా నలుపుకుంది. ఇంతలో ఒక పురుగు కిందపడటం చూసి కంగుతింది. దీంతో ఒక్కసారిగా ఆమె తీవ్ర భయాందోళనకులోనై సమీపంలో ఆస్పత్రికి వెళ్లింది. వాళ్లు ఆమె కంటిని పరీక్షించగా కనురెప్పలు, కనుబొమ్మల మధ్య చాలా పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. దీంతో తక్షణమే వాటిని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్యులు. ఆమె కుడి కన్ను నుంచి 40కి పైగా సజీవ పురుగులను తీయగా, ఎడమ కన్ను నుంచి 10కి పైగా సజీవ పురుగులను తొలగించారు. మొత్తంగా ఆమె కళ్ల నుంచి దాదాపు 60కి పైగా సజీవ పురుగుల(పరాన్నజీవులు) తొలగించరు. ఇలా అసాధారణ స్థాయిలో పరాన్నజీవులు ఉండటం అనేది చాలా అరుదని. ఇది చాలా అసాధారణమైన కేసు అని డాక్టర్ గువాన్ అన్నారు. ఆమె కంటిలో ఫిలారియోడియా రకానికి చెందిన పరాన్నజీవులు ఉన్నట్లు భావిస్తున్నారు వైద్యులు. ఇవి ఎక్కువగా కుక్కలు, పిల్లలు శరీరాలపై ఉండే లార్వాలని, అవే ఆమెకు సంక్రమించి ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే చాలామంది తమ పెంపుడు జంతువులను తాకి ముద్దు చేసి మళ్లీ ఆ చేతులనే కళ్లను తాకడం, రుద్దడం వంటివి చేస్తారు. అందువల్ల ఆమెకు ఈ వ్యాది సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్యులు. అలాగే సదరు మహిళను కంటిలో అవశేష లార్వాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అని దాని గురించి తరుచుగా చెక్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఆమెను పెంపుడు జంతువులను తాకితే గనుక వెంటనే కడుక్కోవాలని సూచించారు వైద్యులు. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
కేసీఆర్కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరం: వైద్యులు
-
ప్రజాసేవలో డాక్టర్లు..!
సాక్షి, హైదరాబాద్: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్ సర్జన్లు కాగా, ఒకరు జనరల్ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్ కాగా ఒకరు న్యూరో సర్జన్ ఉన్నారు. ఇక ముగ్గురు ఎంఎస్ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్ సర్జన్. ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు. -
చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!
వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది. ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల -
ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్కు చేర్చారు. డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు. కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారున్నారు. ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? -
నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..
వాషింగ్టన్: మానవునిలో పెద్ద పేగు దాకా ఏదైనా ఆహారం వెళ్లి దంటే అప్పటికే అది జీర్ణమైందని అర్ధం. అయితే అమెరికాలో ఓ పెద్దాయన పెద్దపేగులో ఒక ఈగ చిధ్రమవకుండా చక్కగా ఉంది. జీర్ణావస్థలోకాకుండా పేగు గోడలకు అతుక్కుని ఉన్న ఈగను చూసి అక్కడి వైద్యులు అవాక్క య్యారు. జీర్ణాశయం, చిన్నపేగును దాటి కూడా ఈ కీటకం ఎలా జీర్ణమవకుండా ఉందబ్బా? అని వైద్యులు పలు విశ్లేషణలు మొదలుపెట్టారు. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఈ వింత ఘటన జరిగింది. ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటెరాలజీ’లో సంబంధిత వివరాలతో కథనం వెలువడింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా 63 ఏళ్ల పెద్దాయన ఆస్పత్రికి రాగా ఆయనకు వైద్యులు కొలొనోస్కోపీ చేశారు. అందులో ఈ విషయం వెల్లడైంది. ‘‘ కొలొనోస్కోపీకి ముందు ఘన పదార్థాలు ఏవీ నేను తీసుకోలేదు. రెండు రోజుల క్రితం మాత్రం పిజ్జా, తోటకూర తిన్నాను. అసలది ఎలా లోపలికెళ్లిందో నాకైతే తెలీదు’’ అని ఆ పెద్దాయన తాపీగా చెప్పారు. ‘‘తిన్న వాటిని జీర్ణరసాలు, పొట్టలోని ఆమ్లాలు జీర్ణం చేస్తాయి. అయినాసరే ఈగ అలాగే ఉందంటే ఆశ్చర్యమే. అయితే ఇది ఇంటెస్టినల్ మయాసిస్ అయి ఉండొచ్చు. ఈగ గుడ్లు లేదా లార్వా ఉన్న ఆహారం తిని ఉండొచ్చు. అవి లోపలికెళ్లి జీర్ణమయ్యాక కూడా జీర్ణవ్యవస్థలోని అసాధారణ వాతావరణాన్ని తట్టుకుని ఒకే ఒక్క లార్వా ఇలా ఈగగా రూపాంతరం చెంది ఉంటుంది’’ అని మిస్సోరీ విశ్వవిద్యాలయంలో గ్యాస్ట్రోఎంటెరాలజీ విభాగ సారథ మ్యాథ్యూ బెక్టోల్డ్ విశ్లేషించారు. ‘ఇలాంటి సందర్భాల్లోనూ వ్యక్తికి విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఉంటాయి. అయినా సరే ఈయనకు అవేం లేవంటే నిజంగా ఇది వింతే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఆ ఈగను కొలొనోస్కోపీ ద్వారా ఎట్టకేలకు బయటకు తీశారు. ఇంత జరిగినా పెద్దాయన ఆరోగ్యంగా ఉండటం విశేషం. చదవండి: మంచు‘మాయం’ -
పాముకు ప్రాణదానం
రాయచూరు రూరల్: పాము అంటేనే ప్రాణాలు తీస్తుందని భయపడతాం. కనిపిస్తే పరుగులు తీస్తాం... కానీ అస్వస్థతకు గురైన ఓ పామును వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం చేసి ఊపిరిపోశారు. ఈ సంఘటన మంగళవారం కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసూగూరులో చోటుచేసుకుంది. లింగసూగూరు తాలూకా హట్టి సమీపంలోని పామనకల్లూరు క్రాస్ వద్ద ఓ జెర్రిపోతు పాము కారులోకి దూరింది. హట్టి ఆస్పత్రి వైద్యుడు రవీంద్రనాథ్ ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకలేదు. అది కారు నుంచి బయటకు రావాలని ఫినాయిల్ చల్లడంతో వాసన తట్టుకోలేక బయటకొచ్చింది. కానీ స్పృహ తప్పి అచేతనంగా పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లింగసూగూరుకు చెందిన పాముల వైద్యుడు ఖాలిద్ చావుస్ వచ్చి ఆ పామును గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. పాము నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టి చికిత్స చేయడంతో కోలుకుంది. తర్వాత ఆ పామును ఊరికి దూరంగా వదిలిపెట్టారు. -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..
ఉత్తరప్రదేశ్లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్లోని వాటర్ హీటర్ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్ను ఇంటివైపు నడిపాడు. ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్! -
వాయు కాలుష్యంతో క్యాన్సర్? ‘ఎయిమ్స్’ నిపుణులు ఏమంటున్నారు?
దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు నాణ్యత సూచిక ‘తీవ్రమైన’ విభాగంలోనే కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వైద్య నిపుణులు ఆరోగ్యంపై వాయు కాలుష్యానికి సంబంధించిన ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలియజేశారు. డాక్టర్ పీయూష్ రంజన్ (అడిషనల్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్, ఎయిమ్స్) మీడియాతో మాట్లాడుతూ వాయు కాలుష్యం- వివిధ రకాల క్యాన్సర్ల మధ్యగల సంబంధానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అన్నారు. శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కరోనరీ ఆర్టరీ వ్యాధులతో వాయు కాలుష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన తెలిపారు. వాయు కాలుష్యం విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మెదడు, గుండె దెబ్బతినే అవకాశాలున్నాయని, ఇది అన్ని వయసులవారిలో సంభవించవచ్చన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ఆదివారం వరుసగా నాల్గవ రోజు కూడా ‘తీవ్రమైన’ విభాగంలోనే ఉంది. ఈ పరిస్థితి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశాలున్నాయని, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు! -
కత్తిపోటుతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిన్ని పేగుకు గాయం
-
నిండు చూలాలికి ప్రాణం పోశారు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు చూలాలికి ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ఊపిరి పోశారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన వెంకటేష్, నాగబిందు దంపతులు. రెండో సారి గర్భం దాల్చిన నాగబిందును కాన్పు కోసం ఈ నెల 16న ఉదయం 7.30 గంటలకు జీజీహెచ్లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆ సమయంలో నిండు గర్భిణి తీవ్రమైన ఆయాసంతో ఊపిరి తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతుండడం గమనించిన గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ సుచిత్ర, డాక్టర్ పార్వతి, డాక్టర్ పూజిత తదితరులు వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం)తో బాధపడుతున్నట్లు గుర్తించి ఏఎంసీలో వెంటిలేటర్పై ఉంచారు. ఆ సమయంలో ఆక్సిజన్ శాతం 52, గుండె పని శాతం 30 మాత్రమే ఉంది. ఆమె పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆదేశాలతో డాక్టర్ షంషాద్బేగం, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్కుమార్, మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ బీమసేనాచార్ పర్యవేక్షణలో అడ్మిట్ అయిన రోజే ఉదయం 9.30 గంటలకు సిజేరియన్ చేసి 2.5 కిలోల బరువున్న మగబిడ్డను వెలికి తీశారు. సిజేరియన్ సమయంలో టాప్ లాక్ అనే నూతన విధానాన్ని అనస్తీషియా వైద్యులు అవలంబించారు. శస్త్రచికిత్స అనంతరం కూడా 24 గంటల పాటు నాగబిందును వెంటిలేటర్ పైనే ఉంచి వైద్యం అందించారు. అనంతరం సీ ప్యాప్ ద్వారా మూడ్రోజులపాటు ఆక్సిజన్ అందించారు. ఈ నెల 21న బాలింత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో లేబర్ వార్డులోని హై డిపెండెన్సీనిట్(ఐసీయూ)కు తరలించారు. ప్రస్తుతం బాలింత నాగబిందు, ఆమె బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన గైనిక్, మెడిసిన్, అనస్తీషియా, చిన్నపిల్లల విభాగం వైద్యులను బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు అభినందించారు. సాధారణంగా ఈ తరహా కేసులకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.లక్షల్లో వసూలు చేస్తారని, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉచితంగా అందించే ఈ చికిత్సపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. -
ఎలాంటి వారికి సీజెరియన్ సజెస్ట్ చేస్తారు?
ఇప్పుడు నాకు 9వ నెల. నార్మల్ డెలివరీ అంటే భయం. అసలు సిజేరియన్ బర్త్ అంటే ఏంటీ? ఎలాంటి వారికి దీన్ని సజెస్ట్ చేస్తారు? – వి. హీరా, ధర్మాబాద్ చాలామందికి 9వ నెల చివర్లో సహజంగా నొప్పులు వచ్చి నార్మల్గా వెజైనల్ బర్త్ అవుతుంది. కానీ కొంతమంది గర్భిణీలు ఇలా నొప్పులు తీయడానికి భయపడుతుంటారు. ఇంకొంతమందిలో బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనుకూలంగా ఉండదు. అలాంటివాళ్లందరికీ సిజేరియన్ బర్త్ను సజెస్ట్ చేస్తారు. సిజేరియన్ బర్త్లో బిడ్డకు, తల్లికి కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఇది చిన్న ప్రొసీజర్ కాదు. పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ సంబంధిత రిస్క్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ మీ డాక్టర్ మీతో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తారు. వ్యక్తిగత కారణాలు, కన్సర్న్స్, ఫీలింగ్స్తో మీకు ఆపరేషనే కావాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని గౌరవించి ఆపరేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు.. తలెత్తే సమస్యలను మీకు వివరిస్తారు. వెజైనల్ డెలివరీకి భయపడి.. ఆపరేషన్కి వెళ్లేవారికి కౌన్సెలింగ్ సెషన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సెషన్లో గైనకాలజిస్ట్, మత్తు డాక్టర్, మానసిక వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. భయాన్ని ఎలా ఎదుర్కోవాలో.. పెయిన్ రిలీఫ్కి బెస్ట్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో సూచిస్తారు. ఆందోళన, టెన్షన్కి కారణాలు చెప్పి.. వాటిని అధిగమించి వెజైనల్ బర్త్కి ప్రయత్నించమనీ చెప్తారు. ఎపిడ్యూరల్ ఎనాలిసిస్, బర్తింగ్ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఈ కౌన్సెలింగ్ తర్వాత కూడా మీరు సిజేరియన్ బర్త్నే కావాలనుకుంటే.. ఎప్పుడు ఆ డెలివరీని ప్లాన్ చేస్తే మంచిదో చెప్తారు. కొన్ని కేసెస్లో సిజేరియన్ డెలివరీ తర్వాత బిడ్డకు ఏర్పడే రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల బిడ్డను ఎన్ఐఐయులో అడ్మిట్ చేసే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అలాంటివి ఎదురవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు. సిజేరియన్ సెక్షన్ తర్వాత కుట్లు నొప్పి లేకుండా.. ఇన్ఫెక్షన్ సోకకుండా త్వరగా మానడానికి స్పెషల్ మెడికేషన్ ఇస్తారు. ఆపరేషన్ వల్ల టిష్యూలో Adhensions ఏర్పడే చాన్సెస్ పెరుగుతాయి. దీనివల్ల తర్వాత డెలివరీ అప్పుడు ఆపరేషన్ టైమ్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. బ్లాడర్, పేగు వంటివీ గాయపడే చాన్సెస్ ఉంటాయి. సాధారణంగా 39 వారాలు పూర్తయిన తర్వాత సిజేరియన్ చెయ్యడం మంచిది. కానీ మీకు బీపీ, సుగర్, బిడ్డ పెరుగుదలలో సమస్యలు ఉంటే కనుక కొంచెం ముందుగా ప్లాన్ చేస్తారు. స్ట్రెచ్ మార్క్స్ మాయం ప్రసవం తర్వాత మహిళలను స్ట్రెచ్ మార్క్స్ చాలానే ఇబ్బంది పెడుతుంటాయి. కొంత మందిలో పెరిగిన బరువు తగ్గిన తర్వాత కూడా ఇవి ఏర్పడుతుంటాయి. వీటినిపోగొట్టేందుకు చాలామంది అనేక రకాల క్రీములు వాడుతుంటారు. అయితే సహజమైన పద్ధతుల్లో వీటిని తగ్గించుకోవచ్చు. చర్మానికి తేమను అందించే గుణం కొబ్బరినూనెకు ఉంటుంది. అందుకే రోజూ రాత్రి పడుకునే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట గోరువెచ్చని కొబ్బరినూనెతో మసాజ్ చేయాలి. దీని వల్ల చారలు పోవడమే కాకుండా సాగిన పొట్ట కూడా తగ్గుతుంది. అలాగే బంగాళదుంప రసం, కలబంద గుజ్జునూ స్ట్రెచ్ మార్క్స్ను పోగొట్టేందుకు వాడొచ్చు. వీటిని స్ట్రెచ్ మార్క్స్ పైరాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే క్రమంగా మార్క్స్ తగ్గటంతో పాటు ఇవి మంచి మాయిశ్చరైజర్స్గానూ పనిచేస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఫ్లూ జ్వరం ఎందుకొస్తుంది? రాకుండా ముందుగానే నివారించొచ్చా?) -
ఎన్నికల బరిలో డజను మంది డాక్టర్ బాబులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ఎన్నికల బరిలో ఉమ్మడి కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ పడుతున్న అభ్యర్థుల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బరిలో దిగబోయేవారిలో డజనుమంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో ఎనిమిది మంది ఎంఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్యశాస్త్రం చదివిన విద్యావంతులు ఉన్నారు. అదే సమయంలో కొందరు పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన అభ్యర్థులూ ఉన్నారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచేవారిలో ఉమ్మడి కరీంనగర్లోని పలు అసెంబ్లీ స్థానాల నుంచి 12 మంది పేర్లలో తొలుత డాక్టర్ ఉండటం గమనార్హం. అదే సమయంలో ఇద్దరు రంజీ ప్లేయర్లు కూడా అసెంబ్లీ బరిలో నిలవడం విశేషం. ఎనిమిది మంది వైద్యులు డాక్టర్ సంజయ్ ఎంఎస్, ఎమ్మెల్యే (బీఆర్ఎస్–జగిత్యాల) డాక్టర్ సంజయ్ ఎంఎస్, (బీఆర్ఎస్– కోరుట్ల) డాక్టర్ భోగశ్రావణి బీడీఎస్ (బీజేపీ–జగిత్యాల) డాక్టర్ వికాస్బాబు ఎంబీబీఎస్ (బీజేపీ– వేములవాడ) డాక్టర్ కే.సత్యనారాయణ ఎంఎస్ (కాంగ్రెస్–మానకొండూరు) డాక్టర్ బల్మూరి వెంకట్ ఎంబీబీఎస్ (కాంగ్రెస్–హుజూరాబాద్) డాక్టర్ జేఎన్ వెంకట్ ఎంబీబీఎస్ (బీజేపీ – కోరుట్ల) డాక్టర్ నగేశ్ ఎంబీబీఎస్ (వైఎస్సార్ టీపీ– కరీంనగర్) నలుగురు డాక్టరేట్లు డాక్టర్ రసమయిబాలకిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (మానకొండూరు) డాక్టర్ కొనగాల మహేశ్ (కాంగ్రెస్–కరీంనగర్) డాక్టర్ మేడిపల్లి సత్యం (కాంగ్రెస్–చొప్పదండి) డాక్టర్ గోలి మోహన్ (సైంటిస్ట్) (బీఎస్పీ–వేములవాడ) ఇద్దరు క్రికెటర్లు.. సెకండ్ ఇన్నింగ్స్ విజయంపై.. కోరుట్ల నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రంజీ క్రికెటర్. 1995లో హైదరాబాద్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్మన్గా ఆడారు. గత ఎన్నికల్లో తాను ఓపెనింగ్ చేసిన తొలి ఎన్నికల్లో అప్పటి నిజామాబాద్ ఎంపీ కవితను ఓడించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో ఇన్నింగ్స్లోనూ సంచలన విజయంపై అర్వింద్ కన్నేశారు. బెస్ట్ ఫెర్ఫామెన్స్ కోసం.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి...2018లో ఈటల రాజేందర్పై కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అదే ప్రత్యర్థిపై బరిలో నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు పాడి కౌశిక్రెడ్డి సైతం రంజీ ఆటగాడు. 2004 నుంచి 2007 వరకు హైదరాబాద్ జట్టులో ఫాస్ట్»ౌలర్గా కొనసాగారు. వీణవంక ఎక్స్ప్రెస్గా పేరున్న కౌశిక్రెడ్డి తన కెరీర్లో 47 వికెట్లు తీసి, ఒక అర్థసెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు కూడా కౌశిక్ పేరిట ఉండటం విశేషం. -
వైద్యులకు స్టైపెండ్ అందడం లేదు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ ఇంటర్న్లకు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదని తేలింది. ఈ సమస్యపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలో గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా 70 శాతం మంది యూజీ ఇంటర్న్లకు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్ అందడం లేదని తేలింది. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని స్టైఫండ్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10,178 మందితో ఆన్లైన్ సర్వే... ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్లు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించే సమస్యపై గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే జరిగింది. పీజీ విద్యార్థుల నుంచి మొత్తం 10,178 మంది నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందులో 7,901 మంది వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలోని 213 ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి ఫీడ్బ్యాక్ స్వీకరించారు. అందులో 2,110 మంది పీజీ విద్యార్థులు తమకు స్టైపెండ్ అందడం లేదని స్పష్టం చేశారు. 4,288 మంది విద్యార్థులు తమకు చెల్లించే స్టైపెండ్ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చెల్లిస్తున్న స్టైపెండ్తో సమానంగా ఉండటం లేదని వెల్లడించారు. తమకు వచ్చే స్టైపెండ్ను ఆయా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలే వెనక్కు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనేక కాలేజీలు కాగితాలపై మాత్రం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తున్నట్లు రాసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా వారికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. ఆందోళనలకు సిద్ధమవుతున్న జూ.డాక్టర్లు... తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ చెల్లింపులో జాప్యంపై సమ్మెకు సిద్ధమవుతున్నారు. మెజారిటీ ప్రైవేట్ కాలేజీలు స్టైపెండ్లు చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎన్ఎంసీని ఆశ్రయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల విద్యా ర్థులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారు యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు సహించడంలేదు. గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వస్తుందని హైదరా బాద్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన ఒక జూనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టైపెండ్ వచ్చేలా ఆందోళనలు చేస్తామని కొందరు విద్యార్థులు అంటున్నారు. కాగా, వైద్య విద్యార్థులకు స్టైపెండ్చెల్లించక పోవడంపై వైద్యవిద్య అధికారులను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికా రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
చంద్రబాబు యాక్టివ్గా ఉన్నారు: వైద్యులు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన్ని పరీక్షించిన వైద్య బృందం ప్రకటించింది. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కనబరుస్తున్న ఆందోళన.. యెల్లో మీడియా దుష్ప్రచారం నేపథ్యంలో వైద్యులు స్పందించారు. కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే: వైద్యులు చంద్రబాబు కేవలం చర్మ సంబంధిత సమస్య మాత్రమే ఉందని ఆయనను పరీక్షించిన డాక్టర్ల బృందం స్పష్టం చేసింది. చంద్రబాబు తమతో చాలా యాక్టివ్గా మాట్లాడారని వైద్యులు పేర్కొన్నారు. ‘‘ఐదుగురు డాక్టర్లు చంద్రబాబును వివరాలు అడిగారు. చంద్రబాబును ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు 67 కిలోల బరువున్నారు. చంద్రబాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాం’ అని వైద్యులు వెల్లడించారు. మేం చెప్పిన మెడికేషన్ చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లతో సంప్రదించాకే వాడుతున్నారని ప్రభుత్వ డాక్టర్ శివకుమార్ తెలిపారు. ‘‘చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉంది. బాబు వ్యక్తిగత డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ ఇచ్చాం. రిమాండ్కు రాకముందు బాబుకు ఎలాంటి వ్యాధులు ఉన్నాయో మాకు తెలియదు. చంద్రబాబు వేసుకుంటున్న మందులను మాకు చూపించారు. చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్ ఇవ్వడం లేదు’’ అని డాక్టర్ శివకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరు: జైళ్ల శాఖ డీఐజీ డాక్టర్ల బృందం ఇచ్చే నివేదికను కోర్టుకు సమర్పిస్తామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. ’’చంద్రబాబు పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా లేరు. 24 గంటలు చంద్రబాబుకు మా అధికారులు అందుబాబులో ఉంటున్నారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నాం. డెర్మటాలజిస్ట్ పరీక్షించి కొన్ని రికమండేషన్స్ చేశారు. నిబంధనల ప్రకారం మేం చేసే ఏర్పాట్లు మేం చేస్తాం. చంద్రబాబు విషయంలో మేం పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. ప్రొటోకాల్ ప్రకారమే అందరితో నడుచుకుంటున్నాం. మేం ఎవరితోనైనా గౌరవంగానే వ్యవహరిస్తాం. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనర్. అత్యుత్తమ డాక్టర్ల బృందం అందుబాటులో ఉంది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం’’ అని జైళ్ల శాఖ డీఐజీ స్పష్టం చేశారు. ప్రెస్మీట్లో పచ్చమీడియా అత్యుత్సాహం చంద్రబాబును మీడియాకు చూపించాలంటూ మీడియా సమావేశంలో ఎల్లోమీడియా ఓవరాక్షన్ చేసింది. పచ్చ మీడియా ప్రశ్నలతో జైల్ అధికారులు షాక్ తిన్నారు. రూల్స్ తెలుసుకుని మాట్లాడాలని జైళ్ల శాఖ డీఐజీ అన్నారు. ప్రభుత్వ వైద్యుల నివేదికపై పచ్చ మీడియా దుష్ప్రచారం చంద్రబాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ వైద్యుల నివేదికపై పచ్చ మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టింది. చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇవ్వగా, బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. స్కిన్ అలర్జీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి -
తల్లిదండ్రుల చేసిన ఘాతుకానికి..ఏకంగా ఆ చిన్నారి 80 ఏళ్లుగా..
కొన్ని విచిత్ర సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. అదెలా సాధ్యం అన్నంతగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రులు ఓ చిన్నారి పట్ల చేసిన దుశ్చర్య వరంగానే మారి అందర్నీ ఆశ్చర్యపరించింది. వైద్యుల్ని సైతం విస్మయపరిచింది. రష్యాలోని ఫార్ ఈస్ట్లో ఉండే ఒక వృద్ధ మహిళ బ్రెయిన్కి సీటీ స్కాన్ చేశారు వైద్యులు. ఐతే వైద్యులలు ఆమె బ్రెయిన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేలా సాధ్యం. అలాంటి వస్తువుతో ఆమె ఏకంగా 80 ఏళ్లు బతికింది. అదికూడా ఓ ఇనుప వస్తువుతోనా!,, అని ఆశ్చర్యపోయారు. శిశుహత్య చేయాలకున్న తల్లిదండ్రుల విఫలప్రయత్నం ఫలితంగా ఆమెకు ఇలా జరిగిందని తెలిసి కంగుతిన్నారు. పైగా ఆ టైంలో ఎలాంటి సదుపాయాలు లేవు. కానీ ఆమెకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండటమే గాదు. పైగా ఇన్నేళ్లు ఆమెకు ఎలాంటి తలనొప్పిగాని తలకు సంబంధించిన ఇబ్బంది గానీ లేకపోవడం విశేషం. రష్య రిమోట్ ప్రాంతంలో సఖాలిన్లో ఆమె పుట్టినప్పుడు తీవ్ర కరువు ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయం. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను చంపేయాలనుకున్నారు. అందుకోసం తలలో మూడు సెంటీమీటర్ల పొడవుగల సూదిని దింపేస్తారు. విచిత్రంగా ఆమెకు ఏం కాలేదు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ కాలంలో శిశువులను ఇలా హతమార్చేవారు. బాల్యంలో ఆ మహిళను చంపేందుకు తల్లిదండ్రులు గుచ్చిన సూది ఆమె బ్రెయిన్కి ఎడమ ప్యారిటల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. అది బాలికపై ఎలాంటి ప్రభావం చూపకపోవడమే గాక ప్రాణాలతో బయటపడింది. ఈ గాయం కారణంగా ఎలాంటి నొప్పి గురించి ఫిర్యాదు చేయలేదని సదరు వృద్ధ మహిళ చెప్పడం విచిత్రం. ఆమెకు ఏం కాకపోవడానికి గల కారణమేమిటి? అది ఇనుము అయినా ఆమెకు ఎలాంటి హాని జరగకపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే అన్వేషణలో ఉన్నారు వైద్యులు. (చదవండి: అంత్యక్రియలు ఆ కాలంలో అలా ఉండేవా..ప్రజలే తినేసేవారా..!) -
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మనిషి యంత్రంలా మారాడు. నిద్ర లేచింది మొదలు ఉరుకులు.. పరుగుల జీవితానికి అలవాటు పడ్డాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చాకా సెల్ఫోన్లు, టీవీలు చూస్తూ కాలం గడిపేస్తున్నాడు. నలుగురు కలిసి కూర్చుని చెప్పుకునే ముచ్చట్లు లేవు. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేసారి భోజనం చేసే పరిస్థితులు అంతకంటే లేవు. భార్యభర్తలిద్దరూ ఇంట్లో ఉన్నా చెరో వైపు కూర్చుని ఫోన్లు, లాప్టాప్లతో కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు ఆశ, అత్యాశ పెరిగిపోయి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల కారణంగా ప్రజల్లో విపరీతంగా మానసిక సమస్యలు పెరిగిపోయాయి. ఒత్తిళ్లు, డిప్రెషన్ అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ఈ ఏడాది ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రకటించింది. మానసిక ఆరోగ్యంపై దృష్టి ఏదీ ఆర్థిక ఇబ్బందులతో కొందరు తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో విశ్రాంతి లేని జీవనం సాగిస్తూ అనేకమంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఆశ, అత్యాశలు బాగా పెరిగిపోయాయి. మనిషి జీవితంలో సంతృప్తి అనేది లేకుండా పోయింది. పిల్లల ఆకాంక్షలు తెలుసుకోకుండా డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలని రూ.లక్షలు ఖర్చుచేసి ఆ కోర్సుల్లో చేర్చుతుంటే.. అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. వారంతా శారీరక అనారోగ్యాలకు తక్షణమే చికిత్స పొందుతున్నారు కానీ.. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఆలోచనే చేయడం లేదు. ఆత్మీయ, అనురాగాలేవి ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సమూహాలుగా ఒకచోట చేరి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు. ఉమ్మడి కుటుంబాల్లో సాయంత్ర ం వేళ ఇంట్లోని వారంతా కలిసి కబుర్లు చెప్పుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఉదయం నుంచి నిద్రించే వరకూ స్మార్ట్ ఫోన్ లేనిదే నిమిషం గడవడం లేదు. ఏదైనా సమాచారం చెప్పాలన్నా.. తెలుసుకోవాలన్నా చాటింగ్లోనే. కనీసం కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదు. బంధువులు, ఆత్మీయుల కలయికలు కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు ఒకప్పుడు రెండు మూడు రోజుల ముందే వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కల్యాణ మండపం వద్దకు రావడం.. కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా ఆత్మీయ , అనుబంధాలు అంతరించిపోవడం కూడా మానíÜక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మానసిక ప్రశాంతతోనే ఆరోగ్యం ప్రస్తుతం రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారిలో ఈ సమస్యలు మరింత అధికమయ్యే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారిలో రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఫలితంగా గుండెపోటు, మెదడు పోటుకు దారి తీయవచ్చునంటున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలుగుతాడని వైద్యులు అంటున్నారు. పాజిటివ్గా ముందుకు సాగాలి ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసంపై దృష్టి సారించాలి. సెల్ఫోన్లు, టెక్నాలజీని అవసరం మేరకే వాడాలి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాలి. ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ కొంత సమయం గడపటం ద్వారా ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. యోగా, మెడిటేషన్, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్యురాలు, రిజిస్ట్రార్, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి!
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య పిల్లలలో మీజిల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యుద్ధ వాతావరణ నేపధ్యంలో మరోసారి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. వీటి పర్యవసానాలను దేశంలోని సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలో రెండేళ్ల వయసుగల నలుగురు పిల్లలు తీవ్రమైన తట్టు(మీజిల్స్) వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ పీడియాట్రిక్ అసోసియేషన్ ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు దేశంలోని చిన్నారులకు టీకాలు వేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి నొక్కి చెప్పింది. దేశంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు వెంటనే టీకాలు వేయించాలని వైద్యాధికారులు సూచనలు చేశారు. తట్టు అనేది వాస్తవానికి రుబియోలా అనే వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా పిల్లలపై దాడి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ వైరస్ సోకాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు బయపటతాయి. తట్టు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి జ్వరం పొడి దగ్గు జలుబు గొంతు మంట కళ్లు ఉబ్బడం చర్మంపై దద్దుర్లు, చర్మంపై చిన్న మచ్చలు వాస్తవానికి మీజిల్స్(తట్టు) లక్షణాలు సాధారణంగా రోగి ముక్కు, గొంతులో కనిపిస్తాయి. బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ వైరస్ గాలిలో కలుస్తుంది. ఫలితంగా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధికి టీకా అందుబాటులో ఉంది. రెండు మోతాదుల టీకా ఈ వ్యాధిని నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో 97 శాతం ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టమయ్యింది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి
తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు: తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. 39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకోసం అవయవదాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్ శ్రీనాథ్రెడ్డితోపాటు డాక్టర్ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. నలుగురికి పునర్జన్మ ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్ ఆస్పత్రి, జీవన్దాన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించడంతో సురేష్బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను ఏపీ జీవన్దాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాఘవేంద్రరావు, జీవన్దాన్ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
భారత సంతతి వ్యక్తికి ఆరుసార్లు ఆగిన గుండె.. ఆ తర్వాత ఏమైందంటే?
లండన్: బ్రిటన్లో లండన్ నగరంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. లండన్ ఆసుపత్రి డాక్టర్లు ఎంతో శ్రమించి భారతీయ-అమెరికన్ విద్యార్థి ప్రాణాలు కాపాడారు. ఏకంగా ఆరుస్లార్లు ఆగిపోయిన గుండెకు ఆపరేషన్ చేసి అతడి ప్రాణాలు నిలబెట్టారు. ఈ ఘటన బ్రిటన్ సహా భారత్లో హాట్ టాపిక్గా మారింది. వివరాల ప్రకారం.. అమెరికాలోని సీటెల్కు చెందిన అతుల్ రావ్, ఈ ఏడాది జూలై 27న లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో చదువుతున్నప్పుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. అది వచ్చే వరకు సెక్యూరిటీ గార్డు సీపీఆర్ కొనసాగించాడు. వెంటనే అంబులెన్స్లో హామర్స్మిత్ హాస్పిటల్కు తరలించారు.కాగా, అతుల్ రావ్ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె నుంచి రక్త ప్రవాహాన్ని అడ్డుకున్నట్లు వైద్య పరీక్షల్లో డాక్టర్లు నిర్దారించారు. పల్మనరీ ఎంబోలిజం అని పిలిచే ఈ పరిస్థితిలో అతడి గుండె ఆరు స్లార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. #IndianAmerican student chooses career in medicine after #UK #NHS medics save his life after his heart stopped 6 times due to blood clots.#CardiacArrest #PulmonaryEmbolism #hearthealth https://t.co/R3NJZipmuQ — National Herald (@NH_India) October 5, 2023 ఈ నేపథ్యంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు రాత్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. మరుసటి రోజున సెయింట్ థామస్ హాస్పిటల్కు తరలించి ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతడు అమెరికా వెళ్లిపోయాడు. ప్రస్తుతం టెక్సాస్లోని బేలర్ యూనివర్సిటీలో ప్రీ మెడికల్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నాడు. మరోవైపు, భారతీయ-అమెరికన్ విద్యార్థి అతుల్ రావ్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి లండన్ వెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తులు, ఆసుపత్రిని సందర్శించాడు. తల్లిదండ్రులతో కలిసి అక్కడి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. -
‘బంగ్లా’లో డెంగ్యూ విధ్వంసం.. వెయ్యి దాటిన మృతులు!
మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో డెంగ్యూ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఏడాది బంగ్లాదేశ్లో డెంగ్యూ బారిన పడి 1000 మందికి పైగా మరణించగా, రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అల్ జజీరా నివేదిక తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్లో 2023లో డెంగ్యూ జ్వరం కారణంగా 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదికంటే ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆ నివేదిక పేర్కొంది. 2023 మొదటి తొమ్మిది నెలల్లో (జనవరి నుండి సెప్టెంబర్ వరకు) కనీసం 1,017 మంది మరణించారని నివేదిక పేర్కొంది. దాదాపు 2,09,000 మంది వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. బంగ్లాదేశ్లోని పలు ఆసుపత్రులు డెంగ్యూ బాధితులతో నిండిపోయాయి. మరోవైపు బాధితులకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జనసాంద్రత అధికంగా ఉన్నఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. డెంగ్యూ అనేది ఉష్ణమండల ప్రాంతాలలో కనిపించే వ్యాధి. అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి, రక్తస్రావం మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల వల్ల వచ్చే వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. డెంగ్యూ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అందించే టీకా లేదా మందు ఇంతవరకూ అందుబాటులో లేదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వృద్ధి చెందుతుంది. అందుకే మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమెజాన్లో వందల డాల్ఫిన్ల మృతదేహాలు ఎందుకు తేలుతున్నాయి? -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిందే..జాగ్రత్తలే రక్ష!
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి తుకారాం సూచించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పీహెచ్సీలు, సీహెచ్సీలు, సబ్ సెంటర్లలో పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో ఉన్న సందేహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వూలో వివరించారు. సాక్షి: సీజనల్ వ్యాధులపై ప్రజలను ఎలా అప్రమత్తం చేస్తున్నారు? డీఎంహెచ్వో: డిస్ట్రిక్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) ద్వారా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ యూనిట్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 20 మంది మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే నిర్వహిస్తున్నాం. ప్రతీ కుటుంబానికి దోమతెరలు అందించాం. ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఎంపీడీవోల సహకారంతో వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. సాక్షి: వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? డీఎంహెచ్వో: ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటిని వేడిచేసి చల్లార్చి వడబోసిన తర్వాత మాత్రమే తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భుజించాలి. అన్ని పీహెచ్సీల్లో వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాం. సాక్షి: డెంగీ, టైఫాయిడ్ నిర్ధారణ ఎలా? డీఎంహెచ్వో: జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో సీబీపీ (బ్లడ్ పిక్చర్, ప్లేట్లెట్స్, కౌంటింగ్) యంత్రాలు ఉన్నాయి. ప్రజలకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని టీహబ్ ద్వారా 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. డెంగీ ఎలిజ టెస్టు ద్వారానే కచ్చితమైన ఫలితం వస్తుంది. సాక్షి: వైద్యశాఖ అందించే చికిత్సలు ఏమిటి? డీఎంహెచ్వో: అన్ని పీహెచ్సీల్లో యాంటిబయాటిక్స్, క్లోరోక్విన్, ప్రైమ్ ఆక్సిజన్, ఆర్టిపీసీటి, అన్ని రకాల విటమిన్స్, నొప్పులు, సిప్రోప్లోక్సిన్, మెట్రోజిల్, ప్లురోక్సిన్, స్పోర్లాక్, సీసీఎం, డెరిఫిల్లిన్, దగ్గు మందులు, మాత్రలు, ఐవీ ప్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలోని 20 పీహెచ్సీలు, 2 అర్బన్ సెంటర్లు, 118 సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. సాక్షి: గ్రామీణులకు అత్యవసర వైద్యం అందేదెలా? డీఎంహెచ్వో: రోగిని ఇంటి నుంచి ఆస్పత్రులకు తీసుకువచ్చేందుకు 8 అవ్వాల్, 12 (108) వాహనాలు, 15 (102) వాహనాలు, 1 ఎఫ్హెచ్ఎస్ వాహనం అందుబాటులో ఉంచాం. సాక్షి: సీజనల్ వ్యాధుల వివరాలు తెలపండి? డీఎంహెచ్వో: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ–81, మలేరియా–69, టైఫాయిడ్–231 కేసులు నమోదయ్యాయి. (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
మనిషి కడుపులో ఇయర్ ఫోన్లు, తాళం, బోల్టులు.. వైద్యుల అవాక్కు
పంజాబ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసి పరీక్షించిన వైద్యులు అతని కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కయ్యారు. వ్యక్తి కడుపులో ఏకంగా ఇయర్ ఫోన్స్, లాకేట్స్, బోల్టులు, నట్స్, ఇలా వందకు పైగా వస్తువును చూసి ఖంగుతున్నారు. వివరాలు.. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా వాంతులు, కడుపు నొప్పి, తీవ్రవైన జ్వరం ఉండటంతో మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవడంతో.. స్టమక్ ఎక్స్రే చేయాలని నిర్ణయించారు. స్కాన్ చేసిన తర్వాత వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వ్యక్తి కడుపులో అనేక ఇనుప, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు తేలింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి అతడి శరీరంలోని వస్తువులను విజయవంతంగా బయటకు తీశారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన అనేక వస్తువుల్లో ఇయర్ ఫోన్లు, వాషర్లు, నట్స్, సేఫ్టీపిన్స్, బోల్ట్లు, వైర్లు, రాఖీలు, తాళం, తాళం చెవి లాకెట్లు, బటన్లు, రేపర్లు, హెయిర్క్లిప్లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్, ఇలా ఎన్నో ఉన్నాయి. చదవండి: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే! సర్జరీపై మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఇదే మొదటిదని అన్నారు. రెండు ఏళ్లుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. దాదాపు 3 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.అతని శరీరంలో నుంచి వస్తువులన్నీ తీసేసినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడలేదని చెప్పారు. వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా షాక్ అయ్యామని చెప్పారు. అవన్నీంటిని అతడు ఎలా, ఎప్పుడూ మింగాడో తెలీదని అన్నారు. కానీ అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని తెలిపారు. ఆసుపత్రిలో చేరే కొన్ని రోజుల ముందు నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించినట్లు చెప్పారు. ఎంతమంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా, వారు అతని నొప్పి వెనుకగల కారణాన్ని నిర్ధారించలేకపోయారని పేర్కొన్నారు. -
పారాహుషార్!
అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది. మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది. బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న ఈ మాటలు భారత్లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్త హైపర్టెన్షన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది. పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్ కిల్లర్’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు. భారత్లో గుండెపోటు, స్ట్రోక్లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్’ (ఐహెచ్సీఐ)ను 2017 నవంబర్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సున్నా, భారత్లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది. జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. -
జెనరిక్ ఔషధాలంటే నాసిరకం కాదు!
వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ ఔషధాలనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసి, వైద్యుల ఆందోళన అనంతరం ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్ ఔషధాలు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ ‘బ్రాండెడ్’ మందులను తీసుకోవడానికే మొగ్గుచూపు తున్నారు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం, లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నాసిరకం మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) ఉత్పత్తవుతాయి. అందువల్ల, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ప్రపంచ ఫార్మసీగా భారత్ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో జెనరిక్ మందులు భారత్ నుండి ఎగుమతి అవుతాయి. 21వ శతాబ్ది ప్రారంభం వరకు, మన దేశంలోని పేటెంట్ వ్యవస్థ ఉత్పత్తి పేటెంట్లను కాకుండా ప్రక్రియ పేటెంట్లను మాత్రమే అనుమతించింది. ఇది భారతీయ ఔషధ పరిశ్రమకు, పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడకుండా ఔషధాలను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించింది. ‘రివర్స్ ఇంజనీరింగ్’ విధానం వల్ల వివిధ తయారీ ప్రక్రియలు అభివృద్ధి చెందగలవు. భారతీయ తయారీ రంగం విజయగాథల్లో ఒకటిగా భారతదేశ ఔషధ రంగాన్ని పరిగణిస్తున్నారు. ప్రత్యేకంగా, హెచ్ఐవి/ ఎయిడ్స్, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ లు వంటి సంక్లిష్ట రంగాల్లో ఇవాళ మనం ప్రపంచం మొత్తానికి జెనరిక్ ఔషధాలకు సంబంధించి అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నాము. ‘బ్రాండెడ్’ ఔషధాల లాగే జెన రిక్ మందులు కూడా అదేవిధమైన క్రియాశీల పదార్థం కలిగినవి కాబట్టి, ఒకేరకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. జెనరిక్ ఔషధాల ధర తక్కువగా ఉండటమే వాటిని సమర్థించ డానికి ప్రధాన కారణం. ఎందుకంటే అవి పదేపదే జంతు, క్లినికల్ అధ్యయనాలకు గురికావాల్సిన అవసరం లేదు. ధర సమస్య దృష్ట్యా, అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా ముఖ్యమైనవి. అలాగే ఇవి ప్రపంచానికి విపరీతంగా ప్రయోజనం చేకూర్చాయి. ఔషధాల నాణ్యత విషయంలో ఏ విధమైన రాజీ ఉండకూడదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్ మందులు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు సహేతుకంగానే జెనరిక్ ఔషధాలను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్ మందులను తీసుకోవడానికే వీరు తరచుగా మొగ్గు చూపు తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి ఔట్లెట్లలో పేలవమైన అమ్మకాలే దీనికి నిదర్శనం. వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ మందులనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న జెనరిక్ ఔషధాల నాణ్యతకు సంబంధించిన తీవ్రమైన సమస్యను ఇది తెరపైకి తెచ్చింది. ఆ ప్రకటనపై వైద్యులు సముచితమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీంతో జెనరిక్ ఔషధాలను వైద్యులు తప్పని సరిగా రాయడానికి సంబంధించిన తన నిర్ణయాన్ని ఎన్ ఎంసి ప్రస్తు తానికి నిలిపివేయడం సరైన చర్య. ఏదేమైనప్పటికీ, జెనరిక్ ఔషధాల ప్రాధాన్యతపై దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి, ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చును తగ్గించడానికి జెనరిక్ ఔషధాల వినియోగం చక్కటి మార్గం. ప్రభుత్వం కూడా నాణ్యమైన జెనరిక్లను నిర్ధారించడానికి అన్ని విధాలా కృషి చేయాలి. మన దేశంలో నకిలీ లేదా నాసిరకం ఔషధాలు ఉండటం, ప్రధా నంగా పేలవమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ ఫలితమే. అలాంటి కొన్ని మందుల ఉపయోగం తర్వాత ఉత్పన్నమైన తీవ్రమైన సమస్యలకు సంబంధించిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. గత సంవత్సరం, ఒక కంపెనీ తయారు చేసిన ప్రొపోఫోల్ ఇంజెక్షన్ను ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రతికూల ఫలితాలు, ఆఖరికి మరణం సంభవించడం కూడా చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్ దృష్టికి వచ్చింది. భారతదేశం నుండి ఎగుమతైన దగ్గు సిరప్ వాడకం వల్ల గాంబి యాలో నమోదైన మరణాలు, ఫార్మా హబ్గా మన దేశానికి ఉన్నపేరు ప్రతిష్ఠను దెబ్బతీశాయి. నాసిరకం మందులు వాడిన తర్వాత ఉండే ప్రమాదాల్లో తగిన రీతిలో లేని ప్రతిస్పందన, ఆ ఔషధానికి నిరోధకత అభివృద్ధి కావడం వంటివి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలు. సమర్థవంతమైన నియంత్రణ యంత్రాంగం లేనప్పుడు, కొన్ని ఔషధ తయారీ సంస్థలు డబ్బును ఆదాచేసుకునే ప్రయత్నంలో, అంత ర్జాతీయంగా ఆమోదించిన ఉత్తమ పద్ధతులను అనుసరించకుండా విస్మరిస్తున్నాయి. వీటి ఉత్పత్తుల విషయంలో కంపెనీలు చాలా తరచుగా రాజీపడి పోతు న్నాయి. నిర్లక్ష్యం, కల్తీ ఉండటం వంటి నిజాయితీ లేని పద్ధతులను కూడా గమనించవచ్చు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నకిలీ మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) సంభవిస్తాయి. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది. బ్రాండెడ్ ఔషధాల లాగే ప్రభావవంతమైనవనీ, సురక్షితమైన వనీ, వాటికి ప్రత్యామ్నాయం కాగలవనీ తగిన ధ్రువీకరణ జరిగిన తర్వాత మాత్రమే యూరోపియన్ దేశాలు, అమెరికా జెనరిక్ ఔషధా లను ఉపయోగించడానికి ఆమోదిస్తాయనేది అందరికీ తెలిసిందే. జెనరిక్ ఔషధాలను ఆమోదించడానికి కఠినమైన సమీక్షా ప్రక్రియ అమలులో ఉంటుంది. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ), ఉత్తమ ఉత్పాదక పద్ధతులకు అను గుణంగా ఉండేలా తయారీ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తుంది. ఇది జెనరిక్ ఔషధాలపై రోగి విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఐఎమ్ఎస్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, జెనెరిక్ మందులు అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఒక దశాబ్దంలో (2009– 2019) దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్లను ఆదా చేశాయి. జెనరిక్ ఔషధాలు ఎంత ముఖ్యమైనవో ఈ సొమ్మే చెబుతోంది. అందువల్ల, మనం పాఠాలు నేర్చుకుని, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. కచ్చిత మైన నాణ్యతా నియంత్రణ చర్యలు అమలులో లేకుంటే, అసమర్థ మైన మందులు, తీవ్రమైన దుష్ప్రభావాల రూపంలో జంట ప్రమా దాలు అలాగే ఉంటాయి. మన ప్రస్తుత విధాన మార్గదర్శకాలను పునఃపరి శీలించి, అమలు ప్రక్రియను బలోపేతం చేయడం తక్షణ అవసరం. పూర్తి శిక్షణ పొందిన నిపుణులు నిర్వహించే పరీక్షా సౌకర్యాల రూపంలో తగిన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతమున్న చట్టబద్ధమైన, ఇతర రక్షణలకు చెందిన కచ్చి తమైన పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది. చట్టపరమైన నియంత్రణ విధానాలు కంపెనీలు స్వీయనియంత్రణను ప్రోత్సహించే విధంగా నిర్మాణాత్మకంగా ఉండాలి. అయితే వికృతమైన కేసులను సాహసంతో ఎదుర్కో వటానికి సంకల్పం ఉండాలి. భారతదేశంలో ఔషధాల నాణ్యతను నియంత్రించడానికి బాధ్యత వహించే ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ (సీడీఎస్సీవో)ను తప్పనిసరిగా బలోపేతం చేయాలి. మన ఔషధ అప్రమత్తత, నిఘా వ్యవస్థ జాగరూకత కార్యక్రమా లను కూడా శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ అనంతరం మన ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి ఇవి మార్గాలు. ఔషధ హెచ్చరికల తర్వాత, వాటిని వెనక్కి తీసుకునే ఏ తదుపరి చర్య నైనా తప్పనిసరిగా పబ్లిక్ డొమైన్ లో వీలైనంత త్వరగా ఉంచాలి. నాణ్యమైన జెనరిక్ ఔషధాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇక బ్రాండెడ్ మందులను మార్కెట్ చేయవద్దని ప్రభుత్వం ఔషధ కంపెనీలను ఆదేశించాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్కె టింగ్ బడ్జెట్లను తగ్గించి, పరిశోధన, అభివృద్ధితో పాటు నాణ్యతా నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించాలి. నాణ్యమైన జెనరిక్ ఔషధాలను నిర్ధారించే సవాలును సీడీఎస్సీఓ తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత, జాతీయ వైద్య కమిషన్ ఆదేశాన్ని స్వాగతించవచ్చు. డాక్టర్ కె.కె. తల్వార్ వ్యాసకర్త పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు ముమ్మరంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం కోసం ఆరోగ్య శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా నిర్వహి ంచిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కా రానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. రూ.66.65 కోట్లతో మందులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎంలు వారి పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజల ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందిస్తున్నారు. సర్వేలో గుర్తించిన ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన పరీక్షలు చేసి, మందులు ఇస్తారు. ఇందు కోసం రూ.66.65 కోట్ల విలువ చేసే 162 రకాల మందులు, 18 సర్జికల్ పరికరాలు, ఎమర్జెన్సీ కిట్స్, ఇతర వస్తువులను కొంటున్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ మొదలయ్యే నాటికి అన్ని ప్రాంతాలకు వీటిని సరఫరా చేస్తారు. 342 మంది స్పెషలిస్ట్ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నెల 30 నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. ప్రతి క్యాంప్నకు సంబంధిత పీహెచ్సీల మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ వైద్యులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 342 మంది స్పెషలిస్ట్ వైద్యులను గుర్తించారు. కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11 నుంచి కంట్రోల్ రూమ్ల నుంచి వైద్యులు, మందులు, డయగ్నోస్టిక్స్ లభ్యత వంటి ఇతర అంశాలపై పర్యవేక్షణ మొదలవుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ ఇలా ♦ 15వ తేదీ నుంచి కార్యక్రమంపై వలంటీర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం ♦ 16వ తేదీ నుంచి ప్రజల్లో ఆరోగ్య సమస్యల గుర్తింపునకు ఇంటింటి సర్వే ♦ 30వ తేదీ వైద్య శిబిరాల నిర్వహణ ఉచితంగా చికిత్స శిబిరాల్లో వైద్యుల కన్సల్టేషన్ అనంతరం ఎవరికైనా తదుపరి వైద్యం అవసరమైతే దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు పంపుతారు. ఆస్పత్రుల్లో వారికి ఉచితంగా చికిత్స చేస్తారు. ఈ కార్యక్రమంపై వలంటీర్లు 15 రోజుల పాటు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు కష్టం
మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 24న ఓ మహిళకు ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బంది కాటన్ ప్యాడ్ను అమర్చి డిశ్చార్జి సమయంలో తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలు కీర్తిలయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయకు ఈ నెల 24న పురిటి నొప్పులు రావడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించగా.. కొంత క్రిటికల్ కావడంతో ఫోర్సెప్ డెలివరీ (బలవంతపు సాధారణ ప్రసవం) చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. కీర్తిలయకు రక్తస్రావం కాకుండా ఉండేందుకు కాటన్ ప్యాడ్ అమర్చారు. అనంతరం తల్లీబిడ్డలను వార్డులోకి మార్చారు. మూడు రోజుల తర్వాత 27న సాయంత్రం కాటన్ప్యాడ్ను తొలగించకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన బాలింత 28న సాయంత్రం అస్వస్థతకు గురికాగా 108లో చెన్నూర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది విషయాన్ని గమనించి కాటన్ప్యాడ్ను తొలగించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాటన్ప్యాడ్ తొలగించకుండానే డిశ్చార్జి చేయడంపై బాలింత, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలింత పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పూర్తిస్థాయి చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చందర్రెడ్డిని సంప్రదించగా.. కాటన్ప్యాడ్ను తొలగించడంలో సిబ్బంది తప్పిదం ఉందని, బాధ్యులైన వైద్యులు, సిబ్బంది వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలిపి, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
షాకింగ్ ఘటన: మహిళ మెదడులో.. కొండచిలువ..
ఓ మహిళ గత కొన్ని రోజులుగా విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎదుర్కొంది. ఇవన్నీ సాధారణమైనవే కదా అన్నట్లు మందులు వాడింది. అయినా ఎలాంటి ఫలితం లేకపోగా మతిమరుపు వంటి జ్వరం వంటివి మరీ ఎక్కువైపోయాయి. దీంతో వైద్యులు అన్ని పరీక్షలు చేశారు. అన్ని నార్మల్గానే వచ్చాయి. ఇక చివరిగా ఎంఆర్ఐ స్కాన్ చేయగా..ఆమె మెదడులో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు వైద్యులు. ఈ షాకింగ్ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..64 ఏళ్ల మహిళ విరేచనాలు, వాంతులు దీర్ఘకాలిక జ్వరం తదితర వాటితో గత కొంతకాలంగా బాధపడుతోంది. దీంతో వైద్యలు ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమె మెదడులో ఉన్న పరాన్నజీవిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది కొండచిలువ శరీరంలో ఉండే ఒక విధమైన పురుగులాంటిది. అలా అని ఆమె పాములు పట్టే ఆమె కూడా కాదు. ఆమె కసలు పాములతో ఎలాంటి సంబంధ కూడా లేదు. అయితే ఆమె కొండచిలువలు నివశించే సరస్సు సమీపంలో నివసిస్తున్నందున ఈ పురుగు ఆమె మెదడులో వచ్చిందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమె వంట చేయడం కోసం అని గడ్డి వంటివి కోసుకువచ్చేది. అలాగే ఆకుకూరలు వంటి పదార్థాలను తీసుకొచ్చేది. ఈ కొండచిలువ వాటిపై పాకడం లేదా దాని మలం ద్వారా ఈ జీవి ఉండొ అవకాశం ఉందని. ఆమె ఆకుకూరలు తిన్నప్పుడో లేదా మరేవిధంగానో ఆమె శరీరంలోకి వెళ్లి మెదడులో కూర్చొందన్నారు. అది ఏకంగా ఎనిమిది సెంటీమీటర్ల పొడవుతో మెలికలు తిరిగనట్లు ఉందన్నారు. దీని కారణంగా ఆమె విపరీతమైన వాంతులు, కడుపునొప్పితో కూడిని విరేచనాలు వంటి సమస్యలను ఎదుర్కొందన్నారు. ఇక ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ పరాన్నజీవిని తీసేసినట్లు తెలిపారు. సదరు పేషెంట్ కూడా నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుందని అన్నారు. ఈ కేసు జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేసిందన్నారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఉద్భవిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జూనోటిక్ వ్యాధులేనని చెప్పారు. జూనోటిక్ అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులు. ఇలానే కనోనా వైరస్లు కూడా మానవాళిని భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. అందువల్ల మానవులు జంతువులను పెంచుకునేటప్పుడూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. టేప్వార్మ్ లాంటి బద్దె పురుగులు కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేసి మూర్చ వంటి రుగ్మతలను కలుగ చేస్తాయన్నారు. ఇవి జంతువుల శరీరంలో పరాన్నజీవిగా ఆశ్రయించి ఉండటం కారణంగా..మనం వాటిని ఆహారంగా తీసుకోవడంతో మన శరీరంలో చేరి నెమ్మదిగా అభివృద్ధి చెంది కేంద్ర నాడివ్యవస్థపై దాడి చేస్తుందని అన్నారు. అందువల్ల బాగా ఉడకబెట్టి తగు జాగ్రత్తల పాటించి ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. (చదవండి: ఆ పరాన్నజీవి గుడ్లు నేరుగా నోట్లోకి వెళ్లడంతో..ఆ ముప్పు తప్పదు!) -
విమానంలో చిన్నారికి గుండెపోటు.. ప్రాణం పోసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్పూర్కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు. విమానం నాగ్పూర్కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్పూర్కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. #Always available #AIIMSParivar While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
-
వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా?
మద్యం, జూదం అనేవి వ్యసనాలని, ఇవి ఎవరికైనా ఒకసారి అలవడితే వారు వాటిని జీవితంలో విడిచిపెట్టలేరని చాలామంది అంటుంటారు. ఇవి వ్యవసంగా మారితే వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేని కూడా చెబుతుంటారు. మనిషికి మద్యం ఎలా అలవడుతుంది? ఏ మేరకు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుంది. కొందరు చెబుతున్నట్లు వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం అలవాటు అనేది ఒక క్రానిక్ డిసీజ్. మద్యం అలవాటు అనేది మూడు దశలుగా ఏర్పడుతుంది. మొదటి దశలో మద్యం తాగేవారు అది వారికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుందని గ్రహించలేరు. ఈ దశలో మద్యం తాగే వ్యక్తి దానిని అధికమోతాదులో తీసుకుంటాడు. మద్యం తాగడంపై నియంత్రణ కోల్పోతాడు. ఇక్కడి నుంచే అతను తప్పు చేయడం మొదలుపెడతాడు. ఇక వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయానికి వస్తే దీనికి స్పష్టమైన రుజువులు లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా ఏడు రోజుల పాటు మద్యం తాగితే, అలాగే అది అధిక మోతాదులో ఉంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక మద్యం తాగడంలోని రెండవ దశ విషయానికొస్తే ఆ సమయంలో శరీరంలో అంతర్గతంగా మార్పులు వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దశలో సమాజంలోని తోటివారు మద్యం తాగేవారిని అవహేళన చేయడం కనిపిస్తుంది. ఇక చివరిదశ విషయానికొస్తే మద్యం తాగేవారు పూర్తిగా తమపై నియంత్రణ కోల్పోతారు. అదే సమయంలో శరీరాన్ని పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఏ పనీ సరిగా చేయలేని స్థితికి చేరుకుంటాడు. శరీరం బలహీనమవుతుంది. ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో? -
విలయం.. యువ హృదయం!
విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువగా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రౖమెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించుకుని గుండె సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఆకస్మిక మరణాలు గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు. ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం పోస్టు కోవిడ్ గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్) పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపిరి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు) ముందు జాగ్రత్తే మందు గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఒత్తిళ్లకు దూరంగా ఉండటం నీరు ఎక్కువగా తీసుకోవడం యువతలో అధికమవుతున్నాయ్.. గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్ వేస్తున్నాం. పోస్టు కోవిడ్ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ను అలవర్చుకోవాలి. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, కార్డియాలజిస్ట్ -
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!!
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!! -
ఆర్ఎంపీలకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. -
డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలకు కొత్త రూల్! మార్గదర్శకాలు విడుదల
వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్ ఎక్స్పర్ట్లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయన్సర్లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్/ఫిట్నెస్ ఎక్స్పర్ట్లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి మినహాయింపు అయితే వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్నెస్, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు. -
ఆ డాక్టర్లపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో వైద్యులు దీర్ఘకాలం సెలవులో ఉండడం, అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం వంటివి సమర్థనీయం కాదని, అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. నూరుశాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా ఆస్పత్రుల వారీగా, సిబ్బంది వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపానల్ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై క్వాలిటీ చెక్ చేయాలని చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు సంబంధించి ఉద్యోగులు నెలనెలా చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా సొమ్మును కూడా ప్రతి నెల సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమయ్యేవిధంగా చూడాలని ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ దీర్ఘకాలం విధులకు హాజరుకాని ప్రభుత్వ డాక్టర్లను గుర్తించి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, తదుపరి చర్యలకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి.మురళీధర్రెడ్డి, ఆరి్థకశాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి మంజుల, ఏపీవీవీపీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్, డీఎంఈ నర్సింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
వైద్యుల కర్మాగారంగా తెలంగాణ: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: వైద్యుల కర్మాగారంగా తెలంగాణ మారిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ‘తెలంగాణ వైట్ కోట్ రివల్యూషన్ సాధించింది. ఆ మేరకు మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్లలో 43% తెలంగాణ నుంచే ఉన్నాయి. త్వరలోనే మండలస్థాయిలో త్వరలోనే 40 ప్రాథమిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తాం’ అని మంత్రి హరీశ్రావు వివరించారు. -
భారీగా ఉబ్బిన కడుపు.. క్రమంగా 15 కిలోల బరువు.. ఇంతలో ఇలా..
మహబూబ్నగర్: ఆదివాసి మహిళకు కడుపులో పెరుగుతున్న బరువు ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాగైనా వైద్యం అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది. అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బీకే) గ్రామానికి చెందిన ఈదమ్మ, భర్త బిక్షమయ్య నిరుపేద కుటుంబం. వారికి ముగ్గురు ఆడపిల్లలు, జీవాలు మేపుతూ జీవనం గడుపుతున్నారు. ఇంతలోనే ఈదమ్మ కడుపులో ఏదో పెరుగుతుంది. క్రమంగా 15 కిలోల బరువు వరకు వచ్చింది. వారికి ఉన్న స్థోమతలో ఆర్ఎంపీల వద్ద చూయించుకున్నా తగ్గలేదు. కడుపులో కణతి పెరుగుతుందని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు తెలిపారని ఈదమ్మ బోరుమంటుంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమతలేక అలాగే ఉన్నామని క్రమంగా బరువు పెరుగుతుండటంతో శ్వాసతీసుకోవడం కష్టం అవుతుందని ఈదమ్మ విలపిస్తోంది. తనకేమన్న అయితే పిల్లలు అనాథలు అవుతారని, ప్రభుత్వం వైద్యం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది. -
బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు..
బజార్హత్నూర్: వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు .. వెరసి ఓ బాలుడి నిండు జీవితం బలైంది. బురద రోడ్డుపై మోటార్సైకిల్పై ఆ స్పత్రికి చేరడం ఆలస్యం కావడం.. సమ యానికి వైద్యులూ అందుబాటులో లేక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన గిరిజన దంపతులు పంద్ర లక్ష్మణ్, జమునల కుమారుడు పరుశురాం(3) బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. గ్రామం నుంచి పీహెచ్సీకి 16కిలోమీటర్ల దూరం ఉండగా.. వర్షాలకు అధికభాగం రోడ్డు బురదమయమైంది. అదే రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మోటార్సైకిల్పై పీహెచ్సీకి బాలుడిని తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందు బాటులో లేరని, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదని, రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపాడు. కొద్దిసేపటికే బాబు మృతిచెందాడని, వైద్యులు అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరూ మోటార్సైకిల్పైనే మృతదేహంతో గ్రామానికి చేరుకున్నారు. చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారంటూ మెడికల్ ఆఫీసర్ వితండవాదన కాగా, ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ భీంరావ్ను ఫోన్లో సంప్రదించగా.. బాలుడు మృతిచెందిన తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులే లేరు కదా మృతిచెందినట్లు ఎవరు నిర్ధారించారని అడగ్గా.. సమాధానం చెప్పలేదు. -
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్!
సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్..చిన్నారుల్లో సైతం ప్రబలుతున్న ఓ వ్యాధి. పిల్లల కాలేయాలను కమ్ముకుంటున్న ఫ్యాటీ లివర్ వ్యాధిపై నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తును చేజేతులా రోగాలకు అప్పగించినట్లు అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బొద్దుగా ముద్దుగా మెరిసిపోతూ మడత నలగని దుస్తుల్లో పాఠశాలలకెళ్లొచ్చే చిన్నారుల్ని చూసి మురిసిపోవడం మాత్రమే కాదు వారి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన ఓ అధ్యయనం చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. పెద్దల్లోనే కాదు.. హైదరాబాద్కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ల బృందం నగరంలోని ఐదు ఉన్నత పాఠశాలల్లో అధ్యయనం నిర్వహించింది. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఎఎఫ్ఎల్డీ)తో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా పెద్దలే ఈ వ్యాధి బాధితులుగా ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం తప్పని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఏమిటీ ఫ్యాటీ లివర్? కాలేయం (లివర్)లో అధిక మొత్తంలో కొవ్వు (ఫ్యాట్) పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఈ వ్యాధి (స్టీటోసిస్) చాలావరకు పెద్దల్లో ఉంటుంది. అయితే ఆరోగ్యవంతమైన లివర్లోనూ స్వల్పంగా కొవ్వు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన లివర్ బరువులో 5 నుంచి 10 శాతం మధ్యకు కొవ్వుపెరుగుతుందో అప్పుడది సమస్యగా మారుతుంది. ఆహారం.. వ్యాధుల భారం సోడా, చాక్లెట్లు నూడుల్స్, బిస్కెట్లు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు వీరు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ‘గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా యూరప్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏర్పడింది. పిల్లలు తినే జంక్ ఫుడ్ చాలావరకు దీనికి కారణమవుతోంది..‘అని వైద్యులు అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ అధ్యయనం కూడా చిన్నారులతో సహా 30 శాతం మందిలో ఈ వ్యాధి విస్తృతి ఉన్నట్లు తాజాగా గుర్తించింది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఇది తక్కువగా ఉన్నట్లు తేల్చింది. ‘ఆట స్థలాలు లేక పాఠశాలల పిల్లల్లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.రవాణా సౌకర్యాలు కూడా నడకను తగ్గించి వారిలో ఊబకాయానికి ఊతమిస్తున్నాయి..‘అని ఉస్మానియా ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ అంటున్నారు. ‘సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనాల్లో కనుగొన్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఇది తక్కువ..‘అని ఏఐజీ బృందంలోని ఓ వైద్యుడు చెప్పారు. జంక్ ఫుడ్పై అవగాహన పెంచాలి చిన్నపిల్లల ఆహారంలో చిప్స్, బర్గర్స్, పేస్ట్రీలు, కూల్ డ్రింక్స్ వంటివి భాగం కాకుండా చూడాలి. వీటివల్ల శరీరంలోని బాక్టీరియా మారిపోయి ఫ్యాటీ లివర్కు కారణమవుతుంది. అందువల్ల జంక్ ఫుడ్ చేసే చేటుపై కూడా చిన్నారుల్లో అవగాహన పెంచాలి. కూరగాయలు, పెరుగు మంచివనే చిన్న చిన్న విషయాలు తరచు చెబుతుండాలి. సన్నగా ఉండే చిన్నారుల్లోనూ ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. కాబట్టి సన్నగా ఉన్నంత మాత్రాన జంక్ ఫుడ్ తినమని చెప్పకూడదు. – డా.నాగేశ్వర్రెడ్డి, చైర్మన్, ఏఐజీ ఆసుపత్రి -
గురుక పెట్టి హాయిగా నిద్రపోతున్నారా?.. అంతకు మించి సమస్యలు
‘చెవిచిల్లు పెట్టే నీ గురక... చిందరవందర అయింది నా పడక’ అని నిద్రలో గురక పెట్టే వాళ్లపైన చుట్టుపక్కలవాళ్లు గింజుకుంటారు. అయితే నిద్రలో గురకపెట్టేవారికి అంతకు మించిన సమస్యలే ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. ఎవరైనా మంచం మీద ఇలా వాలి అలా గుర్రుపెట్టారంటే హాయిగా నిద్రపోతున్నారనుకుంటాం. అయితే గురకపెడుతూ నిద్రపోవడం హాయిగా భావించడం సరికాదని, దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గురక తెచ్చిపెట్టే సమస్యలపై మన దేశంలో అవగాహన అత్యల్ప స్థాయిలో ఉందని వారంటున్నారు సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చేసిన రెస్మెడ్–2023 గ్లోబల్ స్లీప్ సర్వేలో 58 శాతం మంది భారతీయులు గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావిస్తున్నట్టు తేలడం నిద్ర ఆరోగ్యంపై వారి అవగాహన లేమిని తేల్చింది. 2022తో పోలిస్తే 2023లో మన వాళ్ల నిద్ర నాణ్యత 22 శాతం క్షీణించినా సర్వేలో పాల్గొన్నవారిలో 85 శాతం మంది తమ నిద్ర నాణ్యత బాగుందన్నారని సర్వే వెల్లడించింది. మూడ్ మార్పులు, పగటి నిద్ర, ఏకాగ్రత లోపం ఉన్న 20 శాతం మంది మాత్రమే వైద్యుడ్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నారని తేల్చింది. గురక.. అనారోగ్య కారణమే... అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ‘న్యూరాలజీ ఆన్లైన్’సంచికలోప్రచురించిన అధ్యయనం ప్రకారం..గురక పెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 91 శాతం ఎక్కువ. అంతేకాదు గురకపెట్టేవారిలో దాదాపు 20–25 శాతం మంది గురక.. తద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఒఎస్ఎ)తో బాధపడుతూ ఉండవచ్చునని మరో అధ్యయనం తేల్చింది. గురకపెట్టే వారిలో ప్రతి నాల్గవ వ్యక్తి స్లీప్ అప్నియా రోగి అని వైద్యులు అంటున్నారు. పెరుగుతున్నబాధితులు గురక–స్లీప్ అప్నియాతో బాధపడుతున్న చాలా మందికి దాని తీవ్రమైన పరిణామాల గురించి తెలియదని ఛాతీ, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సందీప్ అంటున్నారు. ‘40 శాతం మంది వ్యక్తులు గురక పెట్టినట్లయితే, వారిలో 10 శాతం మందికి స్లీప్ అప్నియా ఉన్నట్టే’అని దేశంలో తొలి స్లీప్ ల్యాబ్ ప్రారంభించిన డాక్టర్ జేసీ సూరి అన్నారు. తాను స్లీప్ ల్యాబ్ ప్రారంభించినప్పుడు నెలకు నలుగురైదుగురు రోగులు మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని అందులో మధ్య వయసు్కలు, వృద్ధుల సంఖ్య దాదాపు 15–20 శాతంగా ఉందన్నారు. ‘స్లీప్ అప్నియా ద్వారా రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. బాల్యంలోనే... నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఇటీవలి అధ్యయనం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం మంది పిల్లలు గురక, నిద్రలేమితో బాధపడుతున్నారు. చిన్నారుల్లో గురకకు చికిత్స చేయకపోతే మానసిక వికాసం, మేధో సామర్థ్యాలు దెబ్బతింటాయని, శారీరక చురుకుదనంపై కూడా ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక లక్షణాలున్న కేసుల్లో దాదాపు 70 శాతం మంది పిల్లలకు స్లీప్ అప్నియా ఉన్నట్టు, 15 నుంచి 20 శాతం మంది పాఠశాల పిల్లలు ఊబకాయంతో ఉన్నారని వీరిలో అత్యధికులు గురకతో బాధపడేవారేనని ఏఐజీ అధ్యయనంలో తేలింది, నిద్ర పోకుండా పిల్లలు ఎక్కువ గంటలు మేల్కొని ఉండటం అధిక చురుకుదనం లక్షణంగా తల్లిదండ్రుల భావిస్తే అది అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్లీప్ అప్నియాలక్షణాలివే.. నిద్రలో కండరాలు సడలించడం వల్ల శ్వాసనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఆక్సిజన్ అందక అది నాణ్యమైన శ్వాసక్రియకు, నిద్రకు తీవ్రమైన అంతరాయం కలిగించే పరిస్థితే స్లీప్ అప్నియా. గురక ముదిరి స్లీప్ అప్నియాకు దారి తీస్తుంది. సాధారణంగా ఊబకాయం ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది. మెడ చుట్టుకొలత తగినంత లేకపోవడం, ఎగువవైపునకు గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారడం స్లీప్ అప్నియాకు దోహదం చేస్తుంది. ఉదాహరణకు, పిల్లలలో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ కూడా స్లీప్ అప్నియాకు కారణం కావచ్చు. స్లీప్ అప్నియా ముదురుతున్న దశలో వ్యక్తి సురక్షితంగా డ్రైవింగ్ చేసే సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పగటిపూట అధికంగా నిద్రపోవడం ఏకాగ్రత లోపాలకు దారితీస్తుంది. ‘స్లీప్ అప్నియా చికిత్సలో భాగంగా బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ బాగా తగ్గించడం, తీరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధి తీవ్రమైతే రోగులకు మాస్క్ ద్వారా గాలిని అందించే వైద్య పరికరం, కొన్ని సందర్భాల్లో, అడ్డంకిని సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. పిల్లలకు మరింత చేటు... తీవ్ర గురకతో బాధపడుతున్న పిల్లల్లో చురుకుదనం, శ్రద్ధ లోపిస్తాయి. చిరుతిళ్లు అధికంగా తినడం, చిరాకు, తరచుగా అలసట ఉంటాయి. గురక, నోటితో శ్వాస తీసుకోవడం, రాత్రి పూట చెమట పట్టడం వంటివి పిల్లల్లో గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. –ఆర్.దీప్తి, చీఫ్ పీడియాట్రిషియన్,అమోర్ హాస్పిటల్స్ -
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
అవి సాధారణ మరణాలే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎంఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించడం వల్లే శుక్రవారం ఆరుగురు మృతి చెందారని సూపరింటెండెంట్ సిద్ధానాయక్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ అందకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా నిరంతరంగా ఉంటుందని తెలిపారు. గూడూరుకు చెందిన కె.సాంబయ్య (55), నెల్లూరుకు చెందిన ఎస్.లలిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో, విపరీతంగా మద్యం అలవాటున్న నరుకూరుకు చెందిన పి.రమేష్ (42), నెల్లూరులోని శ్రీనివాసనగర్కు చెందిన ఎన్.చలపతి (52) క్లోమ గ్రంధి పాడవ్వడంతో మృతి చెందారని తెలిపారు. నెల్లూరులోని వేదాయపాళెంకు చెందిన సుందరం (70), నెల్లూరులోని పొర్లుకట్టకు చెందిన కె.చెంచమ్మ (70) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయారన్నారు. ఐదారు రోజులుగా చికిత్స పొందుతున్న వీరంతా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో మృతి చెందారనే విషయాన్ని గమనించాలన్నారు. ఆరుగురు కూడా దీర్ఘకాలిక రోగులని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్య విచారణ చేపట్టారు. శనివారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలు బాగున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కూడా ఎంఐసీయూ వార్డును పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. ఆక్సిజన్ ట్యాంకును, పైపులను టెక్నీషియన్ ద్వారా పరిశీలించారు. ఆస్పత్రి సేవల్లో ఎక్కడా లోపం లేదని చెప్పారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
జగిత్యాల: పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే వైద్యులు సమయపాలన పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశా రు. డాక్టర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లోనే ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం జగిత్యాల జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ సహా పత్తాలేని పలువురు మంత్రి వచ్చిన సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు విధుల్లో లేరు. దీంతో విచారణకు మంత్రి ఆదేశించారు. ఇక స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వకుండానే మంత్రి మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపు గంటన్నర పాటు వార్డుల్లో కలియ తిరిగారు. ఆ సమయంలో గైనకాలజిస్ట్ అరుణశ్రీ లీవ్ పెట్టకుండా వెళ్లిపోవడం, పీడియాట్రిక్లోని ఇద్దరు ప్రొఫెసర్లు విధుల్లో లేకపోవడం, అనస్తీషి యా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోపా టు, ఆప్తాల్మజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాత లీవ్కు దరఖాస్తు చేయకుండా వెళ్లిపోవడంపై మంత్రి ఆ గ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యులకు మెమో జారీచేయాలని డీఎంఏ రమేశ్రెడ్డిని ఆదేశించారు. కాగా, ‘వైద్యులు ఉన్నా.. లేనట్లే’శీర్షికన ఈనెల 7న ‘సాక్షి’కథనం ప్రచురించింది. స్పందించిన మంత్రి.. ఇటీవల జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పత్రిలోని వైద్యులతో నేరుగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఆకస్మికంగా తనిఖీకి వచ్చారు. -
అరుదైన సమస్య.. ఆరు నెలల్లో మాయం!
జగ్గయ్యపేట అర్బన్ : వంకరకాళ్లతో జన్మించిన చిన్నారిని జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆరు నెలల్లోనే మామూలు స్థితికి తెచ్చారు. చిన్నారి తల్లిదండ్రుల మోముల్లో సంతోషాన్ని నింపారు. జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటకు చెందిన సాయి తారక్, శ్రీలత దంపతులకు ఆరు నెలల కిందట మహన్వితశ్రీ జన్మించింది. జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలోనే జన్మించిన ఆ చిన్నారికి కాళ్లు వంకర్లు తిరిగి ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కఠారి హరిబాబు సలహాతో వారు అదే ఆస్పత్రిలో ఆర్థోపెటిక్గా పనిచేస్తున్న డాక్టర్ హరీష్ను కలిసి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. బాలికను పరీక్షించి తల్లిదండ్రులకు ఆయన ధైర్యం చెప్పారు. ఆరు నెలల్లో చిన్నారి కాళ్లు మామూలు స్థితికి చేరుకుంటాయని భరోసా ఇచ్చి.. 21వ రోజు నుంచి చికిత్స మొదలెట్టారు. వారం వారం ఆ చిన్నారి కాళ్లకు కట్లు కడుతూ మధ్యలో ఇంజక్షన్లు ఇస్తున్నారు. మధ్యలో విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యుల ద్వారా కొంత వైద్య సాయం తీసుకున్నారు. ఆరు నెలలు పూర్తి కావస్తుండటంతో చిన్నారి కాళ్లు దాదాపుగా మామూలు స్థితికి వచ్చాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఇలాంటి లోపాలు వస్తుంటాయని, దీనిని క్లబ్ ఫుట్(సీటీఈవీ) అంటారని తెలిపారు. పుట్టిన వెంటనే చికిత్స మొదలెడితే ఫలితం ఉంటుందని చెప్పారు. -
తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి.. డాక్టర్ ఎలక్షన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (స్టేట్ మెడికల్ కౌన్సిల్)కి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉండే సీనియర్ వైద్యులు ఎన్నికల ప్రక్రియలో బిజీ అవుతున్నారు. సభ్యులు, చైర్మన్ పదవికి పెద్ద సంఖ్యలో వైద్యులు పోటీ పడే అవకాశం ఉందని అంటున్నారు. 25 మంది డాక్టర్లతో మండలి ఏర్పాటవుతుంది. అందులో 13 మందిని డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. అనంతరం వారిలో నుంచి చైర్మన్ను ఎన్నుకుంటారు. చైర్మన్ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొనే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 56 వేల మంది డాక్టర్లు కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఏటా కొత్తగా మరో మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ప్రతి ఐదేళ్లకోసారి సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా రిజిస్ట్రేషన్కు, రెన్యువల్కు ఈ నెల 20వ తేదీ గడువుగా నిర్ధారించారు. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. డాక్టర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునే అవకాశముంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 13 మందిని ఓటు ద్వారా ఎన్నుకోనుండటంతో ఓ విధంగా రాజకీయ తరహా వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వం దాదాపు సగం మంది సభ్యులను నామినేట్ చేయనుండటంతో సభ్యులతో పాటు చైర్మన్ ఎన్నిక కూడా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు కలిగి ఉన్న వారికే చైర్మన్ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి సీనియర్ల సన్నాహాలు మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీకి అనేకమంది సీనియర్ డాక్టర్లు సమాయత్తమవుతున్నారు. కొందరు వైద్యసంఘాల నాయకులు కూడా పోటీకి సై అంటున్నారు. వీరంతా మద్దతు కోసం ఇప్ప టికే రిజిస్టర్డ్ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 లోపు కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. షెడ్యూ ల్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. ఎంబీబీఎస్ పూర్తి చేసి కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ పొందిన ఎవరైనా పోటీచేసే అవకాశముంది. ఒక్కో డాక్టర్ 13మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కుపై ఆందోళన ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకున్న వారే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని మెడికల్ కౌన్సిల్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో డాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేలా ఇటీవల పోర్టల్ను ప్రారంభించారు. కానీ అది పనిచేయడం లేదని డాక్టర్లు చెబు తున్నారు. హైదరాబాద్లోని కౌన్సిల్కు వ చ్చి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం కౌన్సిల్కు ప్రతిరోజూ ఐదారు వందల మంది వస్తుండగా, సగటున 100 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్/రెన్యువల్స్ చేయలేకపోతున్నట్లు కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు. దీంతో చాలామంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని సీనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల నుంచి భారీ స్థాయిలో ఫీజులు తీసుకుంటున్నా, సరైన సౌకర్యాలు కల్పించ డంలో కౌన్సిల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌ న్సిల్ కార్యాలయానికి ఇప్పటికీ పక్కా భవ నం లేకపోవడం, రేకుల షెడ్లో నడుస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రమాదంలోకి ప్రజారోగ్యం! సర్కార్ వారి హద్దులను చెరిపేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారుకు, డాక్టర్లకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయంపై వైద్యులు మండిపడుతున్నారు. వారికి శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలకు వాడుకోవాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పుబడుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు, తెలంగాణ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ కుమార్ పింజరాల, హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) అధ్యక్షుడు డాక్టర్ కె.మహేష్కుమార్లు వైద్యారోగ్య శాఖ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి డాక్టర్లను తయారు చేస్తున్న తరుణంలో ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ వైద్యరంగంలో దయనీయ పరిస్థితికి ఇది ఉదాహరణ. ఇప్పటికే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఆశ, ఏఎన్ఎం సహా ఇతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను ఉపయోగించుకునే దిశగా ఎందుకు ఆలోచించడంలేదు? ఆర్ఎంపీలు, పీఎంపీలకు శిక్షణ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా? ఆధునిక వైద్యంపై అవగాహన లేని వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడం.. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేయడమే. ఏళ్ల తరబడి ఆధునిక వైద్యం నేర్చుకున్న డాక్టర్లకు సర్కారు నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది అనైతిక నిర్ణయం. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి బదులు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులను నియమించాలి..’ అని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్లన్నింటినీ మూసివేయాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. శస్త్రచికిత్సలు చేయడంపై అభ్యంతరం... రాష్ట్రంలో వేలాది మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ఉన్నారు. అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా గ్రామీణ స్థాయి వరకు అవి అందుబాటులో లేవు. పైగా చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డాక్టర్లు నిత్యం రావడంలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణులకు ఆర్ఎంపీలు, పీఎంపీల వైద్య సేవలే దిక్కవుతున్నాయి. అయితే చాలామంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రాథమిక చికిత్సకే పరిమితం కాకుండా, చిన్నపాటి శస్త్రచికిత్సలు, ప్రసవాలు కూడా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేగాక ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్తూ కమీషన్లు పొందుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు అనేకచోట్ల ఆర్ఎంపీలు, పీఎంపీల వైద్యం వికటించిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారికి శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి, కొన్ని పరిమితులతో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేలా చూడాలన్నది తమ ఉద్దేశమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయం.. ప్రజారోగ్యాన్ని అనర్హులైన వారి చేతిలో ఉంచడమే అవుతుందని డాక్టర్లు మండిపడుతున్నారు. ‘ఇది అమలైతే రోగులు ఎక్కువ సంఖ్యలో ఆర్ఎంపీలు, పీఎంపీల వద్దకు వెళతారు. వారు తెలిసీ తెలియని వైద్యం చేసి వికటించినప్పుడు, వారు ఆ కేసులను డాక్టర్ల వద్దకు పంపిస్తారు. కానీ అప్పటికే రోగి పరిస్థితి విషమిస్తుంది. ఆ తర్వాత ఏదైనా జరిగితే డాక్టర్లపైకే నెట్టేస్తారు..’ అని అంటున్నారు. ప్రాథమిక చికిత్సకు మాత్రమే పరిమితమం కావాల్సిన వారు తమ హద్దులను దాటుతున్నారని, మందులు రాయడం వంటివి కూడా చేస్తున్నారని వివరిస్తున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇవ్వాలనే నిర్ణయం ద్వారా ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్యాన్ని పణంగా పెడుతోందని అంటున్నారు. వారికి శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక ఇన్ని మెడికల్ కాలేజీల అవసరం ఏముందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
మంత్రి హరీష్ చొరవ.. హిమాచల్లో హైదరాబాద్ వైద్యులు క్షేమం
సాక్షి, సుల్తాన్బజార్: హిమాచల్ ప్రదేశ్లోని మనాలి వరదల్లో చిక్కుకున్న ముగ్గురు హైదరాబాద్ వైద్యులు క్షేమంగా ఉన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా హైదరాబాద్కు చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన ముగ్గురు వైద్యులు హిమాచల్ ప్రదేశ్ మనాలి వరదల్లో చిక్కుకున్నారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. హైదరాబాద్కు చెందిన డాక్టర్ బానోతు కమల్లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్లు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తి చేశారు. హాస్టల్లో ఉంటూ ఉస్మానియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. పీజీ పూర్తయిన సందర్భంగా వీరు హిమాచల్ప్రదేశ్కు టూర్కు వెళ్లారు. ఇటీవల ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. ముగ్గురు వైద్యులు మనాలి వరదల్లో చిక్కుకున్నారని తోటి వైద్యులకు సమాచారం అందింది. వారిని మళ్లీ సంప్రదించేందుకు ప్రయత్నించగా ముగ్గురి ఫోన్లూ స్విచ్ఛాఫ్ వచ్చాయి. రంగంలోకి మంత్రి హరీష్ రావు.. దీంతో వైద్యుల తల్లిదండ్రులు, తోటి వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల ఆచూకీ కోసం జూనియర్ డాక్టర్ల సంఘం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన హరీశ్రావు వారు ఎక్కడ? ఎలా? ఉన్నారో తక్షణమే తెలుసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మనాలిలోని ప్రభుత్వ అధికారులను సంప్రదించిన తెలంగాణ అధికారులు.. వైద్యులు క్షేమంగా ఉన్నట్లు మంత్రికి ఫోన్లో సమాచారాన్ని అందించారు. వైద్యులను సురక్షితంగా హైదరాబాద్కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: ‘నాకు సీఎం కావాలనే ఆశ లేదు’.. బీఆర్ఎస్ మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కన్నీటి గాథ: నొప్పి భరించలేకపోతున్నా! కాలు తీసేయండి మహా ప్రభో!
టైలా పేజ్ అనే యువతి తన దీనగాథను సోషల్ మీడియా ప్లాట్ఫారం ఇన్స్టాగ్రామ్లో వివరించింది. బాధను భరించలేక తన కాలును తీసేయండంటూ వైద్యులను పలు విధాల ప్రాధేయపడిన ఉదంతాన్ని ఆమె షేర్ చేసింది. ఆమెకు భరించలేనంతగా కాలి నొప్పిరావడంతో దానిని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన ఫుట్బాల్ కోచ్.. న్యూయార్క్ పోస్ట్లో వెలువడిన ఒక రిపోర్టు ప్రకారం బ్రిటన్కు చెందిన టైలా పేజ్కు అపెండిక్స్ తొలగించినప్పటి నుంచి కాలి నొప్పిని ఎదుర్కొంటోంది. అంతకుమందు ఆమె ఫుట్బాల్ కోచ్గా పనిచేసింది. ఆమెకు కాలినొప్పి ఎంతగా ఉండేందంటే ఆ నొప్పితో ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉండేది. నొప్పిని భరించలేకపోతున్నానంటూ కనిపించిన అందరితోనూ చెప్పుకుని రోదించేది. కాలు త్రీవంగా ప్రభావితం టైలా 2016లో కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్ బారిన పడింది. ఈ సమయంలో ఆమె భరించలేనంత నొప్పిని అనుభవించింది. ఈ వ్యాధి సాధారణంగా కాలు లేదా చేయిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మనిషిని శారీరకంగానూ, మానసికంగానూ కుంగదీస్తుంది. దీనిని ‘సూసైడ్ డీసీజ్’ అని కూడా అంటారు. ఈ నొప్పి సాధారణంగా ఏదైనా గాయం అయిన తర్వాత, సర్జరీ లేదా స్ట్రోక్, గుండెపోటు వచ్చిన తరువాత మొదలవుతుంది.ఈ నొప్పి కారణంగా టైలా ఏ పనీ చేయలేకపోయేది. ‘కాలి నొప్పి భరించడం అసాధ్యంగా మారింది’ తన అనుభవాన్ని వివరించిన ఆమె.. ‘ఒకానొక సమయంలో కాలును కదపడం కష్టంగా మారింది. విపరీతంగా నొప్పి వచ్చేది. చల్లని గాలి తాకినా, కాలు నీటిలో పెట్టినా భరించలేనంత నొప్పి పుట్టేది. కుర్చీలో కూర్చోలేకపోయేదానిని. స్కూలులో కొద్దిసేపు ఉండి వచ్చేసేదానిని’ అని తెలిపింది. భరించలేని నొప్పి కారణంగా ఆమె స్నానం చేయలేకపోయేది. దుస్తులు స్వయంగా ధరించలేకపోయేది. మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయింది. తల్లి ఓదార్పుతో.. ఆ సమయంలో ఆమె తల్లి తన కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. ఒకనాడు టైలా ఇక తాను ఆ కాలుతో జీవించలేనని అభిప్రాయపడింది. తన శరీరం నుంచి ఆ కాలిని తొలగించుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ‘చేతులు ఎత్తి వేడుకుంటున్నాను.. నా కాలు తీసేయండి’.. అని వైద్యులను శతవిధాల వేడుకుంది. 2019లో ఆమెకు ఆపరేషన్చేసి, కాలిని తొలగించారు. అప్పుడామె ఎంతో సంతోషించింది. ఇకపై భరించలేనంత నొప్పి ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సంబరపడింది. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..