నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన | CM Jagan Visit To Visakhapatnam District On February 28th | Sakshi
Sakshi News home page

నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన

Published Wed, Feb 28 2024 4:03 AM | Last Updated on Wed, Feb 28 2024 12:50 PM

CM Jagan Visit To Visakhapatnam District On February 28th - Sakshi

29న జరగాల్సిన పామర్రు పర్యటన వాయిదా 

సాక్షి,అమరావతి: సీఎం జగన్‌ ఈ నెల 28న (బుధ­వారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.

అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వె­న్షన్‌ సెంటర్‌లో జరిగే  పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్‌ పర్యటన వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement