west godavari District
-
రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి ఎగిసి పడుతున్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన పండ్లు నిల్వ ఉంచిన షెడ్డు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.ఇతర షాపులకు వ్యాపించకుండా మంటల్ని పండ్ల వ్యాపారులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. -
వణికిస్తున్న బర్డ్ఫ్లూ.. చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలు
సాక్షి,పశ్చిమగోదావరి : గోదావరి జిల్లాలను బర్డ్ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాగా నిర్ధారణైంది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం, వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా విధించారు.ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా (అలర్ట్ జోన్) గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన, హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్,ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, బర్డ్ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసింది. కోళ్లు, బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతోంది. -
తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పసికందును పూడ్చిపెట్టడానికి ఒడిగట్టారు తల్లిదండ్రులు. తణుకు సాయి హాస్పిటల్లో 28వ తేదీ ఉదయం 10: 30ని.లకు సంధ్యా కుమారి అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తలలో ప్రాబ్లమ్ కారణంగా చనిపోయే అవకాశం ఉందని బావించిన తల్లిదండ్రులు.. ఆ శిశువును బతికుండగానే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు.బిడ్డను తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా బిడ్డ అరుపులతో కాటికాపరి అలర్ట్ అయ్యాడు. దాంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు కాటికాపరి, బిడ్డను పూడ్చి పెట్టేందకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పారిపోగా, మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డామిట్.. పారని ‘పార్శిల్’ పాచిక (క్రైమ్ స్టోరీ)
సాక్షి, భీమవరం/ఉండి/ఆకివీడు/కాళ్ల: తాను రెండో పెళ్లి చేసుకున్న అత్తమామల ఆస్తి మీద కన్నేశాడు.. వదినకు వాటా దక్కకుండా చేసేందుకు తన రెండో భార్యతో కలిసి పథకం పన్నాడు.. అందుకు మృతదేహం అవసరమై తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఓ అమాయకుడిని అంతమొందించాడు. బాక్సులో మృతదేహాన్ని ఉంచి రూ.1.30 కోట్లు ఇవ్వాలంటూ లెటర్ పెట్టి వదినకు పార్శిల్ పంపాడు. ఇంటికి పార్శిల్ వచి్చనట్లు ఫోన్ రావడంతో ఏమీ తెలీనట్లుగా వచ్చాడు. హత్యానేరం పడకుండా మృతదేహాన్ని మాయం చేయడం.. ఆగంతకునికి ఇచ్చేందుకు డబ్బులు తాను సర్దుబాటు చేస్తున్నట్లు నటించి వదినకు వచ్చే వాటాను తమ పేరిట రాయించుకోవాలనుకున్నాడు. కానీ, కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంలో నిందితులందరూ పోలీసులకు చిక్కారు. ఆద్యంతం క్రైం థ్రిల్లర్ను తలపించిన ఈ కేసుకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం గాంధీనగర్కు చెందిన శ్రీధర్వర్మ అలియాస్ సుధీర్కు ఇదివరకే వివాహం కాగా... అతని మొదటి భార్య తన ఇద్దరు పిల్లలతో గాంధీనగర్లో ఉంటోంది. అతను తన కులం తప్పుగా చెప్పి యండగండికి చెందిన మరో మహిళను ప్రేమ పేరిట రెండో వివాహం చేసుకున్నాడు. అంతేకాక.. ఫేస్బుక్లో పరిచయమైన కాళ్ల గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. రెండో భార్య రేవతి తల్లిదండ్రులకు యండగండిలో ఇంటితోపాటు మూడెకరాల వరకు పొలం ఉంది. ఆమె అక్క తులసికి ఈ ఆస్తిలో వాటా ఉంది. తులసికి ఆస్తి దక్కకుండా కాజేసేందుకు శ్రీధర్వర్మ, రేవతి పథకం పన్నారు. గ్రామంలోని జగనన్న కాలనీలో తులసి ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా క్షత్రియ ఫౌండేషన్ పేరిట ఆమెకు రెండుసార్లు పార్శిల్ ద్వారా నిర్మాణ సామగ్రి పంపించారు. మూడోసారి తులసి తండ్రి ముదునూరి రంగరాజు పేరుతో మృతదేహాన్ని పంపాలని స్కెచ్ వేశారు.బలైన తాగుబోతు.. ఇందులో భాగంగా మృతదేహం కోసం ఎవరో ఒకరిని హత్యచేయాలని నిందితులు భావించారు. అది కుదరకపోవడం.. మరోవైపు భార్య ఒత్తిడి తెస్తుండటంతో శ్రీధర్వర్మ కన్ను అతని స్వగ్రామమైన కాళ్ల మండలం గాం«దీనగర్లో ఆవారాగా తిరిగే బర్రే పర్లయ్య (38)పై పడింది. పర్లయ్య మద్యానికి బానిసై భార్యాపిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతనైతే ఎవరికీ అనుమానం రాదని శ్రీధర్వర్మ భావించాడు. అనుకున్నదే తడవుగా తాను లీజుకు చేస్తున్న చెరువు వద్దకు పనికి రావాలని చెప్పాడు. ఈ నెల 17న జక్కరం వద్ద అతనిని తన కారులో ఎక్కించుకుని కాళ్ల గ్రామానికి వెళ్లి అక్కడ తన స్నేహితురాలు, ఆమె కుమార్తె అయిన బాలికను ఎక్కించుకున్నాడు. ఉండి మండలం వాండ్రం–పెదపుల్లేరు గ్రామాల మధ్యన ఉన్న లింకు రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకొచ్చి పర్లయ్యతో ఫుల్లుగా మద్యం తాగించాడు. తర్వాత తన స్నేహితురాలి సాయంతో పర్లయ్య మెడకు తాడు బిగించి హత్యచేసి మృతదేహాన్ని తమ వెంట తెచ్చుకున్న బాక్సులో ప్యాక్ చేశాడు. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్డులోని సాగుపాడు చేరుకుని బాక్సును దింపి ఆటోలో లోడ్ చేసేందుకు తన స్నేహితురాలిని అక్కడ ఉంచాడు. అటుగా వెళ్లే ఆటోను ఆమె ఆపి బాక్సు ఎక్కించే వరకు మైనర్ బాలికతో కలిసి దూరంగా వేచి ఉన్నాడు. అనంతరం.. శ్రీధర్వర్మ తల్లీకూతుళ్లను కారులో ఎక్కించుకుని ఇద్దరినీ కాళ్లలోని ఇంటి వద్ద దింపాడు.ఒకరిని మించి మరొకరు.. అక్క ఆస్తిని కాజేయాలని చెల్లి.. ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకున్నాక ఇద్దరు భార్యలను వదిలించుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉడాయించాలని శ్రీధర్వర్మ.. ప్రియుడు తెచ్చే ఆస్తితో కలిసి వెళ్లిపోవాలని ఒకరు.. ఇలా ఒకరికి మించి మరొకరు కుట్రపూరిత ఆలోచనలు చేసి చివరకు పోలీసులకు చిక్కారు.కేసు లేకుండా చేస్తానని చెప్పి.. పార్శిల్ అందిన తర్వాత శ్రీధర్ వర్మకు అతని వదిన తులసి వద్ద నుంచి ఫోన్ వచి్చంది. ఇంటి సామాన్లకు సంబంధించి పార్శిల్ వచి్చందని అతనికి చెప్పింది. తాను వచ్చేవరకు దానిని ఓపెన్ చెయ్యొద్దని తులసికి శ్రీధర్వర్మ చెప్పాడు. ఇంటికొచ్చి బాక్సు ఓపెన్ చేసి మృతదేహాన్ని చూసి అవాక్కయినట్లు నటించాడు. పోలీసు కేసవుతుందని, అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని తన పన్నాగంలో భాగంగా శ్రీధర్వర్మ ఆమెను బెదిరించాడు. కేసు లేకుండా అందరినీ మేనేజ్ చేసేందుకు కోటి రూపాయలకు పైనే ఖర్చవుతుందని చెప్పడంతో తులసి అందుకు అంగీకరించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని చూడటంతో ఇంట్లో అందరి వద్ద నుంచి ఫోన్లు తీసేసుకున్నాడు. అప్పటికే తులసి తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులకు చేరింది. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆటకట్టు.. మొత్తానికి.. విషయం బయటకు పొక్కడంతో శ్రీధర్వర్మ పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి కృష్ణాజిల్లా బంటుమిల్లి గ్రామంలో దాక్కున్నాడు. దర్యాప్తులో భాగంగా శ్రీధర్వర్మ భార్యలను, అనుమానితులను పోలీసులు విచారించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డుల ఆధారంగా శ్రీధర్వర్మ వివరాలు మీడియాకు విడుదల చేశారు. బంటుమిల్లికి చెందిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించడంతో శ్రీధర్వర్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచి్చంది. గురువారం శ్రీధర్వర్మ, ఇద్దరు మహిళలు, మైనర్ బాలికను సంఘటనాస్థలానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి చాకచక్యంగా ఈ కేసును ఛేదించినట్లు తెలుస్తోంది.ఒకటి, రెండు రోజుల్లో నిందితులను పోలీసులు కోర్టుముందు హాజరుపరిచే అవకాశముంది. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,పశ్చిమ గోదావరి : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ (డిసెంబర్15) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత గంజాయి మత్తుకు అలవాటుపడుతోంది. సినిమాలు చూసి ప్రభావితమవుతున్నారు. గంజాయి,డ్రగ్స్,మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారు. చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం,రాష్ట్రంలో శాంతి భద్రతలు సంరక్షించే హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుందిఇలా హోమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు.అసెంబ్లీలో అనిత ఏం మాట్లాడారంటే?ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
ఏపీలో ఆగని ‘కూటమి ’వేధింపులు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బూడిద సుజన్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్యాంగుడైన సుజన్ కుమార్పై సైతం కేసు నమోదు చేయడం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సుజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియా కార్యకర్తలపై కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల్లోకి తీసుకువెళుతున్నామనే ఒకే ఒక్క కారణంతో మా గొంతు నొక్కాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాలన వైఫల్యం చెందింది కాబట్టే.. సోషల్ మీడియా గొంతు నొక్కాలని చూస్తుంది. నేను దివ్యాంగుడనని కూడా చూడకుండా నాపై కేసు పెట్టారు.’’ అని సుజన్ ఆవేదన వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ నాయకత్వాన్ని కచ్చితంగా బలపరుస్తాం. ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. వైఎస్ జగన్ ఎన్నో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయన కోసం మేము ఎంతవరకైనా తెగిస్తాం. మా గొంతు నొక్కే బదులు ప్రజలకు మంచి చేస్తే వారే మిమ్మల్ని ఆదరిస్తారు. ఎన్ని కేసులు పెట్టిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని సుజన్కుమార్ స్పష్టం చేశారు. -
అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యతనీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణస్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం -
క్యాన్సర్ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ
హైదరాబాద్: సాధారణంగా క్యాన్సర్ బాధితులకు జీవితమే అంధకారబంధురంగా ఉంటుంది. అందులోనూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ వచ్చిందంటే, ఆ తర్వాత ఇక గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అనే ఆశలే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన 27 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది. దాంతో వాళ్లు గర్భసంచి తొలగించుకునేందుకు హైదరాబాద్లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, రోబిటిక్ & లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.“ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల మహిళకు తొలుత ఒకసారి గర్భం వచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత లోపలున్న శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానికంగా తప్పనిసరై గర్భస్రావం చేయించాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత మౌనిక ఆరోగ్యం బాగోలేదని పరీక్ష చేయించుకోగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దాంతో తప్పనిసరిగా ఆమెకు గర్భసంచి తొలగించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించి, ఇక్కడకు వచ్చారు. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగిస్తే, తర్వాత ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేయొచ్చని, ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చని వివరించాము. క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు విస్తరించకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం నూరుశాతం ఉంటుందని, నిరాశ చెందక్కర్లేదని కౌన్సెలింగ్ చేశాము. అలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్లు సమాధానపడి, చికిత్సకు సిద్ధమయ్యారు. ముందుగానే పిండాలను (ఎంబ్రియో) సేకరించి, వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సర్ శస్త్రచికిత్స ప్రారంభించాము. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తించి, దాన్ని మాత్రమే తొలగించాము. గర్భసంచికి కూడా కుట్లు వేశాం. తొలగించిన ప్రాంతానికి బయాప్సీ చేయించగా క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉందని, ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని నిర్ధారణ అయ్యింది.క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఫ్రీజ్ చేసిన రెండు పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టాము. రెండూ ఫలదీకరణం చెందాయి. అయితే, కుట్లు వేయడం వల్ల గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని ముందుజాగ్రత్తగా ఒక పిండాన్ని తీసేయాల్సి వచ్చింది. మిగిలిన ఒక పిండాన్నే కొనసాగించాము. మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని క్యాన్సర్ పరీక్షలు, ఇతర పరీక్షలు చేశాము. 32 వారాల తర్వాత ముందుజాగ్రత్తగా లోపల శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశాము. 34, 35 వారాల సమయంలోనే ప్రసవం కావచ్చని చూశాము గానీ, గర్భసంచి బాగానే ఉండటంతో వేచి చూశాము. సరిగ్గా 37 వారాల తర్వాత అంతా బాగుండటంతో ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేశాము. పూర్తి ఆరోగ్యవంతమైన పాప పుట్టింది.పాప పుట్టిన తర్వాత, ఒకసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి తర్వాత ఇక ఇబ్బంది లేకుండా ఉంటుందని గర్భసంచి తొలగించాల్సిందిగా ఆ దంపతులు కోరారు. కానీ, సిజేరియన్ చేసిన సమయంలోనే హిస్టరెక్టమీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పైగా ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదు కాబట్టి అలాగే వదిలేయడం మంచిదని వారికి చెప్పాము. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు” అని డాక్టర్ చీపురుపల్లి వసుంధర తెలిపారు. “ఒకానొక దశలో మేము అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం. కానీ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి బృందం ఎంతగానో మాకు నచ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్యకరమైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి, డాక్టర్ వసుంధర, ఆమె బృందానికి మేమెంతో కృతజ్ఞులై ఉంటాము” అని మౌనిక భర్త మహేష్ చెప్పారు. -
టీడీపీ అభ్యర్ధి సైలెంట్.. అన్ని సర్దుకుని సొంత నియోజకవర్గానికి పరార్
పోలింగ్కు ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీమే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కాని బయటి నుంచి వచ్చి సవాళ్ళు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కుడుంది? అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకువచ్చారు.వాస్తవానికి బాలసుబ్రమణ్యాన్ని టీడీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు అయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బిజేపికి ఇవ్వగా..అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని బీజేపీ బరిలో దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా...ఆందోళనలు కూడా చేశారు. ఓ వైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైనా బాలసుబ్రమణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు అయనకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అయినా బాలసుబ్రమణ్యం మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుకుంతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామనే అలవికానీ హామీలతో రాజంపేట వాసులను అకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు రాజంపేటకు తీసుకువచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టిడిపి జెండా ఎగరేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైఎస్సార్సీపీ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రమణ్యం అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచెయ్యలేదని.. బిజేపితో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తొంది. పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో.. ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడకుండా తన అన్నీ సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తామన్న అయన ఇప్పుడు సైలెంటయ్యారు. కానీ తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం కాన్ఫిడెంట్గ ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్ధికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అయిందని ధీమాగా చెబుతున్నారు. -
ఉమ్మడి ‘పశ్చిమ’లో సంక్షేమానికే పట్టం!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ సమయంలో జనప్రభంజనం సునామీలా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా... కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగా పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది.ఇక టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు మారాయి. ప్రతి ఊరిలో నాడు-నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి, 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. నాడు-నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్ సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లలో రూ.3,880 కోట్ల పెన్షన్, 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యా కానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు.జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగాయి.ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్ను రూ.80 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమేకం కావడం, పాజిటివ్ ఓటు మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోయింది.నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనూ వైఎస్సార్సీపీదే హవా!ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో వైఎస్ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో చూద్దాం.నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.నరసాపురంలో ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని మూడు పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలముకుంది. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆచంటలో ఆ పార్టీ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనుకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తాలేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్నచోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్లుగా జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ, మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది.వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కారు, వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ తాజా పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.70 ఏళ్ల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. -
భీమవరం ‘మేమంతా సిద్ధం’సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Live Updates.. గరగపర్రు చేరుకున్న సీఎం జగన్.. గరగపర్రు అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం జగన్కు స్వాగతం పలకిన ప్రజలు భీమవరంలో కెరటాల్లా పోటెత్తిన అభిమాన జనసంద్రం. సీఎం వైఎస్ జగన్ రోడ్షోకు పోటెత్తిన జనకెరటాలు. డాక్టర్ బీవీరాజు స్టాట్యూ సర్కిల్లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం. వేలాదిమంది మహిళలు దారిపొడవునా మానవహరమై ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రికి రోడ్షోలో అండగా నిలిచిన అక్కచెల్లెమ్మలు. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది ఉప్పొంగిన ప్రజాభిమానం కనిపిస్తోంది మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్థమా? దుష్టచతుష్టయం కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్ ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి మీ బిడ్డది పేదలపక్షం చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది ఆయన మాటల్లో, మాట్లాడేటప్పుడు హైబీపీ వస్తా ఉంటుంది.. మీరు గమనించే ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటాడు.. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటాడు రాళ్లు వేయండని పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకంటే.. ఎందుకో తెలుసా.. అడగకూడని ప్రశ్న చంద్రబాబుని అడిగినందుకు.. అదేమిటో తెలుసా.. బాబు.. బాబు.. చెరువులో కొంగ మాదిరిగా ఎదురుచూస్తూ ఇంకొపక్క కొంగమాదిరిగా జపం చేస్తావ్ ఎందుకయ్యా అని అడగా ఇలా అడగడం తప్పా చెప్పండి చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఒక్కటైనా ఉందా అని అడిగా నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబుని అడిగా.. అందుకే నాపై కోపం, ఆయనకు అందుకే బీపీ ఎక్కువై పోతోంది. ఆయన చేసిన మంచి ఏ ఒక్కటీ గుర్తుకురాకపోగా, ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేవి ఏమిటో తెలుసా.. వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువస్తాయి అదే మాదిరిగా దత్తపుత్తా, దత్తపుత్రా.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, పిల్లల్ని పుట్టిచ్చి, నాలుగేళ్లకు, ఐదేళ్లకొకసారి కార్లును మార్చేసినట్లుగా భార్యను వదిలేసినట్లుగా నియోజకవర్గాలకు అలవోకగా మార్చేస్తున్నావ్.. ఏం మనిషవయ్యా అని అడిగా అందుకే దత్తపుత్రుడిలో బీపీ బాగా కనిపిస్తోంది అయ్యా దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా పవిత్రమైన సంప్రదాయాన్ని నడినొడ్డమీదకు తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా ఇది నేను అడిగితే తప్పుకాదా ఇలా నిన్ను చూసి ఇదే తప్పు ప్రతీ ఒక్కరు చేస్తే.. ఇలా భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఆ పెద్ద మనిషిలో బీపీ కూడా పెరిగిపోతోంది చేయిలూపేస్తాడు.. కాళ్లు ఊపేస్తాడు.. తల ఊపేస్తాడు పవన్ కల్యాణ్ బీపీని అసలు తట్టుకోలేము చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, ఈ బాజాభజీంత్రీలకు ఎందుకు నాపై కోపం వస్తుందంటే.. కారణం ఈ వర్గాలన్నింటినీ.. ఈ పేదలను, ఈ అక్కా చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వాతాతలను, రైతన్నలను నువ్వు ఎలా ముంచావంటే చెప్పడానికి బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణలు కనిపించవు ప్రజలిచ్చిన అధికారాన్ని ఏనాడు కూడా చంద్రబాబు మంచి కోసం ఉపయోగించలేదు మోసాల్ని, అబద్ధాల్ని, వెన్నుపోట్లని, కుట్రల్ని, పొత్తుల్ని నమ్ముకుని ఈ రోజు చంద్రబాబు రాజకీయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే చేసిన మంచి లేదు కాబట్టే.. వీటిని నమ్ముకుని ఇలా రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే.. పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతులేని ఈ చంద్రబాబు.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీరందరీతో పాటు కుట్రలు, మోసాలు, ఇతర పార్టీల్లో చంద్రబాబు పెట్టుకున్న కోవర్టులు కలిసి ఒక్క జగన్ మీద దండయాత్రలు చేస్తా ఉన్నారు జగన్ ఒక్కడు.. బాబుకు పదిమంది సేనానులు వారంతా కూడా బాణాలు పట్టుకుని ఉన్నారు మరి వారు బాణాలు తగిలేది ఎవరికి అని అడుగుతున్నా.. జగన్ పేదలకిచ్చే పథకాలకా అని ప్రతీ ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా వారు బాణాలు తగిలేది.. జగన్కు జగన్ పెట్టిన వాలంటీర్లు, సచివాలయవ్యవస్థలకా? వారు బాణాలు తగిలేది.. జగన్ తెచ్చిన ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ల వ్యవస్థలకా? వారు బాణాలు తగిలేది.. జగన్కా.. జగన్ మార్పులు తెస్తూ పిల్లల భవిష్యత్లకా, వారి చదువులకా? వారు బాణాలు తగిలేది.. అవ్వా తాతాల పెన్షన్కు తగులుతా ఉందా.. లేక జగన్కు తగులుతా ఉందా? వారు బాణాలు తగిలేది.. జగన్కు తగులుతా ఉందా.. రైతన్నకు ఇస్తున్న రైతు భరోసాకా? వారు బాణాలు తగిలేది.. జగన్కు తగులుతున్నాయా.. లేక అక్కచెల్లెమ్మలకోసం, వారి అభ్యుతన్న కోసం, వారి కుటుంబాలకు తగులుతుందా? నా అక్క చెల్లెమ్మల కోసం, వారి సంక్షేమ కోసం వారి ఖాతాల్లోకి రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ వేశాడు వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతున్నాయో ఆలోచన చేయమని అడుగుతున్నాను నేను తీసుకొచ్చిన పథకాలమీద.. వీరంతా బాణాలు ఎక్కుపెడుతున్నారు ఆలోచన చేయమని అడుగుతున్నాను ఈ యుద్ధం.. పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వా తాతల సంక్షేమ మీద, రైతన్నలకు అందుతున్న రైతు భరోసా మీది చంద్రబాబు అండ్ ఆయన పెత్తందార్ల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని ప్రతీ ఒక్కరు గమనించాలని కోరుతున్నాను ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా కూడా సిద్ధమేనా? కాబట్టే చెబుతున్నా.. జగన్ ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్కు మద్దతుగా ప్రతీ ఇంట్లో సైన్యం ఉంది. జగనే ఉండాలి.. జగనే కావాలి.. జగనే రావాలి అని ఈరోజు ప్రతీ ఇంట్లో కూడా మద్దతు తెలిపే వారున్నారు జగన్కు కోట్లాది మంది సైన్యం ఉంది. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం మీ బిడ్డకు రైతన్న, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు చంద్రబాబుపై ఎల్లో మీడియా ఇచ్చేది అతిపెద్ద బోగస్ రిపోర్ట్ చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డపుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రూ. 10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రతి జిల్లాలో హైటెక్ సిటీ అన్నాడు.. ఎక్కడైనా కనిపించిందా? కొత్తగా పోర్టులు కట్టాడా? మెడికల్ కాలేజీలు కట్టాడా? సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చేశాడా? ప్రభుత్వ బడులు, ఆస్పత్రులనైనా బాగు చేశాడా? మళ్లీ ఈ ముగ్గురూ కలిసి కొత్త కొత్త మోసాలతో వస్తున్నాడు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు.. నమ్ముతారా పేదల భవిష్యత్ను కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కోనేందుకు మీరంతా కూడా మీ జేబుల్లోంచి సెల్ఫోన్లు తీసి లైట్ ఆన్ చేసి మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి మన సంక్షేమం ఇలాగే కొనసాగడానికి మీరంతా సిద్ధమేనా? ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన సీఎం జగన్మోహన్రెడ్డిగారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం భీమవరానికి ఈ రెండు మూడు నెలల్లోనే రెండుసార్లు రావడం జరిగింది పశ్చిమగోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన అభిమానం చూపెడుతున్న సీఎం జగన్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన జగనన్న అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడకు వచ్చిన అశేష జనమంతా మీ అభిమానులన్నా. మీ చేయిని పట్టుకుని ఓదార్చాలని ఇక్కడకు వచ్చిన మీ శ్రేయోభిలాషులన్నా మీ అభిమానులంతా మా అన్నపై దాడి జరిగినా పెద్ద ప్రమాదం తప్పింది కదా అని సంతోషిస్తుంటే.. దుర్మార్గులు, దుష్టులు.. మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లాంటి వారు మాట్లాడే మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. అన్నా.. వారికి ఎందుకంత నీ మీద అంత కక్ష, ద్వేషం ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి జన హృదయాల్లో నిలిచిపోయినందుకా అన్నా మీపై వారికి ద్వేషం భీమవరం మేమంతా సిద్ధం సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ భీమవరం సభకు పోటెత్తిన ప్రజాభిమానం ర్యాంప్పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం ఉండి సెంటర్కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర కాసేపట్లో భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమలో జనజాతర, కిక్కిరిసిన రహదారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం సీఎం జగన్కు అడగడుగునా జన నీరాజనాలు దారి పొడవునా సీఎం జగన్కు అపూర్వ స్వాగతం ►గణపవరం చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ►సీఎం జగన్కు దారిపొడువున్న అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. ►ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ ►సీతారామపురం చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర ►గణపవరం సెంటర్లో సీఎం జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న జన సందోహం నారాయణపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక పలువురు నేతలు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్. పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైఎస్సార్సీపీలోకి చేరిక. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు. కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, న నిడమర్రు చేరుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్కు ఘనస్వాగతం పలికిన ప్రజలు. నిడమర్రు వద్దకు భారీగా చేరుకున్న మహిళలు, వృద్ధులు. మండుటెండలో ఉదయం 9 గంటల నుండి జగన్ కోసం ఎదురుచూస్తున్న మహిళలు మళ్ళీ సీఎం కావాలంటూ నినాదాలు చేసిన మహిళలు పెత్తందార్లతో జగన్ చేసే యుద్ధానికి ఆయనతో పాటు మేమంతా సిద్ధం అంటున్న ప్రజలు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. ►కాసేపట్లో నిడమర్రు చేరుకోనున్న సీఎం జగన్. ►ముఖ్యమంత్రి జగన్కు ఘన స్వాగతం పలికేందుకు నిడమర్రు సెంటర్కు భారీ చేరుకున్న ప్రజలు ►రాచూరుకు చేరుకున్న సీఎం బస్సుయాత్ర.. ►ఉంగుటూరు నియోజకవర్గం రాచూరుకు.. చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ►ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న గోదావరి జిల్లావాసులు ►గ్రామ గ్రామాన సంక్షేమ సారధి సీఎం జగన్కు హారతులు పడుతున్న అక్క చెల్లెమ్మలు. . ►పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభైంది. ►కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ►పశ్చిమ గోదావరి సిద్ధమా? Day-16 పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజైన మంగళవారం నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సీఎం జగన్ తొమ్మిది గంటలకు బయలుదేరనున్నారు. ►నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
సారీ రఘురామ.. అడ్జస్ట్ చేస్కో!
పశ్చిమ గోదావరి, సాక్షి: టీడీపీలో చేరిన మరుసటి రోజే.. పశ్చిమ గోదావరి పార్టీ రాజకీయాల్లో రఘురామ కష్ణంరాజు చిచ్చు రాజేశారు. మరోవైపు.. తన వీరవిధేయుడు రఘురామ కృష్ణంరాజును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరుణించాడు. అయితే తొలి నుంచి ఆశించినట్లు నరసాపురం ఎంపీ టికెట్ కాకుండా.. అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టారు. శనివారం పాలకొల్లులో జరిగిన సమావేశంలో రఘురామకు ఉండి అసెంబ్లీ సీటు ఇస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తొలి నుంచి కూటమి తరఫునే పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన రఘురామకు నరసాపురం సీటు బీజేపీకి పోవడంతో నిరాశే ఎదురైంది. అయినప్పటికీ ఆ స్థానం కోసం చంద్రబాబుతో భారీ లెవల్లో లాబీయింగ్ నడిపించారు. బీజేపీతో సీటు మార్పిడి కోసం తెగ ప్రయత్నించారు. అయితే బీజేపీ మాత్రం ససేమీరా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈలోపే రఘురామ కనీసం అసెంబ్లీ సీటు కోసమైనా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత వారం రోజులుగా చంద్రబాబుతో రఘురామ ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చివరకు మంగళవారం రాత్రి ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి టీడీపీ సేఫ్ సీటుగా భావిస్తుంటుంది. అందుకే.. తన కోసం పని చేసిన రఘురామకు ఈ సీటును ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అలా.. పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఉండి అభ్యర్థిగా రఘురామ పేరును ప్రకటించారు. అయితే.. పాలకొల్లులో చంద్రబాబును అడ్డుకుని నిలదీస్తున్న కార్యకర్తలు రఘురామకు సీటు ప్రకటన చేయగానే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించారు. ‘‘ఉండి గడ్డ రామరాజు అడ్డ’’ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. -
టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు
సాక్షి, విజయవాడ: టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారని, చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె వీడియో విడుదల చేశారు. ‘‘నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు. పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం. మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు. నాతో పాటు మాజీమంత్రి జవహర్కి కూడా టికెట్ ఇవ్వలేదు. సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం. నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు’’ అంటూ పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పిఠాపురం రచ్చ.. వర్మ దారెటు? -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని
తాడేపల్లి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్సీపీలో చేరారు. ఈలి నాని.. ఈరోజు(గురువారం) వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు ఈలి నానికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. 2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని.. ఆపై టీడీపీలో చేరిపోయారు ఈలి నాని. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్గా కూడా ఈలి నాని పని చేశారు. -
నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 28న (బుధవారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. -
అన్నీ లాగేసుకుని.. ఇదేం లిస్ట్ బాబూ..?
తూర్పుగోదావరి/పశ్చిమ గోదావరి: ముందు నుంచి ఊహించిందే జరిగింది. టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల ఆ పార్టీల ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అధిష్టానానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. రాజానగరంలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. అలాగే.. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటిదాకా ఇరు వర్గాలకు క్లారిటీ లేకుండా చేశారు. దీంతో.. టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక.. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. మరోవైపు.. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించిన పవన్.. ఇప్పుడు చంద్రబాబుకి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశాడని కేడర్ మండిపడుతోంది. ఇక.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాల్ని సైతం టీడీపీనే లాగేసుకుంది. ఈ క్రమంలో.. మాజీ మంత్రి పీతల సుజాతకు మొండి చేయి చూపించారు చంద్రబాబు. ఇక.. చింతలపూడి లో నాన్ లోకల్కి టికెట్ కేటాయించడంతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాల్లో టిడిపి జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో పంచాయితీ తేలలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేననేత రెడ్డప్పల నాయుడుకి భంగపాటే ఎదురైంది. ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. పాపం.. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
మానవత్వం చాటుకున్న సీఎం జగన్.. గంటలో పరిష్కారం
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలో పరిష్కారం చూపారు. తొమ్మిది మంది అర్జిదారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రశాంతి అందజేశారు. చెక్కులు అందుకున్న వారి వివరాలు.. ►కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు ►ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ►చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం ►కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం.. ►తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం ►అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ►గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం తాడేపల్లి: విద్యాదీవెన నిధులు విడుదల చేయటంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఉన్నత చదువులు చదువుతున్న 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.583 కోట్లను నేడు మన ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాల్లో రీయింబర్స్ చేశామని తెలిపారు. అలాగే దాదాపు 2 లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి విడతగా చెల్లించాల్సిన నగదును కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లో జమచేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 27.61 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు కింద రూ.11,900 కోట్లను అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నానని అన్నారు. -
ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్
Updates: పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్ ►మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం ►ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నాం. ►ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్మెంట్కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ►8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నాం ►ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ►ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది రూ.11,900 కోట్లు ►ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు ►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు ►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి ►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం ►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా ►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి ►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది ►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం ►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా ►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి ►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం ►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి. ►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం ►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్లో మార్పులు చేశాం ►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది ►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది ►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి ►జాబ్ ఓరియెంటెడ్గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. ►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. ►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు. ►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి. ►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు ►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం ►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు ►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు ►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా ►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ►జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ►ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. ►పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ►గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ►కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ►అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం
సాక్షి, తణకు(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారితను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని తణుణు నియోజకవర్గంలో సాగిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. సామాజిక సాధికారత బస్సుయాత్ర బహిరంగ సభ లో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎలక్ట్రానికి మీడియా సలహాదారు అలీ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరావు, మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీ నందిగాం సురేష్, ఎంపీ భరత్లతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంకా రవీంద్రనాథ్లు పాల్గొన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘తణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. అందుకే ప్రతీ విద్యార్థి ఆయన్ను ఒక మేనమామలా చూస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్. కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగనన్న హయాంలో పేదరికం 12 శాతం నుండి ఆరు శాతం వరకూ తగ్గింది. అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘ఎవ్వరు కొడితే లోకేష్, చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయననే మన జగనన్న. చంద్ర బాబు హయాంలో ఒక్క బీసీనైనా రాజ్యసభ కు పంపారా...?, వందల కోట్లకు సీట్లు అమ్ముకునే వాడు చంద్రబాబు. మళ్లీ కారుమూరి వన్స్మోర్’ అంటూ కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు. సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు. కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్,. చంద్రబాబు హయాంలో చేనేతలకు రూ. 200 కోట్లు ఖర్చు పెడితే, నేడు జగనన్న ముఖ్యమంత్రిగా రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగిన సామాజిక సాధికారిత సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ఒక ఊరులో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.ఒక యాదవనైన నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.యాదవులు కు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.శ్రీకృష్ణ డు కూడా గొడ్డెలను కాసుకున్నారు. బీసీలను తోకలు కత్తిరిస్తమని బెదిరించారు.పార్టీ పెట్టి సీఎం కాకూడదనుకున్న వ్యక్తి పవన్. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోబకావద్దు.లోకేష్ ఒక పులకేశి.తండ్రి జైల్ లో ఉండే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..సీఎం జగన్ దమ్ము నాయకుడు.నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారు.. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం అభివృద్ధి దూరంగా ఉన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారు.మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారు. రూ. 150 కోట్లతో హార్బర్ను ఆధునీకరిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు.సుదీర్ఘమైన తీర ప్రాంతన్ని చంద్రబాబు గాలికి వదిలేసారు.మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది.బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవం ను చంద్రబాబు తాకట్టు పెట్టారు.అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను సీఎం జగన్ కాపాడారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారు. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేశారు.విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.విశాఖ ను రాజదాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజదాని గా చేశారు -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 11వ రోజు షెడ్యూల్..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో జరుగనుంది. ఇక, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. షెడ్యూల్ ఇలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో.. ►నేడు 11వ రోజు సామాజిక సాధికార యాత్ర ►సాలూరు, పాలకొల్లు, కనిగిరి నియోజకవర్గాలలో బస్సుయాత్ర ►ఉదయం 10:30 గంటలకు మెంటాడ మండలం పోరాం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►అనంతరం పోరాం గ్రామంలోని సచివాలయం సందర్శన. ►పెద్దమెడపల్లి, బూసాయవలస, రామభద్రపురం మీదుగా బస్సుయాత్ర ►మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు బోసు బొమ్మ జంక్షన్లో బహిరంగ సభ ప్రకాశం జిల్లాలో.. ►ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభం ►సురా పాపిరెడ్డి నగర్ దగ్గర లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం ►వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న నేతలు ►ప్రభుత్వ కాలేజీలో "నాడు-నేడు" కార్యక్రమంపై విద్యార్థులతో సమావేశం. ►వైఎస్సార్భవన్లో రెండు గంటలకు విలేకర్ల సమావేశం ►సాయంత్రం నాలుగు గంటలకు పామూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ పశ్చిమగోదావరి జిల్లాలో.. ►పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బస్సుయాత్ర ►శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర ►గాంధీ బొమ్మల సెంటర్లో బహిరంగ సభ -
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
పశ్చిమగోదావరి జెడ్పీ చైర్పర్సన్గా గంటా పద్మశ్రీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళ అయిన పద్మశ్రీ కి సీఎం జగన్ బీఫామ్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇవాళ జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగ్గా.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీకి జిల్లా మంత్రులతో పాటు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. ‘‘బీసీ మహిళగా నన్ను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. సాధారణ గృహిణి నైన నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు . కొప్పుల వెలమలకు పెద్దపీట వేస్తూ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెరుగైన పాలన అందించి సీఎం జగన్కి మంచి పేరు తీసుకొస్తాను’’ అని గంటా పద్మశ్రీ చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినట్లే వెనుక బడిన వర్గాలకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ,అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్య కర్త కు మంచి భవిష్యత ఉంటుందని నిరూపించారు. ఒక బీసీ మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ::ఎమ్మెల్యే ఆళ్ళ నాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. నాడు జడ్పీ చైర్మన్ గా నాకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. నేడు మంత్రి గా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారు. ఉద్యోగులకు వరాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈనాడు లాంటి టిష్యూ పేపర్ మరొకరి లేదు. మేము అప్పుల పాలు చేశాము అంటున్నారు. మరి ఆనాడు 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... వారికి కనపడలేదు. 4500 కోట్లు పసుపు కుంకుమ రూపంలో డైవర్ట్ చేశారు చంద్రబాబు. బాబు చేసిన అప్పై మేము తీర్చు తున్నాము. ::: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఈరోజు సామాజిక విప్లవం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. బలహీన వర్గాల చెందిన వ్యక్తి కవురు శ్రీనివాస్ ను శాసనమండలికి పంపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసి విప్లాత్మకమైన మార్పు తెచ్చారు. :::ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు బీసీలను ముందు పెట్టీ అధికారం అనుభవించేవాడు. ఇప్పుడు బీసీ వెలమ కులస్తులకి జడ్పీ చైర్మన్ కేటాయించి ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు ఇచ్చి ఆయన రుణo తీర్చుకుందాం ::: ఎంపీ కోటగిరి శ్రీధర్ రెండో మహిళగా.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1936లో జిల్లా బోర్డుగా ఏర్పడింది. 1959 లో జిల్లా ప్రజాపరిషత్గా అవతరించింది. అప్పటి నుంచి 21 మంది జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో 1995, 2000లో జెడ్పీ చైర్మన్గా ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా చైర్పర్సన్గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
గోదావరిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత) -
AP: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఎగిసిపడుతున్న మంటలు!
సాక్షి, పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, పశ్చిమ గోదావరిలో జరగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చలువు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
పాతపాటి సర్రాజు భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
పెద అమిరం(ప.గో. జిల్లా): గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం మధ్మాహ్నం పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాటి సర్రాజు నివాసానికి చేరుకున్న సీఎం జగన్.. సర్రాజు భౌతికకాయానికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే పాతపటి సర్రాజు కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. పాతపాటి సర్రాజు మరణవార్త తెలిసిన వెంటనే ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఆపై వెంటనే పశ్చిమగోదావరి జిల్లాలోని సర్రాజు నివాసానికి బయల్దేరి వెళ్లారు. కాగా, పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా గుట్టు రట్టు
-
ముగిసిన మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు
భీమవరం(ప.గో.జిల్లా): సిరుల తల్లి.. కల్పవల్లి.. భీమవరం మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయంలో మహా నివేదన (మహా ప్రసాదం) సమర్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం జరిగిన అఖండ అన్నసమారాధనకు సుమారు 70 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. 29 రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. -
ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. మూవీ రేంజ్ లవ్స్టోరీ
ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. ఆస్ట్రేలియాలో ప్రేమ.. వీరిది ట్విస్టులతో కూడిన సినిమా రేంజ్ లవ్స్టోరీ. పెద్దలను ఒప్పించడానికి ఏకంగా 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. వారు ఒప్పుకున్నాకే విశాఖలోని రుషికొండలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. కాస్తా లేట్ అయినా కుటుంబంలో ఆనందం నెలకొంది. ఇంతకీ వీళ్ల పరిచయం ఎక్కడ.. ఎలా జరిగిందంటే.. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వేడంగికి చెందిన కోట సూర్యప్రకాశరావు 15 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. కాగా, సూర్యప్రకాశరావుకు భవానీ ప్రసాద్ మూడో కుమారుడు. అయితే, భవానీ ప్రసాద్.. ఉన్నత చదువుల కోసం 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ మలేషియాకు చెందిన ఐక్వేతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పాలని డిసైడ్ అయి వారి మనసులో మాట చెప్పారు. అయితే, చాలా మంది ఫ్యామిలీల్లో జరిగినట్టే వీరి ప్రేమకు కూడా కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో, పెద్దల మాటలను గౌరవించి.. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని ఐక్వే చెప్పింది. ఈ క్రమంలో భాను ప్రసాద్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, ఇద్దరూ ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఉన్నత చదవుల తర్వాత.. ఇద్దరూ మంచి ఉద్యోగాలు పొందారు. కొద్దిరోజుల్లోనే భాను ప్రసాద్ జాబ్కు గుడ్బై చెప్పి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. దీంతో, ఐక్వే కూడా జాబ్ మానేసి.. భాను వ్యాపార వ్యవహారాలను చూస్తున్నారు. ఇలా ఏకంగా 12 సంవత్సరాల కాలం గడిపోయింది. ఇంట్లో వాళ్లు ఇద్దరికీ సంబంధాలు చూసినప్పటికీ నో చెబుతూ వచ్చారు. ఇలా ఇద్దరికీ 41 ఏళ్ల వయస్సు వచ్చింది. ఈ క్రమంలో ఐక్వే కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమకు ఓకే చెప్పి.. పెళ్లికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య విశాఖలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యను టార్గెట్ చేసి..
కాజులూరు, తూర్పు గోదావరి: తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్షి్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్లో ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియోపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కౌన్సెలింగ్ వల్లనే జాప్యం ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. – ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం -
‘ప్రేమోన్మాది కల్యాణ్ను కఠినంగా శిక్షిస్తాం’
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్య స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న వాసిరెడ్డి పద్మ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితుడు కల్యాణ్ను కఠినంగా శిక్షిస్తామన్నారు. ‘ఇది ఒక ప్రేమోన్మాది దాడి. కల్యాణ్ అనే యువకుడు ఒక పశువులా అర్ధరాత్రి ప్రవర్తించాడు. బాధిత యువతి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. పవర్ కట్ చేసి మరీ దాడికి పాల్పడ్డాడు. కరెంట్ పోవడంతో ఇంటిలోని వారు బయటకు వచ్చారు. యువతితో పాటు తల్లి, చెల్లి చేతులు, మెడపైన కత్తితో దాడి చేశాడు. వారి ట్రీట్మెంట్కు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఆ ప్రేమోన్మాదిపై చార్జ్షీట్ వేసి హత్యాయత్నం కింద కేసు పెట్టి రౌడీ షీట్ తెరవాలని ఎస్పీని కోరాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. -
న్యూ ఇయర్ పార్టీకి అత్తారింటికి వెళ్లడమే శాపమైంది..
బిక్కవోలు: న్యూ ఇయర్ వేడుకలో శృతి మించిన సరదా ఒకరి ప్రాణాన్ని బలిగొన్న ఘటన మండలంలోని కొమరిపాలెంలో ఆదివారం జరిగింది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన కొమారపు చిన్నబాబు(20) కొమరిపాలెం గ్రామానికి చెందిన వెంకటలక్షి్మని 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొమరిపాలెంలో నివాసం ఉంటున్నాడు. కాగా, నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని భార్యను, కుమార్తె వినితను పక్క వీధిలో ఉంటున్న అత్తవారింటికి పంపించాడు. అర్ధరాత్రి సమయంలో పక్కింటిలోనే ఉంటున్న వెంకటలక్ష్మి బంధువు ఖండవిల్లి నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో కేక్ క్రీమును ఒకరికొకరు పూసుకునే క్రమంలో నూకరాజు కుటుంబ సభ్యులు చిన్నబాబును హేళన చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగింది. చిన్నబాబు అత్తగారి ఇంటికి వచ్చిన తరువాత.. ఇదే విషయమై నూకరాజుకు వెంకటలక్ష్మి ఫోన్ చేసి అడిగింది. నీ భర్త రేపు ఉండడంటూ నూకరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెల్లవారుజాము మూడుగంటల ప్రాంతంలో నూకరాజు కూతురు శిరీష, ఆమె భర్త ధర్మ అలియాస్ సురేష్, అతని ఇద్దరు స్నేహితులు చిన్నబాబు అత్తవారింటి వద్దకు వచ్చి బయటకు రమ్మని కేకలు వేశారు. చిన్నబాబు బయటకు రావడంతో సురేష్ కత్తితో పలుచోట్ల పొడిచి చంపేశాడని అని వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ వి.శ్రీనివాస్, ఎస్ఐ పి.బుజ్జిబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించారు. విషాద ఛాయలు ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నబాబు తండ్రి రామకృష్ణకు ఇద్దరు కూమారులు. ఇటీవల పెద్ద కుమారుడు ప్రమాదం మరణించడంతో ఉన్న ఒక్క కొడుకుతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. నాలుగు నెలల గర్భిణి అయిన వెంకటలక్షి్మ.. ఏడాది వయసున్న కుమార్తె వినితతో చిన్నబాబు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచి వేసింది. -
పేదలకు గృహవరం.. ఏళ్ల నాటి కల సాకారం
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు. సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి గృహప్రవేశం ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు. వేగంగా నిర్మాణాలు జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. – పి.ప్రశాంతి, కలెక్టర్ కల నిజమాయె.. పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఎడవల్లి సుబ్బారావు (62) మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు హాజరైన సుబ్బారావు అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పార్టీ శ్రేణులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి అత్యుత్తమ వైద్యం అందించారు. మరోవైపు.. సుబ్బారావు మృతి సమాచారం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి, మంత్రి కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పార్టీ తరఫున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లు కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. అంతకుముందు.. తొక్కిసలాట విషయం తెలిసి విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు, ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును కలిసి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. చదవండి: (ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి) -
పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..
మామిడికుదురు: ఇంట్లో పెళ్లి జరిగిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు గంటల వ్యవధిలోనే ఆ ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. ఒక్కగానొక్క కుమార్తెను కన్యాదానం చేసి కల్యాణ మంటపం నుంచి ఇంటికి తిరిగివస్తున్న తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో ఆవేదన కట్టలు తెంచుకుంది. ఈ విషాద ఘటన పాశర్లపూడిలంక గ్రామంలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు తండ్రి ముత్యాల శ్రీనివాసరావు (51) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అతని మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాశర్లపూడిలంకకు చెందిన ముత్యాల శ్రీనివాసరావు కుమార్తె వనదుర్గవల్లీశ్రావణి వివాహం ఈ నెల 8వ తేదీ రాత్రి పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి ఫంక్షన్ హాల్లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత శ్రీనివాసరావు మోటార్ సైకిల్పై ఇంటికి తిరిగి వస్తూ పాశర్లపూడి కైకాలపేటలో 216వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతనిని కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భగవంతుడు తమ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడని మృతుడి భార్య మంగ, నవ వధువు వనదుర్గవల్లీశ్రావణి, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి సోదరుడు వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నగరం హెచ్సీ కొండబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశాజ్యోతి దారుణ హత్య.. అనుమానమే ప్రాణం తీసిందా?
తాళ్లపూడి: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కర్కశంగా కత్తితో నరికి చంపి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాడు. అంగన్వాడీ హెల్పర్ హత్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరులో సంచలనమైంది. భార్యపై అనుమానంతో మెడపై కత్తితో నరికిన నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాళ్లపూడి ఎస్సై కె.వెంకటరమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడి పరిధిలోని కుకునూరు అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఆటపాకల ఆశాజ్యోతి(30) తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త ఆటపాకల వీర వెంకట సత్యనారాయణతో విభేదాలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఇటీవల మళ్లీ పిల్లల కోసమని వచ్చి భార్యా పిల్లలతో కలసి ఉంటున్నాడు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో భార్య ఆశాజ్యోతితో గొడవ పడి కత్తితో ఆమె మెడపై, గొంతుపై నరికి హత్యచేశాడు. తీవ్ర రక్త స్రావం అయి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమార్తెపై అనుమానంతో అల్లుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని మృతురాలి తండ్రి పెద్దాడ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వెంకటరమణ కేసు నమోదు చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ కేవీ రమణ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణవర్మ ఆధ్వర్యంలో ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలు కన్నీరుమున్నీరు ఆశాజ్యోతి దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో సురేంద్ర 8వ తరగతి, తేజ 5వ తరగతి, గోపి దుర్గ నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి మృతితో వీరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూసే తల్లి తమ కళ్ల ముందే మృత్యు వాత పడడంతో వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అంగన్వాడీ వర్కర్లు ఆశాజ్యోతి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
ఏపీ మార్కెట్లోకి మధుర ఫలాలు.. అన్ సీజన్లో కిలో మామిడి పండ్లు ఎంతంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలోకి మామిడి పండ్లు అప్పుడే వచ్చేశాయ్! వేసవిలో వచ్చే మామిడి పండ్లు శీతాకాలంలో రావడమేమిటని ఆశ్చర్యపోకండి! నూజివీడు ప్రాంతంలో ప్రత్యేకంగా పండించిన ఈ మధుర ఫలాలు నగరవాసులకు రుచిచూపించడానికి విచ్చేశాయి. సాధారణంగా ఏప్రిల్ నాటికి మామిడి పండ్లు పక్వానికి వస్తాయి. ఎక్కడైనా ముందుగా కాసిన చోట ఒక నెల ముందు మార్కెట్లో కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా నాలుగైదు నెలల ముందుగానే ఇవి దర్శనమిస్తున్నాయి. అనూహ్యంగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ మామిడిని చూసిన వారు ఒకింత ఆశ్చర్య చకితులవుతున్నారు. ప్రస్తుతం విశాఖ మార్కెట్లో బంగినపల్లి, సువర్ణరేఖ, పరియా రకాల మామిడి పండ్లు అందుబాటులోకి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ప్రాంతంలో కొంతమంది రైతులు వీటిని ప్రత్యేకంగా పండిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి విశాఖ, గాజువాకలకు చెందిన కొందరు పండ్ల వర్తకులు కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు. వీటిలో ఏ రకమైనా కిలో రూ.250 చొప్పున పండ్ల బండ్లపై విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైనా మామిడి పండ్లపై మోజు పడేవారు అర కిలో, కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ సీజనులో వచ్చే మామిడి పండ్లకంటే కాస్త రుచి తక్కువగానే ఉంటున్నా కాలం కాని కాలంలో వీటిని తినడం ఓ తీయని అనుభూతిని కలిగిస్తోందని నగరంలోని శాంతిపురానికి చెందిన ఎంకేఆర్ శర్మ ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు అర టన్ను పండ్లు అమ్మకం నూజివీడు ప్రాంతం నుంచి కొనుగోలు చేసిన మామిడి పండ్లను నగరంలోని డైమండ్ పార్క్, ఎల్ఐసీ బిల్డింగ్, సీతమ్మధార రైతుబజార్, ఎంవీపీ కాలనీ, పూర్ణామార్కెట్, గాజువాక తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రోజుకు నూజివీడు ప్రాంతం నుంచి అర టన్ను (500 క్వింటాళ్ల) మామిడి పండ్లు తెస్తుండగా 90 శాతం అమ్ముడుపోతున్నాయని ఈ పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. రోజూ తాను 50 కిలోల మామిడి పండ్లను తెస్తే 40 కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయని డైమండ్ పార్కు వద్ద బండిపై విక్రయించే పండ్ల వ్యాపారి ఎస్.ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మామిడిపండ్లు డిసెంబర్లో మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారని, సంక్రాంతి వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
పెళ్లి పుస్తకంలో రంగుల పేజీలు
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయనేది పాత మాట.. ఇక్కడే స్వర్గం సృష్టిస్తామనడం నయా ట్రెండ్.. సంప్రదాయ తంతుకు సరికొత్త హంగులద్దుతున్నారు.. ఎంగేజ్మెంట్ హంగామా.. ప్రీవెడ్డింగ్ షూట్.. ప్రత్యేక అలంకరణలు.. మెహందీ.. సంగీత్ వంటి వాటితో మెగా ఈవెంట్ను తలపింపజేస్తున్నారు.. వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు పదిలపర్చుకోవాలని వధూవరులు చూపిస్తున్న ఆసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు కొందరు. ముహూర్తాలు మొదలవడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లిసందడి ప్రారంభమైంది. ఏలూరు (ఆర్ఆర్పేట) : పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలాల నుంచి వివాహ వేడుక వరకూ భారీ బడ్జెట్తో జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం పెళ్లి పుస్తకంలో మధుర ఘట్టంలా వధూవరులు భావిస్తున్నారు. దీంతో ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఉపాధి లభిస్తోంది. అలాగే వివాహ వేడుకలో పూర్వకాలం నుంచి అరివేడు ముంత, పూలజడ, చమ్మిలి దండ, అడ్డుతెర, ఉంగరాల ఆట బిందె, మంగళస్నానాల జల్లెడ, గొడుగులు వంటి వాటికి ప్రాధాన్యముంది. పెళ్లివారి అభిరుచులకు అనుగుణంగా వీటిని రంగులు, అద్దాలతో ప్రత్యేకంగా అలంకరిస్తూ ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు. భలే ముహూర్తం ఈ ఏడాది వరుసగా మూడు నెలల మూఢం కారణంగా ఎటువంటి శుభకార్యాలు జరగలేదు. ఈనెల మొదటి వారంలోనే మూఢానికి ముగింపు పడగా కొద్దిపాటు ముహూర్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 2న రాత్రి నుంచి కొద్దిపాటి పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలయ్యాయి. అలాగే జనవరిలో 25 నుంచి మాఘమాసం ప్రవేశించి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ గట్టి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అనంతరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకూ గురు మూఢం ప్రవేశిస్తుండడంతో ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. మెండైన ఉపాధి : వివాహాది శుభకార్యాలు మొదలుకావడంతో ఇప్పటికే చాలా మంది బ్యూటీషియన్లను బ్రైడల్ మేకప్ల కోసం రిజర్వ్ చేసుకున్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. వీరితో పాటు పూలు, విద్యుత్ అలంకరణ చేసేవారు, ఫుడ్, ఐస్క్రీమ్, పాన్ సప్లయర్లు, కేటరర్లు, ఆయా వర్గాలకు సంబంధించిన సహాయకులకు చేతినిండా పని దొరుకుతుందనే ఆశతో ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు ముహూర్తాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిన వారంతా తిరిగి ఇటుగా రానున్నారు. దృశ్య కావ్యంలా.. వధూవరుల మంగళస్నానాలకు వినియోగించే పాత్రలు, మహారాజా తలపాగాలు, కాళ్లకు తొడిగే పావుకోళ్లు, రోళ్లు, రోకళ్లు, బాసికాలు, విదేశీ పూలజడలు, అల్లికల జాకెట్లు, పట్టువస్త్రాలు, వధూవరులు ఆకర్షణీయంగా కనిపించడానికి బ్రైడల్ మేకప్లు, పూచ్చిపూల మండపాలు, విద్యుద్దీపాలంకరణ, బాణసంచా సందడి, ఆర్కెస్ట్రా, వింధు భోజనాలు ఇలా అన్నింటా ప్రత్యేకతకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా దృశ్యకావ్యంలా వివాహ తంతును జరిపించేందుకు పలువురు ఆసక్తి చూపడంతో ఆయా రంగాల్లో ని ఎందరో ముహూర్తాల సీజన్లో ఉ పాధి పొందుతున్నారు. మెహందీ.. సంగీత్ వేడుకలు వివాహా వేడుకల్లో ముఖ్యంగా మెహందీ, సంగీత్లు ప్రత్యేకతను సంతరించుకుంటున్నా యి. ఉత్తర భారతదేశంలో ఉండే ఈ వేడుకలు ఇటీవల జిల్లాలోను తళుక్కుమనిపిస్తున్నాయి. గోరింటాకు పెట్టుకోవడం, సినీ గీతాలకు నృత్యాలు చేయడం వంటి పనులు వినోదాత్మకంగా జరుగుతున్నాయి. దీంతో బ్యూటీషియన్లు, ఈవెంట్ మేనేజర్లకు ఉపాధి లభిస్తోంది. ఈవెంట్ అంటే ఓ కళ పెళ్లంటే సంప్రదాయ సంబరం. అందరినీ ఒకదగ్గరకు చేర్చి వినోదాన్ని పంచాలి. అలాంటి ఈవెంట్ను నిర్వహించడంలో ఓ కిక్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తే ఈవెంట్ ఆర్గనైజర్గా విజయం సాధించినట్టే. ఒక్కోసారి ముహూర్తం అర్ధరాత్రి ఉంటుంది. అటువంటప్పుడు అందరినీ ఆహ్లాదపరుస్తూ సమయం గడిచేలా చేయడం కూడా కళగా భావిస్తున్నాం. – అల్లాడ లావణ్య, ఈవెంట్ మేనేజర్ ఓపిగ్గా మేకప్ బ్రైడల్ మేకప్ను ఎంతో ఓపికగా చేయాలి. దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కరి శరీర ఛాయకు సరిపడేలా రంగులు అద్దాల్సి ఉంటుంది. దానిని గుర్తించడం బ్యూటీషియన్కు సవాలే. కరోనా తర్వాత చాలా మంది బ్రైడల్ మేకప్కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఈ రంగంలోకి రావడంతో పోటీ పెరిగి ఆదాయం తగ్గింది. అలాగే ఖర్చు కూడా పెరుగుతోంది. – బండి శిరీష, బ్యూటీషియన్, సిరీస్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రత్యేక అలంకరణలు పెళ్లి తంతులో వినియోగించే ప్రతి వస్తువునూ ఆకర్షణీయంగా అలంకరించడం ట్రెండ్గా మారింది. ఇందుకు అనుగుణంగా గరికి ముంతలు, అవిరేడు ముంతలు, బాసికాలు, తలపాగాలు, సంప్రదాయ టోపీలు, పూల జడలు, గొడుగులు, బుట్టలు, బిందెలు వంటివి ప్రత్యేకంగా అలంకరిస్తున్నాం. ప్రతి దానికీ హంగులు అద్దుతూ పూసలు, పెయింటిగ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. – పి.ఉమా మహేశ్వరిదేవి, శ్రీదేవి ఉమెన్స్ వరల్డ్ యజమాని ప్రీ వెడ్డింగ్ షూట్తో.. ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్ నంచి ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెళ్లి పని మొదలవుతోంది. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్కు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫొటోగ్రాఫర్ల పనితనానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దీంతో మేం అందమైన లొకేషన్లను వెదుకుతున్నాం. పెళ్లి తంతులో ప్రతి ఘట్టాన్నీ కవర్ చేయాల్సి ఉంది. ఇందుకు తగ్గట్టు ఖరీదైన కెమెరాలు వాడుతున్నాం. వివాహాల కవరేజ్ను బట్టి ప్యాకేజీ ఉంటుంది. – కరణం ఫణి, ఫొటోగ్రాఫర్ -
వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా: చంద్రబాబు
సాక్షి, ఏలూరు/సాక్షి, రాజమహేంద్రవరం/కొవ్వూరు: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను నట్టేట ముంచుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. నేను అనుకుంటే వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా. పశ్చిమ గోదావరిలో ఉన్న హార్టీకల్చర్ యూనివర్సిటీ పేరు మారుస్తా’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో, కొవ్వూరులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో రోడ్షోలు నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. తొలుత కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన బీసీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఒకే జిల్లా వాళ్ళు. రాష్ట్రంలో సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల ఈ నలుగురే రాజకీయం చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా’ అని అన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి అగ్రవర్ణాల కింద పని చేయించుకుంటున్నారని అన్నారు. బీసీలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని కోరిక ఉండటం తప్పు కాదని, ఒక పద్ధతి ప్రకారం ఎదగాలని చెప్పారు. బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన పోలవరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు గానీ గంజాయి మాత్రం ఇస్తున్నారని, అందరూ గంజాయి మత్తులో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, తెలంగాణలో ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పోయి, ఇసుక, మైనింగ్ మాఫియా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువయ్యారన్నారు. పోలవరం పునరావాస కాలనీలను జూబ్లీహిల్స్లా చేయాలనుకున్నా అన్నారు. 72 శాతం ప్రాజెక్టు తానే పూర్తి చేశానని, తాము అధికారంలోకి రాగానే పోలవరాన్ని జిల్లా గా ప్రకటిస్తామన్నారు. మనం ఎమైనా చేస్తే పోలీసులు వచ్చి గోడలు దూకి అరెస్టు చేస్తారని అంటూనే, వాళ్లదేం తప్పులేదని, జీతాలు కూడా లేవంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన మీద కేసులు పెట్టేందుకు తవ్వుతూనే ఉన్నారని, ఈక కూడా దొరకదని చెప్పారు. ప్రాజెక్టు వద్ద హైడ్రామా అంతకుముందు చంద్రబాబు, టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొన్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి తప్పనిసరని, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో అనుమతించలేమని డీఎస్పీ లతాకుమారి వివరించారు. దీంతో పోలీసులను అడ్డగోలు రీతిలో ప్రశి్నంచి 15 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఉద్యోగాలిచ్చా.. రాయల్టీ ఇవ్వండి తన హయాంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని, మీ పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని, లక్షల ఆదాయం చూపించానని అందుకు ప్రతిఫలంగా తనకు రాయల్టీ పే చేయాలని చంద్రబాబు కొవ్వూరు సభలో అన్నారు. సంపాదనలో కనీసం ఒక శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. పార్టీ ఫండ్ అన్నా ఇవ్వాలని ప్రాథేయపడ్డారు. -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
ఆర్బీకేల్లోనే గోనె సంచులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు సంక్షేమమే థ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తు దగ్గర నుంచి కోత కోసే వరకు అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. రైతు పంటకు మద్దతు «ధర దక్కేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎక్కడా నష్టపోకుండా ధాన్యాన్ని కళ్లాల వద్దే కొనుగోలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు రెండు జిల్లాల అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా రైతులకు రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేశారు. ఆర్బీకేల వద్ద వలంటీర్లు, రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారులతో ఒక టీం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్ళకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళల్లో రైతు సంఘాల నేతలు, రైస్మిల్లర్లు, రైతులతో జిల్లా అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గోనెసంచుల కొరతతో ఇబ్బందులు ఈ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోనెసంచుల కొరత అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటికి ఇబ్బందులు ఏర్పడకుండా గోనెసంచులు భారీ ఎత్తున అందించేందుకు అ«ధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ఆరంభంలో గోనెసంచుల కొరత ఏర్పడినప్పటికీ దానిని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గోనె సంచులను రైస్మిల్లర్ల నుంచి రైతులకు అందించేందుకు రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో గోనెసంచులు అందుబాటులో ఉండేలా మిల్లర్లు గోనెసంచులు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆరంభంలో మిల్లర్లు గోనెసంచులు అందించడంలో కాస్త అశ్రద్ధ వహించినప్పటికీ క్రమేపి రైతు భరోసా కేంద్రాలకు గోనెసంచులు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు. మిల్లర్ల సాయంతో గోనెసంచుల సేకరణ ఏలూరు జిల్లా వ్యాప్తంగా 745 రైతుభరోసా కేంద్రాల్లో 4.2 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా పశ్చిమగోదావరి జిల్లాలో 296 రైతుభరోసా కేంద్రాల పరిధిలో 3.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. వీటికి ఏలూరులో 1.50 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 85 లక్షలు గోనెసంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటికి అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు ఏలూరు జిల్లాలో 95 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 60 లక్షలు గోనెసంచులు అవసరం కానున్నాయి. వీటిని రైతులకు అందుబాటులో ఉన్న రైతుభరోసా కేంద్రాలకు మిల్లర్ల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.43 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ప్రస్తుత ఖరీఫ్లో మంచి దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో గోనెసంచులు భారీగా అవసరమయ్యాయి. గోనెసంచుల విషయంలో అధికారులు పూర్తి దృష్టి కేంద్రీకరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోనెసంచులను రీసైక్లింగ్ విధానం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ చేస్తున్నారు. కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలుకు అధికారులు వాహనాలను సైతం సిద్ధంగా ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్బీకేల వద్ద వీఆర్ఓ, ఆర్ఐలను కస్టోడియన్లుగా నియమించి మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 120 నుంచి 180 వరకు వాహనాలను అందుబాటులో ఉంచి రవాణాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేపడుతున్నాం. ఆరంభంలో గోనెసంచుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అ«ధిగమించి రైతులకు గోనెసంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్నవెంకటేష్, ఏలూరు జిల్లా కలెక్టర్ గ్రామస్థాయిలోనే రైతులకు సేవలు గ్రామ స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు సేవలందిస్తున్నాను. ప్రస్తుతం కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు అందుబాటులో గోనెసంచులు ఉంచి కొనుగోలు నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాము. రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు అ«ధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. – పి.ప్రశాంతి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ -
చంద్రబాబు ఈ వయసులో అలాంటివి అవసరమా?: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: కర్నూలులో న్యాయరాజధాని వస్తే తమప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆనందంలో అక్కడి ప్రజలు ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అందుకే వాళ్లు బాబుని అడ్డుకొని గోబ్యాక్ నినాదాలు చేశారన్నారు. జగన్ ప్రజల హృదయాలకు దగ్గరయ్యేసరికి చంద్రబాబుకి పిచ్చి ముదిరిందని మండిపడ్డారు. ఎవరైనా అతనిని మెంటల్ ఆస్పత్రిలో చూపించాలన్నారు. ఈ మధ్య చంద్రబాబు కొత్తగా తొడగొట్టడం కూడా మొదలు పెట్టాడు. ఈ వయసులో అలాంటివి అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ పార్టీలకతీతంగా పథకాలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యేసరికి బాబుకి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయాయి అన్నారు. అమరావతి రాజధాని కాకపోతే లక్షల కోట్లు పోతాయనే బెంగ పట్టుకుందన్నారు. బాబు ఎక్కడికెళ్లినా తన భార్యను అవమానించారంటూ సింపతీ కోసం చూస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీ రికార్డులు వెరిఫై చేసి నిరూపించు చంద్రబాబు అని సవాల్ విసిరారు. మేము చంద్రబాబు భార్యను ఒక్కమాట అన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతగా విరమించుకొంటాను అని సవాల్ చేశారు. మహానుభావుడు ఎన్టీఆర్ని క్షోభ పెట్టి, ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా బ్లాక్ చేసిన నీచుడు చంద్రబాబు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) -
రూ.1,400 కోట్లతో ‘పశ్చిమ’కు తాగునీరు
సాక్షి, అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్తో ఏర్పడిన నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రూ.1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నారు. నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం), తాడేపల్లిగూడెం (కొంత భాగం) పరిధిలోని 26 మండలాల ప్రజలకు పథకం ద్వారా ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. సమీపంలోని నదుల నుంచి.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాలున్నా సరఫరా చేయడానికి నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఏడాది పొడవునా తాగునీటి సరఫరా జరిగేలా సమీప నదులతో ప్రత్యేక పైపులైన్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. సీఎం ప్రారంభించనున్న రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. రూ.10,131 కోట్ల పనులు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో రూ.10,131 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే 34 శాతానికిపైగా జరిగాయి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు 25 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల త్వరలోనే ప్రారంభం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రూ. 1,200 కోట్లతోనూ, ఉమ్మడి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత రక్షిత మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
సంక్రాంతికి తగ్గేదేలే.. స్పెషల్ డైట్తో తర్ఫీదు.. పుంజు ధర ఎంతో తెలుసా?
సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో గుర్తొచ్చేది కోడిపందేలే. ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. పందేలలో రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే సంక్రాంతి పండగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా అప్పుడే కోడిపుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. బరిలో బలంగా ఢీకొట్టేలా జాతి కోళ్లను జిల్లాలోని కొన్ని శిబిరాల్లో పెంచుతుండగా, వీటి ఖరీదు రూ.వేల నుంచి లక్షల్లో పలుకుతుండటం విశేషం. భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి బరిలో దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పెట్టుబడులు పెడతారు. పందేనికి పుంజును సిద్ధం చేయడం కోసం పెంపకందారులు చాలా శ్రమిస్తారు. పుంజును సుమారు ఏడాది పాటు పెంచుతారు. వీటి ఆహారం నుంచి ఆరోగ్యంగా, బలంగా ఉండేవరకు ఒక్కోక్క పుంజుపై సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తారు. కొందరు ప్రత్యేకంగా కోసం స్థలం లీజుకు తీసుకుని మరీ 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. పుంజుల సంఖ్య బట్టి ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తారు. మరి కొందరు అయితే తమ ఇంటి వద్ద ఉండే చిన్న పాటి ఖాళీ స్థలంలోనే పందెం పుంజులను పెంచుతూ పండగ సమయంలో వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు. ఖరీదైనా దాణా.. నిత్యం వ్యాయామం పందెం పుంజుకు బలవర్థమైన ఆహారం పెడతారు. మటన్ కైమా, జీడిపప్పు, బాదం పప్పు, కోడిగుడ్డు, గంటులు, చోళ్లు, తదితర వాటిని ప్రతిరోజు వాటికి ఆహారంగా పెడతారు. తరచూ పుశువైద్యులకు చూపించి వారి సలహాలు మేరకు విటమిన్ మాత్రలు, అనారోగ్యానికి గురికాకుండా వైద్యం అందించడం చేస్తారు. పందెం బరిలో త్వరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పోరాడేలా ప్రతి రోజు వ్యాయామం చేయిస్తారు. నీటిలో ఈత కొట్టిస్తారు. పుంజు ఎలా పోరాడుతుంతో తెలుసుకోవడానికి తరచూ ఇతర కోళ్లతో పందేలు వేసి గమనిస్తుంటారు. రూ.10 కోట్ల వ్యాపారంపైనే.. జిల్లాలో పందెం పుంజుల పెంపకం కలిగిన ప్రాంతాల చూస్తే ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, నర్సాపురం, ఆచంట, తణుకు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తదితర ప్రాంతాల్లో భారీగా పుంజులను పెంచుతుంటారు. మొత్తం జిల్లాలో ఏటా సంక్రాంతి పండగకు పందెం పుంజుల కొనుగోలు కోసం పందెంరాయుళ్లు సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారని అంచనా. పుంజు ధర, రకాలు పందెం పుంజుల ధర విషయానికి వస్తే జాతి, రంగు, దెబ్బలాడే విధానాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర సుమారుగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. వీటిలో నెమలి, కాకీ నెమలి, పచ్చ కాకి, సేతువా, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగీ, మైలా, ఫింగలా, పెట్టమర్రు, తదితర రకాల పుంజులు ఉంటాయి. ఆన్లైన్లోనూ విక్రయాలు పందెం పుంజులను పెంపకందారులు పలు రకాలుగా విక్రయిస్తున్నారు. పుంజు కావాల్సిన వారు ముందుగా కొంత అడ్వాన్సు ఇచ్చి బుక్ చేసుకుని పందెం రోజు పూర్తి మొత్తం ఇచ్చి తీసుకువెళుతుంటారు. మరి కొందరు నేరుగా మకాం వద్దకు వెళ్లి వారికి కావాల్సిన పుంజులను ఎంచుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అయితే పెంపకందారులు పుంజులను ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండగ సమయంలో పందేలు జరిగే ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ నేరుగా కూడా విక్రయిస్తుంటారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం, కాళ్ల, ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో కోడి పుంజులను విక్రయాలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. -
CM Jagan: నరసాపురం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నరసాపురంలో ఈనెల 18న జరుగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. పట్టణంలోని 25వ వార్డు వీవర్స్కాలనీలో బహిరంగసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయా లని ఆదేశించారు. చినమామిడిపల్లి లేఅవుట్ వద్ద హెలీప్యాడ్ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం మీదుగా వెళ్లే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిబ్బందికి పాస్లు జారీ చేయాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం ఆమె సీఎం పర్యటించనున్న ప్రాంతాలు బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మురళి, నరసాపురం సబ్కలెక్టర్ ఎం.సూర్యతేజ ఆమె వెంట ఉన్నారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్కు సీఎం జగన్) 92 అర్జీల స్వీకరణ : నరసాపురం మున్సిపల్ కార్యా లయంలో కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 92 మంది అర్జీలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను తక్షణం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి కలెక్టర్ వినతులు స్వీకరించారు. చదవండి: (విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సీఎం జగన్ భేటీ) -
బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?
తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఓ యువతి సజీవ దహనం ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లో బెడ్రూమ్లో మంచంపైనే సజీవ దహనం అయ్యింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చివేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపరాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది. తెల్లారేసరికి నాగహారిక మంచంపై కాలి బూడిదై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగహారికకు రూపరాణి సవతి తల్లికాగా ఆమెకు తొమ్మిదేళ్ల మంజలిప్రియ అనే కుమార్తె ఉంది. ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఇంటి సామగ్రి తెచ్చుకోకపోవడంతో యజమాని ముళ్లపూడి శ్రీనివాస్ పాత ఇంటివద్దనేనిద్రిస్తున్నారు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపే సమయంలో కుమార్తె నిద్రిస్తున్న గది నుంచి పొగలు రావడం గమనించారు. అప్పటికే నాగహారిక మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై రాజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్స్కా్వడ్ ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
బ్లాక్ రైస్ సాగులో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. యువరైతు సక్సెస్ ఫార్ములా ఇదే!
నేటి యువతరం కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని ఉన్నతమైన ఉద్యోగం, వేతనాలతో ఆధునిక జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అదేబాటలో పయనిస్తూ ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్మెడల్ సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన యువ రైతు విష్ణుమూడి శశికాంత్ కోవిడ్ వల్ల వచ్చిన స్వల్ప విరామం సమయంలో వ్యవసాయంపై ఆసక్తి చూపారు. బ్లాక్ రైస్, సుగర్ ఫ్రీ రైస్, బాస్మతీ రకాలను తనకున్న సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. తాడేపల్లిగూడెం రూరల్: కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెనుమార్పులను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డ వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన విష్ణుమూడి శశికాంత్ కుటుంబీకులు కోవిడ్ బారిన కోలుకోవడంతో వైద్యుల సూచన పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించారు. శశికాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, కోవిడ్ సంక్షోభంలో సాఫ్ట్వేర్ రంగంలో కొంత విరామం రావడం వంటి కారణాలతో తనకున్న భూమిలోనే ప్రయోగాత్మకంగా పోషకాలతో కూడిన బ్లాక్ రైస్ సాగుపై మక్కువ చూపారు. బ్లాక్ రైస్లో ప్రోటీన్లు 8.16 శాతం, కొవ్వు శాతం 0.07 శాతం, బార్లీ, గోధుమల్లో లభించే గ్లూటన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటిని గ్రహించిన శశికాంత్ బ్లాక్ రైస్ సీడ్ను వరంగల్ నుంచి తీసుకువచ్చి తనకున్న ఐదెకరాల విస్తీర్ణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్ రైస్ సాగు చేపట్టారు. అందులో పురుగుమందులు వినియోగించుకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు నాణ్యమైన దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో బ్లాక్రైస్ను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బాస్మతీ రైస్, సుగర్ ఫ్రీ (బీపీటీ 5420) రైస్ను అరెకరం చొప్పున విస్తీర్ణంలో సాగు చేశారు. బాస్మతీ రైస్ 20 బస్తాలు, సుగర్ ఫ్రీ రైస్ 25 బస్తాలు దిగుబడి లభించాయి. పశువుల వ్యర్థాలే ఎరువు పశువుల, జీవాల విసర్జిత మల, మూత్రం, వేప పొడి వంటి వాటితో ఎరువును తయారు చేసి చేనుకు అందించడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. తద్వారా ఎరువుల ఖర్చులను దాదాపు తగ్గించుకున్నారు. రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు. అటువంటి వాటిని సైతం దీటుగా ఎదుర్కొని నిలబడగలిగే వరి వంగడంగా ఆయన పేర్కొన్నారు. బ్లాక్ రైస్ సాగు చేపట్టిన రైతు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండవచ్చని భరోసానిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆదాయం బ్లాక్ రైస్ను తమ ఇంటి అవసరాలకు, బంధువులకు సరఫరా చేయగా, మిగిలిన వాటిని 25 కిలోల బస్తాకు రూ.3 వేలు, సుగర్ ఫ్రీ రైస్ బస్తాకు రూ.1500లకు విక్రయించారు. ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క ఆదాయం కూడా బాగుందని శశికాంత్ చెబుతున్నారు. ఒత్తిడి లేని వ్యవసాయమే లక్ష్యం ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేసుకోవాలని భావిస్తున్నా. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో 680 రకాల రైస్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో మేలైన రకాలు సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించాలన్నదే నా లక్ష్యం. – విష్ణుమూడి శశికాంత్, యువ రైతు, మెట్ట ఉప్పరగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
భీమవరం కాలేజీ హాస్టల్లో దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఐరన్ బాక్స్లో అంకిత్ ఛాతిపై వాతలు పెట్టారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లీజ్ అని వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్కు తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
AP: కళ్లెదుటే కలల గృహం
పేదల సొంతింటి కల సాకారమవుతోంది.. పల్లెల స్వరూపం మారుతోంది.. జగనన్న కాలనీలు కొంగొత్త గ్రామాలుగా అవతరిస్తున్నాయి.. కళ్లెదుటే ఆనందాల లోగిళ్లను చూస్తూ పేదల మోము వికసిస్తోంది.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ప్రతి పేదవాడికీ సొంతింటిని అందించాలని సంకల్పించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అర్హులందరికీ స్థలాల పట్టాలు అందించి గృహనిర్మాణాలకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తోంది. ఈ క్రమంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,863 లేఅవుట్లు గ్రామాలుగా విస్తరిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణంతో కొత్త ఊరిని తలపిస్తోంది. లేఅవుట్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వివిధ దశల్లో నిర్మాణాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,863 లేవుట్లు ఉండగా.. 2,12,895 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో 17,916 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా రెండు జిల్లాల్లోనూ వివిధ దశల్లో ఉన్న గృహాలను వచ్చే డిసెంబర్ 21 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి రోజూ లక్ష్యాలను నిర్దేశించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వందల కోట్లతో.. రెండు జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 322.48 కోట్లు వెచ్చించింది. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.600 కోట్లు అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి ఇంటికీ డీఆర్ డీఏ ఆధ్వర్యంలో రూ.35 వేలు అదనంగా అందిస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు కూడా అడిగిన వెంటనే ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత ఎక్కువ మందికి గృహాలు అందించాలని నిర్ణయించి ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించి పనులు పూర్తి చేయిస్తున్నాం. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ గృహనిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్న వెంకటేష్, కలెక్టర్, ఏలూరు ప్రభుత్వమే అన్నీ సమకూర్చుతూ.. అధికారులు సిమెంట్, ఐరన్, ఇసుకను ఇంటి వద్దనే అందిస్తున్నారు. నిర్మాణ పనుల కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. నేను, నా భార్య కూలీలతో కలిసి పనిచేస్తున్నాం. మా ఇద్దరికీ ఉపాధి పథకం ద్వారా 90 రోజుల కూలీ డబ్బు లు రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. సంతోషంగా నిర్మాణం పూర్తి చేస్తాం. – పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం. పక్కాగా మౌలిక వసతులు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీ భూమి మెరక చేసింది. దీంతో మాకు పునాది ఖర్చు రూ.50 వేల వరకు తగ్గింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంటు ఇచ్చారు. గ్రావెల్ రోడ్డు వేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారులు అన్ని పనులు దగ్గరుండీ చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. – బసవరాజు వెంకటేశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం స్థిరాస్తిని అందించిన ప్రభుత్వం ఇతడి పేరు కిల్లారి రాంబాబు, భీమడోలు మండలంలోని గుండుగొలను గ్రామం. వీరి కుటుంబానికి ప్రభుత్వం సెంటున్నర భూమి ఇచ్చి ఇంటిని మంజూరు చేసింది. ఐదు నెలల క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసి కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేయడంతో పాటు జగనన్న తనను రూ.5 లక్షల ఆస్తికి హక్కుదారుడిని చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా నిర్మాణం ఈమె పేరు కానూరి పార్వతి, భీమడోలు మండలం గుండుగొలను గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో అవస్థలు పడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. సెంటున్న స్థలాన్ని ఉచితంగా అందించగా ఆనందంగా నిర్మాణ పనులు చేపట్టింది. తన దశాబ్దాల కల సాకారమైందని, జీవితాంతం సీఎం జగన్కు రుణపడి ఉంటానని ఆమె అంటున్నారు. -
ద్వారకాతిరుమలలో దారుణం.. కూతురుపై ప్రేమ ఎంతకు దారితీసింది
ద్వారకాతిరుమల: తన కుమార్తె మృతికి ప్రియుడే కారణమని భావించిన ఆమె తండ్రి ఆ యువకుడిని పథకం ప్రకారం హతమార్చాడు. తన కుమార్తె సమాధికి కూతవేటు దూరంలో ఆ యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ దారుణ ఘటన ద్వారకాతిరుమల మండలం, గొడుగుపేట శివార్లలో సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూర్ల లక్ష్మీపురానికి చెందిన తానిగడప పవన్కల్యాణ్ (24), రామసింగవరం పంచాయతీ గొడుగుపేటకు చెందిన మరీదు శ్యామల (18) జంగారెడ్డిగూడెంలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. వారు తమ ప్రేమ విషయాన్ని కొద్ది నెలల క్రితం ఇంట్లో చెప్పగా, కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించ లేదు. దాంతో మనస్థాపానికి గురైన శ్యామల ఈ ఏడాది జూన్ 5న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతితో కలత చెందిన ఆమె తండ్రి నాగేశ్వరరావు.. పవన్ కల్యాణ్ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలోని ఓ కాలువ గట్టుపై తన స్నేహితుడు నాగరాజుతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ చేసుకున్నాడు. అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు రోజు రాత్రి పవన్ కల్యాణ్ను శ్యామల తండ్రి నాగేశ్వరరావు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో, పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు నాగేశ్వరరావు అంగీకరించాడు. మృతదేహాన్ని శ్యామల సమాధికి సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్బాబు, లక్కవరం ఎస్సై దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పవన్ కల్యాణ్ కుటుంబాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోమవారం పరామర్శించారు. -
అమరావతి పాదయాత్రకు రెండో రోజూ నిరసన సెగలు
-
అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ చేస్తోన్న పాదయాత్రపై పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని ముసుగులో వస్తున్న తెలుగుదేశం బినామీలు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ''ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులుగా అమరావతి, కర్నూలు, విశాఖపట్నం కావాలి, రాజధాని ముసుగులో తెలుగుదేశం బినామీ నాయకులు గోబ్యాక్ గోబ్యాక్'' అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు ముద్రించారు. చదవండి: (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ) -
NIT Tadepalligudem: క్యాంపస్ ప్లేస్మెంట్లో నిట్ విద్యార్థుల సత్తా
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్ ప్లేస్మెంట్లలో నిట్ 2018–22 బ్యాచ్ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్ అమెజాన్లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్ఈ విద్యార్థి కేతన్ బన్సాల్ స్కైలార్క్ ల్యాబ్స్లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఏపీ నిట్ సత్తా చాటింది. ఈ బ్యాచ్లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..) -
లక్షల్లో డబ్బు పెట్టి అలుగులను కొంటున్న చైనా.. ఎందుకో తెలుసా?
బుట్టాయగూడెం: అడవికి రాజు సింహం... అది ఎంతటి జీవినైనా వేటాడి నమిలేస్తుందని నమ్ముతాం... కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును కలిగి ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులు ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గల పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలిన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్ పాంగోలిన్ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవనం సాగిస్తుంటాయి. తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకు సంచరిస్తున్నాయని వెల్లడించారు. అలికిడి అయితే బంతిలా ముడుచుకుపోతాయి.. అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలికిడి అయితే అవి బెదిరి కదలకుండా గట్టిగా బంతిలా ముడుచుకుని ఉండిపోతాయి. వీటికి ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుంది. ఇవి రెండేళ్లకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. కోతి మాదిరిగానే తన పిల్లలను వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ పోషిస్తాయి. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఒక్కో అలుగు రూ.20లక్షల వరకు ధర పలుకుతోందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరైనా వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
రాబోయే రెండేళ్లలో మరో 23 లక్షల ఇళ్లు
తాడేపల్లిగూడెం రూరల్(ప.గో. జిల్లా): కొత్తగా పెళ్లయిన పేదలకు 90 రోజుల స్కీంలో ఇళ్ళ పట్టాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన నివాసం వద్ద పెదతాడేపల్లి గ్రామానికి చెందిన 24మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, నిర్మాణాలు చేపట్టారన్నారు. రాబోయే రెండేళ్ళల్లో మరో 23 లక్షల ఇళ్ళు కట్టించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారన్నారు. పెదతాడేపల్లి గ్రామంలో రెండో దఫా 24 మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నట్టు తెలిపారు. పేదల సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. పెదతాడేపల్లిలోనే చాలామంది దుర్మార్గులు ఉన్నారని, దోచుకోవడానికి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేయాలనేది వారి ఆలోచనగా పేర్కొన్నారు. దుర్మార్గుల కళ్ళు తెరిపించేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అప్పుడే సీఎం జగన్కు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, వీఆర్వో ఆర్వీ.పోతురాజు, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు గుండుబోగలు నాగు, పెద తాడేపల్లి సొసైటీ అధ్యక్షుడు పరిమి తులసీదాస్, వీరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ ఆలపాటి కాశీవిశ్వనాధం, నాయకులు పరిమి ప్రసాద్, పరిమి రంగ, తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ఇంట్లో తెలిసిపోద్ది!
సాక్షి, భీమవరం: అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంతో విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది. ప్రత్యేక యాప్తో ప్రయోజనాలెన్నో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన స్టూడెంట్ అటెండెన్స్ యాప్ దోహదపడుతోంది. ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా క్లాసుల్లో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గంటల వరకు హాజరు వేస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతికి వెళ్లిన వెంటనే సెల్ఫోన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లాగిన్ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. సాయంత్రం పూట గతంలో మాదిరి హాజరు పట్టీలో మ్యాన్యువల్గా నమోదు చేస్తారు. ఉదయం యాప్లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే తల్లిదండ్రుల సెల్ఫోన్కు మెసేజ్ వెళుతుంది. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు. కార్పొరేట్ సవ్వడి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలుచేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. మన బడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తరగతి గదులు, ఫరి్నచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు వంటి వసతులు కలి్పస్తున్నారు. అన్ని పాఠశాలల్లో.. జిల్లాలోని 1,391 ప్రభుత్వ, 472 ప్రైవేట్ పాఠశాలల్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అమలుచేస్తున్నాం. దీంతో విద్యార్థులు తప్పని సరిగా క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం వెళుతుండటంతో వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది. – ఆర్.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం హాజరు శాతం పెరిగింది స్టూడెంట్ అటెండెన్స్ యాప్ కారణంగా హాజరుశాతం పెరిగింది. ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకానికి హాజరు శాతం తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు హాజరు కాకుంటే వారికి నచ్చచెప్పి స్కూల్కు పంపిస్తున్నారు. దీని కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగింది. – వి.రాధాకృష్ణ, ఉపాధ్యాయుడు, పీఎస్ఎం స్కూల్, భీమవరం చాలా బాగుంది ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వెళ్లేలా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ చాలా బాగుంది. మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఎప్పుడైనా బడికి వెళ్లకపోతే మెసేజ్ వస్తుంది. స్కూల్కు వెళ్లకపోవడానికి గల కారణాలను టీచర్స్కు వివరిస్తున్నాం. – ఎన్.వరలక్ష్మి, విద్యార్థిని తల్లి, దొంగపిండి -
శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి..
సాక్షి, నూజివీడు (పశ్చిమగోదావరి): శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపంతో ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్టేషన్తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్ వరకు చదివింది. అదే ఏరియాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కొండా ప్రదీప్కుమార్, రాణి ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరు సైతం మాట్లాడుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ప్రదీప్ మళ్లీ రాణితో మాటలు కలిపి ఇద్దరం శారీరకంగా ఒక్కటైతే పెద్దలు కచ్ఛితంగా పెళ్లికి అంగీకరిస్తారని చెప్పి నమ్మించాడు. 10వ తేదీన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. మరుసటి రోజు నుంచి ప్రదీప్ యువతితో మాట్లాడటం మానేశాడు. మహిళ భయంతో 27న తన తల్లి మంజులకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె పెద్దలతో చెప్పగా, వారు ప్రదీప్, అతని తల్లిని వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించారు. దీంతో 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాణి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష) -
ఉపాధి జాతర: కోటికిపైగా పనిదినాల కల్పన
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కష్టకాలంలో పేదలకు భరోసాగా నిలుస్తోంది. ఏలూరు జిల్లాలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో అధికారులు కోటికి పైగా పనిదినాలు కల్పించారు. వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ కలిపి రూ. 227.85 కోట్ల మేరకు ఖర్చు చేశారు. జిల్లా ఉపాధి హామీ చరిత్రలో ఇదో రికార్డుగా నిలిచింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క ఏలూరు జిల్లాలోనే కోటికి పైగా పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేయడంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది, అధికారులు విశేష కృషి చేశారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర దిన వేడుకల్లో అవార్డు ఇచ్చి సత్కరించింది. అడిగిన ప్రతిఒక్కరికీ పని కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలో బాసటగా.. కరోనా ప్రభావంతో పూర్తిగా ఛిన్నాభిన్నమైన పేదల బతుకులు తేరుకునేందుకు ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది. ఏలూరు జిల్లాలో 2022–23లో 1.50 కోట్లు పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా మొదటి ఐదు నెలల్లోనే 1.03 కోట్ల పనిదినాలు కల్పి ంచారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడు నెలలు పనిచేసి లక్ష్యానికి రెట్టింపు పనులు చేయాలనే దృఢ సంకల్పంతో డ్వామా సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పనులను గుర్తించి పేదలకు ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో స్థానికంగానే పనులు కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల జీవనానికి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 706 కుటుంబాలకు వంద రోజుల పని జిల్లాలో 5.35 లక్షల జాబ్ కార్డులు ఉండగా వీటిలో మొత్తం 5.82 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు. ఇప్పటివరకూ 3.26 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు చెందిన దాదాపు 4.50 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 103.38 లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 706 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు ఒక్కరికి రూ.206.16లు వేతనాలుగా చెల్లించారు. ఐదు నెలల్లో రూ.227.85 కోట్ల నిధులు ఖర్చు చేయగా దీనిలో రూ. 203.13 కోట్లు కూలీల వేతనాలుగా, రూ. 24.72 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్గా వెచ్చించారు. కూలీలకు వేతనాలను 15 రోజుల వ్యవధిలో 95.84 శాతం మేర చెల్లిస్తున్నారు. అడిగిన వారందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా పనులు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరి«ధిలో జరుగుతున్న అన్ని పనులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్బాబు సహకారంతో నిరంతరం పనులు కల్పించేలా పనిచేస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
AP: రూపాయికే ఇల్లు ప్రభుత్వం ఘనత
భీమవరం (ప్రకాశంచౌక్)/పాలకొల్లు అర్బన్(ప.గో. జిల్లా): దేశంలోనే ఒక్క రూపాయికి 300 చదరపు అడుగుల ఇల్లు ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడులో సుమారు 54 ఎకరాల్లో తొలి విడత నిర్మించిన 1,856 టిడ్కో గృహాలను, భీమవరం పట్టణం గునుపూడిలో 82 ఎకరాల్లో నిర్మించిన 1,920 టిడ్కో గృహాలను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పాలకొల్లులో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి కవురు శ్రీనివాస్ అధ్యక్షతన, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు సారె రూపంలో టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని, జగనన్ననగర్ పేరుతో వీటిని నిర్మిస్తూ సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లను దశల వారీగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టా మన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు టిడ్కో ఇళ్లపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. నాడు 300 చదరపు అడుగుల ఇల్లుకు రూ.2.50 లక్షల బ్యాంకు రుణం కట్టాలని టీడీపీ వారు చెప్పారా లేదా అనిప్రశ్నించారు. ఈ మేరకు పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలంటే సాధ్యమా అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో పేదలపై భారం తగ్గించేలా రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి 300 చదరపు అడుగుల ఫ్లాట్ను పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. జగనన్నకు మీ అందరి అశీస్సులు ఉండాలని ఆయన కోరారు. భీమవరంలో నాడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 82 ఎకరాల భూమిని ఒకేచోట సేకరించడం వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే నిమ్మ ల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహ న్, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, కార్పొరేషన్ చైర్మన్లు పెండ్ర వీరన్న, గుబ్బల తమ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, జెడ్పీటీసీలు కాండ్రేగుల నర్సింహరావు, నడపన గోవిందరాజులనాయుడు, గుంటూరు పెద్దిరాజు, ఎంపీపీలు రావూరి వెంకటరమణ, సబ్బితి సు మంగళి, పేరిచర్ల విజయనర్సింహరాజు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం నా భర్త శ్రీనివాస్ వడ్రంగి పని, నేను కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. నాకు రూపాయి రిజిస్ట్రేషన్తో ఏ–59 బ్లాక్లో ఫ్లాట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.15 లక్షల బ్యాంక్ రుణం కట్టాలన్నారు. నెలకి రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ మొత్తంగా రూ.7 లక్షల వరకు చెల్లించాలన్నారు. సీఎం జగన్ నా కుటుంబానికి ఉచితంగా టిడ్కో ఇల్లు ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. – కీర జ్యోతి, లబ్ధిదారు, పాలకొల్లు సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నా సొంతింటి కల నెరవేర్చారు. సుమారు 30 ఏళ్లపాటు అద్దె ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్న నాకు ఈ రోజు సొంతిల్లు రావడంతో కొండంత ధైర్యం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేవలం రూపాయికే నాకు ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించడం చాలా సంతోషంగా ఉంది. పండగ పూట మా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మంత్రుల చేతులమీదుగా ఇళ్ల పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది. – కె.దానమ్మ, లబ్ధిదారు, భీమవరం సొంతింటి కల సాకారం మండలి చైర్మన్ మోషేన్రాజు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ భీమవరంలో తొలి విడతగా 1,920 మందికి ఇళ్లను అందించడం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో 180 ఎకరాలు సేకరించి వేల మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇవ్వడం అభినందనీయమన్నారు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం పండగ రోజున టిడ్కో ఇళ్లను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివంగత వైఎస్సార్ సాయంతో పట్టణంలో 82 ఎకరాల భూమిని అప్పట్లో సేకరించామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ భీమవరంలో మిగిలిన టిడ్కో ఇళ్లను రెండు, మూడు నెలల్లో అందజేస్తామన్నారు. ఇక్కడ 512 మందికి ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చామన్నారు. -
సీఎం వైఎస్ జగన్ పాలన భేష్
భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందని ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనేంద్రసింగ్ జిత్త్ బిట్ట (ఎంఎస్ బిట్ట) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ తనకు అన్నయ్య లాంటివారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచివారని, మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కన్నా ఆంధ్రా సురక్షిత ప్రాంతమని, ఆంధ్ర ప్రభుత్వానికి, పోలీసులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. తెలంగాణ బేకార్ అని, అక్కడ పొలిటికల్ టెర్రరిజం ఉందని, అటువంటి విధానం ఆంధ్రాలో లేదన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రా పోలీసుల భద్రత చాలా బాగుందన్నారు. హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతం కాదని.. కానీ ఆర్థికంగా బలమైందన్నారు. కాగా, భీమవరానికి చెందిన ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు మాండ్రు నారాయణ రమణారావు ఆహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టు ఎంఎస్ బిట్ట చెప్పారు. ముందుగా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో శక్తీశ్వరస్వామిని, అనంతరం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామిని ఎంఎస్ బిట్ట దర్శించుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
పశ్చిమ గోదావరి: ఆగడాలలంక శివారు వద్ద లారీ కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడుకు చెందిన ముంగర హర్షవర్దన్ (30) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే విధులను నిర్వహిస్తున్నాడు. శనివారం బ్యాంకు పని నిమిత్తం తన స్కూటిపై హర్షవర్దన్ పైడిచింతపాడు నుంచి ఏలూరు బయలుదేరాడు. ఆగడాలలంక శివారు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ఇటుకల లోడు లారీని అధిగమించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్కూటి ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు లారీ చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భీమడోలు ఏఎస్సై చలపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పంచానామా అనంతరం బంధువులకు అప్పగించారు. ఏఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైడిచింతపాడులో విషాదఛాయలు హర్షవర్దన్ మృతితో పైడిచింతపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ముంగర బోజరాజు, ఝాన్సీలక్షి్మల పెద్ద కుమారుడు హర్షవర్దన్కు మూడేళ్ల క్రితం దుర్గాశ్రీతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఎనిమిదో నెల గర్భిణి. భార్య డెలివరీ తర్వాత బెంగళూరుకు కుటుంబ సమేతంగా వెళదామని భావించాడని, ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు కబళించిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దేవుడు తనకు అన్యాయం చేశాడంటూ భార్య దుర్గాశ్రీ గుండెలవిసేలా రోదించడంతో ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి మెలిగే హర్షవర్దన్ మృతి చెందాడన్న వార్తను గ్రామస్తులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. -
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్సర్వీస్మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
ప్రభుత్వ సాయం అందింది.. బాబుకు చెప్పిన వరద బాధితులు
పాలకొల్లు సెంట్రల్ / యలమంచిలి: ‘మాకు ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.2 వేలు నగదు అందింది. వరదల్లో చిక్కుకున్న మమ్మల్ని ప్రభుత్వం చాలా బాగా చూసుకుంది. ఈ రోజు వరకు అంటే శుక్రవారం వరకు పునరావాస కేంద్రాల్లో భోజనాలు పెడుతూనే ఉన్నారు..’ అంటూ వరద బాధితులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చెప్పారు. బాధితుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం గ్రామాలను సందర్శించారు. ముందుగా దొడ్డిపట్లలో నాలుగు బాధిత కుటుంబాలను సందర్శించగా వారిలో ఇద్దరు ప్రభుత్వం ఇప్పటివరకు బాగానే చూసుకుందన్నారు. ఏటిగట్టు ఎవరు పటిష్టం చేశారని అడుగగా, అధికారుల సహకారంతో తామంతా కృషి చేసి గట్టును పటిష్టం చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగించారు. గంగడపాలెంలో టీడీపీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించారు. చాలా ఆనందంగా ఉందని చెప్పగా, గంగడపాలెం గ్రామస్తుల్లో కొందరు చంద్రబాబు మా కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారా లేక పార్టీ నాయకులను పొగడడానికి వచ్చారా అంటూ స్థానిక టీడీపీ నాయకులను నిలదీశారు. అక్కడి నుంచి లక్ష్మీపాలెం గ్రామానికి వెళ్లిన చంద్రబాబును అక్కడి మత్స్యకార ప్రాంతానికి రావాలని పలువురు గొడవ చేయడంతో వెళ్లారు. అక్కడ మహిళలను చంద్రబాబు వివరాలు అడగ్గా ప్రభుత్వం తమకు రూ.2 వేలు ఇచ్చిందని, ఇప్పటివరకు తమను బాగానే చూసుకుందని చెప్పారు. వరద బాధితులు ఉన్నది ఉన్నట్టు చెపుతుండగా, ఏంచేయాలో పాలుపోని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. అదే నేను పోరాటం చేసిన తరువాత ఇవన్నీ వచ్చాయని చెప్పడం గమనార్హం. ఈ పర్యటనలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడినచోట కాస్త ఎక్కువసేపు ఉన్న చంద్రబాబు... ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినచోట వారి మాటలు వినకుండా వెళ్ళిపోయారు. పైపెచ్చు వరద బాధితులను పరామర్శించడానికి బాబు రాగా... స్థానిక నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. బాధితులను ఆదుకోకుండాగాల్లో తిరుగుతారా... పరామర్శ యాత్రలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకోకుండా గాల్లో తిరిగి వెళ్లిపోతారా? నాడు తండ్రి చనిపోతే సుమారు ఐదేళ్ల పాటు ఓట్ల కోసం ఓదార్పు యాత్ర పేరుతో తిరిగిన జగన్మోహన్రెడ్డికి... నేడు గడప గడపకూ తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాలని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం అందించాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.4 లక్షలు, అరటి తోటకు ఎకరానికి రూ.40 వేలు, తమలపాకుల తోటకు రూ.50 వేలు, వరికి హెక్టారుకు రూ.20 వేలు, ఆక్వా రైతులకు కరెంటు బిల్లు యూనిట్కు రూ.1.50 చేస్తూ హెక్టారుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆవు, గేదెలకు రూ.40 వేలు, పశువుల షెడ్డుకు లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. -
జగనన్న కాలనీలు.. ఆనందాల లోగిళ్లు
పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): పల్లెలు నూతన గృహాలతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి.. జగనన్న కాలనీలు ఊళ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. అర్హులందరికీ ఇప్పటికే స్థలాలు అందించగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ సాయం, అధికారుల ప్రోత్సాహంతో నెల రోజులుగా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో జగనన్న కాలనీలు ఆనందాల లోగిళ్లను తలపిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు మరింత ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణాల ప్రగతి భళా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 27 లేఅవుట్లను ఏర్పాటుచేశారు. మొత్తం 2,193 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,340 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే 760 ఇళ్లు పునాది దశ దాటాయి. మిగిలిన లబ్ధిదారులు కూడా నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పెంటపాడు మండలం 55 శాతం ప్రగతితో జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్ను రాయితీపై ఇస్తోంది. పెంటపాడు మండలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సాయం, మెటీరియల్ ఖర్చు కింద రూ.15,00,79,366 అందిం చినట్టు గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. సదస్సులతో స్ఫూర్తి గ్రామాల్లో అధికారులు, సర్పంచ్లతో అవగాహన సదస్సులు నిర్వహించాం. దీని ద్వారా చాలా మంది పేదలు గృహనిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. వారికి గూడు సమకూరుతోంది. – ఓ.శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ, పెంటపాడు జిల్లాలో రెండో స్థానంలో.. పెంటపాడు మండలంలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాం. అవగాహన సదస్సులతో స్ఫూర్తి పొందిన లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. దీనిద్వారా 55 శాతం ప్రగతి సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచాం. – ఎ.ప్రసాద్, హౌసింగ్ డీఈ ఆన్లైన్ కాగానే బిల్లులు జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి దశల వారీగా ఆన్లైన్ కాగానే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. స్టాక్ పాయింట్ల ద్వారా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మెటీరియల్ అందిస్తున్నాం. – జయరాజు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, పెంటపాడు పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన యల్లా బాలాజీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కాగా సొంతిల్లు కలగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో వారికి గృహం మంజూరు కాగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సీఎం జగన్ దయవల్లే తమకు గూడు సమకూరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన గూడూరి పుణ్యవతి చాలా కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్థలం మంజూరు చేయడంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు అధికారులు ఆమెను ప్రోత్సహించారు. దశల వారీగా బిల్లులు మంజూరు చేయడంతో ఆమె ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగారు. సీఎం జగన్ సంకల్పంతోనే తన సొంతింటి కల సాకారమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక బృందాలు
సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 71,797 మందికి స్థలాల పట్టాలు మంజూరు చేయగా ఇప్పటికే 63,933 ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. వీటి నిర్మాణాల కోసం ప్రభు త్వం రూ.257.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సుమారు 21 వేల మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం చేపట్టిన లబ్ధిదా రులకు ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు మరో రూ.30 వేలు బ్యాంకు రుణంగా అందించే ఏర్పాట్లు చేసింది. పట్టణాల్లో పక్కా ప్రణాళికతో.. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించారు. కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. లబ్ధిదారులు విడివిడిగా గృహ నిర్మాణం చేపడితే మెటీరియల్ రవాణా, కొనుగోలు వంటి వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో పాటు వ్యయప్రయాసలు తప్పవు. ఈ నేపథ్యంలో 30 మంది లబ్ధిదారులను యూనిట్గా విభజించి సచివాలయ ఉద్యోగులు ఆరుగురిని బృందంగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్కు నిర్మాణాన్ని అప్పగిస్తారు. ఇలా ముందుగా పట్టణాల్లో ని ర్మాణాలు చేపట్టి అనంతరం గ్రామాల్లో నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులను సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పర్యవేక్షించేందుకు వీలున్నందున నాణ్యతా ప్రమా ణాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ విధా నం ద్వారా సత్ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. భీమవరంలో 42 బృందాలు భీమవరంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంలో త్వరితగతిన గృహాల నిర్మాణానికి 42 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తున్నాం. ఒక్కో బృందం 30 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాయి. టీమ్ సభ్యులంతా ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ కాంట్రాక్టర్కు పనులు అప్పగించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. గృహ నిర్మాణ ఆవశ్యకత, లబ్ధిదారుల ఇబ్బందులను కాంట్రాక్టర్లకు వివరించి కాంట్రాక్ట్ పద్ధతిన పనులు చేయించేందుకు సన్నద్ధం చేస్తున్నాం. – ఎస్.శివరామకృష్ణ, మునిసిపల్ కమిషనర్, భీమవరం -
గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి డెల్టా ఆధునికీ కరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిర్వహించేలా సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11 నియోజకవర్గాల్లో రూ.163.06 కోట్లతో 95 పనుల కోసం సాంకేతికపరమైన అనుమతులు పొందారు. వచ్చే ఏడాది రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. వీటిలో రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, కాలువల మరమ్మతులు, స్లూయిజ్ గేట్ల మరమ్మతులు వంటి కీలక పనులు ఉన్నాయి. 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి జలాలతో పాటు మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది. ఏటా రబీ సీజన్ ప్రారంభంలో వీటికి వార్షిక మరమ్మతులు చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ క్రమంలో జిల్లాలో సీజన్ ప్రారంభానికి ముందే రూ.22.54 కోట్లతో 180 పనులను ప్రతిపాదించగా 121 పనులకు టెండర్ల ఖరారై వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా వచ్చే రబీ నాటికి శాశ్వత ప్రాతిపదికన గోదావరి డెల్టాలో కీలక పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి సాంకేతికపరమైన, పరిపాలనా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది నెలల్లో టెండర్ల దశకు పనులు చేరుకోనున్నాయి. వీటిలో ప్రధానంగా మేజర్ డ్రెయిన్లలో మరమ్మత్తులు, కొన్నిచోట్ల రిటైనింగ్వాల్ నిర్మాణాలు, స్లూయిజ్ గేట్ల మరమ్మత్తులు, ఎర్త్ వర్క్స్తో పాటు పూడికతీత పనులు ఉన్నాయి. పశ్చిమగోదావరిలో.. ఆచంట నియోజకవర్గంలో రూ.3.68 కోట్లతో 5 పనులు నరసాపురం నియోజకవర్గంలో రూ.28.22 కోట్లతో 2 పనులు పాలకొల్లు నియోజకవర్గంలో రూ.19.01 కోట్లతో 5 పనులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూ.6.41 కోట్లతో 21 పనులు ఉండి నియోజకవర్గంలో రూ.38.25 కోట్లతో 18 పనులు తణుకు నియోజకవర్గంలో రూ.7.49 కోట్లతో 12 పనులు భీమవరం నియోకవర్గంలో రూ.30.14 కోట్లతో 13 పనులు ఏలూరు జిల్లాలో.. దెందులూరు నియోజకవర్గంలో రూ.14.40 కోట్లతో ఒక పని ఉంగుటూరు నియోజకవర్గంలో రూ.8.35 కోట్లతో 3 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. గోపాలపురం నియోజకవర్గంలో రూ.4.71 కోట్లతో 11 పనులు నిడదవోలు నియోజకవర్గంలో రూ.2.37 కోట్లతో 4 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మొండికోడు మేజర్ డ్రెయిన్కు 2.50 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం, భీమవరంలో పశ్చిమ డెల్టా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ పనులు, తణుకులో ఎర్రకోడు మీడియం డ్రెయిన్, ఉండిలో కోరుకొల్లు మైనర్ డ్రెయిన్, ఇతర మరమ్మతులు ఇలా 95 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో పాలకొల్లులో రూ.8.10 కోట్ల వ్యయంతో నక్కల మేజర్ డ్రెయిన్పై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. -
పది పాస్కు ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారిని పరీక్షలకు మరింత సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 13 నుంచి ఫెయిలైన విద్యార్థులకు ఆయా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాక్షి, భీమవరం: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యాబోధన సక్రమంగా సాగకపోవడంతో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ప్రస్తుత విద్యాసంçవత్సరం తరగతులు నిర్వహించిన రోజులు తక్కువ కావడంతో ప్రభుత్వం పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి 57.55 శాతం మాత్రమే పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 47వేల మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో దాదాపు 27 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 31,254 మంది విద్యార్థులకు 13,274 మంది పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9,303 మంది విద్యార్థులు తప్పగా వారిలో ఒక సబ్జెక్ట్ తప్పినవారు 3,226 మంది, రెండు సబ్జెక్టŠట్స్లో తప్పినవారు 2,272 మంది, మూడింటిలో తప్పినవారు 1,856 మంది, నాలుగింటిలో తప్పినవారు 1,079 మంది ఉన్నారు. 602 మంది అయిదు సబ్జెక్ట్స్ లో, 268 మంది అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏఏ సబ్జెక్సŠట్లో తప్పారు అన్న విషయాలను సేకరించి దానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఏ స్కూల్లో ఎన్ని తరగతులు నిర్వహించాలనే అంశాన్ని ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే అప్పగించారు. విద్యార్థులకు సబ్జెక్సŠట్ వారిగా తరగతులు నిర్వహించి ఉత్తీరణ సాధించేలా సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేశారు. కంపార్ట్మెంట్ పాస్గా కాకుండా రెగ్యులర్ పాస్గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతంన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో తరగతుల నిర్వహణ పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలను ప్రత్యేకంగా సన్నద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ఎక్కువ మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జ్క్ట్స్లో ఫెయిల్ అయినందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. తరగతులు ఎలా నిర్వహించాలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే నిర్ణయం. ఫెయిలయిన విద్యార్థులకు సబ్జ్క్ట్ల బట్టి తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసేవరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. – ఆర్వీ రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
మామిడి రైతుకు నిరాశే
నూజివీడు/ చింతలపూడి : ఏటా వేలాది మంది కూలీలకు ఉపాధి, కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మామిడి పరిశ్రమ ఈ ఏడాది రైతులు, వ్యాపారులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడి ఎగుమతుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో దాదాపు 52 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాలు ఉండటం విశేషం. మిగిలిన ఏడు వేల ఎకరాలు చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగులో ఉన్నాయి. దెబ్బతీసిన నల్ల తామర గత రెండేళ్లు కరోనాతో దెబ్బతిన్న రైతులు, ఈ ఏడాది కొత్తగా ఆశించిన నల్లతామర వల్ల దారుణంగా దెబ్బతిన్నారు. సంక్రాంతి తరువాత తోటల్లో పూత ఉద్ధృతంగా వచ్చినప్పటికీ నల్లతామర పురుగు ఆశించడంతో పూత అంతా మాడిపోయి కేవలం కాడలే మిగిలాయి. దీని ప్రభావం దిగుబడిపై çపడింది. సాధారణంతో పోల్చితే సగం కూడా దిగుబడి రాలేదు. అరకొరగా వచ్చిన దిగుబడికి సరైన ధర లభించకపోవడంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. భారీగా తగ్గిన ఎగుమతులు ప్రతి ఏటా ఈ ప్రాంతం నుంచి కోల్కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వేలకొద్ది లారీల్లో నాణ్యమైన మామిడి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు వచ్చినా ఎగుమతులు చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా ఒక్క నూజివీడు ప్రాంతం నుంచే రోజుకు దాదాపు 350 నుంచి 400 లారీల మామిడి ఎగుమతులు జరి గేవి. ఈ ఏడాది ఎగుమతులు రోజుకు 150 లారీలకు పడిపోయాయి. చింతలపూడి ప్రాంతం నుంచి రోజుకు 25 లారీల ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది 10 నుంచి 12 లారీలకు పడిపోయాయి. దీనిని బట్టి దిగుబడులు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. సిండికేట్తో పడిపోయిన ధరలు ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగుంటుందని రైతులు భావించారు. రైతుల ఆశలను ఢిల్లీ వ్యాపారులు ప్రతిఏటా మాదిరిగానే అడియాస చేశారు. వారంతా సిండికేట్ అయ్యి ధరను తమకు కావాల్సిన విధంగా పెంచడం, తగ్గించడం చేస్తూ రైతులతో ఆడుకున్నారు. దీంతో దిగుబడి తక్కువగా ఉన్నా ధర మాత్రం రోజురోజుకూ దారుణంగా పతనమైంది. మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారం, మార్చి తొలి వారంలో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, కలెక్టర్ (తోతాపురి) రకం రూ.90 వేలకు కొనుగోలు చేసిన ఢిల్లీ వ్యాపారులు దిగుబడి పూర్తిస్థాయిలో వచ్చే సమయాల్లో అతి దారుణంగా ధరను పతనం చేశారు. ఆ తరువాత సీజన్ గడుస్తున్న కొద్దీ తగ్గుకుంటూ వచ్చి చివరకు బంగినపల్లి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్యలో నిలబడింది. కలెక్టర్ రకం ధర రూ.11 వేల నుంచి రూ.16 వేల మధ్య నడుస్తోంది. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్ అయ్యారు ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లభించలేదు. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్గా మారి ధర దారుణంగా తగ్గించి కొనుగోలు చేశారు. ప్రారంభంలో ధర బాగున్నప్పటికీ సీజన్ గడుస్తున్న కొద్దీ ధరను తగ్గించేశారు. దీంతో రైతులు నష్టాలపాలయ్యారు. – మూల్పురి నాగవల్లేశ్వరరావు, మామిడి రైతు, నూజివీడు నష్టాలు తప్పువు ఈ ఏడాది మామిడి రైతుకు నష్టాలు తప్పవు. మంగు తెగులు కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే గానీ నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.లక్ష వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగులుతుంది. – చిక్కాల సుధాకర్, మామిడి కమీషన్ వ్యాపారి, చింతలపూడి -
9న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాక
సాక్షి, భీమవరం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి వచ్చేనెల 9న భీమవరం రానున్నారని, ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు జూలై 4న ప్రధాని మోదీ ఇక్కడకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం భీమవరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అధ్యక్షతన జ రిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వపరంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందుకోసం 250 మంది ప్రముఖులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైందన్నారు. స్వాత్రంత్య సమరయోధుల ప్రాంతాల సందర్శనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కృషితో ప్రధాని మోదీ భీమవరం రానున్నారన్నారు. ప్రధాని పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయని, 3 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారన్నారు. బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు అల్లూరి సా యిదుర్గరాజు, నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, మణికంఠ వెంకటేష్ పాల్గొన్నారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!
ఆకివీడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు శనివారం తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు. -
విద్యాసంక్షేమం సఫలం.. దొరబిడ్డల్లా పేద పిల్లలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. విద్యా కానుక, ఇంగ్లిష్ మీడియం చదువులు, నాడు–నేడు, గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021–22లో సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించి ఈ ఏడాది అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వ విద్యారంగంపై సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను కాన్వెంట్లలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా అధికారులు పథకాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున అమ్మఒడి పథకాన్ని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అమలుచేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన నివేదికలను ఉన్న తాధికారులకు పంపించారు. దొరబిడ్డల్లా పేద పిల్లలు ప్రభుత్వం విద్యాకానుక కింద యూనిఫాం, నోట్ పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు, స్కూల్ బ్యాగులు అందిస్తోంది. 2021–22లో మొత్తంగా నోట్ పుస్తకాలు 1,840,218, బెల్టులు, 2,53,530, స్కూల్ బ్యాగులు 3,39,273, బూట్లు 3,36,424, యూనిఫాం 3,42,494, డిక్షనరీలను 3,42,494 విద్యార్థులను అందజేశారు. కార్పొరేట్ హంగులతో.. మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అందమైన బొమ్మలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారు. విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా విద్యార్థుల నమో దు శాతం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అక్షర యజ్ఞం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్షర యజ్ఞం కొనసాగుతోంది. రెండు విడతలు అమ్మఒడి పథకం అమలుచేయగా మూడో విడత ల్యాప్టాప్లు, నగదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు చేపట్టనున్నారు. సర్కారీ బడుల్లో ఉన్నత కుటుంబాల విద్యార్థులు కూడా చేరే రోజు వస్తుంది. – జీజేఏ స్టీవెన్, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా ముందుకు.. విద్యారంగ పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప థకాల అమలుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. అర్హులందరికీ పథకాలు అందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాడు–నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసిన అంశం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.శ్యామ్సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నాడు–నేడు పనులు తొలివిడతలో 1,176 పాఠశాలలను ఎంపిక చేసి రూ.242.70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకూ 1,076 పాఠశాలల్లో రూ.226.48 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రెండో విడతలో 892 పాఠశాలలను ఎంపిక చేసి రూ.292.18 కోట్ల నిధులు కేటాయించారు. -
ఉదయం భగభగలు.. రాత్రి కుండపోత
బుట్టాయగూడెం, ఏలూరు (మెట్రో): పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా.. రాత్రి కుండపోత వానతో సేదదీరారు. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలు ఊరటచెందినా.. మామిడి తదితర పంటలకు భారీ వర్షం నష్టాన్ని మిగిల్చింది. గత నాలుగు రోజులుగా రెండు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోయారు. ఉదయం 11 గంటలకే గ్రామాలు, పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సాయంత్రం 7 గంటల వరకూ కూడా వేడి గాలులు వీయడంతో ఉక్కబోతతో జనం ఇబ్బందులు పడ్డారు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈదురు గాలులు, వర్షంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. కారుమబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు వాన హోరెత్తింది. వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కొద్దిపాటి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. -
మారనున్న ‘పశ్చిమ’ ముఖ చిత్రం
సాక్షి, భీమవరం: భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని విలీనం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ముఖచిత్రం మారనుంది. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరాన్ని ‘పశ్చిమ’లో కలుపుతామని ఇటీవల గణపవరంలో జరిగిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గణపవరానికి భీమవరం అత్యంత సమీపంలో ఉండటంతో ‘పశ్చి మ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు వినతులు సమర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం ఆక్వా సాగులో పేర్గాంచింది. ప్రస్తుతమున్న ఏలూరు జిల్లా కేంద్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ‘పశ్చిమ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. 2,278 చ.కి.మీ విస్తీర్ణంతో.. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, ఆరు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. గణపవరాన్ని విలీనం చేస్తే మండలాల సంఖ్య 20కి పెరుగుతాయి. మరో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి
సాక్షి, పాలకోడేరు (తూర్పుగోదావరి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ టీవీ సత్యనారాయణ పాలకోడేరులో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదివి ఇంటి దగ్గరే ఉంటోంది. వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన నల్లి దిలీప్ డెకరేషన్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలికతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని.. నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ కూడా లైంగిక దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ) -
దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం..
నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో.. బ్రిటీష్ హయంలో లీజుకు తీసుకుని తరతరాలుగా అనుభవిస్తున్న సాగుభూములకు వారికే అప్పగించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నరసాపురం: నరసాపురం మండలం దర్భరేవు కంపెనీ భూములను ప్రస్తుతం అనుభవిస్తున్నవారికే రూ.100 నామమాత్రపు కనీస ధరకు అప్పగించాలని, రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది. 1754 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న 1485 మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. త్వరలో నరసాపురంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఈ పంపిణీ జరుగుతుంది. 1921లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న 1814 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ది అగ్రికల్చర్ సొసైటీ కంపెనీతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి దానికి 1,814 ఎకరాల భూమిని 100 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. మళ్లీ ఓ ఐదేళ్ల తరువాత అదే బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేపట్టి కాలువలు, డ్రెయిన్ల తవ్వడం కోసం 1,814 ఎకరాల్లో 60 ఎకరాలు అవసరమని తీసుకుంది. మిగిలిన 1,754 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా అడవిలా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చాక మన ప్రభుత్వాలు ఈ భూముల జోలికి వెళ్లలేదు. రైతులు కష్టపడి వాటిని సాగుభూములుగా మార్చుకున్నారు. కోట్లు దండుకున్న టీడీపీ ప్రభుత్వం గత టీపీపీ ప్రభుత్వం ఈ భూములపై కన్నేసింది. 2019లో అమలు సాధ్యంకాని జీవో హడావుడిగా తీసుకొచ్చింది. ఎకరాకు రూ.1000 నామమాత్రం ధర తీసుకుని సాగుదారులకు కంపెనీ భూముల పట్టాలిస్తున్నామని మభ్యపెట్టారు. తీరా ఎకరాకు రూ.1000 కాకుండా స్థానిక టీడీపీ నాయకులు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు తాము మోసపోయిన వైనాన్ని మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి, అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో నరసాపురం సబ్కలెక్టర్తో విచారణ చేయించారు. అవకతవకలు జరిగినట్టు అప్పటి సబ్ కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై సీఐడీ విచారణ సాగుతుంది. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేలా ప్రభుత్వ ముదునూరి కృషి చేస్తున్నారు. ఇప్పుడు సాగుదారులగా ఉన్న కొందరి రైతుల చేతుల్లో 10, 12 ఎకరాలు కూడా ఉన్నాయి. నిబంధనల మేరకు రెండున్నర ఎకరాలకు మించి ప్రభుత్వ భూములు పంచడానికి వీలులేదు. భూముల్లో అసలు సాగుదారుల ఎవరు అనే అంశంపై సర్వే చేయించి, భవిష్యత్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులకే భూముల పంపిణీ దర్బరేవు కంపెనీ భూముల సమస్య చెప్పగానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు నిజమైన సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భూములు పంచుతాం. గత ప్రభుత్వంలో ఈ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సాగుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్పై సంతోష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్ కుమార్ అడ్డుకున్నాడు. సంతోష్ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్ పోలీసులు సంతోష్ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (కాలేజీ బస్సు డ్రైవర్తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..) -
AP: ప్రగతి బాటలుగా ప్రధాన రహదారులు
ప్రధాన రహదారులు ప్రగతి బాటలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే రోడ్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు డివిజన్ల పరిధిలో రూ.207.55 కోట్లను కేటాయించగా పనులు ముమ్మరంగా జరిగేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో వందల కోట్లతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 71 పనులకు రూ.207.55 కోట్లు కేటాయించారు. ఏలూరు, కొవ్వూరు, భీమవరం ఆర్అండ్బీ డివిజన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 3,219 కిలోమీటర్ల రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనిలో 44 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లు, 792 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, 2,383 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ రహదారులు ఉన్నాయి. అనుసంధాన రహదారులపై ప్రత్యేక దృష్టి జిల్లా రోడ్లపై ముందుగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం పూర్తిస్థాయిలో నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాలకు అనుసంధానంగా ఉండే జంగారెడ్డిగూడెం–ఏలూరు, చింతలపూడి–ఏలూరు, ఏలూరు–భీమవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, నరసాపురం–భీమవరం, నిడదవోలు–కొవ్వూరు ఇలా ప్రతి పట్టణానికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ౖMðకలూరు, భీమవరంలో రోడ్ల పనులు పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్డీబీ నిధులతో.. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల ద్వారా ఫేజ్–1లో 11 రోడ్ల పరిధిలో 74 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్–2లో 13 రోడ్ల పరిధిలో 108 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. సీఆర్ఐఎఫ్ పథకం ద్వారా 29 కిలోమీటర్ల మేర 3 రోడ్ల పనులను చేయనున్నారు. రాష్ట్ర రహదారులపై గోతులు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హై లెవిల్ బ్రిడ్జిలకు నిధులు ఉమ్మడి జిల్లాలో రూ.29.50 కోట్లతో 3 హైలెవిల్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వంతెనల మరమ్మతులకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. ఏలూరు డివిజన్ పరిధిలో రూ.9 కోట్లతో 5 పనులను పూర్తిచేయగా.. రూ.76 కోట్లతో 21 పనులు జరుగుతున్నాయి. కొవ్వూరు డివిజన్ రూ.5.41 కోట్లతో 3 పనులను పూర్తిచేయగా.. రూ.74.43 కోట్లతో 21 పనులు పలు దశల్లో ఉన్నాయి. రూ.11 లక్షలతో ఐదు రో డ్లు పూర్తిచేయగా.. రూ.30 లక్షలతో 15 పనులు పలు దశల్లో ఉన్నాయి. -
కొత్తగా భీమవరం పోలీస్ సబ్డివిజన్
నరసాపురం: జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు శాఖలో మార్పులు జరుగనున్నాయి. కొత్తగా భీమవరం పోలీస్ సబ్డివిజన్ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లాలో ఇప్పటికే ఉన్న నరసాపురం పోలీస్ సబ్డివిజన్తో పాటు భీమవరం సబ్ డివిజన్ ఏర్పాటుకానుంది. దీంతో పోలీసు శాఖలో పాలనపరమైన ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ రెవెన్యూ మండలంలోని గ్రామం మరో మండలంలోని పోలీస్స్టేషన్ పరిధిలో ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొ త్తగా పోలీస్ సబ్డివిజన్ ఏర్పాటు చేయనుండటంతో స్టేషన్ల పరిధిని సవరించే ఆలోచన ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పక్క మండలం స్టేషన్ పరిధిలో.. మండలంలోని ఓ గ్రామంలో సమస్య వస్తే పక్క మండలంలోని పోలీస్స్టేషన్కు వెళ్లాల్సిన పరిస్థితి నరసాపురం సబ్డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఉంది. ముఖ్యంగా నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్ ప్రాంతాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఇబ్బందులతో సిబ్బంది సతమతమవుతు న్నారు. ప్రజలూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నరసాపురం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో మత్స్య పురి, తుందుర్రు గ్రామాలు ఉన్నాయి. ఇవి రెండు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు గ్రామం భీమవరం రూరల్, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలాలకు చెందినవి. నరసాపురం రూరల్ మండలంలోని ఎల్బీచర్ల, పస లదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు మొగల్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. భీమవరం రూరల్ మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉంది. తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. పాలకొల్లు రూరల్ మండలంలోని అడవిపాలెం గ్రామం పోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉంది. సబ్డివిజన్ ఎలా ఉండవచ్చంటే.. ప్రస్తుతం నరసాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 19 పోలీస్స్టేషన్లు, ఆరు సర్కిళ్లు ఉన్నాయి. నరసాపురం పట్టణం, నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం–1 టౌన్, భీమవరం–2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్స్టేషన్లు పనిచేస్తున్నాయి. భీమవరం పోలీసు సబ్ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేస్తే సగం మండలాలు అటు, సగం మండలాలు ఇటు మారవచ్చు. భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాల విలీనం జరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇబ్బందులు లేకుండా నిర్ణయం గతంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓ మండలంలో ఊరు, మరో మండల పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం నరసాపురం డివిజన్లో చాలాచోట్ల ఉంది. పోలీసుల విధుల నిర్వహణలో ఇది పెద్ద ఇబ్బంది. కొత్తగా భీమవరం పోలీసు సబ్డివిజన్ ఏర్పాటు సమయంలో ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవచ్చు. – వి.వీరాంజనేయరెడ్డి, నరసాపురం డీఎస్పీ నరసాపురం రెవెన్యూ డివిజన్ నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం మండలాలు భీమవరం రెవెన్యూ డివిజన్ భీమవరం, వీరవాసరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి మండలాలు -
రహదారుల అభివృద్ధిలో ముందడుగు
రహదారులకు మహర్దశ పట్టింది.. జాతీయ రహదారుల నిర్మాణంతో కొత్త జిల్లాల రూపురేఖలు మారనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా రాష్ట్రంలో హైవేల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.1,490 కోట్లు విడుదల చేసింది. ఎన్హెచ్–216, ఎన్హెచ్–165 విస్తరణ పనులు జరుగనున్నాయి. నరసాపురం: కోనసీమ, కోస్తా ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని కూడా నిర్ణయించారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న వశిష్ట వారధి డిమాండ్ ఇన్నాళ్లకు తీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వ యంగా రంగంలోకి దిగి జాతీయ రహదారుల కో సం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన సంప్ర దింపులు సత్ఫలితాలను ఇచ్చాయి. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కు రూ.1,490 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్త జిల్లాలో నాలుగు లైన్ల రహదారు లు అందుబాటులోకి రా నున్నాయి. దశాబ్దాల కల సాకారం కాకినాడ జిల్లాలోని కత్తిపూడి నుంచి ఒంగోలుకు వెళ్లే 216 జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా కోనసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ బైపాస్ ని ర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూ.490 కోట్ల నిధులు కేటాయించింది. కోనసీమ జిల్లాలోని దిండి నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర సాపురం మండలంలోని సీతారాంపురం వరకు బై పాస్ను నిర్మించనున్నారు. దీంతో జిల్లావాసులు ఎదురుచూస్తున్న నరసాపురంలో వశిష్ట గోదావరిపై వారధి నిర్మాణం కల సాకారం కానుంది. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో స్థల సేకరణ పూర్తిచేసింది. ఫలించిన ప్రయత్నం : ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు జిల్లాలో హైవేల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ఎన్హెచ్ 216కు బైపాస్, ఎన్హెచ్ 165 నాలుగు లైన్ల విస్తరణ విషయాలపై సీఎం ద్వారా కేంద్ర మంత్రికి లేఖ ఇప్పించారు. రూపురేఖలు మారనున్నాయి సీఎం వైఎస్ జగన్ కృషితోనే నిధులు మంజూర య్యాయి. కొత్త జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1,490 కోట్లను కేంద్రం కేటాయించడం రికార్డు. ఇంత పెద్ద స్థాయిలో నిధుల కేటాయింపు ఎన్నడూ లేదు. వశిష్ట వంతెన నిర్మాణం కూడా పూర్తవుతుంది. రానున్న ఐదేళ్లలో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. నరసాపురం, భీమవరం నుంచి విజయవాడకు ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్విప్ పనులు ఇలా.. ఎన్హెచ్ 216 బైపాస్ రూ. 490 కోట్లు కోనసీమ జిల్లా దిండి నుంచి మలికిపురం, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలోని రాజుల్లంక నుంచి సీతారాంపురం వరకు ఎన్హెచ్ 165 1,000 కోట్లు పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా జాతీయ రహదారి విస్తరణ నాలుగు లైన్లుగా విస్తరణ జాతీయరహదారి 165 పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకు 107 కిలోమీటర్ల మేర ఉంది. దిగమర్రు నుంచి ఆకివీడు వరకు నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశారు. ఆకివీడు నుంచి పామర్రు వరకు నాలుగు లైన్ల పనులు ఏడాది క్రితమే ప్రారంభమయ్యాయి. ఎన్హెచ్–165ను దిగమర్రు జంక్షన్ నుంచి ఎన్హెచ్–216కి అనుసంధానం చేస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. తాజాగా విధులైన నిధులతో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు పనులు మొదలు కానున్నాయి. ఈ నిర్మాణంతో భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. -
భీమవరానికి వాకీటాకీలు
వాకీటాకీ.. ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో విధినిర్వహణలో ఉపయోగిస్తున్న సాధనం. సమాచారం వేగంగా ఎక్కువమందికి అందించడానికి, సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది. ఇదే విధానాన్ని భీమవరం మున్సిపాలిటీలో కూడా అమలులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో సిబ్బందికి త్వరలో వాకీటాకీలు అందుబాటులోకి రానున్నాయి. పాలన పరంగా, మౌలిక వసతులైన తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఇతర ఏ సమస్య ఉన్నా వేగంగా అధికారులు, సిబ్బంది స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా వీటిని వినియోగించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీకి 80 వాకీటాకీల కోసం రూ.25 లక్షల నిధుల మంజూరు కోసం ప్రతిపాదించారు. మే మొదటి వారంలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని కమిషనర్ చెబుతున్నారు. ఎలా ఉపయోగపడతాయంటే.. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 46 సచివాలయాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్కటి చొప్పున వాకీటాకీలు అందిస్తారు. ఆయా వార్డుల పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు సచివాలయ సిబ్బందికి గాని, అధికారులకు నేరుగా గాని తెలియజేసినప్పుడు ఆ సమస్య సత్వర పరిష్కారం కోసం సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు వాకీటాకీలను ఉపయోగిస్తారు. ఏదైనా అగ్నిప్రమాదం, తుపానులు, వరదల సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించాల్సిన సమయాల్లో ఉన్నతాధికారులకు వాకీటాకీ ద్వారా సచివాలయ సిబ్బంది సమాచారం తెలియజేసి సాయం అందేలా చేయడానికి వీటిని వినియోగిస్తారు. తద్వారా ఉన్నతాధికారులు సత్వర ఆదేశాలు జారీ చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. మున్సిపల్ కమిషనర్, సెక్షన్ ముఖ్య అధికారులు ప్రతిరోజూ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో వారిని అప్రమత్తం చేయడానికి, పాలన పరంగా సేవలు వేగవంతం చేయడానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సమాచారం అందరికీ ఒకేసారి చేరడం ఇందులో ప్రధాన సౌలభ్యం. సచివాలయాల్లో విధుల్లో ఉండే ఇమ్యూనిటీ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, ఇతర సిబ్బంది వీటిని వినియోగించేందుకు అవకాశముంటుంది. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వద్ద కూడా వాకీటాకీలు ఉండటం వల్ల సమస్య వెంటనే వారి దృష్టికి వెళుతుంది. జిల్లాలో మొట్టమొదటిగా.. వాకీటాకీల వ్యవస్థ నూతన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం మున్సిపాలిటీ తొలిసారిగా వినియోగించనుంది. 20 ఏళ్ల క్రితం ఇదే మున్సిపాలిటీ వాకీటాకీలను ఉపయోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం, సిబ్బంది పుష్కలంగా అందుబాటులో ఉండటంతో వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. భీమవరం పట్టణంలో అత్యంత ఎత్తులో ఉండే బీఎస్ఎన్ఎల్ లేదా ప్రైవేట్ టవర్లకు అనుసంధానం చేసి నిరంతరం సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా వాకీటాకీలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. మే మొదటి వారంలోనే.. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సూచన మేరకు మున్సిపాలిటీలో సమస్యల సత్వర పరిష్కారం కోసం వాకీటాకీలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. వీటికోసం ప్రతిపాదనలు పంపించాం. మే మొదటివారంలోనే వాకీటాకీలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.శివరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్, భీమవరం -
కులాసా.. మత్స్యకార భరోసా
ఆటుపోటుల జీవితం.. సముద్రంలో వేటకు వెళితేగాని పూట గడవని బతుకు సమరం.. వారి జీవితాల్లో మార్పులు వచ్చాయి.. పథకాలు ముంగిటకు వచ్చి చేరుతున్నాయి.. వేట విరామ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసా వారికి కొండంత అండగా నిలుస్తోంది. గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వే చేసింది. వచ్చే నెలలో అర్హుల ఖాతాల్లోకి సొమ్ములను జమచేయనుంది. నరసాపురం : చేపల పునరుత్పత్తి సీజన్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తుంది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15వ తేదీ వరకు 61 రోజులపాటు మత్స్యకారులు ఖాళీగా ఉంటారు. ఈ సమయంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటారు. పడవలు, వలలు మరమ్మతులు చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మత్స్యకార భరో సా పథకాన్ని ప్రవేశపెట్టి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో ఉన్న అర్హుల సంఖ్యను పెంచుతూ మరింత మందికి చేయూతగా నిలుస్తోంది. జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీరం ఉండగా నరసాపురం ప్రాంతంలో దాదాపు 2 వేల మంది వేటపై ఆధారపడి బతుకుతున్నారు. పాదయాత్ర హామీ మేరకు.. పాదయాత్ర చేసిన సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురం వేదికగా వేట నిషేధ సా యా న్ని రూ.10 వేలకు పెంచుతానని ప్రకటించారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో మ త్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. అప్పటికి 173 మంది మాత్రమే అర్హులు ఉండగా ఆ సంఖ్యను 1,072కు పెంచి సాయం అందించారు. అలాగే 2020, 2021లో పథకాన్ని సమర్థవంతంగా అమలుచేశారు. ఈ ఏడాది కూడా పథకానికి అర్హులను గుర్తించారు. గతంలో సాయం నామమాత్రంగా ఉండగా ఈ ప్రభుత్వంలో వేలాది మందికి కోట్లాది రూపాయల లబ్ధి చేకూరుతోంది. గతంలో ముప్పుతిప్పలు గతంలో వేట నిషేధ సాయం కోసం మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. నిషేధం ము గిసి వేట ప్రారంభమైన ఐదారు నెలల తర్వాత కొద్దిమందికి మాత్రమే అరకొరగా సాయం అందించేవారు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ, బడా నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. 2014కు ముందు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.600, కేంద్ర ప్రభు త్వం రూ.600 కలిపి రూ.1,200 అందించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఎగ్గొట్టారు. 2015లో 52 మందికి రూ.1.04 లక్షలు, 2016లో 46 మందికి 0.92 లక్షలు, 2017లో 104 మందికి రూ.4.16 లక్షలు, 2018లో 173 మందికి రూ.6.92 లక్షలు మా త్రమే నామమాత్రంగా అందించారు. జగన్ వచ్చాకే డబ్బులు వస్తున్నాయి మాకు ఏ పథకాలు ఉన్నాయో తెలిసేది కాదు. వేట విరామ సమయంలో రూపాయి వచ్చేది కాదు. జగన్ ముఖ్య మంత్రి అయిన తర్వాత మూడేళ్ల నుంచి వేట విరామ సమయంలో రూ.10 వేల చొప్పున మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ ఏడాది కూడా నాపేరు ఎంపిక చేశారు. వేట లేని సమయంలో ఇదే మాకు ఆధారం. – పెమ్మాడి గంటయ్య, మత్స్యకారుడు, నరసాపురం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి నుంచి వేట తప్ప మరేమీ తెలియదు. ఏటా వేసవిలో రెండు నెలలు వేట ఉండదు. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు అలాకాదు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నారు. అదీ నా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఆనందంగా ఉంది. – మైలా రాముడు, పీఎం లంక, మత్స్యకారుడు సర్వే పూర్తయ్యింది నరసాపురం తీరంలో మాత్రమే మత్స్యకార భరోసా లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలో 141 ఇంజిన్ బోట్లు ఉన్నాయి. వీటిపై పనిచేసే మత్స్యకార్మికులు 1,454 మందిని గుర్తించాం. వీరందరికీ మత్స్యకార భరోసా పథకానికి ఎంపిక చేశాం. ఈ మేరకు సర్వే పూర్తయ్యింది. వచ్చేనెలలో వీరందరికీ సొమ్ములు పడతాయి. – వి.ఏడుకొండలు, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
పశువిజ్ఞాన బడితో పాడి సిరులు
బుట్టాయగూడెం: అన్నదాతల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధిపై కూడా దృష్టి సారించింది. రైతుల ముంగిటకు సేవలందించేందుకు ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించేలా ఏర్పాటు చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాల్లోనే పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిద్వారా పశు పోషణ, మెలకువలపై పశువైద్య సహాయకులు, గోపాల మిత్రలు రైతులకు పూర్తి అవగాహన కల్గిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి తమకు ఎంతగానో ఉపయోగ పడుతుందని పాడి రైతులు ఆనంద పడుతున్నారు. ఏలూరు జిల్లాలో 537 కేంద్రాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 911 రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు విజ్ఞాన బడి కార్యక్రమం అమలు జరిగేలా అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతీ గ్రామ సచివాలయ పరిధిలో పాడి రైతులకు సలహాలు, పలు సూచనలు ఇచ్చేందుకు 373 మంది పశువైద్య సహాయకులు, 187 మంది గోపాల మిత్రల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని 28 మండలాల పరిధిలో ఉన్న 537 రైతు భరోసా కేంద్రాల్లో పశు విజ్ఞాన బడి కార్యక్రమం విజయవంతంగా అమలు జరిగేలా అధికారులు కృషి చేస్తున్నారు. పాడి పశువుల పెంపకంపై అవగాహన : ఆర్బీకేల్లో అమలు చేస్తున్న పశు విజ్ఞాన బడి కార్యక్రమం ద్వారా పాడి రైతులకు పాడి పెంపకంపై మెలకువలు, యాజమాన్య పద్ధతులు, పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగిస్తున్నారు. పశువుల్లో వచ్చే వ్యాధులైన గొంతువాపు, జబ్బ వాపు, సంచుల వ్యాధి, గొర్రెలు, మేకలకు వచ్చే ఇటిక వ్యాధి గురించి అవగాహన కలిగిస్తున్నారు. జీవాలకు టీకాలు వేసే సమయం తదితర అన్ని వివరాలను పశువైద్య సహాయకులు వివరిస్తున్నారు. దగ్గర ఉండి పశువులకు టీకాలు వేయిస్తున్నారు. పశువుల కృత్రిమ గర్భధారణ గురించి పాడి రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. పాడి రైతులకు రుణ సదుపాయం భవిష్యత్లో కిసాన్కార్డుల ద్వారా రైతులకు ఏ విధంగా రుణాలు ఇస్తారో అదేవిధంగా పాడి పెంపకం చేపట్టే రైతులకు కూడా కిసాన్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు కూడా పాడి రైతులకు అందిస్తున్నారు. ఇంతవరకూ ఏలూరు జిల్లాకు సంబంధించి 537 కేంద్రాల పరిధిలో 2142 మంది పాడి రైతులకు 705 టన్నుల దాణాను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 3725 మంది రైతులకు 58.4 టన్నుల పశుగ్రాస విత్తనాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసా కేంద్రంలో విజ్ఞాన బడి ఆర్బీకేల్లోనూ పశు రైతుల కోసం పశు విజ్ఞాన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. మేకల పెంపకం, గొర్రెలు, పోషకాలకు సంబంధించిన మెలకు వలు, పశువులకు వచ్చే వ్యాధుల నివారణ చర్యలను రైతులకు వివరిస్తున్నాం. – జి.నెహ్రూబాబు, పశు సంవర్ధక శాఖ జేడీ, ఏలూరు పశు విజ్ఞాన బడితో ప్రయోజనం రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పశువులకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తున్నారు. దీంతో సకా లంలో వైద్యం చేయించగలుగుతున్నాం. అలాగే పశు సంపద అభివృద్ధిపై మెలుకువలు కూడా చెబుతున్నారు. – కె.భూమయ్య, రైతు, బూరుగువాడ, బుట్టాయగూడెం మండలం పాడి రైతులకు ఎంతో మేలు రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పశు విజ్ఞాన బడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ పనులకే కాకుండా పాడి సంపదపై అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్బీకేల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే దాణాలు, మందులు, గడ్డి కోసే యంత్రాలు, పాలు పితికే యంత్రాలు మొదలైన వాటిని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. – డాక్టర్ ఎం.సాయి బుచ్చారావు, అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), జీలుగుమిల్లి -
పర్యాటకం..ప్రగతి పరుగు!
సహజసిద్ధ ప్రకృతి ప్రాంతాలు, ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలతో అలరారుతున్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది. జీవ వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతం విదేశీ, స్వదేశీ పక్షులకు స్వర్గధామంగా మారింది. కొల్లేరు సరస్సు పెలికాన్, పెయింటెడ్ స్ట్రాక్ వంటి 189 రకాల పక్షులకు ఆవాసంగా ఉంది. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలో బోటు షికారు చేస్తూ వేలాది పక్షుల కేరింతలను ఆస్వాదించవచ్చు. ఏలూరు మండలం మాధవాపురం పక్షుల కేంద్రాన్ని అటవీశాఖ నూతనంగా అభివృద్ధి పరచింది. రిజం సర్కిల్గా కొల్లేరు కొల్లేరులో వృక్షజాలం, జంతుజాలం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆస్ట్రేలియా, సైబీరియా, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి ప్రతి ఏటా వలస పక్షులు విచ్చేస్తాయి. వీటిలో ప్రధానమైనది పెలికాన్ పక్షి. దీని పేరుతో ఆటపాక పక్షుల కేంద్రానికి పెలికాన్ ప్యారడైజ్గా నామకరణం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం మీదుగా ఏలూరు జిల్లా చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి కొల్లేరు సర్కారు కాల్వపై పెద్దింట్లమ్మ వారధి నిర్మాణం పూర్తి కానుంది. రానున్న రోజుల్లో కొల్లేరును టూరిజం సర్కిల్గా ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా మారుతుంది. త్వరలో పూర్తికానున్న పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే అవకాశముంది. పశ్చిమగోదావరి జిల్లాలో కొలువైన పేరుపాలెం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రాంతం కావడం గమనార్హం. ప్రఖ్యాతఆధ్యాత్మిక క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలతో పాటు ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొలువై ఉన్నాయి. యాత్రికులకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఏలూరు జిల్లాలో ద్వారకాతిరుమల గొప్ప దర్శనీయ స్థలంగా పేరుగడించింది. అమ్మవార్ల విషయంలో భీమవరం మావుళ్లమ్మ, కొల్లేటికోట పెద్దింట్లమ్మలను భక్తులు కొంగుబంగారంగా కొలుస్తున్నారు. ఇక పంచారామాల్లో రెండు క్షేత్రాలు భీమవరం, పాలకొల్లులోనే కొలువై ఉన్నాయి. భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయం, పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనీయ స్థలాల్లో ముఖ్యమైనవి. జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి, గోకుల తిరుమల పారిజాత క్షేత్రం, ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థానం ప్రసిద్ధి చెందిన దర్శినీయ స్థలాలుగా చెప్పుకోవచ్చు. వీటన్నింటికి బస్సు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సందర్శనంలో భాగంగా ఆ ప్రాంతానికి ప్రయాణం భక్తులకు ఆహ్లాదకరంగానూ సాగుతుంది. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో కొలువైన శోభనాచలస్వామి ఆలయం వేల సంవత్సరాలుగా భక్తుల తాకిడితో అలరారుతోంది. ప్రకృతి రమణీయత, ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రాలకు నెలవైన ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యాటకం పరుగులు తీయనుంది. కృష్ణాజిల్లా నుంచి ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో చూడచక్కని ప్రదేశాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కొల్లేరు ప్రాంతం, ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలు, ప్రఖ్యాత దేవస్థానాలైన ద్వారకాతిరుమల, పెద్దింట్లమ్మ ఆలయం, భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలో కొలువైన పంచారామ క్షేత్రాలు, పేరుపాలెం బీచ్, ఏలూరు జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతం, పోలవరం ప్రాజెక్టు, ఆగిరిపల్లిలోని సోభనాచల స్వామి ఆలయం ఇలా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు అనేకం. పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెడితే టూరిజం స్పాట్గా ఈ ప్రాంతాలు మంచి ఆదాయ వనరులుగా మారే అవకాశముంది. – కైకలూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలు కొల్లేరు ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ముఖ్యంగా పక్షుల విహార కేంద్రాల వద్ద ఎకో టూరిజం అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశాం. యాత్రికుల నుంచి టిక్కెట్ల రూపంలో వచ్చిన నగదుతో పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఏలూరు జిల్లాలో కొల్లేరు ప్రాంతాలన్నీ విలీనం కావడంతో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. ఆటపాక, మాధవాపురం పక్షుల కేంద్రాలను అభివృద్ధి చేశాం. – ఎస్వీవీ కుమార్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఏలూరు -
ఉపాధి హామీలో రికార్డు
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వం ముందు చూపుతో లక్ష్యాలకు మించి పనులను కల్పించి ఉపాధి హామీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో జిల్లాలో అత్యధిక పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేశారు. 170.63 లక్షల పనిదినాలు కల్పన లక్ష్యం కాగా 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. మొత్తంగా రూ.653.79 కోట్లు ఖర్చు చేయగా కూలీలకు వేతనాలుగా రూ.365.89 కోట్లు అందించారు. మెటీరియల్ చెల్లింపుల కోసం రూ.287.90 కోట్లను వెచ్చించారు. 15 ఏళ్ల ఉపాధి హామీ చరిత్రలో ఇది ఆల్టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్వేవ్ సమయంలో పేదలకు ఉపాధి హామీ పథకం బాసటగా నిలిచింది. 1.50 కోట్ల పనిదినాల లక్ష్యం : 2022–23లోనూ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని అధికారులు ప్రణాళికలు రచించారు. వేసవితో పాటు ఏడాది పొడవునా పనులు చూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 1.50 కోట్ల పనిదినాలు కల్పించడం ద్వారా కూలీలకు వేతనాలుగా రూ.320 కోట్ల వరకూ అందించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి హమీ నిధులతో చేపట్టారు. ఆయా పనులు వివిధ పనుల్లో ఉన్నాయి. దీంతోపాటు కొత్తగా పనులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరోనా వంటి విపత్కర సమయం లోనూ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. లక్ష్యానికి మించి.. 2021–22లో ఉపాధి హామీలో లక్ష్యానికి మించి పనులు కల్పించడంతో పాటు అత్యధికంగా కూలీలకు వేతనాలు చెల్లించారు. ఉమ్మడి జిల్లాలో 5.70 లక్షల కుటుంబాలకు చెందిన 9.99 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 171.14 లక్షల పనిదినాలు కల్పించారు. 27,619 కుటుంబాలకు వంద రోజుల పనులు కల్పించారు. సగటున రోజుకు రూ.220.49 వేతనంగా అందించారు. అభివృద్ధికి బాటలు : ఉపాధి హామీ పథకంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం, జగనన్న లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి నిధులు వెచ్చిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జగనన్న లేఅవుట్లలో రూ.124 కోట్లతో 1,318 పనులు పూర్తి చేశారు. మొక్కలు, తోటల పెంపకానికీ నిధులు అందించారు. ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్లో భాగంగా 118 ప్రభుత్వ సంస్థల్లో 7,231 మొక్కలు నాటారు. 1,090 జలసంరక్షణ పనులు పూర్తి చేశారు. అడిగిన అందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. 2022–23లోనూ లక్ష్యానికి మించి పనులు చేపట్టేలా కృషిచేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరిధిలో పనులనూ సత్వరం పూర్తి చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
కల్పవల్లి.. రాట్నాలమ్మ తల్లి
సిరుల తల్లిగా.. కల్పవల్లిగా.. భక్తుల కొంగుబంగారంగా.. కోర్కెలు తీర్చే అమ్మవారిగా పూజలందుకుంటున్నారు రాట్నాలమ్మవారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో అమ్మవారు రక్షణనిచ్చే శక్తిగా ప్రసిద్ధిగాంచారు. ఐదో శతాబ్ధంలో వేంగి రాజ్యాన్ని శత్రువుల బారినుంచి అమ్మవారు కంటికి రెప్పలా కాపాడారని శాసనాలు వెల్లడిస్తున్నాయి. శనివారం నుంచి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పెదవేగి: ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తులు తమ బిడ్డలకు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనం, అక్షరాభ్యాసాలు చేయి స్తుంటారు. పాలుపొంగలి వండి నైవేధ్యం పెట్టి మొ క్కుబడి తీర్చుకుని తలనీలాలు ఇవ్వడం ఆచారం. రైతులు తమ పొలంలో పండిన పంటను కొంత భాగం అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఇంటికి తీసుకువెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వ స్తోంది. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఆలయాన్ని సిద్ధం చేశామని దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ చళ్లగొళ్ల వెంకటేశ్వరరావు, ఈఓ కలగర శ్రీనివాస్, కమిటీ సభ్యులు తెలిపారు. మహిమాన్వితం మహిమాన్విత దివ్యక్షేత్రంగా రాట్నాలమ్మ ఆలయం విరాజిల్లుతోంది. వేంగి రాజుల కాలంలో రాజ్యాన్ని కాపాడే శక్తిగా అమ్మవారు అవతరించారు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో అమృత కలశంతో పులి వాహనంపై వెలిశారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి, చదుర్భుజ దుర్గాదేవి, షడ్భుజ దుర్గాదేవి, సుబ్రహ్మణ్యస్వామి, సప్తమాత్రుకలు, వైదేహీ సూర్య ఉషాదేవి మొదలగు పరివార దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఐదు రోజుల ఉత్సవాలు తొలిరోజు అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు. వేకువజామున 4.09 గంటలకు ప్రత్యేక పూజలతో తిరునాళ్లు ప్రారంభమవుతాయి. 17న అమ్మవారు మహాలక్ష్మిదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18న అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు పుష్పయాగోత్సవం. 19న అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం. 20న ఫల అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయం 10 గంటల నుంచి అన్నసమారాధన ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు దీక్షా విరమణ, అవభృదోత్సవం, కుంభాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. -
అర్హులందరికీ పథకాల వర్తింపే లక్ష్యం
నరసాపురం రూరల్: అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు వలంటీర్లు కీలకమని చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. లిఖితపూడిలో శుక్రవారం వలంటీర్ల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీడీఓ ఎన్వీ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తోందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం విశిష్ట సేవలందించిన వలంటీర్లు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. సేవా దృక్పథంతో సమర్థవంతంగా సేవలందిస్తున్నారన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఐదుగురు సేవా వజ్రా, 15 మంది సేవారత్న, 960 మంది సేవామిత్ర పురస్కారాలను అందుకున్నారన్నారు. అవినీతికి తావు లేకుండా పథకాలను అందించడంలో వలంటీర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం మండలంలోని గొంది, చిట్టవరం, పాతనవరసపురం, కొత్తనవరసపురం, సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక, కొప్పర్రు, కే.బేతపూడి, సీతారాంపురం నార్త్, సీతారాంపురంసౌత్, రాజుగారితోట తదితర గ్రామాలకు చెందిన వలంటీర్లకు ఆయన పురస్కారాలు అందజేశారు. మార్కెట్యార్డు చైర్మన్ కొల్లాబత్తుల రవికుమార్, బొక్కా రాధాకృష్ణ, ఉంగరాల రమేష్, దొంగ మురళీకృష్ణ, పోతురాజు చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
‘వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు’
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకు చేర్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థ తెచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వలంటీర్లకు సేవారత్న, మిత్ర, వజ్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హాజరైన కారుమూరి.. మీడియాతో మాట్లాడారు. పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకే చేర్చేలా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మావాళ్ళకే చేయండి.. మావాళ్లనే చూడండి అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు భేదం లేకుండా సంక్షేమం అందరికీ అందాలని చెప్పారు. మండపాక గ్రామంలో టీడీపీ హయాంలో కోటి 8 లక్షల రూపాయిలు మాత్రమే ఖర్చు చేశారు.మండపాక గ్రామంలో వై యస్ ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల 81 లక్షల రూపాయిలు ఖర్చు చేశాము. రెండున్నర ఏళ్లలో మేము రూ. 7,109 కోట్ల తణుకు మండలానికి ఖర్చు చేశాము. 346 ఎకరాలు సేకరించి 18 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. దేశంలోని ముఖ్యమంత్రులు మన పాలనవైపు చూస్తున్నారు. 70 శాతం బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పించారు’ అని కారుమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, జేసీ మురళీ, శెట్టి బలిజ కార్పోరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం
దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్విప్గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్విప్ చాంబర్లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్ గూడపాటి పవన్కుమార్ ఉన్నారు. చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం -
ఆ గోల్డ్.. మహా బోల్డ్
నరసాపురం (పశ్చిమ గోదావరి): వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్.. రూపాయి కాసంత కట్ ఉంగరం.. స్వర్ణ కంకణం సైజులో గాజులు.. నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు.. విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు.. అందాలు చిందే అర వంకీలు.. తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం.. నడుముకు వడ్డాణం.. కాళ్లకు పట్టీలు.. వీటిలోనూ వందల రకాలు. బంగారు ఆభరణాల తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిపోనివిధంగా అధునాతన డిజైన్లలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ ఆభరణాలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. గీటు పెడితేనే గాని అవి గోల్డో, రోల్డ్ గోల్డో కనుక్కోలేని విధంగా వీటిని తయారు చేస్తున్నారు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా వీటిదే హవా. పేద, ధనిక భేదం లేకుండా మహిళలంతా వీటినే ధరిస్తున్నారు. బంగారాన్ని తలదన్నేలా.. బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వ్యాపారం పైపైకి ఎగబాకుతోంది. బంగారం ధర బరువెక్కిన పరిస్థితుల్లో అది ధనికులకు పెట్టుబడి వ్యవహారంగా మారిపోయింది. ఇంకోవైపు నగలు ఇంట్లో పెట్టుకున్నా.. ధరించి వీధిలో తిరిగినా దొంగల భయం. దీంతో మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో సైతం రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ధరిస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సంపన్న వర్గాలకు చెందిన మహిళలు సైతం ఫంక్షన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు ధరించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతులను సైతం ఇమిటేషన్ జ్యూవెలరీ విశేషంగా ఆకర్షిస్తోంది. వారి అభిరుచులకు తగ్గట్టుగా వందలాది డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా రాగిని ఉపయోగించి వివిధ లోహాల మిశ్రమంతో వీటిని తయారు చేస్తున్నారు. పైన బంగారం పూత పూయడంతో ఈ నగలకు పసిడి వన్నెలు వస్తున్నాయి. ఇలా తయారుచేసిన ఆభరణాలకు క్వాలిటీని బట్టి ఏడాది నుంచి ఐదేళ్ల వరకూ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. మెరుపు తగ్గినప్పుడు పూతవేస్తే తిరిగి అవి కొత్త వాటిలా తళతళలాడుతున్నాయి. అందుబాటులో ధరలు రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు మార్కెట్లో వివిధ క్వాలిటీలలో లభిస్తున్నాయి. సాధారణంగా ధరించే చెవి పోగులు, బుట్ట దుద్దులు, తాళ్లు లాంటివి రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. చెయిన్లు, గాజులు, రాళ్ల గాజులు రూ.300 నుంచి రూ.1,500 వరకు ఉన్నాయి. వడ్డాణాలు, ముత్యాల నెక్లెస్లు, ముత్యాల హారాలు లాంటివి నాణ్యతను బట్టి రూ.10 వేల వరకు ధరలు ఉన్నాయి. రంగంలోకి బడా కంపెనీలు కొంతకాలం క్రితం వరకు కృష్ణా జిల్లా చిలకలపూడిలో తయారయ్యే రోల్డ్ గోల్డ్ వస్తువులు మార్కెట్కు విరివిగా వచ్చేవి. రోల్డ్ గోల్డ్ కొత్త ట్రెండ్ సంతరించుకోవడంతో బడా కంపెనీలు రోల్డ్ గోల్డ్ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం రోల్డ్ గోల్డ్ నగలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ముంబై, సూరత్, అమృత్సర్, ఆగ్రా, చెన్నై ప్రాంతాల్లో యంత్రాలపై తయారుచేసిన ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. డిమాండ్ అంతా.. ఇంతా కాదు బంగారు ఆభరణమైతే అవసరానికి సొమ్ము చేసుకోవచ్చు. కానీ రోల్డ్ గోల్డ్ వస్తువులపై పెట్టిన సొమ్ము వృథా. అయినా ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న మొత్తమే కాబట్టి వృథా అయినా ఫర్వాలేదన్న ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. బంగారు ఆభరణాలకు మించి రోల్డ్ గోల్డ్ ఆభరణాల అమ్మకాలు సాగుతుండటం విశేషం. కొత్తగా ఏర్పడిన పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ విక్రయించే దుకాణాలు 700 వరకు ఉన్నాయి. ఇళ్లల్లో సైతం చిన్నపాటి షాపులు నిర్వహిస్తూ మహిళలు వీటి అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో సీజన్లో అయితే రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు బంగారు ఆభరణాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇమిటేషన్ జ్యూవెలరీ అమ్మకాలు రోజుకు రూ.40 లక్షల వరకు సాగుతున్నట్టు అంచనా. ఒకప్పుడు పట్టణానికి ఒకటి, రెండు రోల్డ్ గోల్డ్ షాపులు ఉండేవి. ప్రస్తుతం ప్రతి పట్టణంలో 20 నుంచి 30 వరకు షాపులు ఉన్నాయి. గ్రామాలకే వెళ్లి వన్ గ్రాము వస్తువులు తీసుకెళ్లి విక్రయించేవారు సైతం పెరిగారు. రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్ అరకాసు బంగారం కొనాలంటే వేలకు వేలు పెట్టాలి. మాకు నచ్చిన డిజైన్లలో రోల్డ్ గోల్డ్ వస్తువులు దొరుకుతున్నాయి. బంగారం కంటే ఎక్కువ డిజైన్లు వీటిలో లభిస్తున్నాయి. వాటిని ధరిస్తే రోల్డ్ గోల్డ్ అన్న ఆలోచనే రాదు. ప్రస్తుత తరుణంలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలే బెటర్. – అద్దేపల్లి రాధిక, గృహిణి బంగారు కంటే మిన్నగా.. ఇదివరకు రోల్డ్ గోల్డ్ వస్తువులు వేసుకుంటే అవి బంగారం కాదని చాలా ఈజీగా తెలిసిపోయేది. పెద్దగా నాణ్యత ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. రోల్డ్ గోల్డ్ వస్తువులు బంగారం వస్తువుల కంటే బాగుంటున్నాయి. రూ.5 వేలు పెట్టి రోల్డ్ గోల్డ్ వస్తువు కొని పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది. అదే వస్తువు బంగారంతో చేయించాలంటే రూ.5 లక్షలకు పైనే పెట్టాలి. ఇదే బెటర్ కదా. – కె.సత్యవాణి, గృహిణి అమ్మకాలు బాగా పెరిగాయి రోల్డ్ గోల్డ్ వస్తువుల అమ్మకాలు బాగా పెరిగాయి. మా షాపులకు మధ్య తరగతివారే కాకుండా సంపన్న వర్గాలు వారు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మంచి మంచి డిజైన్లలో వస్తువులు దొరుకుతున్నాయి. చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతాం. – శిరం చంటి, రోల్డ్ గోల్డ్ షాపు యజమాని, నరసాపురం -
మంగళగిరిలో చోరీ.. ఏలూరు వద్ద అస్వస్థత.. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి మృతి
సాక్షి, ఏలూరు: గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్సీసీ రోడ్డు ప్రాంతానికి చెందిన నరేంద్ర (22) అనే చోరీ కేసు నిందితుడు గురువారం ఏలూరులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నరేంద్ర ఇటీవల మంగళగిరి షరాఫ్ బజార్లో గల తన బంగారు దుకాణానికి వచ్చి రూ.19 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడని షాపు యజమాని కొల్లి గిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైజాగ్లో పట్టుబడ్డ నిందితుడు! నిందితుడు నరేంద్ర విశాఖపట్నంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు బాధితుడు, అతనికి సన్నిహితంగా ఉండే రాజకీయ నేతలతో కలసి అక్కడికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ నరేంద్రను అదుపులోకి తీసుకుని తిరిగి తీసుకువస్తుండగా, ఏలూరు వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. దీంతో వారు వెంటనే అతన్ని ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని ధృవీకరించారు. ఆస్పత్రి వైద్యులు ఏలూరు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మృతదేహం హాస్పిటల్ మార్చురీలో ఉంది. ఏలూరు ఆర్డీవో ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిట్సా.. గుండె నొప్పా? గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో నిందితుడు నరేంద్రకు ఫిట్స్ వచ్చాయని, అనంతరం గుండెనొప్పితో మృతిచెందాడని నరేంద్ర తల్లిదండ్రులు వి.కూర్మయ్య, లక్ష్మీనారాయణలకు పోలీసులు సమాచారమిచ్చారు. వెంటనే ఏలూరుకు చేరుకున్న మృతుని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తమ కుమారుడి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. తమ కుమారుడికి ఫిట్స్ కానీ, ఎలాంటి అనారోగ్యం గానీ లేవని ఈ సందర్భంగా వారు చెబుతున్నారు. తమ కుమారుడి వద్ద విశాఖపట్నంలోనే బంగారం స్వాధీనం చేసుకున్నారని, ఏలూరు వచ్చేసరికి తమ కుమారుడికి ఏమి జరిగిందో చెప్పాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని రాజీ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
మరో వ్యక్తితో భార్య చనువు, వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా..
సాక్షి, పశ్చిమగోదావరి: భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడం భరించలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏలూరు టూటౌన్ సీఐ డీవీ రమణ నిందితుల్ని అరెస్టు చేశారు. సీఐ వివరాలు వెల్లడిస్తూ.. ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ 1వ రోడ్డు ప్రాంతానికి చెందిన పెరుమాళ్ళ సంతోష్(30)కు రామకుమారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సంతోష్ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రామకుమారి పీ.రూపగోవింద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త సంతోష్ భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా భర్త ఇంట్లో ఉండగానే గోవింద్తో చనువుగా ఉండేది. ఈ క్రమంలో గత నెల మార్చి 29న భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సరికి రామకుమారి గోవిందుతో ఏకాంతంగా ఉండటాన్ని గుర్తించాడు. నిందితుల్ని అరెస్టు చేసిన టూటౌన్ సీఐ రమణ దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్.. తన మరణానికి భార్య, ప్రియుడు గోవిందు కారణమని తల్లిదండ్రులకు చెప్పి, అదేరోజు సాయంత్రం ఇంటివద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామకుమారి, గోవింద్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: యువకుడితో భార్య టిక్టాక్.. సహించలేకపోయిన భర్త.. చివరికి.. -
ఇది ‘టీల్’ గుంపు.. రెక్కలు విప్పి రెపరెపలాడుతూ
రెక్కలు విప్పి రెపరెపలాడుతూ ఆకాశమే హద్దుగా ఎగురుతున్నాయి విదేశీ విహంగాలు. సిలువ బాతుగా పిలిచే నలుపు రంగులో ఉండే టీల్ పక్షులు ఇలా గుంపులుగా విహరిస్తూ కనువిందు చేశాయి. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే దారిలో కొల్లేరు వద్ద కనిపించిన దృశ్యమిది. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు(ప.గో.జిల్లా) -
పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం అవిష్కృతమయ్యింది. స్పిల్ వేలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. గత సీజన్లో వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన 6 గేట్ల అమరిక పనులు సైతం పూర్తి చేశారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. త్వరలోనే మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
కట్టినోళ్ల కష్టం గుర్తుండేలా!
సాక్షి, అమరావతి: తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్లు ఎవరికీ తెలియదు. కానీ.. తన కలల సౌధాన్ని నిర్మించిన శ్రామికుల వివరాలన్నీ ఆ యజమానికి తెలుసు. వారి పేర్లు పది కాలాలపాటు పదిలంగా ఉండేలా శిలాఫలకంపై చెక్కించాడు ఆ అపార్ట్మెంట్ యజమాని కొత్తపల్లి మురళీమోహనరావు (అబ్బులు). ఆయన విలక్షణ శైలి గురించి తెలిసినోళ్లంతా ‘వావ్.. సమ్థింగ్ స్పెషల్ అబ్బులు’ అంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో 2012లో నిర్మించిన ఐదంతస్తుల ‘అలిపిరి అపార్ట్స్’లోకి వెళ్లగానే సెల్లార్లో నిలువెత్తు శిలాఫలకం కనిపిస్తుంది. అందులో ఆ భవన నిర్మాణం కోసం శ్రమించిన తాపీమేస్త్రి, ప్లంబర్, కరెంటు వర్కర్, పెయింటర్, ఐరన్ మేస్త్రి, టైల్స్ మేస్త్రి, వాచ్మేన్ పేర్లు, వారి ఊరు, ఫోన్ నంబర్లు ఆ శిలాఫలకంపై దర్శనమిస్తాయి. ఆ అపార్ట్మెంట్ గృహప్రవేశం జరిగి ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యింది. శ్రామికుల పేర్లతో అమర్చిన శిలాఫలకాన్ని చూసిన ప్రతి ఒక్కరు అబ్బురపడుతున్నారు. శ్రామికులకు గుర్తించిన అబ్బులును అభినందిస్తున్నారు. వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతికి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి 2004 ఎన్నికల్లో గెలిస్తే తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కుకున్న అబ్బులు అప్పట్లోనే మొక్కు చెల్లించుకున్నారు. తణుకు నుంచి పాదయాత్ర చేపట్టి ద్వారకా తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి తిరుమల తిరుపతి వెళ్లారు. 15 రోజుల పాదయాత్ర చేసి 2004 ఆగస్టు 5న తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. దారి పొడవునా జోలెపట్టి ప్రజల నుంచి సేకరించిన రూ.32 వేల విరాళంలో రూ.16 వేలు తిరుపతి వెంకటేశ్వరుడి హుండీలోను, మరో రూ.16 వేలు తణుకులోని నాలుగు ఆలయాల్లోను సమర్పించి దేవుడిపైన, ఇటు వైఎస్పైన తన భక్తిని చాటుకున్నాడు. శ్రామికుల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకం పురాతన నాణేల సేకరణ అబ్బులుకు పురాతన నాణేలు సేకరించే మరో హాబీ కూడా ఉంది. కాలక్రమంలో కనుమరుగైన అనేక నాణేలను ఆయన సేకరించి భద్రపరిచారు. కాణీలు, అణాలు, పైసలు వంటివి సేకరించడం గమనార్హం. సంతృప్తినిచ్చే పనులు చేస్తాను విలక్షణంగా ఆలోచించి అమలు చేయడం సంతృప్తినిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రముఖుల పేర్లతో శిలాఫలకాలు వేస్తారు. అలాకాకుండా శ్రామికుల పేర్లు శిలాఫలకంపై వేస్తే వారికెంతో సంతృప్తిగా ఉంటుంది. అందుకే నా భవన నిర్మాణంలో శ్రమించిన వారి పేర్లతో శిలాఫలకం వేయించాను. అది చూసి వారి ముఖంలో అప్పట్లో కనిపించిన ఆనందం.. పదేళ్లయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. నాకు వైఎస్ అంటే చాలా ఇష్టం. 2004లో వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతి వెళ్లాను. కనుమరుగవుతున్న పురాతన నాణేలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో వాటి సేకరణను హాబీగా పెట్టుకున్నాను. – కొత్తపల్లి మురళీ మోహనరావు (అబ్బులు), తణుకు -
ఎట్టకేలకు గరికపాటి క్షమాపణ
భీమవరం(ప్రకాశం చౌక్): తన వ్యాఖ్యలతో స్వర్ణకారులు బాధపడుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెబుతున్నానని ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రవచనాలు చేయడానికి విచ్చేసిన ఆయన స్థానిక హోటల్లో బస చేశారు. తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ భీమవరానికి చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. దీంతో స్వర్ణకారుల సంఘం నుంచి పలువురు నాయకులు అలాగే కొందరు పెద్దల సమక్షంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2006 సంవత్సరంలో ఓ చానల్లో హాస్యం అనే కార్యక్రమంలో స్వర్ణకారుల గురించి తాను వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈ సందర్భంగా బయటకు వచ్చి బహిరంగంగా కూడా స్వర్ణకారులకు ఆయన క్షమాపణ చెప్పారు. -
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు
హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసులను ఏపీలోని ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఏడేళ్లుగా హైకోర్టులో అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ వివాదాలు కొనసాగుతుండగా, వాటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, హైకోర్టులోనే విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్ల, బ్యాంకుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లను కూడా ఏలూరు కోర్టుకే బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని ఏలూరు కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం ఏలూరు కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు పేర్కొంది. -
ప్రియుడితో వాగ్వాదం.. యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, కళ్యాణదుర్గం: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ అమ్మాయి జిల్లాకు చెందిన ఓ అబ్బాయితో ఫేస్బుక్ ద్వారా ప్రేమలో పడింది. వీరి వ్యవహారాన్ని ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణ సీఐ తేజమూర్తి తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన సుజినకు ఏడాది క్రితం కణేకల్లు మండలం పూలచెర్లకు చెందిన నగేష్తో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ కొంతకాలం కల్లూరులోని ఓ సెల్ షో రూంలో పనిచేశారు. కొన్ని రోజులకే ఇద్దరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సుజిన గురువారం ప్రియుడికి ఫోన్ చేసి తాను వస్తున్నట్లు చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన ఆమె వెంటనే తన సెల్ ద్వారా రాయదుర్గం పోలీసులకు ఫోన్ చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన వారు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కళ్యాణదుర్గంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. చదవండి: (ఫేస్బుక్ ప్రేమ.. ఇంటి నుంచి వెళ్లిపోయి..) కళ్యాణదుర్గం పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసు సిబ్బంది బాధితురాలు ఉన్న చోటుకు వెళ్లేలోపే అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే వారు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. విషయాన్ని ప్రియుడు నగేష్, అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అమ్మాయిని వారికి అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ప్రేమ వివాహం: తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకులో సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం రేపింది. పట్టణానికి చెందిన కొల్లి వెంకటేష్ (26) ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్మ చేసుకున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతని భార్య లక్ష్మి తులసి కూడా ఆత్మహత్య చేసుకొంది. వెంకటేష్, లక్ష్మి తులసిది ప్రేమ వివాహం. ఇద్దరు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నావంటూ ఇరుగుపొరుగు వారు తన భార్యను వేధించినట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైతం స్పందించలేదని ఆరోపించాడు. ఈ వివాదాలతో పాటు తనకు రూ.7 లక్షలు అప్పు కూడా ఉన్నట్లు వెంకటేష్ సూసైడ్ నోట్లో వివరించాడు. చదవండి: (శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. భార్య, అత్తను కిరాతకంగా..) -
అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు.. మద్యం తాగి అర్ధనగ్నంగా
West Godavari: పోలసానిపల్లిలోని ఓ తోటలో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఘటనా స్థలంలో మద్యం తాగి అర్ధనగ్నంగా ఉన్న ముగ్గురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక కారు, ఆరు సెల్ఫోన్లు, ఐదు మోటార్సైకిళ్లు, సౌండ్ సిస్టమ్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పంగిడిగూడెం పంచాయతీ సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం, నల్లజర్ల, రాజమండ్రిలకు చెందిన కొంత మంది యువకులు తమ బైక్లపై పొలసానిపల్లిలోని ఓ తోటలోకి రాత్రి చేరుకోగా, మరో కారులో ముగ్గురు యువతులు వచ్చారు. మద్యం మత్తులో ఐటెంసాంగ్స్తో అర్ధనగ్నంగా ఉన్న యువతులతో అరుపులు, కేకలతో యువకులు చిందులేశారు. దీంతో ఆ ప్రాంతం హోరెత్తింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) స్థానికుల సమాచారంతో ఎస్సై వీఎస్వీ భద్రరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతులు, యువకులు చిందులేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి అచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలకు తిలోదకాలిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు. -
ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పశ్చిమ గోదావరి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంబేడ్కర్ మిషన్ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న రఘురామ నిజాయితీపరుడైన అధికారిని దూషించడాన్ని ఖండించారు. -
ఏలూరు : ఉత్సాహంగా ఎడ్ల బండ్ల పోటీలు
-
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..1880 నుంచి అమ్మవారికి పూజలు
భీమవరం: మావుళ్లమ్మ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు.. గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో.. చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎంతో మహిమ గల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపారం రాణిస్తామనేది నమ్మకం. భీమవరం ప్రాంత ప్రజలకు తమ పనిలో రాణించాలంటే అమ్మవారి ఆ«శీస్సులు ఉండాలని ఎంతగానే విశ్వసిస్తారు. అనేక మంది తమ వ్యాపారాలకు అమ్మవారి పేరు పెట్టుకుని విజయవంతంగా సాగిపోతున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నుంచి పెళ్లి శుభలేఖ అమ్మవారి పాదాల వద్ద పెట్టే వరకు అన్నింటికీ అమ్మవారి దయ ఉండాల్సిందే. దేశంలో మన తెలుగువారున్న ప్రాంతానికి ఎక్కడికి వెళ్లినా భీమవరం అంటే మావుళ్లమ్మ అమ్మవారు వెలిసిన పట్ణణమని గుర్తుచేసుకుంటారు. ఏటా 33 రోజుల పాటు వార్షికోత్సవాలు మావుళ్లమ్మకు ఏడాదంతా జాతర్లు, ఉత్సవాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు, ఉగాది, ఆషాడ మాస పూజలు, సారెలు, వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంతా సందడే సందడి.. సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాల్ని సుమారు 33 రోజలు పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అత్యంత వైభవంగా జ్యేష్ట మాసం జాతర నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో పట్ణణంలోని ప్రతి చోట అమ్మవారి జాతరను ప్రజలు నిర్వహించుకుంటారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దేవస్థానంలో చండీహోమం జరుపుతారు. ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి మా«లధారణ దీక్ష తీసుకుంటారు. దసరా, వార్షికోత్సవ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ దేవతామూర్తుల అలంకరణలో దర్శనమిస్తారు. 50 కిలోల ఆభరణాలతో అలంకరణ మావుళ్లమ్మ నిలువెత్తు స్వర్ణమయానికి దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 8 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగారం సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 63 కిలోలు సేకరించారు. అందులో సుమారు 50 కిలోల బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించి అలంకరించారు. మరో 13 కిలోల బంగారంతో అభరణాల తయారీకి సిద్ధంగా ఉన్నారు. భక్తులు, దాతలు తమ స్తోమతను బట్టి 2 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు బంగారాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఇక అమ్మవారికి భక్తులు చీరలు, జాకెట్ ముక్కలు మొక్కుగా చెల్లించుకుంటారు. భక్తులు సమర్పించిన చీరలు, జాకెట్ ముక్కలను దేవస్థానం వేలం పాట నిర్వహిస్తుంది. మహిళలు వీటిని వేలంలో దక్కించుకుంటారు. ఈ వేలం ద్వారా దేవస్థానానికి లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. దూరప్రాంత భక్తుల కోసం నిత్యాన్నదానం అమ్మవారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సుమారు 13 ఏళ్ల క్రితం అమ్మవారి సన్నిధిలో శాశ్వత నిత్యాన్నదానం ప్రారంభించారు. సాధారణ రోజుల్లో సుమారు 200 మందికి.. ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, పండుగల రోజుల్లో సుమారు 300 మంది వరకు అన్నదానం చేస్తారు. దాతలు అన్నదానానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు లడ్డు, పులిహోర ప్రసాదంగా విక్రయిస్తారు. మావుళ్లమ్మ అమ్మవారికి సుమారు 9 ఎకరాల సాగు భూమి ఉంది. ఆలయం ఎదురుగా రూ.కోట్ల విలువ చేసే స్థలంతో పాటు ఉండి రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్సు భవనం ఉంది. అమ్మవారి దేవస్థానం ట్రస్టీ బోర్డు 9 మంది ధర్మకర్తలతో నడుస్తోంది. ఒకరు చైర్మన్గా, 8 మంది ధర్మకర్తలుగా సుమారు రెండేళ్లు పాటు అమ్మవారి సేవలో ఉంటారు. 1880లో తొలిసారి పూజలు మావుళ్లమ్మ వెలిసిన ప్రాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారు 1200 ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసినట్లు చెబుతారు. 1880 సంవత్సరంలో ఇక్కడ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ప్రారంభించారు. పట్టణంలో ఉన్న మోటుపల్లి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవనం ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట మావుళ్లమ్మ వెలిశారని చరిత్ర చెబుతుంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక మామిళ్ళు అమ్మగా.. అనంతరం మావుళ్లమ్మగా పేరు వచ్చిందని చెబుతారు. 1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన మారెళ్ళ మాచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంటారు. అమ్మవారి విగ్రహానికి ఎండ తగలకుండా పూరిపాక వేసి పూజలు చేసేవారు. అనంతరం మాచిరాజు, అప్పన్నలు ప్రస్తుత ఆదివారం బజార్ ప్రాతంలో అమ్మవారికి ఆలయం నిర్మించారు. 1910 ప్రాంతంలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యలు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు. అమ్మవారు ప్రళయ భీకర స్వరూపిణిగా కనిపించేవారు. దాంతో గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. తొలి నుంచి మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి భీమరాజు వంశస్తులు అమ్మవారి పుట్టింటి వారిగా, గ్రంధి అప్పన్న మొదలైన వారి పూర్వీకులు అత్తింటివారిగా జ్యేష్ట మాస జాతర ఉత్సవాలలో పాల్గొంటారు. అమ్మవారి దర్శనానికి ప్రముఖుల క్యూ మావుళ్లమ్మ అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు తరలివస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల సమయంలో పలువురు ప్రముఖులకు సన్మానాలు చేస్తుంటారు. -
ఐదేళ్ల చిన్నారిని ముద్దాడుతూ.. సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి..
సాక్షి, పశ్చిమగోదావరి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనలో బాలికను ఏలూరు తరలించి వైద్యం చేయించారు. చిన్నారి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి శనివారం డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం చిన్నారి ఇంటి వద్ద కోలుకుంటోంది. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఘటన వివరాలు ఎస్సై ఎం.సాగర్బాబు వెల్లడించారు. డాంగేనగర్కు చెందిన ఐదేళ్ల చిన్నారిని కాకి శ్రీకాంత్ అనే యువకుడు ముద్దాడుతూ సమీపంలోని చెట్లలోకి తీసుకువెళ్లి శుక్రవారం అత్యాచారం చేశాడు. బాలికను తీసుకెళ్లటం ఆమె బంధువు ఒకామె చూసింది. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లి వెతుకుతుండగా, ఆమెకు శ్రీకాంత్ తీసుకెళ్లినట్లు ఆ బంధువు చెప్పింది. సాయంత్రం చిన్నారి ఇంటికి వచ్చిన తరువాత బాధపడటాన్ని తల్లి గమనించింది. దీంతో వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమాచారాన్ని పోలీసులకు తెలుపగా ఎస్సై ఆసుపత్రికి వెళ్లి బాలికకు చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. చదవండి: ఐదేళ్ల ప్రేమ.. గుట్టల్లో వరలక్ష్మి మృతదేహం.. మాకు దిక్కెవరు బిడ్డా! -
వివాహితతో యువకుడి చాటింగ్.. చివరికి ఇద్దరూ కూడా..
సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరు పవరుపేట స్టేషన్లో ఇద్దరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి రైలుపట్టాలపై విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు వీరిని ఢీకొంది. ఏలూరు కొత్తపేట ఏటిగట్టు ప్రాంతానికి చెందిన సత్యవాడ అరుణకుమారి (37), కిషోర్కుమార్ దంపతులు. కిషోర్కుమార్ పెయింటర్. రాజమహేంద్రవరం తొర్రీడుకు చెందిన సువ్వాడ హేమవినయ్ (27) ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. కిషోర్కుమార్కు వినయ్ పిన్ని కుమారుడు. 20 రోజులుగా అతను అరుణకుమారితో సెల్లో చాటింగ్ చేస్తున్నాడు. ఆమె వద్దని వారించినా చనిపోతానంటూ బెదిరించటంతో ఆమె కూడా చాటింగ్ చేసింది. ఇదే విషయాన్ని భర్త కిషోర్కుమార్కు చెప్పగా వినయ్ తల్లిదండ్రులకు కొడుకును అదుపులో పెట్టుకోవాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వివాదం సాగుతోంది. రెండు రోజుల క్రితం వినయ్ తల్లిదండ్రులు అతన్ని గట్టిగా హెచ్చరించారు. దీంతో వినయ్ ఈ నెల 4న ఏలూరు వచ్చి అరుణకుమారికి విషయం చెప్పాడు. ఆమె కూడా ఈ వ్యవహారంతో కుటుంబంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని మనస్తాపానికి గురైంది. తనువు చాలించాలని నిర్ణయించుకుని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, కుమారుడు నితిన్ను ఇంజనీరింగ్ పూర్తి చేయించాలని ఉత్తరం రాసి మంగళవారం రాత్రి ఇల్లు విడిచి వెళ్లింది. అరుణకుమారి, వినయ్ రైలుకింద పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. -
అయ్యో పాపం.. ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో..!
సాక్షి, నల్లజర్ల (పశ్చిమగోదావరి): ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ పెరిగిందో తెలియదు. మన ఊరు, భాష కాదు. సుమారు 25 – 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓ గుర్తు తెలియని యువతి దూబచర్ల శివారులో ఉన్న బైపాస్ రహదారి అండర్ పాస్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. వంటిపై దుస్తులు కూడా సక్రమంగా లేవు. హిందీ, ఇంగ్లిష్లో ధారాళంగా మాట్లాడుతోంది. ఉన్నత చదువులు చదివినట్లు కనిపిస్తున్నా మతిస్థిమితం లేదు. ఎవరైనా కొట్టారో, ఎక్కడైనా పడిపోయిందో తెలియదు. కానీ కాళ్లకు దెబ్బలు ఉన్నాయి. మంగళవారం అటుగా వెళ్తున్న విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ డేవిడ్, మరో వ్యక్తి ఉండ్రాజవరం వెంకటేశ్వరావు ఆమె స్ధితిని గమనించి దుస్తులు తెచ్చి ఇచ్చారు. కాళ్ల గాయాలకు మందు రాశారు. ఆహారం పెట్టారు. ఆమె వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా, పోలీసుల ద్వారా ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో చేర్చుతామని చెబుతున్నారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. చదవండి: (దివ్యాంగ బాలికపై అత్యాచారం) -
ఆకట్టుకున్న ఆప్కో ఫ్యాషన్ షో
సాక్షి, అమరావతి: నూతన ఒరవడికి ఆప్కో శ్రీకారం చుట్టింది. సరికొత్త డిజైన్లతో కూడిన చేనేత వస్త్రశ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. విజయవాడ ఆప్కో మెగా షోరూమ్లో ఆదివారం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. సంక్రాంతి సంబరాలను ముందుగానే ఆప్కో ఆవిష్కరించింది. చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి తదితర ప్రాంతాలకు చెందిన వందలాది డిజైన్ల వ్రస్తాలతో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. చేనేత వ్రస్తాలంటే వయోజనులు, వృద్ధులకే అన్న నానుడిని తుడిచివేస్తూ ర్యాంప్ వాక్ సాగింది. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, ఎండీ చదలవాడ నాగరాణి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన అన్నిరకాల చేనేత వ్రస్తాలను ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు. మోడల్స్తో పాటు చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడే యువతులు సైతం స్వచ్ఛందంగా ర్యాంప్ వాక్లో పాల్గొన్నారు. కండువాల నుంచి పంచెలు, చీరల వరకు మంగళగిరి ఫైన్ కాటన్, ఉప్పాడ పట్టు, జాంథానీ బుటా, అంగర సీకో కాటన్, పెడన కాటన్, పోలవరం, ఐదుగుళ్లపల్లి, వేంకటగిరి కాటన్, సిల్క్ చీరలు, మాధవరం కాటన్, చీరాల, కుప్పడం, ధర్మవరం సిల్క్ చీరలు, పావడాలు, మంగళగిరి, చీరాల డ్రెస్ మెటీరియల్స్, పెద్దాపురం సిల్క్ పంచెలు, షర్టింగ్స్, కండువాలు, భట్టిప్రోలు కాటన్ పంచెలు, మంగళగిరి, చెరుకుపల్లి, చీరాల కాటన్ షర్టింగ్స్, పొందూరు ఖాదీ పంచెలు, కండువాలు, రెడీమేడ్ షర్టింగ్స్, లేడీస్ టాప్స్ను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో ఆప్కో అధికారులు పాల్గొన్నారు. ఏలూరు రోడ్లో ఆప్కో మెగా షోరూం హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఫ్యాషన్ షో దృశ్యాలు -
సంక్రాంతి బరిలో తగ్గేదేలే...
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్), ద్వారకాతిరుమల: సంక్రాంతి బరికి సై అంటూ పందెంకోళ్లు కాలు దువ్వుతున్నా యి. పండుగ దగ్గర పడుతున్న కొద్దీ సమరోత్సాహంతో కదం తొక్కు తున్నాయి. ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో నిరంతర సాధనతో రాటుదేలుతూ ఈ సంక్రాంతికి నువ్వా నేనా అన్న రీతిలో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా పందెం కొట్టాలన్న కసితో పందెంరాయుళ్లు కూడా పందెం నీదా.. నాదా అంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. పందెంకోళ్ల వైభోగం చూసి ఒకపక్క జనం నోరెళ్లబెడుతుంటే.. మరోవైపు వాటి యజమానులు మాత్రం మురిసిపోతున్నారు. పందేల్లో పైచేయి కోసం తహతహలాడిపోతున్నారు. కోడి పందేలంటేనే గోదావరి జిల్లాలు.. ఇక భీమవరం, మెట్ట ప్రాంతాల్లో పండుగ మూడు రోజులు పందెం బరులు తిరునాళ్లను తలపిస్తాయి. భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తారు. కోడి పందేలను వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, దేశ విదేశాల నుంచి ఎన్నారైలు గోదావరి జిల్లాలకు తరలివస్తారు. పందేల్లో డబ్బు సంపాదించాలని కొందరు, తమ సత్తా చాటాలని మరికొందరు పుంజులను బరుల్లోకి దింపుతారు. ఈ ఏడాది కూడా పందేలు భారీ ఎత్తున నిర్వహించేందుకు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, గణపవరం, వీరవాసరం, ఐ.భీమవరం, ద్వారకాతిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, ఉంగుటూరు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పండుగకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడాది ముందు నుంచే కసరత్తులు ఎలాగైనా పందెం కొట్టాలనే లక్ష్యంతో సరైన పుంజును బరిలోకి దింపేందుకు పందెంరాయుళ్లు వాటి శిక్షణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. పుంజును పోటీలకు సిద్ధం చేసేందుకు దాదాపు ఏడాది ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పందెం కోళ్ల శిక్షణ, పోషణకు యజమానులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ముందుగా వాటి గొంతులో నీటిని పోసి, కపం పోయేలా కళ్లి కొట్టడం, నోట్లో నీరు పోసి ఊదడం, ఒంట్లో కొవ్వు కరిగించేందుకు పొయ్యిపై అట్లపెనం పెట్టి, దానిపై నీరు చల్లి, ఆ నీటిని గుడ్డతో కోడి శరీరానికి రాయడం వంటివి చేస్తారు. కత్తిపోట్లు తట్టుకోవడానికి, ఒళ్లు గట్టిపడడానికి పసుపు, పిప్పళ్లు, వట్టివేర్లు, ఉక్కిసాయిలం, జామాయిల్ సీస, కుంకుళ్లు తదితర 20 రకాల ఆకులతో మరగబెట్టిన నీటిని పోత పోస్తున్నారు. నీటిలో ఈదించడం, వాకింగ్ చేయించడం వంటివి చేస్తారు. పుంజు బరిలో దిగినప్పుడు ఆవేశ పడకుండా ఢీకొట్టేందుకు ఈత కొట్టిస్తామని యజమానులు చెబుతున్నారు. రూ. 15 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర జిల్లాలో ఏటా సంక్రాంతికి పందెం పుంజుల అమ్మకాలపై సుమారు రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. పుంజు ధర సుమారు రూ.15 వేల నుంచి సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. నెమలి, కాకి నెమలి, పచ్చకాకి, సేతువ, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగి, మైలా, ఫింగలా, పెట్టమర్రు తదితర రకాల పుంజులు ఉన్నాయి. గత మూడేళ్లుగా పెరూవియన్ జాతిని అభివృద్ధి చేస్తున్నారు. పెరూ దేశానికి చెందిన ఈ జాతి పుంజులు అమిత వేగంతో దెబ్బలాడతాయి. అవి చిన్నగా ఉండటం వల్ల స్వదేశీ కోళ్లతో సంకరం చేసి, వాటి ద్వారా వచ్చిన సెకండ్, థర్డ్ జనరేషన్ బ్రీడ్లను ప్రస్తుతం పందాలకు సిద్ధం చేస్తున్నారు. బలానికి డ్రై ఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా బలం కోసం బాదం, పిస్తా, డ్రైఫ్రూట్ లడ్డూ, మటన్ కైమా, కోడిగుడ్లు పెడుతున్నారు. ఆహారంగా సోళ్లు, గంట్లు, మెరికలు అందిస్తున్నారు. పుంజును తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్ మాత్రలు అందిస్తారు. పుంజు సామర్థ్యం తెలుసుకునేందుకు తరుచూ ట్రయల్ పందాలు వేస్తారు. పుంజులపై భారీగా పెట్టుబడులు పెట్టి సంక్రాంతి పండుగకు రాబట్టుకోవాలని కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు శ్రమిస్తున్నారు. పందానికి పుంజును సిద్ధం చేసేందుకు సుమారు ఏడాది పాటు పెంచుతారు. ఒక్కొక్క పుంజుపై రూ.10 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేస్తున్నారు. ముందుగా పుంజుల పెంపకం కోసం స్థలం లీజుకు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో శిబిరంలో 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. వారి స్థాయిని బట్టి పుంజుల పెంపకం కోసం ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. -
ఆహారం మిగిలిందా.. మాకివ్వండి
తణుకు అర్బన్(పశ్చిమగోదావరి): శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పాహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నాయి తణుకుకు చెందిన ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఎ మీల్ రిఫ్రిజరేటర్స్ కేంద్రాలు. పేదల ఆకలిని తీర్చేందుకు తణుకు ప్రభుత్వ ఆస్పత్రి ముఖద్వారంలో, తణుకు సొసైటీ రోడ్డులోని బాలగంగాధర తిలక్ ఆడిటోరియం ప్రాంతంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే.. ఏ ఒక్కరూ కూడా ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో తణుకులో ఏర్పాటుచేసిన రెండు కేంద్రాలు ఇప్పుడు అన్నపూర్ణలుగా మారాయి. ఫీడ్ ద నీడ్ – గిఫ్ట్ ఏ మీల్ రిఫ్రిజరేటర్లను ఈనెల 21న ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు పేదలకు ఆహారాన్ని అందించడంలో సేవలందిస్తున్నాయి. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వా తాతలు, దివ్యాంగుల, అనాథల కడుపులు నింపుతున్నాయి. ఈ కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లోను ముగ్గురు ,చొప్పున ఆరుగురు విధుల్లో ఉండి పేదలకు ఆహారాన్ని అందించేలా రూపకల్పన చేశారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్ల్లో భద్రపరచడం, ఆహారం కోసం వచ్చే పేదలకు ఆహారాన్ని అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గృహాలు, శుభకార్యాల్లో మిగిలిన ఆహారం గృహాలు, శుభకార్యాల్లోను మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా ఔదార్యం ఉన్న మహానుభావులు ఈ కేంద్రాలకు తరలిస్తే వాటిని ఫ్రిజ్లలో ఉంచి పేదలకు అందించే విధంగా ఏర్పాటుచేశారు. మానవత్వం, సామా జిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రాలకు అందచేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి, పట్టాభి ఫౌండేషన్ ఔదార్యం ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాల్లో ఒక కేంద్రం ఏర్పాటుకు తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు రూ. 7 లక్షలు అందించగా, మరొక కేంద్రాన్ని తణుకుకు చెందిన పట్టాభి ఫౌండేషన్ సంస్థ ఏర్పాటుచేశారు. అంతేకాకుండా మునిసిపాలిటీ కూడా విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. గుప్పెడు ఆహారం అందించడం కోసమే.. పేదలకు గుప్పెడు ఆహారం అందించాలనే లక్ష్యంతో ఫీడ్ ద నీడ్ ఫ్రిజ్ కేంద్రాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది. ఆహారం లేక ఖాళీ కడుపుతో ఏ ఒక్కరూ పడుకోకూడదనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. తణుకు ఎమ్మెల్యే కారుమూరి, అధికారులు ఎంతగానో ప్రోత్సాహం అందించారు. – డాక్టర్ నీలిమ ఆర్య, ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా పేదలకు ఆహారం అందించాలనే లక్ష్యం నచ్చి.. వారసుల ఆదరణ కొరవడిన అవ్వా, తాతలు, అనాథలు, దివ్యాంగులు ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వతహాగా అన్నం పెట్టడమంటే నాకు చాలా ఇష్టం. పేదలకు ఆహారం అందాలనే లక్ష్యం నచ్చి ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి కేంద్ర ఏర్పాటుపై నా దృష్టికి తీసుకురాగానే వెంటనే నా వంతుగా సాయం చేశాను. ఆ కేంద్రాల ద్వారా పేదల ఆకలి తీరడం నాకు చాలా ఆనందంగా ఉంది. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే -
Eluru Town: యువతిపై లైంగికదాడి.. సీఐపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, ఏలూరు టౌన్: ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పోలీసు శాఖలో అధికారుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏలూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన సీఐ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించడంతో పాటు ఆమెను బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతేడాది ఈ కేసుకు సంబంధించి యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలేమి లేకుండా చేసుకునేందుకు సీఐ తీవ్రంగా ప్రయత్నించారు. చదవండి: (దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే) అయితే యువతి ఫిర్యాదుపై రాష్ట్రస్థాయి అధికారుల విచారణ నేపథ్యంలో సీఐపై వేటు తప్పదని తెలుస్తోంది. సదరు సీఐ ఇటీవల అటాచ్మెంట్పై మరో విభాగంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయితే ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఐను వీఆర్కు తరలించారు. జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మ ఆధ్వర్యంలో సీఐపై విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏలూరు రూరల్ స్టేషన్లో గతంలో పనిచేసిన సీఐ, ఎస్సై పై వేటు పడింది. వీరిద్దరిపై కోర్టుల్లో కేసులు కూడా నడుస్తున్నాయి. చదవండి: (భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..) -
జంగారెడ్డిగూడెం : జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ( ఫొటోలు )
-
జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొని జల్లేరు వాగులో బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్తో సహా 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ రాహుల్ దేవ్శర్మ, ఎమ్మెల్యే ఎలీజా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు బయటకు వస్తేగాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. -
నా తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టారు.. గత్యంతరం లేకే ఇలా..
సాక్షి, తూర్పుగోదావరి(కామవరపుకోట): తనకు న్యాయం చేయాలని కోరుతూ కామవరపుకోటలో గురువారం ఓ వివాహిత అత్తింటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించింది. అదనంగా కట్నం తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తామని, లేకపోతే రావొద్దని తనను బిడ్డతో సహా కొట్టి బయటికి గెంటివేశారని వాపోయింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగపాలెం మండలం కొత్తపల్లికి చెందిన రత్నదుర్గకు కామవరపుకోటకు చెందిన యన్నా దుర్గారావు, జ్యోతి కుమారుడు నరేంద్రతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.3 లక్షల కట్నం, మూడు ఎకరాల పొలం, 20 కాసుల బంగారం ఇచ్చారు. భర్త హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండటంతో వివాహం తరువాత అక్కడే కాపురం పెట్టారు. తరువాత ఆడపిల్ల పుట్టడంతో అత్తమామల నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. చదవండి: (పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య) గత నెల 28న అత్త ఇంట్లో ఉన్న తనపై, తన కుమార్తెపై మామ దుర్గారావు మరో ముగ్గురితో కలిసి హత్యాయత్నానికి పాల్పడడంతో తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి అత్తారింట్లోనే ఉంటోంది. గురువారం అత్తమామలతో పాటు మరిది, అతని భార్య, మరి కొంతమంది మరోసారి తన తల్లి, కుమార్తెపై దాడి చేసి కొట్టడంతో గత్యంతరం లేక ఇంటి ముందు ఆందోళనకు దిగినట్లు తెలిపింది. పోలీసులు తనకు, తన కుమార్తెకు రక్షణ కల్పించాలని, హత్యాయత్నం చేసినవారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరింది. తడికలపూడి ఎస్సై కె.వెంకన్న ఘటనా స్ధలానికి చేరుకుని మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. -
పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య
సాక్షి, ఏలూరు టౌన్ : భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతోపాటు, స్టేషన్కు రావాలని పోలీసులు పిలవటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గణపవరానికి చెందిన కే.బాలరాజుకు ఏలూరు శివారు చొదిమెళ్ల గ్రామానికి చెందిన జ్యోతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు బాలరాజు. ఇటీవల అత్తింట్లో బంధువు మృతి చెందటంతో బట్టలు పెట్టేందుకు భార్య స్వగ్రామం చొదిమెళ్ల వెళ్లారు. చదవండి: (ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా..) ఈ నేపథ్యంలో ఈ నెల 17న బాలరాజు, జ్యోతి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య చీమలమందు తాగటంతో ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సతో ఆరోగ్యం కోలుకుని ఇంటికి తిరిగివెళ్లింది. భర్త బాలరాజు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, కొడుతున్నాడంటూ జ్యోతి 100 నంబర్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసింది. గురువారం ఉదయం ఏలూరు రూరల్ పోలీసులు బాలరాజుకు ఫోన్ చేసి విచారణ నిమిత్తం రావాలని చెప్పారు. జ్యోతి తన తండ్రిని వెంటబెట్టుకుని పోలీస్స్టేషన్కు వెళ్లింది. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) బాలరాజు కూడా స్టేషన్కు వెళుతున్నానంటూ చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే స్టేషన్కు వెళ్లకుండా పవర్పేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్
సాక్షి, నరసాపురం (ప.గో): అరబ్ దేశాల్లో తయారయ్యే బంగారు ఆభరణాల డిజైన్లు రోజుల వ్యవధిలోనే పసిడి ప్రియుల కోసం అక్కడి గోల్డ్ మార్కెట్లో రెడీగా ఉంటాయి. జ్యూయలరీ అయినా, గోల్డ్ బిస్కట్లయినా అక్కడి నుంచే రాష్ట్రంలోని చాలా షాపులకు సరఫరా అవుతుంటాయి. అందుకే నరసాపురం గోల్డ్ మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన జిల్లాలో గోల్డ్ మార్కెట్ను శాసిస్తున్న ఈ పట్టణం తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన బంగారం బిజినెస్కు పెట్టిందిపేరు.. శతాబ్దం పైనుంచే మేలిమి బంగారాన్ని వినియోగదారులకు అందిస్తున్న ఇక్కడి మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో హోల్సేల్ వ్యాపారానికి పేరుపడింది. అందుకే కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం మార్కెట్లో ఇక్కడి వర్తకులు సత్తా చాటుతున్నారు. 1920లలో బంగారం వ్యాపారానికి పునాది దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే నరసాపురం బంగారం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. 1920 ప్రాంతంలో ఇక్కడ పసిడి మార్కెట్ను ప్రారంభించారు. రాజస్థాన్కు చెందిన కొన్ని జైన్ కుటుంబాలు బ్రిటిష్ హయాంలో ఇక్కడ స్థిరపడ్డారు. మొదట తాకట్టు వ్యాపారం ప్రారంభించిన జైన్లు తరువాత కాలంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం తరువాత కాలంలో భారీగా విస్తరించింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 400 వరకూ జ్యూయలరీ షాపులు ఉండగా ఒక్క నరసాపురంలోనే 150 వరకూ షాపులు ఉన్నాయి. రిటైల్ వ్యాపారమే కాదు.. ఇక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని షాపులకు హోల్సేల్గా బంగారం సప్లయ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జ్యూయలరీ షాపులకు కూడా ఇక్కడి హోల్సేల్ వ్యాపారులు బంగారం, వెండి సప్లయ్ చేస్తారు. ఇందులో బిస్కెట్ల నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఉంటాయి. పలు కార్పొ రేట్ షాపులకు కూడా ఇక్కడి డీలర్లు సప్లయ్ చేస్తుంటారు. నరసాపురం కేంద్రంగా రోజుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం సాగుతుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో వ్యాపారం రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్లు అదనంగా ఉంటుంది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా బ్రిటిష్ వారి హయాంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో ఉండేది. బంగారు బిస్కెట్ల అమ్మకాలకు కొందరికే అనుమతి ఉండేది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు నరసాపురం వచ్చేవారని చెబుతారు. ముఖ్యంగా జల రవాణా సౌలభ్యం ఉండటంతో వేరే రాష్ట్రాల వ్యాపారులు అక్రమంగా ఇక్కడకు బంగారం తరలించి అమ్మకాలు చేసేవారని ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నరసాపురం బంగారం వ్యాపారానికి పేరుపడింది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా ప్రారంభమైంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడి వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. దుబాయ్, సింగపూర్, ముంబై, కోల్కతా, చెన్నై, అమృత్సర్ ఇలా దేశ, విదేశాల్లో తయారయ్యే అధునాతన డిజైన్లు రోజుల వ్యవధిలోనే ఇక్కడి వ్యాపారులు తయారుచేసేవారు. 30 మంది వరకూ హోల్సేల్ వ్యాపారులు.. నరసాపురంలో 30మంది వరకూ హోల్సేల్ వ్యాపా రులు ఉన్నారు. వీరికి నరసాపురం కేంద్రంగా ముంబై, చెన్నై, కోల్కతాలో అనుబంధ కార్యాలయాలు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని జ్యూయలరీ షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బంగారం, వెండి తెప్పిస్తారు. వెండి ఆభరణాల తయారీకి దేశంలో తమిళనాడులోని సేలం ప్రసిద్ది. తరువాత స్థానంలో నరసాపురం ఉండటం మరో విశేషం. మన రాష్ట్రంలో వెండి హోల్సేల్ వ్యాపారం నరసాపురం నుంచే పెద్దస్థాయిలో జరుగుతుంది. గోల్డ్ ఎగ్జిబిషన్లో నరసాపురం స్టాల్స్ ప్రతీఏటా జులై–నవంబర్ మాసాల మధ్యలో ముంబైలో ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు ఇక్కడకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్లో నరసాపురం వ్యాపారుల స్టాల్స్కు మంచి క్రేజ్. దీంతో నరసాపురం పసిడి ఖ్యాతి ప్రపంచ గుర్తింపు పొందింది. జిల్లా ప్రజలతో జైన్లు మమేకం బంగారం వ్యాపారం కోసం గణేష్మల్, శాంతలాల్, జోట్మల్ నట్మల్, గులాబ్చంద్ కుటుంబాలు వచ్చాయి. ప్రస్తుతం నరసాపురంలో 94 జైన్ కుంటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని మరికొన్ని పట్టణాలకు కూడా వీరి వ్యాపారం విస్తరించింది. బంగారంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా వీరు స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల కష్టం దాగిఉంది నరసాపురం పేరు చెబితే ఇప్పుడు బంగారం పేరు గుర్తుకువస్తుంది. ఓ వ్యాపారం ద్వారా ఊరికి పేరు రావడం గొప్ప విషయం. దీని వెనుక కొన్ని జైన్ కుటుంబాల సంవత్సరాల కష్టం దాగిఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడి ప్రజలతో వారు ఏర్పర్చుకున్న బంధం, సేవా దృక్పథం ఈ ఉన్నతికి కారణం. భవిష్యత్లో కూడా ఇది కొనసాగాలి – సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, వ్యాఖ్యాత, నరసాపురం అన్ని డిజైన్లూ దొరుకుతాయి ఏ మోడల్ ఆభరణం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అందుకే దూరప్రాంతాల్లో ఉన్న చుట్టాలు కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఇక్కడకు వచ్చి మా ఇళ్లలో ఉండి కొనుక్కుని వెళతారు. ఫోన్లు చేసి బంగారం రేటు ఎంతుందో కనుక్కోమంటారు. ఈ ప్రాంతంలోని అందరి ఇళ్లలోనూ ఇవే అనుభవాలు. బంగారానికి మా ఊరు పెట్టిందిపేరు. – మేకల కాశీఅన్నపూర్ణ, గృహిణి, నరసాపురం మా పెద్దల కృషే కారణం నరసాపురం బంగారం వ్యాపారానికి పేరు రావడానికి కారణం మా పెద్దలు చేసిన కృషే. 1980లో రెడీ మేడ్ ఆభరణాల రాకతో వ్యాపారం బాగా పెరిగింది. దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్కు చాలాసార్లు వెళ్లాను. మా ఆభరణాలకు అక్కడ మంచి పేరుంది. – వినోద్కుమార్జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పోణంగిలో అశ్లీల నృత్యాలు
సాక్షి, ఏలూరు రూరల్: గురువారం ఏలూరు మండలం పోణంగి గ్రామంలో జరిగిన గొంతేలమ్మ జాతర సందర్భంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయంలో ట్రాక్టర్పై మహిళలతో ఈ అశ్లీల నృత ప్రదర్శనలు చేయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ట్రాక్టర్ చుట్టూ చేరిన కుర్రకారు నృత్యం చేస్తున్న మహిళలను కిందకు లాగారు. పలువురు ట్రాక్టర్పైకి ఎక్కి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పోలీసులు ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (భర్త చనిపోవడం, ఇద్దరు కొడుకులు జైలుకెళ్లడంతో.. తల్లి ఆత్మహత్య) -
పేరుపాలెం బీచ్.. పర్యాటకం భేష్
సాక్షి, నరసాపురం: జిల్లాలో ఆహ్లాదానికి, ప్రకృతి రమణీయతకు ఆలవాలం పేరుపాలెం బీచ్.. ఏ ఇతర బీచ్లకు కూడా తీసిపోని కనువిందు చేసే దృశ్యాలు పేరుపాలెం సొంతం. తీరం పొడవునా కొబ్బరి చెట్లు, మతసామరస్యానికి ప్రతీకగా వివిధ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్లకు బ్లూఫాగ్ సర్టిఫికెట్ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్ కూడా ఉండటంతో బీచ్కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్ బీచ్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. పేరుపాలెం బీచ్ సోయగం వర్ణించడానికి మాటలు చాలవు. అయితే అనుకున్నంత ప్రచారం లేకపోవడం, మౌలిక వసతుల లేమితో ఆశించినంత అభివృద్ధికి నోచుకోకుండా పోయింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గద్దెనెక్కిన తొలినాళ్లలోనే పర్యాటకరంగం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో 2020 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పేరుపాలెంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి బాటలు వేయడానికి ఈ వేడుక ఉపయోగపడింది. బీచ్ అభివృద్ధికి ప్రస్తుతం వడివడిగా అడుగులు పడుతున్నాయి. కరోనా కల్లోలం లేకపోతే ఇప్పటికే బీచ్ మరింత అభివృద్ధి చెందేది. చదవండి: (కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం) వేగంగా రిసార్టుల నిర్మాణాలు పేరుపాలెం, కేపీపాలెం బీచ్లను అభివృద్ది చేసేందుకు ఏడాది క్రితమే ప్రయత్నాలు ప్రారంభమయ్యియి. పర్యాటకుల వసతి కోసం లగ్జరీ హోటల్ నిర్మాణానికి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రిసార్టులు నిర్మించారు. మరికొన్ని రిసార్టులతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపడడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల టూరిజం శాఖ రీజనల్ డైరక్టర్ తీరప్రాంతంలో పర్యటించి నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించారు. ఇప్పటికే పేరుపాలెం బీచ్ నుంచి కేపీపాలెం బీచ్ వరకు ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారిని డబుల్ రోడ్గా విస్తరిస్తూ పనులు ప్రారంభించారు. రూ 8. కోట్లతో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బీచ్లో రిసార్ట్స్ బ్లూఫాగ్ గుర్తింపుతో మరింత అభివృద్ధి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన బ్లూఫాగ్ బృందం తీరంలో పర్యటించింది. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఈ బీచ్ అనుకూలంగా ఉందని బృందం నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లూఫాగ్ సర్టిఫికేషన్పై దృష్టిపెట్టింది. చదవండి: (దేశంలో మూడో స్వచ్ఛ నౌకాశ్రయంగా విశాఖ పోర్టు) అప్పుడు వైఎస్..ఇప్పుడు జగన్ బీచ్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డే కారణం. 2004 సునామీ తరువాత బాధితుల కోసం తీరంలో ఇళ్లు నిర్మించారు. 2007లో వాటిని ప్రారంభించడానికి వచ్చిన వైఎస్ పేరుపాలెం బీచ్లో జరిగిన సభలో పాల్గొన్నారు. అప్పుడు బీచ్ అభివృద్ధి ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే ముదునూరి ద్వారా తెలుసుకున్నారు. అప్పటికప్పుడు బీచ్ అభివృద్ధికి రూ 2.80 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో రివిట్మెంట్తో కలిపి రోడ్డు వేశారు. గెస్ట్హౌస్ నిర్మించారు. అప్పటి నుంచి బీచ్కు జనం రాకపోకలు పెరిగాయి. రిసార్టుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 10 ఏళ్లలో పాలకులు బీచ్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీచ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. భవిష్యత్లో రూపురేఖలు మారిపోతాయి గతేడాది బీచ్ ఫెస్టివల్ పేరుపాలెంలో జరగడం ముందడుగుగా భావించాలి. ముఖ్యమంత్రి బీచ్ అభివృద్ధికి సహకరిస్తున్నారు. భవిష్యత్లో బీచ్ రూపురేఖలు పూర్తిగా మారుస్తాం. కరోనా వల్ల అభివృద్ధి పనులకు కొంత ఆటకం కలిగింది. త్వరలో హోటల్స్, రిసార్ట్స్ నిర్మాణాలు చేపడతాం. -ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే -
జ్యోతిక పసిడి పరుగు.. రజతం గెలిచిన యశ్వంత్
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రెండో రోజు తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు సత్తా చాటుకున్నారు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకాన్ని సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన జ్యోతికశ్రీ 400 మీటర్ల దూరాన్ని 53.05 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ విభాగంలో వైజాగ్కు చెందిన లావేటి యశ్వంత్ రజతం గెల్చుకున్నాడు. కాగా యశ్వంత్ 14.25 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నక్కా రాజేశ్ 48.94 సెకన్లలో గమ్యానికి చేరి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో తెలంగాణకు చెందిన నిత్య కాంస్య పతకం సొంతం చేసుకుంది. నిత్య 11.90 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 200 మీటర్ల విభాగంలో మాయావతి ఫైనల్కు చేరింది. చదవండి: Ashwin Vs Morgan: అందుకే ఆ గొడవ జరిగింది: దినేశ్ కార్తిక్ -
పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్న కలెక్టర్
-
‘వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి’
సాక్షి, చిత్తూరు: పేద ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి పెద్దిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు మేలు చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ చూపిన బాటలో సీఎం వైఎస్ జగన్ నడుస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలోని దుగ్గిరాల గ్రామంలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలను మంత్రి ఆళ్ల నాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కరోనాను కట్టడి చేస్తూ సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారమే సీఎం జగన్ పేదలకు సంక్షేమన్ని చేరువచేశారని కొనియాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మనందరికీ దూరమై నేటికీ 12ఏళ్లు గడిచాయని, ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పధకాలతో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. పేదలకు కుల, మత, పార్టీ, బేధం లేకుండా సంక్షేమ పాలన అందించారని కొనియాడారు. భావితరాల భవిష్యత్ను ఉద్దేశించి సీఎం జగన్ పాలన అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో రూ. 750 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, రూ.100కోట్లతో రూర్బన్ కింద 15కొల్లేరు గ్రామాల రూపురేఖలు మారబోతోన్నాయని తెలిపారు. రూ.240 కోట్లతో ఆర్అండ్బీ కింద పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మోషేన్ రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలో.. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. దుగ్గిరాల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. సంక్షేమ పాలనలో సువర్ణ అధ్యాయం వైఎస్సార్ పాలన అని కొనియాడారు. -
లాభాల్లో ‘మునగంగా’..
పెరవలి (పశ్చిమగోదావరి): మునగ సాగు రైతులకు కల్పతరువుగా మారింది. ఒకప్పుడు పెరటి పంటగా ఉండే మునగ నేడు వాణిజ్య పంటగా రూపాంతం చెందింది. దేశవాళీ రకాలు సీజన్లో మాత్రమే కాపు కాస్తుండగా.. హైబ్రీడ్ రకాలు ఏడాది పొడవునా దిగుబడి ఇస్తున్నాయి. ఖర్చు తక్కువ ఉండటం, నిత్యం ఆదాయం వస్తుండటంతో రైతులు మునగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవాళీ రకాల కంటే హైబ్రీడ్ రకాలు అధిక దిగుబడితో పాటు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఎకరాకు రైతుకు ఖర్చులు పోను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. కాండం ద్వారా వ్యాప్తి చెందే మునగ చెట్లు నాలుగేళ్ల పాటు దిగుబడిని ఇస్తాయి. పశ్చిమలో సాగు ఇలా.. జిల్లాలో మునగ సాగు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఇక్కడ పంట స్థానిక అవసరాలతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పెదవేగి, నల్లజర్ల, పోలవరం, చాగల్లు, దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పెదపాడు, ద్వారకాతిరుమల, పెరవలి మండల్లాలో మునగ సాగు ఎక్కువగా ఉంది. ఆరునెలల నుంచి దిగుబడి మునగ పంట వేసిన ఆరునెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. తొలి ఏడాది చెట్టుకు 150 కాయలు దిగుబడి వస్తే, రెండో ఏడాది నుంచి దిగుబడి బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు 300 నుంచి 500 కాయలు దిగుబడి వస్తాయి. ఇలా నాలుగేళ్లపాటు ఫలసాయం ఉంటుంది. రూ.20 వేల వరకు పెట్టుబడి మునగ సాగుకు పెట్టుబడి బాగా స్వల్పం. ఎరువులు, పురుగు మందులు వాడితే సరిపోతుంది. కాండం ద్వారా పలవర్ధనం చేసి మొక్కలను పెంచుతారు. పంటను గొంగలి పురుగు, కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని నివారిస్తే సరిపోతుంది. ఎకరాకు ఏడాదికి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుంది. రోజూ మార్కెట్ మునగకు రోజూ మార్కెట్ ఉంటుంది. ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 ధర పలుకుతోంది. కిలోకు కాయ సైజును బట్టి 10 నుంచి 15 వరకు తూగుతాయి. 100 కిలోల వరకు.. ఏడాది పొడవునా కాపు ఉండటంతో ఎకరాకు రోజుకు 30 కిలోల నుంచి 100 కిలోల వరకు దిగుబడి వస్తుంది. రైతుకు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుండగా కోత, రవాణా, ఎరువులకు పోను రూ.1,000 నుంచి రూ.1,500 వరకు మిగులుతుంది. నాలుగేళ్లపాటు.. మునగ వేసి ఆరు నెలలు అయ్యింది. ప్రస్తుతం కాపు కొద్దిగా ఉండటంతో దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. ప్రస్తుతానికి వస్తున్న ఆదాయం పెట్టుబడికి సరిపోతోంది. రెండో ఏడాది నుంచి మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. నాలుగేళ్ల పాటు ఫలసాయం పొందవచ్చు. –కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు ఏడాది పొడవునా.. వాణిజ్య పంటలకు దీటుగా మునగ పంటకు ఆదాయం వస్తోంది. ఏడాది పొడవునా ఫలసాయం పొందవచ్చు. గతంలో వాణిజ్య పంటలు వేసి నష్టాలు చవిచూస్తే నేడు లాభాలు పొందుతున్నాను. ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు మిగులుతోంది. –ఉమ్మిడి రాముడు, రైతు, ఉమ్మిడివారిపాలెం సాగు పెరిగింది హైబ్రీడ్ రకాలతో ఏడాది పొడవునా ఫలసాయం పొందవచ్చు. ఇటీవల మునగ సాగు బాగా పెరిగింది. దీంతో ఎగుమతి కూడా అవుతున్నాయి. గొంగలి పురుగు, కాయతొలుచు పురుగు మాత్రమే పంటకు నష్టం కలిగిస్తాయి వీటిని అరికడితే మంచి ఆదాయం పొందవచ్చు. –ఎ.దుర్గేష్, ఉద్యాన శాఖ ఏడీఏ, తణుకు చదవండి: పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే! -
ఈ-క్రాప్తో రైతు సంక్షేమం
భీమవరం: రైతు శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తూ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగానే పథకాలను రైతులకు మరింత చేరువ చేయడానికి చేపట్టిన ఈ–క్రాప్ నమోదు భీమవరం నియోజకవర్గంలో వేగంగా జరుగుతోంది. ఈ–క్రాప్ ద్వారా గ్రామాల్లో పండించిన అన్నిరకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పశుగ్రాసం, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్సార్ సున్నావడ్డీ, పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంట బీమా, ఇన్ఫుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటివి దక్కుతాయి. గతంలో ప్రభుత్వం రైతుల కోసం అమలుచేసే పథకాలు భూస్వాములకు మాత్రమే దక్కేవి. జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. వీరిని పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ పథకాలు పంట సాగుచేసే రైతులకే అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఈ క్రాప్ విధానం చేపట్టారు. ఈ క్రాప్లో భూయజమానులు, కౌలు రైతులు, ఈనాం రైతులు వంటి వారిని కూడా నమోదుచేస్తారు. ఈ క్రాప్ నమోదు కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోంది. వీరవాసరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో నమోదు చేశారు. భీమవరం మండలంలో 11 వేల ఎకరాలకు గాను 5వేల ఎకరాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన విస్తీర్ణంలో కూడా నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నారు. పంట అమ్మకాలకు ఎంతో మేలు నియోజకవర్గంలో ప్రధానంగా వరి అమ్మకాలకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మే సమయంలో రిజిస్టర్ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద అభ్యంతరాలు చెబుతున్నారు. పండిన పంటను తీరా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక నమోదు ఇబ్బందులతో అమ్మకంలో జాప్యం జరుగుతోంది. దీనిని అధిగమించడానికి పంట వేసిన సమయంలోనే ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే.. అమ్మే సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. వేగంగా ఈ క్రాప్ నమోదు భీమవరం వ్యవసాయ సబ్డివిజన్ పరిధిలోని, వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో ఈ క్రాప్ నమోదు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50 శాతం వరకు పూర్తయ్యింది. ఈ క్రాప్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. రైతులంతా తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం -
చంపేందుకు ఎందుకు కన్నావమ్మా!?
నవ మాసాలూ మోసి.. రక్తం పంచిన బిడ్డల్ని అత్యంత దారుణంగా తల్లులే హత్య చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న భర్తతో గొడవ పడి ఓ తల్లి ఏకంగా తన బిడ్డ చేతిని కోసి ప్రాణాలు విడిచే వరకూ అలానే చూస్తుండిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో చూశాం. ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రిలోని నీటితొట్టిలో వేసి బిడ్డ ఊపిరి తీసిన తల్లి ఉదంతాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు చూస్తున్నాం. రక్తమాంసాలు పంచిన ‘అమ్మ’లే నిలువునా బిడ్డల ప్రాణాలు తీస్తుంటే.. ఇక బిడ్డలను రక్షించేదెవరు?! సాక్షి, ఏలూరు టౌన్: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల కిందట చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. చాలా కాలానికి సీతామహాలక్ష్మి గర్భం దాల్చింది. ప్రసూతి కోసం ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, జూలై 30న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డ మళ్లీ అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఏలూరు శంకరమఠం వీధిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండటంతో ఈఎన్టీ వైద్యులు చికిత్స అందించారు. ఇదిలా ఉండగా బిడ్డ కోలుకుందని ఈ నెల 11న ఇంటికి వెళ్లొచ్చని వైద్యులు చెప్పారు. హరికృష్ణ బయటికి వెళ్లి తండ్రితో కలిసి హాస్పిటల్కు వచ్చేసరికి పాప కనిపించలేదు. ఆస్పత్రి అంతా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆస్పత్రి ప్రాంగణంలోని నీటి తొట్టెలో ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ ఆదిప్రసాద్, ఎస్ఐలు కిషోర్బాబు, నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై తల్లిని ప్రశ్నించగా తన బిడ్డను తానే చంపినట్టు సీతామహాలక్ష్మి చెప్పింది. సీతామహాలక్ష్మికి ఆడబిడ్డ పుట్టటం ఇష్టం లేదని, దీనికి తోడు బిడ్డ అనారోగ్యంతో ఉండటంతో అస్సలు నచ్చలేదని శనివారం మీడియాతో ఏలూరు డీఎస్పీ దిలీప్కిరణ్ చెప్పారు. నిందితురాలిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
జాతీయ వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్ర జట్లకు చాంపియన్షిప్
ఏలూరు రూరల్/సత్తెనపల్లి: జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్ర జట్టు లిఫ్టర్లు చాంపియన్షిప్ సాధించారని రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య గురువారం తెలిపారు. పంజాబ్లోని పటియాలలో 3 రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన బాలబాలికలు అద్భుత ఫలితాలు సాధించారని చెప్పారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో 6 బంగారు,8 వెండి పతకాలు సొంతం చేసుకున్నారని వివరించారు. ఫలితంగా సబ్ జూనియర్ బాలుర జట్టు విన్నర్స్ ట్రోఫీ కైవసం చేసుకోగా, బాలికల జట్టు రన్నరప్గా నిలిచిందని వెల్లడించారు. పతకం సాధించిన వారిలో విజయనగరం, విశాఖ, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల లిఫ్టర్లు ఉన్నట్లు వివరించారు. జట్టు కోచ్గా సీతాభవాని ఉన్నారు. పావని ప్రతిభ.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఏజీకేఎం కళాశాలలో బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కేవీ పావని కుమారి జాతీయ సబ్ జూనియర్, జూనియర్ బాలికల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. 45 కేజీల విభాగంలో స్నాచ్లో 69 కేజీలు, క్లీన్, జెర్క్లో 82 కేజీలతో మొత్తం 151 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం కైవసం చేసుకుంది. జూనియర్స్ విభాగంలో 151 కేజీల బరువు ఎత్తి రజత పతకం కైవసం చేసుకుంది. పావనికుమారిని కళాశాల పాలకవర ్గఅధ్యక్షుడు అన్నం సత్యనారాయణ అభినందించారు. -
రూ.50లక్షలు డిమాండ్ చేసి.. ప్రాణం తీశారు
సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో ఓ యువకున్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బుధవారం పోతవరం సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆ యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి వంశీ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.50లక్షలు ఇస్తే విడిచిపెడతామని అన్నారు. దీంతో ఏం చేయాలో తెలియని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు రూ.50లక్షలు డిమాండ్ చేశారని యువకుడి తండ్రి పోలీసులిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. -
వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!
బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత్రులు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆ అడవి నుంచే అన్నీ పొందుతుంటారు. అలాగే వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం. సంప్రదాయ వంటకం కొమ్ముల కూర ఎంతో రుచికరమైన వెదురు కొమ్ముల కూర అడవి పుత్రుల సంప్రదాయ వంట. మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా వండుకుని తింటారు. అడవిలో వెదురు మొక్కల పక్కన మొలకెత్తే లేత పిలకల్ని కొమ్ములుగా పిలుస్తారు. వర్షాకాలంలో గిరిజన మహిళలు అడవికి వెళ్లి వాటిని సేకరిస్తారు. వెదురు కొమ్ముల తొక్కలు తీసి సన్నగా తరగాలి. అనంతరం నీళ్లలో తరుగును ఉడకపెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేయాలి. ఉప్పు వేసి కొంతసేపు ఉడికించాక.. ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టి కూరను సిద్ధం చేస్తారు. వెదురు కొమ్ముల కూరలో ఇంకా రుచి రావాలంటే అందులో చింతచిగురు లేదా గోంగూర వేస్తుంటారు. ఈ కొమ్ముల కూరలో కారం వేస్తే కూర చేదు వస్తుంది. వర్షాకాలంలో ప్రత్యేకం వర్షాకాలంలో కొమ్ములు దొరికినంత కాలం గిరిజనులు ఈ కూరే తింటారు. ప్రతి ఇంట గ్రామాల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు అదిరిపోతుంటాయి. జూన్లో తొలకరి వర్షాలతో వెదురు చెట్లు చిగురిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వెదురు కొమ్ములు దొరుకుతాయి. ఆ సమయంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర ఉండాల్సిందే. వెదురు కొమ్ముల సేకరణ అంత సులువేం కాదు. వాటి కోసం గిరిజన మహిళలకు అనేక ఇబ్బందులు తప్పవు. వెదురు కూపులో పిలకలు (కొమ్ములు) కోసే సమయంలో పొదల్లో విష సర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వెదురు ముళ్లు విపరీతంగా గుచ్చుకుంటాయి. అయినా వాటి కోసం వెదుకులాట మానరు. 1. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు. 2. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు ఎక్కువగా తింటారు. ►వెదురు కొమ్ముల కూర ఎంతో ఇష్టం కావడంతో కష్టమైనా జాగ్రత్తగా సేకరిస్తామని గిరిజన మహిళలు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా.. అటవీప్రాంతానికి వెళ్ళి సేకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి దొరికే వెదురు బియ్యంతోనూ ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. ఎర్ర చీమలతో చారు... అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లకు చీమలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గూళ్ళను దులిపి దొరికే గుడ్లను నూరి ఆ చూర్ణంతో చారు కాసుకుంటారు. ఈ వర్షాకాలంలో ఈ చారు గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇది మా సంప్రదాయ వంటకం అడవి వెదురు కొమ్ముల కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వంటకం. కొమ్ముల కూరలో ఎండు చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చెట్లకు పట్టే ఎర్ర చీమల పుట్టను తెచ్చుకుని దాని గుడ్లతో చారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. – మాల్చి కోటంరెడ్డి, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం వెదురు కూరలో ఎన్నో పోషకాలు వానలు కురిసే సమయంలో ఎక్కువగా పప్పు కొమ్ముల కూరం తింటాం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ కూర తినేవారు మంచి ఆరోగ్యం ఉంటారు. – మాల్చి పాపాయమ్మ, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం -
దంపతుల పరస్పర దాడి భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
పాలకోడేరు(ఉండి): దంపతుల మధ్య మాటామాటా పెరిగి పట్టరాని ఆవేశంతో ఒకరినొకరు కొట్టుకోవడంతో భర్త మృతి చెందగా.. భార్య ఆస్పత్రి పాలై మృత్యువుతో పోరాడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొల్లలకోడేరు సంజనా అపార్ట్మెంట్లోని సివికా ఫ్లాట్–311లో కనుమూరి విజయరామరాజు (80), సరళాదేవి (70) కాపురం ఉంటున్నారు. వీరిద్దరిదీ ద్వితీయ వివాహమే. తరచూ ప్రతి విషయానికీ కీచులాడుకునేవారు. సోమవారం ఉదయం కూడా వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బంధువుల ఇంటికి పెళ్లిళ్లకు వెళ్లి నెల రోజులు ఉండి వస్తానని భార్య అంటే.. తాను కుమారుడి ఇంటికి వెళ్తానని భర్త అన్నాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగింది. దీంతో పచ్చడి చేసుకునే పొత్రంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిసేపటికి భర్త మృతి చెందగా, భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదే అపార్ట్మెంట్లోని 411 ఫ్లాట్లో ఉంటున్న సమీప బంధువు సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ప్రాణాలతో ఉన్న సరళాదేవిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవలు: ఆళ్ల నాని
సాక్షి,జంగారెడ్డిగూడెం రూరల్: సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని, సచివాలయాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ రామచర్లగూడెంలో విజయ హాస్పిటల్స్ ఐకేర్ ఆస్పత్రిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను మంత్రి ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని నాని ప్రారంభించారు. సచివాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కరోనా థర్డ్ వేవ్పై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్ని వేవ్లు వచ్చినా గత అనుభవవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో రాష్ట్రంలో పరిపాలనలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆ సమస్య నెల రోజుల్లో పరిష్కారం చూపి పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా, జెడ్పీటీసీ అభ్యర్థి పోల్నాటి బాబ్జి, సర్పంచ్ యడ్లపల్లి దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు పీపీఎన్ చంద్రరావు, ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి చిలుకూరి జ్ఞానారెడ్డి, విజయ హాస్పటల్స్ ఐకేర్ వైద్యులు విజయభాస్కరరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. -
Nadu Nedu: సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి
నాడు.. వెలిసిపోయిన బ్లాక్బోర్డులు, విరిగిపోయిన బల్లలు, నేలవాలిన ప్రహరీలు, కూలడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులు, శిథిల స్థితిలో భవనాలు, వినియోగానికి వీలులేని మరుగుదొడ్లు, పనిచేయని కుళాయిలు, ముంపునకు గురయ్యే ప్రాంగణాలు నేడు.. అధునాతన హంగులతో భవనాలు, పక్కాగా నిర్మించిన ప్రహరీలు, కార్పొరేట్కు ధీటుగా ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్లు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు.. ఇది రెండేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు విద్యపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కాన్వెంట్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాడు–నేడులో భాగంగా 1,117 బడుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకూ రూ.226.23 కోట్లను వెచ్చించి 98 శాతం పనులు పూర్తిచేశారు. ఏడాదిలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 25 వేలకు పైగా పెరగడం ప్రభుత్వ కృషికి నిదర్శనం. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీలో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి, విద్యాకానుక, వసతిదీవెన, విద్యాదీవెన, గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను స్వయంగా చూసిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటి ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు. నాడు–నేడులో భాగంగా మూడు విడతలతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పనులు 98 శాతం పూర్తయ్యాయి. కార్పొరేట్ సవ్వడులు నాడు–నేడులో భాగంగా పాఠశాలల భవనాలను ఆధునికీకరించారు. ప్రాంగణాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా మొక్కలు నాటారు. తరగతి గదుల్లో ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు గోడలను విజ్ఞానాన్ని అందించే బొమ్మలతో తీర్చిదిద్దారు. వీటితో పాటు డిజిటల్ తరగతి గదులు, ఇంగ్లిష్ ల్యాబ్లు ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లను ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటుచేశారు. మొత్తంగా పాఠశాలలను నందవనంలా తీర్చిదిద్దారు. మొదటి విడతలో రూ.230 కోట్లు జిల్లాలో మొదటి విడత నాడు–నేడు పనులకు 1,117 పాఠశాలలను ఎంపిక చేసి రూ.230 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు సుమారు 98 శాతం పనులను రూ.226.23 కోట్లతో పూర్తిచేశారు. సమగ్ర శిక్ష అభియాన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేయిస్తున్నారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య నాడు–నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదంగా మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,280 ఉండగా 2019–20 విద్యాసంవత్సరంలో 2,85,315 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య 2020–21 విద్యా సంవత్సరంలో 3,11,178కి చేరుకుంది. ఈ లెక్కన ఏడాదిలో 25,863 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది కరోనా తొలిదశ సమయంలోనూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపైనే తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. నూతన జవసత్వాలు మనబడి నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ విద్యాలయాలను సమూలంగా మార్చి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యావకాశాలు కల్పిస్తున్న సీఎం జగన్ చరిత్రకెక్కారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అరకొర వసతుల మధ్య ఆదరణ కోల్పోయిన సర్కారీ బడులకు ముఖ్యమంత్రి ఆలోచనలతో నూతన జవసత్వాలు వచ్చాయి. విద్యార్థులు ఇష్టపూర్వకంగా పాఠశాలలకు వచ్చే పరిస్థితులు నాడు–నేడు పనులతో సాధ్యమయ్యాయి. –పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కార్పొరేట్ను తలదన్నేలా.. నాడు–నేడులో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యారంగ అభివృద్ధిపై సీఎం జగన్కు ఉన్న చిత్తశుద్ధి నాడు–నేడు పనుల్లో కనిపిస్తోంది. ప్రతి పాఠశాల ఒక ఆలయంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇకపై పేదల విద్యార్థులు విద్యాకానుకలో భాగంగా అందించే యూనిఫాం, బూట్లు, టై, బెల్టు బ్యాగులతో దొరబాబుల్లా పాఠశాలలకు వస్తారు. –ప్రసాద్ బైరీసెట్టి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రెండో విడతకు ప్రతిపాదనలు జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలల్లో నాడు–నేడులో భాగంగా చేపట్టిన పనుల్లో 98 శాతం పూర్తయ్యాయి. రెండో విడతలో మరో 1,101 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. తొలివిడతలో అభివృద్ధి చేసిన పాఠశాలలను వచ్చేనెల 15న సీఎం జగన్ విద్యార్థులకు అంకితం చేయనున్నారు. వచ్చేనెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. సరికొత్త హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి. –సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి -
ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు ప్రకటించింది. తాజా నిబంధనల ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపునిచ్చిన ప్రభుత్వం.. ఆయాచోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. అదే విధంగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్ ప్రొటోకాల్స్తో రెస్టారెంట్లు, జిమ్స్, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం... శానిటైజర్, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది. -
ఒకే పొలం.. ప్రతి నెలా ఆదాయమే!
ఒకే భూమిలో అడుగడుగునా ఆదాయం పొందేలా సమీకృత వ్యవసాయం వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు. ఏడాది పొడవునా ప్రతినెలా ఆదాయం ఆర్జిస్తూ తమ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాల రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నారు. కొద్దిపాటి భూమిలోనే అందుబాటులో ఉన్న సహజ వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటూ వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పాడి పశువులు, సన్న జీవాలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, చేపలు పెంచుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఈ తరహా సాగుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుండగా.. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ సాంకేతికంగా సహకారం అందిస్తోంది. 2016లో గిరిజన గ్రామాలైన పండుగూడెం, బండార్లగూడెంలో 4 క్షేత్రాల్లో పరిచయం చేసిన సమీకృత వ్యవసాయం ఇప్పుడు 89 క్షేత్రాలకు విస్తరించింది. – సాక్షి, అమరావతి బహుళ ఆదాయ పంటలు: అందుబాటులో ఉన్న భూమిని (3 ఎకరాలు) 5 భాగాలుగా విభజించి సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో వరి, చిరు ధాన్యాలు, పప్పు, నూనె గింజలు సాగు చేస్తూ కుటుంబానికి ఆహార భద్రత కల్పించుకుంటున్నారు. పావు ఎకరంలో బహుళ వార్షిక పశుగ్రాసాలను, మరో పావు ఎకరంలో పప్పుజాతి పశు గ్రాసాలు సాగు చేస్తున్నారు. అర ఎకరంలో ఉద్యాన పంటలు, వాటిలో అంతర పంటలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. మరో అర ఎకరంలో మూగజీవాలు, కోళ్ల పెంపకం కోసం షెడ్లు, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగా, మిగిలిన భూమిలో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. వరి పొలం చుట్టూ తీసిన కందకంలో 1,000 నుంచి 1,500 వరకు చేపలను పెంచుతున్నారు. చెరువు చుట్టూ పండ్ల చెట్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, బాతులు, కముజు పిట్టలు, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇలా 3 ఎకరాల్లో సమీకృత వ్యవసాయం ద్వారా నికరంగా రూ.3.60 లక్షల నుంచి రూ.4.20 లక్షల ఆదాయం లభిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తోంది నాకు నాలుగెకరాలు ఉంది. రెండెకరాల్లో వరి వేశాం. మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నాం. ఎకరంలో చేపల చెరువు వేశాం. మొదటి పంట వరి, రెండో పంట మొక్కజొన్న వేస్తాం. రెండూ ఎకరాకు 30 బస్తాల చొప్పున దిగుబడి ఇస్తున్నాయి. పాడి గేదెలు, మూడు గొర్రెలు ఇచ్చారు. వాటిద్వారా రూ.50 వేల వరకు ఆదాయం వస్తోంది. చేపల ద్వారా రూ.లక్ష ఆదాయం వచ్చింది. కోళ్ల ద్వారా ఏటా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వస్తోంది. – మడకం వీరాస్వామి, ఎర్రాయి గూడెం, పశ్చిమ గోదావరి ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం సన్న, చిన్నకారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. ముందుకొచ్చే రైతులకు కేవీకేల ద్వారా శిక్షణనిస్తున్నాం. చేపలు, పాడి గేదెలు, కోళ్లు, వాటికి మేత అందిస్తున్నాం. ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నారు. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ చదవండి: చక్కనైన ఓ చిరుగాలి -
సంగీత దర్శకుడు చంద్రశేఖర్ కన్నుమూత
కరోనా మహమ్మారి మరణాలు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆల్ ఇండియా రేడియో సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కోవిడ్తో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ 1990లో ఆల్ ఇండియా రేడియోలో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్గా చేరారు. అల్లు రామలింగయ్య నటించిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్ అసోసియేట్గా చేశారు. ఆ తర్వాత రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకునిగా చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ ద్వారా సంగీత దర్శకుడు అయ్యారు. ‘బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్–హిందీ )’ ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు చంద్రశేఖర్. ఆ తర్వాత విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా సేవలందిస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. తిరుపతిలో చంద్రశేఖర్ ప్రదర్శన చూసి ముగ్దులైన ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల తన హార్మోనియాన్ని ఆయనకు బహూకరించారట. కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు చంద్రశేఖర్ వద్ద శిష్యరికం చేశారు. చంద్రశేఖర్కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్-2021: బంతి బంతికీ బెట్టింగ్
‘ఏలూరుకి చెందిన రామకృష్ణ నగరంలో ద్వితీయ శ్రేణి బుకీతో క్రికెట్ బెట్టింగ్ కట్టాడు. తన సెల్ఫోన్లో ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగులు కాస్తున్నాడు. రెండు, మూడు మ్యాచ్లలో డబ్బులు రావడంతో ఆసక్తి పెరిగింది. దీంతో జోరుగా పందేలు కాయడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే రూ.70 వేలు బుకీలకు బకాయిపడ్డాడు. బుకీలకు చెందిన రౌడీషీటర్లు అతని ఇంటికి వెళ్లి డబ్బుల కోసం వేధింపులకు దిగటంతో ఏం చేయాలో పాలుపోక మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు రామకృష్ణ.’ ‘భీమవరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వెంకటేష్ గత ఐపీఎల్ సీజన్లో జోరుగా క్రికెట్ బెట్టింగులు కట్టాడు. ఫీజులు కట్టాలని తల్లిదండ్రులకు చెప్పి డబ్బులు తెచ్చి బెట్టింగులు కాసాడు. మ్యాచ్లు పూర్తయ్యే సరికి లక్షల్లో అప్పు అయ్యింది. బుకీలకు చెందిన వ్యక్తులు వెంకటేష్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను సైతం వేధించారు. బయటకు చెబితే పరువుపోతుందని వీరు అప్పులు చేసి కొంతమేర డబ్బులు కట్టారు.’ ఏలూరు టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగులకు వారధిగా మారింది. ఐపీఎల్ మ్యాచ్లపై పందేలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత లక్ష్యంగా బెట్టింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. బంతి బంతికీ, ఓవర్ ఓవర్కు, మ్యాచ్ విజేతలు ఇలా పలురకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. క్రికెట్ బుకీల వలలో చిక్కుకుంటున్న యువకులు అప్పులు చేసి మరీ బెట్టింగులు కడుతున్నారు. ఎర చూపుతూ.. సులువుగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ ఎరవేయడంతో యువత, విద్యార్థులు బెట్టింగ్ మాఫియా వలలో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్ కేసుల్లో అత్యధికంగా పట్టుబడేది కూడా యువత, విద్యార్థులు కావడం విశేషం. బెట్టింగులకు అలవాటు పడిన యువత వ్యసనాలకు బానిసలై దొంగలుగానూ మారుతున్నారు. ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, నిడదవోలు, కొవ్వూరుతోపాటు పల్లెల్లోనూ బెట్టింగ్ సంస్కృతి విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంజినీరింగ్ విద్యార్థులే అధికం గత ఐపీఎల్ సీజన్లో ఏలూరు ప్రాంతంలో పోలీసులు బెట్టింగ్ కేసుల్లో 35 మంది వరకూ అదుపులోకి తీసుకుంటే వారిలో 12 మంది ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నారు. భీమవరం, జంగారెడ్డిగూడెం, ఆకివీడు తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు దాడులు చేసి 46 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో 30 మందికి పైగా యువతే ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. పల్లెల్లోనూ విష సంస్కృతి : గ్రామాలకు సైతం బెట్టింగ్ మాఫియా విస్తరించడంతో చిరు వ్యాపారులు, కూలీలు, కార్మికులు సైతం వీరి బారిన పడుతున్నారు. కీలకమైన జట్లు తలపడితే బెట్టింగ్ హీట్ పెరిగిపోతుంది. ఈ ఐపీఎల్ సీజన్లో సుమారుగా జిల్లాలో రూ.వంద కోట్లకు పైగానే బెట్టింగులు జరుగుతాయని అంచనా. ఆన్లైన్ యాప్లతో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధాన బుకీలు ప్రత్యేక యాప్లలో సెకండ్ స్టేజ్ బుకీలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. వాటికి అనుగుణంగా సెల్ఫోన్తోనే బెట్టింగ్లు జరుగుతున్నాయి. టీవీల్లో చూసే వాటికంటే రెండు, మూడు నిమిషాలు ముందుగానే ప్రత్యేక యాప్లలో మ్యాచ్ వివరాలు తెలిసిపోతూ ఉండటం గమనార్హం. కఠిన చర్యలు జిల్లాలో క్రికెట్ బెట్టింగులు, పేకాట, జూదక్రీడలపై ప్రత్యేక నిఘా ఉంది. క్రికెట్ బెట్టింగుల పేరుతో యువత, విద్యార్థులను పెడదోవ పట్టించే అసాంఘిక శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. బెట్టింగులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోనూ పటిష్ట చర్యలు చేపట్టాం. – కె.నారాయణనాయక్, జిల్లా ఎస్పీ ఓ కంట కనిపెట్టాలి యువత, విద్యార్థులు సమాజాభివృద్ధికి కీలక వనరులు. వీరిని వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. విలాసాలకు అలవాటు పడితే పెడదారిపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల బంగారు భవిష్యత్తును పాడుచేసే వ్యసనాలకు దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉంది. – డాక్టర్ హరికృష్ణ, జిల్లా ఆస్పత్రి వైద్యులు -
కాకిన్నూర్ గ్రామం.. జల్జీవన్ మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: జలజీవన్ మిషన్ విజయానికి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలోని కాకిన్నూర్ గ్రామం ఒక నిదర్శనమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కాకిన్నూర్.. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య ఉంది. ఈ గ్రామానికి వెళ్లడానికి రోడ్డు మార్గం లేదు. విద్యుత్ సరఫరా లేదు. గ్రామానికి వెళ్లడం చాలా కష్టమైన పని. అయితే.. ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నీరు అందించాలన్న లక్ష్యంతో అధికారులు విజయం సాధించారు. గోదావరి నదీ తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామానికి చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో అధికారులు పడవలో డ్రిల్లింగ్ యంత్రాలను రవాణా చేశారు. తీరానికి సమీపంలో ఒక వాగు దగ్గరలో గొట్టపు బావిని తవ్వారు. దానికి సౌరశక్తితో పనిచేసే పంపును అమర్చి గ్రామంలో మొత్తం 200 కుటుంబాలకు కుళాయిల ద్వారా సురక్షిత తాగునీటిని అందించగలిగారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ లక్ష్యం కాకిన్నూర్ గ్రామంలో పూర్తిగా నెరవేరింది. కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటిని తాగడంతో ప్రజల ఆరోగ్య స్థితిగతులు పూర్తిగా మెరుగుపడ్డాయి’ అని మంత్రిత్వ శాఖ ప్రశంసలు కురిపించింది. దేశంలో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లోని ఏడు కోట్ల గృహాలకు జల్జీవన్ మిషన్ కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపింది. 2024 నాటికి అన్ని గృహాలకు సురక్షిత మంచినీరు దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ను ప్రారంభించామని జల్శక్తి శాఖ తెలిపింది. ఆగస్టు 2019 నాటికి మూడు కోట్ల కుళాయి కనెక్షన్లు ఉండగా.. తాజాగా ఈ పథకం కింద రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 4,00,37,853 కనెక్షన్లు అందించామంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ల సంఖ్య 7,24,00,691కి చేరిందని వివరించింది. తెలంగాణ, గోవా, అండమాన్ నికోబార్ దీవుల్లో వంద శాతం కుళాయి కనెక్షన్లు అందించామని తెలిపింది. -
షటిల్ ఆడుతూ సీఐ ఆకస్మిక మృతి
సాక్షి, గణపవరం: గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్(42) గుండెపోటుతో మరణించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన స్నేహితులతో కలసి షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వాసుబాబు సోదరుడు కార్తీక్ వెంటనే ఆయనను అంబులెన్స్లో గణపవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి పీహెచ్సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తూర్పుగోదావరి కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన భగవాన్ప్రసాద్ 2003లో కానిస్టేబుల్గా పోలీస్శాఖలో చేరి, 2007లో ఆర్ఎస్ఐగా, 2009లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితం సీఐగా ప్రమోషన్ పొందారు. సీఐ మృతదేహాన్ని ఎమ్మెల్యే వాసుబాబు సందర్శించి నివాళులర్పించారు. చదవండి: ప్రధాని హత్యకు కుట్ర: 14 మందికి మరణ శిక్ష -
‘అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని జల వనరులశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తెలిపారు. ఆయన పోలవరంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆర్అండ్ఆర్ కాలనీ పనులను పరిశీలించామని తెలిపారు. బుధవారం పోలవరం పనులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించామని చప్పారు. వరదలు వచ్చే సమయం లోపల స్పీల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, స్పిల్వే, గేట్లు అన్ని పూర్తి చేసి అప్పర్, లోయర్ డ్యామ్లను పూర్తిచేసేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నీటిని స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన అనుమతులు తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని పేర్కొన్నారు. గత వరదల్లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ను గుర్తించామని తెలిపారు. కాపర్ డ్యామ్ పనులు పూర్తయిన తర్వాత దానికి మరమ్మతులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు పూర్తవుతాయని, వరదలు వచ్చే సమయానికి 41 కాంటూర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు పూర్తవుతున్నాయని తెలిపారు. వారికి కావలసిన పునరావాస కాలనీలు కూడా పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై పూర్తిగా దృష్టిపెట్టి పనులు చేయిస్తున్నారని గుర్తుచేశారు. డ్యామ్ నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పూర్తి నాణ్యతతో డ్యామ్ నిర్మాణం జరుగుతుందని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. చదవండి: యుద్ధప్రాతిపదికన పోలవరం పనులు పూర్తి చేయాలి -
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫలితాలపై ఉత్కంఠ!
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ఆదివారం జరిగాయి. పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి రెండు జిల్లాల పరిధిలో 92.95 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 13,505 మంది ఓటర్లకు 12,554 మంది ఓటు వేశారు. గుంటూరు జిల్లాలో 7,081 మందికి 6,566 మంది ఓటు వేయడంతో 92.73 శాతం పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లాలో 6,424 మందికి గాను 5,988 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93.21 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉదయం పది గంటల వరకు 27.12 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 56.33 శాతం, రెండు గంటలకు 76.88 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ బాక్సులను ఏసీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కృష్ణా జిల్లా నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన బందోబస్తు నడుమ గుంటూరుకు తరలించారు. కోవిడ్–19 నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ నిర్వహించారు. మాస్క్ ధరించిన వారినే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. కౌంటింగ్కు ఏర్పాట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 17వ తేదీన మొదలు కానుంది. గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో కౌంటింగ్ చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా అధికారులు మొదలుపెట్టారు. పోలైన ఓట్లు 12,554 అయినా బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏ ఒక్కరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చే అవకాశం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా తప్పనసరి అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. గెలుపు ఎవరి తలుపు తడుతుందో... పోలింగ్ 92.95 శాతం నమోదవడంతో అభ్యర్థుల్లో గుబులు పట్టుకుంది. గెలుపు ఎవరి తలుపు తడుతుందని లెక్కలు వేసుకోవడంలో అభ్యర్థులు, వారి అనుచరులు తలమునకలయ్యారు. బరిలో 19 మంది అభ్యర్థులు ఉండటంతో ఓట్లు చీలి ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో గెలిచే పరిస్థితి కనిపించటం లేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో అన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంది. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా కుక్కునూరు, కొవ్వూరు, ఏలూరు, నరసాపురం డివిజన్లలో 49 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 7,765 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 92.14 శాతం పోలింగ్ నమోదైంది. 7,155 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 4,365 మంది పురుష ఓటర్లు, 2,790 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఏలూరులో జరిగిన ఎన్నికలను ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పరిశీలించారు. కుక్కునూరు కేంద్రంలో కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉండగా వారిలో ఇద్దరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలేరుపాడులో ఆరుగురు ఓటర్లు ఉండగా అందరూ ఓటు వేశారు. డివిజన్ల వారీగా చూస్తే జంగారెడ్డిగూడెం డివిజన్లో 91.43 శాతంతో 800 మంది, కొవ్వూరు డివిజన్లో 94.73 శాతంతో 1,636 మంది, ఏలూరు డివిజన్లో 89.51 శాతంతో 2,388 మంది, నరసాపురం డివిజన్లో 93.44 శాతంతో 2,323 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ సాబ్జి ఏలూరులోని సెయింట్ గ్జేవియర్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్కు పటిష్ట భద్రత ఏలూరు టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు. ఏలూరులోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు, పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. డీఐజీ మోహనరావుతో పాటు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఏలూరు వన్టౌన్ సీఐ వైబీ రాజాజీ, టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
‘ఏలూరు’ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్, కానీ..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరిపి ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 23కి వాయిదా వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై సోమవారం హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ విషయం తెలిసిందే. కాగా, ఆ స్టేను ఎత్తివేస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: తుది ఓటర్ల జాబితాలో అనేక తప్పులున్నాయన్న హైకోర్టు -
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బ్రేక్ వేసింది. ఏలూరులో ఎన్నికలు నిలిపి వేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ సరిగా చేయడం లేదని గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటర్ల జాబితాను సరి చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో 14న పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన, జనగణన, కులగణన సరిగా చేయకుండానే ఎన్నికలు జరుపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ముగిసిన ప్రచారం పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమవ్వడంతో అక్కడ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ చదవండి: మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్ -
టీడీపీ మాజీ ఎంపీ మాగంటి తనయుడు కన్నుమూత
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆదివారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా, రాంజీ శరీర అవయవాలను దానం చేయుటకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు. -
దారుణం: అద్దె అడిగితే హతం చేశాడు
సాక్షి, పశ్చిమగోదావరి: పాలకొల్లులో దారుణం చోటుచేసుకుంది. అద్దె అడిగినందుకు ఇంటి యజమానిని హతమార్చాడో దుర్మార్గుడు. వివరాలు.. అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం వంగా ప్రసాద్(50) ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ క్రమంలో కిరాయి చెల్లించమని అడగటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కొండయ్య.. ప్రసాద్ తలపై బండ రాయితో కొట్టాడు. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం కొండయ్య నేరుగా పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. చదవండి: తండ్రి మృతి..అప్పులు తీర్చలేక కొడుకు ఆత్మహత్య : బస్సులో ప్రయాణికుడి మృతి -
ట్రాన్స్జెండర్తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు
సాక్షి, ఏలూరు: ఫేస్బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.. ట్రాన్స్జెండర్ అని తెలిసే ప్రేమాయణం సాగించాడు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ నువ్వు నాకు వద్దంటూ వేధింపులకు పాల్పడడంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఏలూరు సత్రంపాడుకు చెందిన యువకుడు కావటం ఆసక్తిగా మారింది. ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అలియాస్ పండు అనే యువకుడు హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన ట్రాన్స్జెండర్ భూమితో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు. అనంతరం 2020 జనవరిలో పెద్దలను ఒప్పించి మరీ భూమిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా కొనసాగుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభమైంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో యువకుడు భూమితో ఉండేందుకు నిరాకరించటంతోపాటు, అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తారకను అరెస్టు చేశారు. చదవండి: మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు చదవండి: ముందు ఛాటింగ్ .. తర్వాత ఫోన్ -
రొయ్యల వ్యాపారి దారుణ హత్య
-
పంచాయతీ: మమ్మల్ని బలి చేస్తారా!
భీమవరం: పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన అధినాయకత్వం ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ఖంగుతింటున్నారు. సాధారణంగా గ్రామాల్లో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వర్గాలు, కుటుంబాలు, సంప్రదాయాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల వ్యవహారం నడుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ సానుభూతిపరులు సర్పంచ్గా ఎన్నికైతే ఆయా గ్రామాలకు ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు, గ్రామాభివృద్ధికి నిధులు పెద్ద మొత్తంలో మంజూరవుతాయని గ్రామీణ ప్రజలు భావిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పార్టీలను పక్కన పెట్టి ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం, జనసేన నాయకులు ఎన్నికలు ఏకగ్రీవం కాకూడదంటూ చేస్తున్న ప్రకటనలకు ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు విస్తుపోతున్నారు. కన్నెత్తి చూడలేదు సాధారణ ఎన్నికలు జరిగి దాదాపు రెండేళ్లు కావస్తుండగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఆయా పార్టీల పెద్దలు కనీసం ఇప్పటివరకు పట్టించుకోలేదని వాపోతున్నారు. నరసాపురం లోక్సభ స్థానానికి జనసేన అ భ్యర్థిగా పోటీచేసిన కొణిదెల నాగేంద్రబాబు, భీమవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కొణిదెల పవన్కల్యాణ్ ఇంతవరకు జిల్లాను కన్నెత్తి చూడలేదంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో వ్యయప్రయాసల కోర్చి పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల అనంతరం తమను పట్టించుకున్న నాథుడే లేడని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించినా వారెవరూ గ్రామాలను పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ, బీజేపీ అధినాయకు లు ఇచ్చిన పిలుపు సైతం గ్రామాల వరకు తీసుకువెళ్లకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి కార్యక్రమాలు మమ అనిపిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కార్యకర్తలు పార్టీ కోసం ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. అండగా ఉంటారా? పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కోసం ఎన్నికల బరిలో నిలిస్తే అండగా ఎవరుంటారని ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసిన పల్లె ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారని అంటున్నారు. సాధారణ ఎన్నికల అనంతరం గ్రామాల్లో పార్టీ పటిష్టానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అధిష్టానాలు ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని మదనపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అధినాయకులకు తెలిసినా కార్యకర్తలను బలిచేస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీ ఎన్నికలు టీడీపీ, జనసేన నాయకులకు తలబొప్పికట్టే విధంగా తయారవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పశ్చిమ గోదావరిలో వింతవ్యాధి కలకలం
భీమడోలు: వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. బాధితుల సంఖ్య 20కి చేరింది. వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇద్దరు బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి. వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో 5 వైద్య బృందాలు ఏర్పాటుచేశారు. ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పరీక్షల కోసం పంపించారు. వింత వ్యాధి బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ సునంద పరామర్శించారు. పూళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించనున్నారు. గతంలో ఏలూరులో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. -
బైక్పై వెనుక కూర్చుని.. కసితీరా పొడిచేసింది
కొవ్వూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా తాళికట్టాడు. బహిరంగ పెళ్లికి నిరాకరించాడు. పైగా అనుమానంతో ప్రేయసిపై వేధింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం ఆరంభించాడు. ఈ మోసాన్ని, అవమానాన్ని భరించలేక ఆ నయవంచకుడిని యువతి కత్తితో పొడిచి హతమార్చింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన గర్సికూటి పావని కొవ్వూరు ఏబీఎన్ అండ్ పీఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే తాడేపల్లిగూడెంలో ఇంటర్ చదువుతున్న సమయంలో అంబటి కరుణ తాతాజీనాయుడు అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వలలో వేసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి.. కులాలు వేరు కావడంతో అతడు పెళ్లికి నిరాకరించాడు. అయితే యువతి ఒత్తిడి చేయడంతో దొంగచాటుగా తాళి కట్టాడు. కొంతకాలం సహజీవనం కూడా చేశాడు. ఈ క్రమంలో.. అధికారికంగా అందరిముందు తనను పెళ్లి చేసుకోవాలని పావని కోరగా అందుకు ససేమిరా అన్నాడు. అంతేగాకుండా పావనిపై అనుమానం పెంచుకుని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడి వేధింపులు తాళలేక యువతి తన స్వగ్రామమైన మలకపల్లి వచ్చేసింది. సోమవారం యువతికి ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని ఐ.పంగిడి జంక్షన్కి రావాలని తాతాజీనాయుడు కోరాడు. దీంతో పావని అక్కడికి వచ్చింది. (చదవండి: ప్రేమ విఫలం.. యువకుడి బలవన్మరణం) అనంతరం ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడంతో తనను ఇంటి దగ్గర దింపి రావాలని కోరడంతో మోటారు సైకిల్పై బయల్దేరారు. అయితే అప్పటికే అతడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఆన్లైన్లో కొనుగోలు చేసిన చాకుతో అతడిపై దాడి చేసింది. ధర్మవరం గ్రామ శివారుకు వచ్చేసరికి తాతాజీ నాయుడు మెడపై పొడిచింది. దీంతో మోటారు సైకిల్ పైనుంచి అతడు పడిపోవడంతో పలుచోట్ల కత్తితో కసిదీరా పొడిచింది. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పావని పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చి లొంగిపోయింది. రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపట్టారు. -
మంత్రిగా అవకాశం ఇవ్వడం నా అదృష్టం: తానేటి వనిత
సాక్షి, పశ్చిమగోదావరి: లక్ష మంది పనిచేస్తున్న మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టమని మంత్రి తానేటి వనిత అన్నారు. మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్దాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వనిత, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, డైరెక్టర్ కృతికా శుక్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళల పథకాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినపుడు వెంటనే స్పందిస్తారు. 12 సంవత్సరాలుగా ఈ శాఖలో ప్రమోషన్లు రాలేదు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ శాఖకు నిధులు కూడా కొరతే. సంవత్సరానికి రూ.500 కోట్లు కేటాయిస్తే, నేడు జగనన్న ప్రభుత్వం రూ.1,800 కోట్లు కేటాయించింది. చదవండి: ('బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి') గర్భవతులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చేయూత కార్యక్రమం ప్రారంభించారు. మహిళలు రాజకీయంగా ముందుండేందుకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అండగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు' అని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఉనికిని చాటుకునేందుకే.. ఇప్పటివరకు రాజధాని, కులాల అంశాలు తెరపైకి తెచ్చినా స్పందన లేకపోవడంతో కొత్తగా దేవుడిని ముందుకు తెచ్చారు. ప్రతిపక్షం తమ ఉనికిని చాటుకునేందుకే ఈ అంశాల్ని తెర మీదకు తెచ్చింది. అందులో భాగంగానే.. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ సమయంలో విజయవాడలో దేవాలయాల కూల్చివేతపై బీజేపీ ఎందుకు మాట్లడలేదు. దుర్గ గుడి అభివృద్ధికి సీఎం జగన్ రూ.70 కోట్లు విడుదల చేశారు. టీడీపీ కూల్చి వేసిన గుడులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పునర్నిర్మించేందుకు ఈరోజు శంకుస్థాపన చేశారు. టీడీపీ దేవుడుని అడుపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేయడం సరికాదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. అధికార పార్టీ చేసే పనులపై తప్పొప్పులు మాట్లాడాలి కానీ దేవుడిని అడుపెట్టుకుని రాజకీయం చేయడం సరికాదు' అని మంత్రి తానేటి వనిత అన్నారు. చదవండి: (ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) -
కోడి పందేలకు ‘ఐటీ’తో చెక్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలను అడ్డుకునేందుకు ఈ సారి జిల్లా యంత్రాంగం కొత్త వ్యూహాలను పన్నుతోంది. ఇన్కంట్యాక్స్ (ఐటీ) అధికారులతో దాడులు చేయించడం ద్వారా వీటిని అడ్డుకోవచ్చని భావించిన అధికారులు ఈ మేరకు ఆ శాఖకు లేఖ రాశారు. ఐటీ అధి కారులు కూడా 20 వరకు బృందాలను పంపడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సంక్రాంతి ముందు రెండు రోజుల నుంచి అన్ని హోటళ్లు, గెస్ట్ హౌస్లతో పాటు పందేలు జరిగే ప్రాంతాల్లో బృందాలు దాడులు చేయనున్నాయి. కాగా, ప్రతి ఏటా సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కోడి పందేలు జోరుగా జరుగుతుంటాయి. అయితే గత కొంత కాలంగా కోడి పందేల్లో భారీగా బెట్టింగ్లు జరుగుతుండటంతో అధికారులు నిఘాను పటిష్టం చేశారు. బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టించేందుకు ఈ సారి ఆదాయపన్ను శాఖ అధికారులను రంగంలోకి దించాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. (చదవండి: రోజూ సైకిల్పై 18 కి.మీ. పయనం: గ్రూప్–2 విజేత) గృహ నిర్మాణ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా శేఖర్ సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా అదే శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తోన్న పి.బాలముని శేఖర్ నియమితులయ్యారు. అలాగే, చీఫ్ ఇంజనీర్ మల్లిఖార్జునను టెక్నికల్ ఎగ్జామినర్గా నియమిస్తూ గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్జైన్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జైళ్ల శాఖలో పోస్టుల అప్గ్రేడ్ సాక్షి, అమరావతి: జైళ్ల శాఖలో శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా జైళ్లల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు) పోస్టులను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు)గా అప్గ్రేడ్ చేశారు. అలాగే విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, కడపలో ఉన్న కేంద్ర జైళ్లకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు) పోస్టులను కొత్తగా సృష్టించారు.