
సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో వివిధ స్థాయిలో అధికారులను నియమించే సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ)లోని నియామకాల్లో కొంతమంది అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు ఉండటంతో సీబీఐ రంగంలోకి దిగి విచారించింది.
దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి, అక్రమాల్లో 15 మంది ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులతో పాటు లెఫ్ట్నెంట్ కల్నల్ మేజర్ నాయిబ్ సుబేదార్, సీపోయ్లు, మరో ఆరుగురు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment