![CBI Issued Notices To MP YS Avinash Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/16/MP%20Avinash%20Reddy_03.jpg.webp?itok=tub4506X)
సాక్షి ప్రతినిధి కడప: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment