tour
-
వైఎస్ జగన్ రాకతో పులకించిన పులివెందుల (ఫోటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల టూర్ ..షెడ్యూల్ ఇదే
-
విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రస్తుతం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ చేరుకున్న ఆయన ఈరోజు(సోమవారం) భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. అయితే ఆయన విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తన షెడ్యూల్లో మార్పులు చేసుకున్నారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(Global Investors Summit) జరిగే ప్రాంతానికి నిర్థారించిన విధంగా ప్రధాని ఉదయం 9.45కు హాజరు కావలసివుంది. అయితే ఈ కార్యక్రమానికి 10 గంటలకు వెళ్లే విధంగా ప్రధాని మోదీ తన షెడ్యూల్ మార్చుకున్నారు. నగరంలోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తన కాన్వాయ్ కారణంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.భోపాల్లోని నేషనల్ మ్యూజియంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పారిశ్రామిక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group) చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ నాదిర్ గోద్రేజ్, రస్నా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ అధ్యక్షుడు పిరోజ్ ఖంబట్టా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ బాబా ఎన్ కళ్యాణి, సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రాహుల్ అవస్థి, ఏసీసీ లిమిటెడ్ సీఈఓ నీరజ్ అఖౌరి తదితరులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరుకానున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా.. -
ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడినవాళ్లను చూశాం. దేశానికి సేవ చేయాలన్న కతృనిశ్చయంతో ఐఏఎస్,ఐపీఎస్ ర్యాంకులను సాధించిన వారినీని చూశాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేం దుకు ఉద్యోగాలనూ, ఇంటినీ..అంతెందుకు సర్వస్వాన్ని వదిలేసిన ఫ్యామిలీ గురించి విన్నారా? రండి ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం!రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్, కుమార్తె కైయా రివా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి, పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజనులను ఆశ్చర్యపరిచింది.ఈ ఆలోచన ఎలా వచ్చింది?భారత నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌరవ్కి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు, వైదేహి చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కొచ్చి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్గా నియమితుడైనప్పుడు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య ,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న , ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత, ఈ జంట చూడాల్సినవి, ఆస్వాదించ వలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి. అంతే ఇక ఆలస్యం చేయదల్చుకోవలేదు వీరు. 2022లో గౌతమ్ నావీ వీఆర్ఎస్ తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరూ వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6వేల కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వృధా అనుకున్నారు. రెండు క్యాబిన్లు, వంటగది, తొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్ , ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.పడవపై ఎలా బతుకుతున్నారు?సంవత్సరంలో దాదాపు 70 శాతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసి గడుపుతారు. మిగతా అన్నిసమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి, వంతులవారీగా బోటు నడపటం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటారు. అప్పుడప్పు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు.ఎక్కడికైనా వెళ్లి సముద్ర మీదే. అయితే వాతావరణం, నావిగేషన్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్లు, వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో రాటు దేలారు. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల(1988లో దీన్ని తయారు చేశారు) పడవ నిర్వహణ ఖర్చులు, చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760-వాట్ల సోలార్ ప్యానెల్స్తో ఛార్జ్ చేయబడిన 800-AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది . దీనికి విండ్ జనరేటర్ కూడా అమర్చుకున్నారు. మలేషియాలోని పెనాంగ్లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావీ (మలేషియా), థాయిలాండ్కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్ , డైవింగ్ చేస్తూ,కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్లో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది. వీలైనన్ని ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక.తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్లను కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి, తరువాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారుట .“పడవలో జీవించడం సాధ్యమేనా?” అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్స్టా పేజ్లోని వీడియోలను చూస్తూ ఉంటే.. సమయమే తెలియదు. (వీలైతే ఒకసారి చూడండి) View this post on Instagram A post shared by Sailing Yacht Reeva | 🇮🇳 | Gogo, VC & Kay (@the_reeva_project)ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంకెళ్లేవీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తాయి. ఒక విశాలమైన అవగాహనను కలిగిస్తాయి. -
పాలవలస రాజశేఖరం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో వివాదం
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం(జనవరి24) సాయంత్రం సిరిసిల్లలో కొద్దిసేపట్లో కేటీఆర్ ప్రారంభిస్తారనగా కమ్యూనిటీ హాలుకు మున్సిపల్ అధికారులు తాళం వేశారు.కేటీఆర్తో కమ్యూనిటీ హాల్ ప్రారంభింపచేయడానికి పాలకవర్గం సిద్ధం చేసుకుంది.అయితే ఈ ప్రారంభంపై ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని,ప్రోటోకాల్ పాటించి కమ్యూనిటీ హాల్కు విప్ ఆది శ్రీనివాస్ పేరు వేయలేదని ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలు అడ్డుకట్ట వేశారు. అయితే శుక్రవార సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించి పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పక్క నియోజకవర్గమైన వేములవాడకు కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.విప్ పదవిలో ఉన్న తమ నేత పేరును పక్క నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై రాయకపోవడం ఆది శ్రీనివాస్ వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లు చెబుతున్నారు. -
అమిత్షా పర్యటనతో ఏం ఒరిగింది: పోతిన మహేష్
సాక్షి,విజయవాడ:అమిత్షా ఆంధ్రప్రదేశ్కు వస్తే వరాల జల్లు కురిపిస్తారని అందరూ ఊహించారని, అయితే అది జరగలేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత పోతినమహేష్ విమర్శించారు. మహేష్ సోమవారం(జనవరి20) ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.‘అమిత్ షా రాకను చంద్రబాబు ఏ విధంగా ఉపయోగించుకున్నారో చెప్పాలి. ఆంధ్రప్రదేశ్,కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించి ప్రకటన చేయించి ఉంటే బాగుండేది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు 8వేల కోట్లు ఉన్నాయి. వీటిని తీసుకురావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. కృష్ణా జలాల అంశంపై కనీసం మాట్లాడలేదు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై మాట్లాడడంపై మానేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్యాకేజీపై కార్మికసంఘాలు,ప్రజలకు అనుమానాలున్నాయి. స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ నిలపివేస్తున్నామని,సెయిల్ లో కలుపుతున్నామని అమిత్షాతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? చంద్రబాబు నివాసం అక్రమనిర్మాణం కాదా? వరదల్లో మునిగిపోలేదా?ఇటువంటి విషయాలు అమిత్ షాకి చూపించాల్సింది.వైఎస్ జగన్పై అబద్దపు ప్రచారాం ఎంతకాలం చేస్తారు. ఇది మంచిపద్దతి కాదు. చంద్రబాబు హైదరాబాద్లో కట్టుకున్న ప్యాలెస్లోకి ఏ కార్యకర్తనైనా తీసుకుని వెళ్లాడా?కనీసం ప్రవేశం ఉందా? వైఎస్ జగన్ తాడేపల్లి ఇంట్లోనే పార్టీ కార్యక్రమాలు,సమావేశాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ అంశంపై అమిత్ షా స్పందించలేదు. అమరావతిలో 5ఎకరాలు భూమి కొన్నారు.ఈ అంశంపై అమిత్ షా మాట్లాడడలేదు.రుషికొండ భవనాలపై విష ప్రచారం చేస్తున్నారు. పవన్కి ఒక్కడికే బాబు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్జగన్ సామాజిక న్యాయం చేసి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు లోకేష్కే కాదు.బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. వైఎస్ జగన్ సామాజిక న్యాయం చేస్తే బాబు సామాజిక మోసం చేశారు.పవన్ కళ్యాణ్కు ఉపముఖ్యమంత్రి పదవి అమిత్ షా రెకమెండ్ చేస్తే ఇచ్చారని ట్విటర్లో పెట్టారు. బాబు సామాజిక మోసంపై తెలుగుదేశం,జనసేన కార్యకర్తలు మాట్లాడాలి. 30లక్షల మంది పేదవారికి సొంతింటి కలను నేరవేర్చాడం విధ్వంసకర పాలన అంటారా?ప్రజలకు పరిపాలన దగ్గర చేసేందుకు గ్రామవార్డు సచివాలయాలు పెట్టడం విధ్వంసకర పాలన అంటారా? విద్యా,వైద్య రంగాలను అభివృద్ది చేస్తే విధ్వంసకర పాలన అంటారా?హర్బర్లు,పోర్టులు,మెడికల్ కాలేజీలు పెట్టి అభివృద్ది చేయడం విధ్వంసకర పాలన అంటారా’అని మహేష్ ప్రశ్నించారు. -
నగరంలో 'జిరో' ఫెస్టివల్..
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ సంగీతోత్సవం.. తెలంగాన రాష్ట్రం హైదరాబాద్ నగరానికి రానుంది. ఈ విషయాన్ని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు, పేరొందిన అవుట్డోర్ మ్యూజిక్ ఫెస్టివల్.. ఇప్పుడు జిరో ఆన్ టూర్ పేరిట దేశవ్యాప్త టూర్కు సిద్ధమైందని, ఇందులో భాగంగా తమ తొలి ప్రదర్శనకు హైదరాబాద్ నగరాన్ని వేదికగా ఎంచుకుందని వివరించారు. నగరంలోని తారామతి బారాదరిలో ఫిబ్రవరి 1 నుంచి 2 రోజుల పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకూ ఈ సంగీతోత్సవం కొనసాగుతుందన్నారు. ఈ సంగీతోత్సవంలో పంజాబీ ఫోక్ రాక్ గాయకుడు రబ్బీ షేర్గిల్, అరుణాచల్కు చెందిన ఇండీ ఆరి్టస్ట్ తాబా చాకె, మణిపూర్ జానపద సంచలనం మంగ్కా, మిజోరమ్ నుంచి ప్రత్యేక హోమ్లతో పాటు దక్షిణాది సంగీత సంచలనాలు రామ్ మిరియాల, శక్తిశ్రీ గోపాలన్, చౌరాస్తా బ్యాండ్స్ పాల్గొంటున్నాయని, ఈ సంగీత పండుగకు గిటార్ ప్రసన్న, జ్యోతీ హెగ్డే, ఫ్లూటిస్ట్ జెఎ జయంత్, రెహ్మత్–ఎ–ముస్రాత్ ఖవ్వాలీలు మరో ఆకర్షణగా పేర్కొన్నారు. ఇవే కాకుండా స్థానిక చెఫ్స్, కళాకారులు, ఔత్సాహిక వ్యాపారులకు కూడా భాగం కల్పిస్తున్నామని, స్టోరీ టెల్లింగ్ సెషన్స్, వర్క్షాప్స్ ఉంటాయన్నారు. (చదవండి: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్కు పిలుపు..) -
ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. ఉక్కు కార్మికులకు వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:ప్రధాని మోదీ విశాఖపట్నం సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ స్టీల్ కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీక్షా శిబిరం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు దీక్ష చేస్తున్న కూర్మన్నపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.ఏ నిమిషమైనా పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మారుతి సర్కిల్ నుంచి ఐఎన్ఎస్ డేగా, కాన్వెంట్ జంక్షన్,రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో వాహనాలను నిలిపివేశారు. ప్రెగ్నెంట్ లేడీ ఆసుపత్రికి వెళ్లేందుకు బ్రతిమిలాడినా పోలీసులు అనుమతించలేదు. నిండు గర్భిణీ హాస్పిటల్ పేపర్స్ చూపించినా కనికరించలేదు.టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని మాత్రం అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విశాఖ(visakhapatnam)లో స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్కు ఏజెంట్గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్ను తొలగించాలని డిమాండ్ చేశారు. -
యూకే వెళ్లేందుకు వైఎస్ జగన్కు అనుమతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజా పాస్పోర్ట్ పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్వోసీ) జారీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల కాల వ్యవధితో వైఎస్ జగన్కు పాస్పోర్ట్ జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులను ఆదేశించింది. కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 16న యునైటెడ్ కింగ్డమ్ (యూకే) వెళ్లేందుకు జగన్మోహన్రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.తాజాగా ఐదేళ్ల కాల వ్యవధితో పాస్పోర్ట్ జారీకి ఎన్వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనంటూ విజయ వాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాసరెడ్డి మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ‘క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు నుంచి నిరభ్యంతర పత్రం అడగటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. క్రిమినల్ ప్రొసీడింగ్స్కు దరఖాస్తు దారు అందుబాటులో ఉండేలా చూడటమే. పాస్పోర్ట్ కలిగి ఉండటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. విదేశాలకు వెళ్లేందుకు తగిన పాస్పోర్ట్ కలిగి ఉండాలి.జగన్ మోహన్రెడ్డి ఈ నెల 16న తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాల్సి ఉంది. జగన్మోహన్రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే. మాజీ ముఖ్యమంత్రి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే.. ఇదే హైకోర్టు గత నవంబర్లో ఉత్తర్వులిచ్చింది. జగన్ తరఫున ఆయన న్యాయవాది హాజరైతే సరిపోతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా పాస్పోర్ట్ పొందేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదు. ఎన్వోసీ జారీ చేయాలన్న జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలేవీ చెల్లవు. అందువల్ల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని శ్రీనివాసరెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. -
సందేశ్ఖాలీలో నేడు మమతా బెనర్జీ పర్యటన
కోల్కతా:పశ్చిమబెంగాల్లో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్ఖాలీలో సీఎం మమతాబెనర్జీ సోమవారం(డిసెంబర్30) పర్యటించనున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల భూకబ్జాలు,లైంగిక వేధింపులపై ఈ ఏడాది ఆరంభంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనల తర్వాత ఈ ప్రాంతంలో సీఎం మమత పర్యటించడం ఇదే తొలిసారి. పౌరసరఫరాల శాఖ కార్యక్రమంలో మమత పాల్గొననున్నారు. మాజీ టీఎంసీ నేత షేక్షాజహాన్ తమ భూములు కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని సందేశ్ఖాలీలో మహిళలు ఉద్యమించారు.తర్వాత రేషన్ స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై షేక్షాజహాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షేక్ షాజహాన్ను అరెస్టు చేసింది. ఈ పరిణామాలతో అప్పట్లో అతడిని టీఎంసీ సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: బీహార్లో ఉద్రిక్తతలు..ప్రశాంత్కిశోర్పై కేసు -
4 రోజుల పాటు పులివెందులలో జగన్ పర్యటన
-
గోవా టూర్లో బాయ్ ఫ్రెండ్తో హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు సొంత నియోజవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.వైఎస్ జగన్.. రేపు ఉదయం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులతో ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిశాక సాయంత్ర సమయంలో పులివెందుల బయల్దేరుతారు. 25న సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు.26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు27వ తేదీన స్థానికంగా ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అదే మధ్యాహ్నాం పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు -
Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్కు ప్లాన్ చేసుకోవచ్చు
2024కు వీడ్కోలు పలుకుతూ కొద్దిరోజుల్లో కొత్త ఏడాది 2025ను స్వాగతించబోతున్నాం. ఈ నేపధ్యంలో 2024లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం. వాటిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు ఒకటి. ఈ ప్రాంతాలకు సామాన్యులు కూడా తక్కువ బడ్జెట్తో వెళ్లిరావచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అరబ్ దేశంలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. భారత్- యూఏఈ మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను ప్రధాని మోదీ సందర్శించారు. టూరిజంరంగంలో యుఎఈ మరింతగా విస్తరిస్తోంది. దీంతో విదేశాల్లో పర్యటించాలనుకునేవారికి యూఏఈ మొదటి ఎంపికగా మారింది. ఈ దేశంలోని దుబాయ్ నగరాన్ని దర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ప్రతి ఏటా భారత్తో పాటు పలు దేశాలకు చెందిన పర్యాటకులు యూఏఈని చూసేందుకు తరలివస్తుంటారు.భూటాన్భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఆహ్వానం మేరకు ఈ ఏడాది నరేంద్ర మోదీ భూటాన్లో పర్యటించారు. భూటాన్ భారత్కు పక్కనేవున్న పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది. తక్కువ బడ్జెట్లో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి భూటాన్ సందర్శన ఉత్తమ ఎంపిక. వీసా లేకుండా భూటాన్లో 14 రోజుల పాటు ఉండేందుకు భారతీయులకు అనుమతి ఉంది. భూటాన్ వెళ్లేవారు అక్కడి అందమైన అడవులను, దేవాలయాలను సందర్శించవచ్చు.ఇటలీ50వ జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఈ ఏడాది ఇటలీలో పర్యటించారు. ఐరోపాలోని ఇటలీ అందమైన దేశంగా పేరొందింది. సినీతారలు ఇటలీని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇటలీకి తరలివస్తుంటారు. చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇటలీని సంద్శించాలని భావిస్తుంటారు. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్, అమాల్ఫీ కోస్ట్ మొదలైనవి చూడదగిన ప్రాంతాలు. రష్యా22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాది రష్యాలో పర్యటించారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. భారీ పర్వతాలు, ఎడారులు, అందమైన బీచ్లు, వారసత్వ ప్రదేశాలు, రాజభవనాలు, మంచుతో నిండిన సరస్సులను ఈ దేశంలో చూడవచ్చు. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో రష్యా ఒకటి. ఇక్కడి మాస్కో, వ్లాడివోస్టాక్ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.సింగపూర్ఈ ఏడాది ప్రధాని మోదీ సింగపూర్లో పర్యటించారు. సింగపూర్ సంపన్న దేశంగా పేరొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు సంగపూర్ సందర్శనకు వస్తుంటారు. ఇక్కడి అందమైన మ్యూజియం, జురాంగ్ బర్డ్ పార్క్, రెప్టైల్ పార్క్, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్ సెంటోసా ఐలాండ్, పార్లమెంట్ హౌస్, హిందూ, చైనీస్, బౌద్ధ దేవాలయాలు, చైనీస్, జపనీస్ గార్డెన్లు చూడదగిన ప్రదేశాలు. విదేశాలను సందర్శించాలనుకునేవారికి సింగపూర్ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.ఇది కూడా చదవండి: ఐదేళ్లకు జాతర.. లక్షల జీవాలకు పాతర.. నేపాల్లో ఘోరం -
ఢిల్లీలో శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే భారత్ చేరుకున్నారు. ఆదివారం(డిసెంబర్15) సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు.అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్లో పర్యటిస్తున్న దిసనాయకేకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.#WATCH | Delhi: Sri Lankan President Anura Kumara Dissanayake was received by MoS Dr L Murugan as he arrived in New Delhi.This is President Disanayaka’s first bilateral visit to India since he assumed Presidency. pic.twitter.com/7IF8zFdczK— ANI (@ANI) December 15, 2024 భారత్లో మూడు రోజుల పాటు (డిసెంబరు 15-17 వరకు) దిసనాయకే పర్యటన కొనసాగనుంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిసనాయకే మనదేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఈ పర్యటనలో దిసనాయకే వెంట శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్తోపాటు మరో మంత్రి అనిల్ జయంత ఫెర్నాండో కూడా ఉన్నారు.పర్యటనలో తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దిసనాయకే భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి అవుతారు. ప్రధానంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం,ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.కాగా శ్రీలంకలో సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే.దేశ 9వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. -
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన
-
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
రాష్ట్రపతి ముర్ము తెలంగాణ పర్యటన
-
డీకే అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి,వికారాబాద్జిల్లా:మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. -
ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డు
అబుజా: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలలో పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా నేడు(ఆదివారం) నైజీరియా చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం నైజీరియా అత్యున్నత పురస్కారం "ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్"తో ప్రధాని మోదీని సత్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. ప్రధాని మోదీ ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ప్రపంచంలోనే రెండవ నేతగా నిలవనున్నారు. దీనికి ముందు 1969లో నైజీరియా నుంచి ఈ గౌరవాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి.Nigeria to honour Prime Minister Narendra Modi with its award- The Grand Commander of The Order of the Niger (GCON). Queen Elizabeth is the only foreign dignitary who has been awarded GCON in 1969. This will be the 17th such international award being conferred to PM Modi by a… pic.twitter.com/nOVKGyJr0a— ANI (@ANI) November 17, 2024ఇది కూడా చదవండి: ఉక్రెయిన్పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి -
మూడు దేశాల టూర్కు బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శనివారం(నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్తో పాటు భాగంగా నైజీరియా,గ్వామ్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.ఐదు రోజులపాటు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. భారత్తో ఆయా దేశాల బంధాన్ని బలపరిచే దిశగా ప్రధాని ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలతో పాటు ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులను కలుస్తారు. ఇదీ చదవండి: రాహుల్గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’ -
మంచి రోజులు వస్తున్నాయి...
దుబాయ్: మన మహిళల క్రికెట్కు మంచి రోజులు వస్తున్నాయి. గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇకపై క్రమం తప్పకుండా భారత్లో పర్యటించనున్నాయి. 2025–29 సైకిల్కు సంబంధించిన మహిళల భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత జట్టు కీలక ద్వైపాక్షిక సిరీస్లలో తలపడనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ టీమిండియా పర్యటించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని ప్రతి సభ్య దేశం ఇంటా బయటా నాలుగు సిరీస్ల చొప్పున పాల్గొనేలా కొత్త ఎఫ్టీపీని రూపొందించారు. భారత్ మేటి ప్రత్యర్థులతో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్, 11వ సభ్య దేశంగా ఉన్న జింబాబ్వేతోనూ తలపడుతుంది. ఎప్పుడో అరకొరగా జరిగే టెస్టులను ఈ నాలుగేళ్ల సైకిల్లో పెంచారు. సభ్యదేశాలన్నీ మూడు ఫార్మాట్ల సిరీస్లో పాల్గొనేందుకు సమ్మతించాయని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీమ్ ఖాన్ తెలిపారు. దీంతో గత ఎఫ్టీపీతో పోల్చితే తదుపరి సైకిల్లో మహిళల మ్యాచ్లు మూడు ఫార్మాట్లలోనూ గణనీయంగా పెరగనున్నాయి. » కొత్త ఎఫ్టీపీ వచ్చే ఏడాది మేలో మొదలై 2029 ఏప్రిల్తో ముగుస్తుంది. ప్రతి దేశం పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో 2025–29 సైకిల్లో 400 పైచిలుకు అంతర్జాతీయ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో జరిగే 44 వన్డే సిరీస్లలో ఒక్కో సభ్యదేశం మిగతా పది జట్లతో మూడు వన్డేల చొప్పున ఆడుతుంది. అలా 132 వన్డేలు జరుగుతాయి. » మహిళల ఎఫ్టీపీని 2029లో జరిగే వన్డే ప్రపంచకప్కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడున్న 10 జట్లతో పరిమితం కాకుండా ఆ మెగా టోర్నీ 11 జట్లతో జరుగనుంది. 11వ దేశంగా జింబాబ్వే బరిలోకి దిగుతుంది. ఇటీవల జింబాబ్వే మహిళల జట్టుకు శాశ్వత సభ్యదేశం హోదా ఇచ్చారు. » 2026లో ఇంగ్లండ్లో జరగబోయే టి20 ప్రపంచకప్కు ముందు భారత్ అక్కడ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో కలిసి ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. » ఐర్లాండ్లోనూ జరిగే సన్నాహక ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్లు తలపడతాయి. అలాగే భారత ఉపఖండంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్, మరో జట్టుతో కలిసి ముక్కోణపు సిరీస్లో పాల్గొంటుంది. » ఐసీసీ మహిళల చాంపియన్íÙప్లో భాగమైన జింబాబ్వే... వచ్చే నాలుగేళ్ల పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకలతో జరిగే ద్వైపాక్షిక సిరీస్లకు ఆతిథ్యమిస్తుంది. దీంతో పాటు భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో పర్యటిస్తుంది. » అందరికంటే ఆ్రస్టేలియా గరిష్టంగా ద్వైపాక్షిక సిరీస్లలో భాగమవుతుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లాంటి గట్టి ప్రత్యర్థులతో ఇంటా బయటా సిరీస్లు ఆడుతుంది. -
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
మంత్రి నాదెండ్ల టూర్.. కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు -
నిర్మాతతో మొరాకో టూర్లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)
-
నిన్న భారత్ పై వెటకారాలు.. నేడు కాళ్ల బేరాలు
-
చంద్రబాబు పాపం బయటకు రావాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
బ్రూనై పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం(సెప్టెంబర్3) ఉదయం బ్రూనై పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు. సింగపూర్లో ప్రధాని సెప్టెంబర్ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. PM @narendramodi is set to visit Brunei and Singapore from Sept 03-05, 2024.🎥 Take a quick look at 🇮🇳’s engagements with the two countries. pic.twitter.com/9yJ3nEgK1I— Randhir Jaiswal (@MEAIndia) September 2, 2024ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్తో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. బ్రూనై పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. బ్రూనై, సింగపూర్లతో భారత్ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. -
నేడు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
అమెరికాలో భారతీయ అంధుల క్రికెట్ జట్టు.. డాలస్లో మహాత్ముడికి నివాళి
డాలస్, టెక్సాస్: జూలై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు అమెరికా పర్యటనలో ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్ట్ఙు మంగళవారం డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి మొదలైన వారు వీరికి ఘనస్వాగతం పలికారు.బోస్టన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డి.సి, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్ మరియు బే ఏరియా లలో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.వీరిలో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగల్గుతారు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో బంతి వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ బంతిని కొడతాడు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని చాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటన మొత్తాన్ని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ వారు స్పాన్సర్ చేసి తగు ఆర్ధిక సహకారం అందించడం ముదావహం. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ తమ క్రికెట్ ఆటలు సుదీర్ఘ కాలం విజయవంతంగా కొనసాగడానికి కావలసిన ఆర్ధిక పరిపుష్టికోసం విరాళాలు సేకరిస్తున్నారు. -
మేయర్ విదేశీ యాత్ర దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్కు ఇన్చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.వెలుగుచూసిందిలా..వాస్తవానికి మేయర్ సునీల్రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్రావు తనకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్చార్జి మేయర్గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు. మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్మేయర్పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.6న ఇండియాకు: మేయర్తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పోలెండ్ చేరుకున్న ప్రధాని మోదీ
వార్సా: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(ఆగస్టు21) సాయంత్రం పోలెండ్ చేరుకున్నారు. రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం పలికారు. భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలెండ్లో పర్యటిస్తున్నారు. పోలెండ్ పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. -
టీ కన్సల్ట్ చొరవతో తెలంగాణలోకి భారీ పెట్టుబడులు: రేవంత్
-
విజయవాడ కు వైఎస్ జగన్
-
బీఆర్ఎస్ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం(జులై 25) బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్ తిరిగిరానుంది. -
రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో పలు ప్రశ్నలడిగి, వారితో ఉత్సాహంగా ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు.మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, "మోదీ మోదీ" నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తన ప్రసంగంలో మోదీ ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్బర్గ్లలో భారత కాన్సులేట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.ఎన్నాళ్లనుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారని అని కళాకారులను ప్రధాని మోదీ ప్రశ్నించారు. కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇస్కాన్ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామ్ కృష్ణ మిషన్ నుండి స్వామి ఆత్మలోకానంద తదితరులు మాట్లాడారు.కాగా సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు మోదీపై పుతిన్ ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.#WATCH | Prime Minister Narendra Modi meets artists of the Russian Cultural Troupe who performed to welcome PM Modi during his address to the Indian community in Moscow, Russia(Souce: PMO) pic.twitter.com/qUWMVkVk3K— ANI (@ANI) July 9, 2024 -
గుర్రపుశాలలో మోదీ, పుతిన్
మాస్కో: రష్యాలో ప్రధాని మోదీ టూర్ రెండోరోజు కొనసాగుతోంది. మంగళవారం(జులై 9) ఉదయం రష్యా అధ్యకక్షుడు పుతిన్, మోదీలు కలిసి పుతిన్ అధికారిక నివాసం నొవో ఒగర్యోవ్లో గార్డెన్లో టీ సేవించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై అనధికారికంగా చర్చించుకున్నారు. అనంతరం గార్డెన్లో ఇద్దరు కలిసి కొద్దిసేపు నడిచారు. అక్కడే ఉన్న గుర్రాలశాలను సందర్శించి గుర్రాలను చేతితో నిమిరి పలకరించారు. మంగళవారం పుతిన్, మోదీ మధ్య శిఖరాగ్ర సదస్సులో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో మాస్కో చేరున్నారు. అనంతరం అధ్యక్షుడు పుతిన్ నివాసంలో ఇచ్చిన విందు స్వీకరించారు. ఈ సందర్భంగా భారత ప్రజల కోసం మోదీ చేస్తున్న కృషిని పుతిన్ కొనియాడారు. -
రష్యా టూర్కు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్ మొదలైంది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటన కోసం సోమవారం(జులై 8) ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మూడు రోజుల పాటు రెండు దేశాల్లో ప్రధాని పర్యటన సాగనుంది. Over the next three days, will be in Russia and Austria. These visits will be a wonderful opportunity to deepen ties with these nations, with whom India has time tested friendship. I also look forward to interacting with the Indian community living in these countries.…— Narendra Modi (@narendramodi) July 8, 2024 పర్యటనలో భాగంగా భారత్, రష్యా 22వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాకక్షిక చర్చలు జరపనున్నారు. రష్యాలో నివసిస్తున్న భారతీయులను ప్రధాని కలవనున్నారు. అనతరం అక్కడి నుంచి ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనుండటం విశేషం. -
జిల్లాల పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫొటోలు)
-
జులైలో ప్రధాని రష్యా టూర్..!
న్యూఢిల్లీ: జులైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మోదీ చివరిసారిగా 2019లో రష్యాలో పర్యటించారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన రష్యాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన ఒక రోజు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. పర్యటన వివరాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మోదీ పర్యటన కోసం రష్యాలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన తేదీ ఖరారైన తర్వాత ఇరు దేశాలు దీనిపై అదికారిక పర్యటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవలే మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇటలీకి వెళ్లొచ్చారు. -
రూ.14 వేలకే 'దివ్య దక్షిణ్ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!
దక్షిణాది పుణ్య క్షేత్రాలు దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్. తక్కువ ధరలోనే దక్షిణది పుణ్యక్షేత్రాలను దర్మించుకునేలా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. అందుకోసం సికింద్రబాద్ నుంచి మరో భారత గౌరవ్ టూరిస్ట్ రైలుని తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్ గౌరవ్ రైళ్లకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్ చేస్తుంది. ఈనెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ గౌరవ్ రైలుని విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వేస్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుగా కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి.జర్నీ ఎలా సాగుతుందంటే..సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12.00 గంటలకు రైలు బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై(అరుణాచలం) చేరుకుంటారు. అరుణాచలం రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత, ఫ్రెష్ అవ్వడానికి హోటల్కు చేరుకుంటారు.ఆ తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం కుదల్నగర్కు పయనమవుతారు.మూడో రోజు ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు. హోటల్లో బస చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని దేవాలయాలను సందర్శిస్తారు రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.నాలుగో రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి వెళ్లేందుకు రాత్రి కూడాల్ నగర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 11.30 కన్యాకుమారికి పయనమవుతారు. ఐదో రోజు ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్లో బస చేస్తారు. ఆ తర్వాత వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేస్తారు.ఆరో రోజు కన్యాకుమారి - కొచ్చువేలి - తిరుచ్చి-హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి..రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ని సందర్శిస్తారు. ఇక తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్లో రైలు ఎక్కుతారు.ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.) వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం రాత్రి 11 గంటలకుతంజావూర్లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు.ఎనిమిదో రోజు మొత్తం రైలు జర్నీయే ఉంటుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో స్టాపింగ్ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.ఛార్జీలు: ఎకానమీలో ఒక్కరికి రూ. 14,250, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 13,250 చెల్లించాలి.స్టాండర్ట్లో ఒక్కరికిరూ.21,900; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.20,700 చెల్లించాలి.కంఫర్ట్లో ఒక్కరికిరూ.28,450; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,010 చెల్లించాలి.ఫుడ్ ఐఆర్టీసీదే..రైలులో టీ, టిఫిన్, భోజనంన్ని ఐరా్టీసీనే ఏ ర్పాటు చేస్తుందియాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వ్యక్తులే చెల్లించువాల్సి ఉంటుంది.పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.దక్షిణ భారత్లోని జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్టీసీ టూరిజం లింక్పై క్లిక్ చేయండి.(చదవండి: తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!) -
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
-
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
-
చైనా–రష్యా కరచాలనం!
తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి. పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్కు బీజింగ్లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం. అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది. చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం. ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి. ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు. వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి. చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
గుండె నిండా కేసీఆర్..
-
పవన్ ఆపసోపాలు.. హైదరాబాద్ ఫాంహౌస్కు జంప్
‘‘రెండు రోజులు ప్రచారం చేయలేని వాడు ఎమ్మెల్యే అవుతాడా?. హైదరాబాద్ ఫాంహౌస్లకు అలవాటు పడిన వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాడా?. పార్ట్టైం పాలిట్రిక్స్ చేస్తే జనం నమ్ముతారా?. స్టంట్లలో డూపులను పెట్టినట్టు.. జనసేన సింబల్ కింద టీడీపీ నేతలతో పోటీ చేయిస్తావా?. ఇదేనా నిఖార్సయిన రాజకీయం?. ఇదేనా గోదావరి ప్రజల ముందుకెళ్లి తేల్చుకునే అంశం?’’ అంటూ పవన్కల్యాణ్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. హైదరాబాద్కు వెళ్లిపోయిన పవన్.. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది.. దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో.. సేనాని దమ్ము ఇంతేనా.. ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం.. స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా.. క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా? పిఠాపురం ఒక్కదానికే ఆయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని.. బ్రాయిలర్ కోడి మళ్లీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. మరో వైపు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. -సిమ్మాదిరప్పన్న -
కేసీఆర్ దూకుడు మరో పర్యటనకు సిద్ధం
-
US: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!
మనం ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వందల సంవత్సరాలనాటి దారులనే అటు ఇటుగా బాగుచేసుకుంటూ వాటిపైనే ప్రయాణాలు చేస్తున్నాం. అమెరికా వాళ్ళు రాబోయే వందేళ్ల అవసరాలకు ఉపయోగపడే విశాలమైన రోడ్లు దేశమంతా ఎప్పుడో వేసుకున్నారు. ఆ దేశంలో అడుగుపెట్టిన భారతీయులను ముందుగా ఆశ్చర్యచకితులను చేసేవి అక్కడి పెద్దపెద్ద లైన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు. అక్కడ రోడ్ల మీద మనకు మనుషులు కనబడరు, పరుగులు తీస్తున్న వాహనాలే దర్శనమిస్తాయి. గుంపులు గుంపులుగా మనుషులను చూడాలంటే మాల్స్కో, సినిమా హాల్స్ కో వెళ్లాల్సిందే. మన దేశంలో మనుషుల కొరత మాత్రం లేదు, ఎక్కడికి వెళ్లినా తనివితీరా చూడొచ్చు, చివరికి ఇండ్లలో కూడా. అయితే ఈ మానవ వనరులే మనకిప్పుడు పెద్ద పెట్టుబడి అయింది నిజం.అమెరికాలో జనం ఎక్కువగా విమానాల్లోనే దూర ప్రయాణాలు చేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మనవాళ్లతో పోల్చుకుంటే అక్కడ రైలు, బస్సు ప్రయాణాలు చాలా తక్కువనే చెప్పాలి, వాళ్లకు అంత ఓపిక ఉండడం లేదు. అక్కడి బస్సుల్లో ఎక్కువగా తిరిగేది శ్రామిక వర్గానికి చెందిన నల్లవారు, మెక్సికో, చైనా వంటి దేశస్తులు. నేను 2008లో అమెరికాలో పర్యటించినప్పుడు తప్పనిసరై టెక్సాస్లోని డాలస్ నుంచి వేన్ కౌంటీలో ఉన్న టేలర్కు బస్సులో జూన్ 7 న ప్రయాణమై వెళ్ళాను. అమెరికా వెళ్లి అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్న మా బంధువుల అబ్బాయి ప్రోత్సాహంతో బస్సు ఎక్కాను. సరదాగా ఉంటుంది వెళ్ళమని నన్ను డల్లాస్ - టేలర్ బస్ జర్నీ కి ప్రోత్సహించింది అతనే. ఆ రోజుల్లో ఈ ప్రయాణ ఛార్జి 44.50 డాలర్లు, మన రూపాయల్లో దాదాపు 3 వేల పైమాటే. నా పాసుపోర్టు చూశాకనే, లగేజీ చెక్ చేశాకనే బస్సులోకి అనుమతించారు. నేను ఎక్కింది వన్ మ్యాన్ సర్వీస్ కావడం వల్ల అన్ని పనులు డ్రైవరే చూసుకునేవాడు, ప్రయాణికుల లగేజీ సర్దిపేట్టేది ఆయనే, వారు దిగేప్పుడు తీసి ఇచ్చేది కూడా అతనే. ఇది చిన్న పని అది పెద్ద పని అనే ఆలోచన చేయకుండా, ప్రయాణికుల నుండి ఏమీ ఆశించకుండా ఓపిగ్గా అన్నీ డ్రైవరే చేయడం విశేషం. అన్నట్లు అమెరికాలో లేడీ డ్రైవర్లు కూడా ఎక్కువే. అమెరికాలో గ్యాస్ స్టేషన్లు అంటే పెట్రోల్ బంకులు చాలా సర్వీస్ చేస్తుంటాయి. అక్కడ కేవలం గ్యాస్ మాత్రమే కాదు ప్రయాణికులకు కావలసిన వస్తువులు దొరుకుతాయి, తినడానికి, విశ్రాంతికి సౌకర్యంగా ఉంటుంది. పాకిస్తానీలు చాలా మంది ఈ స్టేషన్ స్వంతదారులు, పనిలో మనవాళ్ళు కనబడుతుంటారు, ఒంటరిగా ఉంటే గన్తో వచ్చి బెదిరించి ఉన్నవి లాక్కునేవాళ్ళను స్థానికులు అంటారు. మన గమ్యం వస్తుందంటే డ్రైవరే అనౌన్స్ చేస్తుంటాడు, అతన్ని టీవీ స్క్రీన్ మీద గమనించవచ్చు. బస్ టికెట్తో పాటు ఇచ్చిన ప్రకటనల బ్రోచర్స్లో ఆనాటి ఇరాక్ యుద్ధం వల్ల సైనికుల అవసరం పెరిగి సైన్యంలో చేరమన్న విజ్ఞప్తులు కనబడ్డాయి. బస్సులో చాలా మంది ఆడవాళ్లు మేకప్తో కాలక్షేపం చేస్తుంటే మరికొందరు మ్యూజిక్ వింటూ ఊగిపోయేవారు. బస్సులోనే చిన్న టాయిలెట్ మంచి సౌకర్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ త్రాగడం నిషేధం. డౌన్ టౌన్ లో ప్రవేశించే వరకు ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాయిగానే సాగింది. డాలస్లో ఉదయం 6 గంటలకు బయలుదేరిన బస్సు దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత గమ్యస్థానం చేరింది. భారతదేశంతో పోలిస్తే.. ఇక్కడి బస్సు ప్రయాణంలో ఎలాంటి అలసట అనిపించలేదు. సుఖవంతమైన ప్రయాణం కదా అనిపించింది. బస్సులోన నిశబ్ధం, విశాలమైన రోడ్లపై వాహనాల టైర్ల సౌండ్, మధ్యమధ్యన బ్రేక్లలో స్నాక్స్. ఇప్పుడు హైదరాబాద్ - విజయవాడ మధ్య, హైదరాబాద-బెంగళూరు లేదా విజయవాడ - విశాఖ మధ్య బస్సు ప్రయాణం కూడా ఇలాంటి అనుభవమే కనిపిస్తోంది. మున్ముందు మనం కూడా అమెరికా తరహాలో రోడ్డు ప్రయాణం ఉంటుందని ఆశిద్దాం వేముల ప్రభాకర్ (చదవండి: US: అమెరికాలో 911..అదో పెద్ద హడావిడి!) -
రేపు సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 14న పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. -
‘కజిరంగా’కు ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆయన నేడు యూపీతోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో పర్యటిస్తున్నారు. అసోంలోని కజిరంగాలోని నేషనల్ పార్క్లో సఫారీతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయ్యింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ప్రధాని మోదీ జీప్ సఫారీతో పాటు ఏనుగు సవారీ కూడా చేశారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇది 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. వివిధ జాతులకు చెందిన వెయ్యికి మించిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేకత. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పార్కులో 2200కు పైగా ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అలాగే ఈ పార్క్ 180కు మించిన బెంగాల్ పులులకు నిలయం. #WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp — ANI (@ANI) March 9, 2024 కజిరంగా నేషనల్ పార్క్ నమూనాను నాటి లార్డ్ కర్జన్ భార్య 1904లో రూపొందించారు. 1905, జూన్ ఒకటిన ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటయ్యింది. పార్క్ 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1908లో గోలాఘాట్, నాగావ్ జిల్లాలను ఈ పార్కు కలిపింది. యునెస్కో దీనిని 1985లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది కజిరంగాను 2006లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఈ పార్క్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మే ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు పార్కును మూసివేస్తారు. ఈ పార్కులో ఏనుగులు 1,940,వైల్డ్ బఫెలోలు 1666, జింకలు 468 ఉన్నాయి. Assam CM Himanta Biswa Sarma shares video of PM Modi's arrival at Kaziranga National Park pic.twitter.com/FlsjC2fwgU — ANI (@ANI) March 8, 2024 -
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ను, రెండో టన్నెల్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ల స్కాముల బంధం గట్టిది: ప్రధాని
Updates: 12:36PM, Mar 5th, 2024 ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్రెడ్డి ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ 12:26PM, Mar 5th, 2024 బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్కు అవకాశమిచ్చారు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి 12:10PM, Mar 5th, 2024 కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్ కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు. మోదీ దేశఖజానా నింపాడు నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్ను బేగంపేటలో ఏర్పాటు చేశాం ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం పటాన్చెరులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమాలు NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు) NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు) NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు) హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు) ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఘట్కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్ ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు. రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు. సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు. ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు. ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు.. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు. 11:00AM, Mar 5th, 2024 పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10:40AM, Mar 5th, 2024 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ 10:30AM, Mar 5th, 2024 ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ 10:20AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని #WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX — ANI (@ANI) March 5, 2024 10:06AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని 9:50AM, Mar 5th, 2024 కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్ రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు ప్రధాని సభ కోసం పటాన్చెరులోని పటేల్గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ.. ► రూ.1,298 కోట్లతో ఎన్హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ ► రూ.399 కోట్లతో ఎన్హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ ► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి ► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ ► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు. ► ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం -
కాసేపట్లో తెలంగాణకు ప్రధాని మోదీ
-
Rashmika Mandanna: జపాన్లో రష్మిక.. భారత్ నుంచి మొట్టమొదటి సెలబ్రిటీ (ఫోటోలు)
-
నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 28న (బుధవారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్ప్రదేశ్లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్
-
విశాఖలో సీఎం జగన్ పర్యటన
-
కోడ్ కూయక ముందే.. మోదీ టూరు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగానే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేయాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనే అంచనాల మధ్య పెద్దఎత్తున ముందస్తు ప్రచారానికి కమలదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నెలాఖరులోగా లేదంటే మార్చి మొదటివారంలోగా రెండు, మూడు పర్యాయాలు మోదీ రాష్ట్రానికి వస్తారని చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా ప్రధానితోనే ప్రారంభించినట్టు అవుతుందని బీజేపీ నాయకులు అంచనావేస్తున్నారు. మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే గత అక్టోబర్ 1న మహబూబ్నగర్లో, 3న నిజామాబాద్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, తెలంగాణలో పసుపుబోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పంథాలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేలోగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి యాక్షన్ప్లాన్ కూడా అమల్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ద్వారా రాష్ట్రంలో వివిధ రూపాల్లో చేపట్టనున్న ఎన్టీపీసీ, రోడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్లకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్లో బహిరంగసభ? ఆదిలాబాద్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అక్కడే విడిగా ఏర్పాటు చేసే బహిరంగసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా... ములుగులో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్లో పసుపు బోర్డ్ ఏర్పాటుకు శంకుస్థాపనలు, తెలంగాణకు మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి ప్రయోజనం చేకూరేలా చేపట్టనున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఇక చర్లపల్లిలో రైల్వే టెరి్మనల్ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా లోక్సభ ఎన్నికల్లో రాజకీయ మైలేజీని సాధించే దిశలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. -
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
రేపు సీఎం జగన్ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15వతేదీన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు, అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. -
రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్.. అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
కమలం కసరత్తు తెలంగాణ నుంచే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్లమెంటు ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లు (మూడు, నాలుగేసి సీట్ల చొప్పున)గా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో ఆదివారం నిర్వహించనున్న క్లస్టర్ (మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ ఎంపీ సీట్లు) ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్ (కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలు)కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పైస్థాయి కార్యకర్తలు దాదాపు 20 వేల మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. 29న భేటీలకు ఛుగ్, మీనన్ వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్సభ ఎన్నికలు జర గొచ్చుననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్న ద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో.. పోలింగ్ బూత్ కమిటీ, ఆ పైస్థాయి కార్యకర్తలు ఇంటింటికీ (జనసంపర్క్ అభియాన్) వెళ్లి పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి, కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే మహిళా వృత్తినిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ఛుగ్ హాజరుకానున్నారు. అదేరోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ (ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లు) పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ పాల్గొననున్నారు. టికెట్లకు పోటీ ఒకవైపు పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరో టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా 13 స్థానాల్లో వివిధ రూపాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. మోదీ ఆకర్షణ, అభివృద్ధి నినాదం పనిచేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అయిదారు మంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు ఇప్పటికే పార్టీ నాయకత్వంతో టచ్లోకి వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 5 బీసీలకు, 3 రెడ్డి, 5 ఎస్సీ.. ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, లింగా యత్ లేదా వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఆదివారం ఢిల్లీ నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో 1.40కి మహబూబ్నగర్కు చేరుకుంటారు. 2.40 దాకా సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్లో పాల్గొంటారు తర్వాత హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.55కు కరీంనగర్కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని, 6.15 నుంచి 7.05 వరకు జేఆర్సీ కన్వెన్షన్ హాలు లో మహిళా వృత్తి నిపుణులు, ఇతరులతో భేటీ అవుతారు. రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. -
ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
సాక్షి, అమరావతి : రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది. అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియాకు వివరిస్తారని ముఖే‹Ù కుమార్ మీనా అన్నారు. సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని.. విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నోవాటెల్ కాన్ఫరెన్స్ హాల్ను పరిశీలించారు. -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు చొప్పున ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశమయ్యారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. సంక్షేమం..అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని, తాను గత సీఎం తరహా కాదని తేల్చి చెప్పారు. జనవరి 26 తర్వాత వారానికి మూడురోజులు సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఉంటుంది. తొలిసభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసభ ఇంద్రవెళ్లిలో నిర్వహించగా, సీఎం హోదాలోనూ అక్కడ జరిగే తొలిసభలో రేవంత్ పాల్గొంటారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మతివనానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు రేవంత్ సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని, రెట్టి ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు బదనాం చేస్తున్నారు నియోజకవర్గ సమస్యలతోపాటు పార్టీ బలోపేతానికి సీఎం పలు సూచనలు చేశారని మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రభుత్వ పథకాల విధివిధానాలు తయారుకాక మునుపే బీఆర్ఎస్ నేతలు తమను బదనాం చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడుతున్నారని, ఐదేళ్ల వరకు ఎన్నికలు రావని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులకు ధైర్యం ఇచ్చేందుకే సీఎం సమావేశం ఏర్పాటు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ పాలన తట్టుకోలేక తమకు అధికారం ఇచ్చారని, వచ్చే టర్మ్లోనూ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. సీఎంగా రేవంత్కు వంద మార్కులు : జగ్గారెడ్డి సీఎంతో జరిగిన భేటీలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చ జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున సీఎం ఇస్తారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ పరిధిలోని రెండు స్థానాలు గెలుచుకోవాలని తమకు దిశానిర్దేశం చేశారన్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదన్నారు. ఓటమి పాలైనా తాము పార్టీ తరపున ఎమ్మెల్యేలమని, సీఎంగా రేవంత్కు వంద మార్కులు వేస్తానన్నారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు అంశం చర్చకు వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. -
నేడు UPSC ఛైర్మన్ తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి
-
2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంటాయి. 2023లో ప్రధాని మోదీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర 11 దేశాలలో పర్యటించారు. మే 19.. జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాను సందర్శించారు. ఇక్క జరిగిన ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సిడ్నీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు. జూన్ 20.. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరుకున్న ప్రధాని జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్కు వెళ్లారు. జూన్ 22న వైట్ హౌస్ను సందర్శించారు. జూన్ 22.. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు సీనియర్ ప్రముఖులతో పాటు అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు. జూలై 13.. బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో అధికారిక చర్చలు జరిపారు. ఒక ప్రైవేట్ విందులో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లి, అక్కడ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో చర్చలు జరిపారు. ఆగస్టు 22.. జోహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గ్రీస్లో అధికారిక పర్యటన చేశారు. ఇది 40 సంవత్సరాలలో భారత ప్రధాని తొలి పర్యటన. సెప్టెంబర్ 6.. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొన్నారు. నవంబర్ 30.. ఈ ఏడాది చివరిలో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ... -
సీఎం జగన్ కడప టూర్ డే-1
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
ఏపీలో రెండోరోజు కొనసాగుతున్న సీఈసీ పర్యటన
-
వైఎస్సార్ జిల్లా: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం
Updates: ►మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కడప నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►రాత్రికి ఇడుపులపాయలో బస ►రేపు ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం జగన్►అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్లో గాంధీజీ దండి మార్చ్ విగ్రహాలు ఆవిష్కరణ చేసిన సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్ చేరుకున్న సీఎం జగన్ ►అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►అంబేద్కర్ చౌరస్తా చేరుకున్న సీఎం జగన్ ►ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ►దివ్యాంగులను ట్రై స్కూటర్లను పంపిణీ చేసిన సీఎం జగన్ ►రిమ్స్లో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►వైఎస్సార్ కేర్ బ్లాక్, వైఎస్సార్ మానసిక వైద్యశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు ►2,266 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి ►కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ప్రత్యేక హెలికాఫ్టర్లో గోపవరం పయనం ►ఘన స్వాగతం పలికిన జిల్లా నాయకులు, అధికారులు ►మరికాసేపట్లో సెంచూరీ పరిశ్రమ వద్దకు చేరుకోనున్న సీఎం ►వైఎస్సార్ కడప జిల్లాకు బయలేర్దిన సీఎం జగన్ ►మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం ►బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరులలో సీఎం జగన్ పర్యటన సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
23, 24, 25 తేదీల్లో.. సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ ఉ.9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
రేపు ‘అల్లూరి’ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 21న (గురువారం) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందజేసి, అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అపోహలొద్దు.. ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తుపాన్తో పంటలు నష్టపోయిన అన్నదాతలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు వెంటనే అందిస్తామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం, బుద్దాం గ్రామాల్లో దెబ్బతిన్న మిరప, వరి పంటలను పరిశీలించిన అనంతరం బాధిత రైతులను సీఎం జగన్ ఊరడించారు. ఎన్నడూ లేనంతగా నాలుగు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం జగన్ అన్నారు. ఇంత బాధాకరమైన పరిస్థితులు వచ్చినా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న నమ్మకం ఇక్కడి రైతన్నల్లో కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ ప్రభుత్వంలో అందరికి మంచే జరుగుతుందని కచ్చితంగా చెబుతున్నానన్నారు. నాలుగు రోజుల్లో.. 'ఏ రాష్ట్రాలలోనూ లేనిది, మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థలుగా అవి నిలిచాయి. వివక్షకు తావులేకుండా, ఆఖరికి మనకు ఓటు వేయని వారికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం అందరికి తోడుగా నిలుస్తోంది. జరిగిన నష్టాన్ని పారదర్శకంగా గుర్తించి, జాబితాను సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిచేసుకుని మరీ సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం మనదే. గతంలో కరువులు, వరదలు వచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఏ రోజు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో, అసలు ఎంతమందికి వస్తుందో కూడా తెలియని దుస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మారింది. వరదతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ రేషన్తో పాటు ప్రతి ఇంటికి రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. దాదాపు 12 వేల మందికి వారికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళ దుంపలతోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ వలంటీర్ వచ్చి అందచేస్తారు. 4 రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీని పూర్తి చేస్తాం.' అని సీఎం జగన్ తెలిపారు. ఇన్సూరెన్స్పై ‘ఈనాడు’ దిక్కుమాలిన రాతలు మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! అదేపనిగా అబద్ధాలనే చూపించే, ప్రచురించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడులో ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు. ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వంలోనే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. జూన్ నాటికి రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తాం. గతంలో ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా వారు కట్టాల్సిన ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ అన్నదాతలకు ఇన్సూరెన్స్ ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలో మాత్రమే. గతంలో చంద్రబాబు పాలనలో వరుసగా కరువు కాటకాలే తాండవించినా ఐదేళ్లలో 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎక్కడా కరువు కాటకాలు లేకపోయినా నాలుగేళ్లలో 55 లక్షల మందికి రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు అందచేశాం. ఈ ఖరీఫ్లో రైతన్న ఇబ్బంది పడితే వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూ్యరెన్స్ కచ్చితంగా వస్తోంది. దేశంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్నది మన ప్రభుత్వమే. పారదర్శకంగా పంట నష్టం వివరాలు తుపాను విపత్తు వేళ కలెక్టర్లు అందరూ వెంటనే స్పందించి ఎన్యుమరేషన్ మొదలు పెడుతున్నారు. ఎన్యూమరేషన్ పూర్తైన తర్వాత 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో జాబితాను పారదర్శకంగా ప్రదర్శిస్తారు. ఈ జాబితాలో ఎవరైనా రైతు మిస్ అయితే, వారి పేరు మళ్లీ చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే సంక్రాంతిలోపు అర్హులు అందరికీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా గత నాలుగేళ్లుగా ఏటా ఇలానే అమలు చేస్తున్నాం. డబ్బులిచ్చి.. తగినంత సమయం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా.. సీఎం హోదాలో నేను వచ్చి జరుగుతున్న పనులను చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకుని, ఫొటోలకు పోజులిస్తూ టీవీల్లో, పేపర్లలో రావాలని తాపత్రయపడే వ్యక్తిని కాదు. గతానికి, ఇప్పటికి తేడా అదే. ఏదైనా సంఘటన జరిగితే మీ బిడ్డ కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాడు. ముందుగా కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేస్తున్నాడు. వారికి సరిపడా వారం రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత బాగా జరిగిందా లేదా? అనేది నిర్ధారించుకునేందుకు స్వయంగా వచ్చి ప్రజలనే నేరుగా అడుగుతున్నాడు. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడనే మాట ప్రజల నుంచి రావాలని అధికారులకు చెప్పా. గతంలో చంద్రబాబు కలెక్టర్లకు నిధులు ఇచ్చేవారు కాదు. అసలు ‘టీఆర్ 27’ అనే పదానికి అర్థమే ఆయనకు తెలియదు. కలెక్టర్లు, తహసీల్దార్లు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ విపత్తు సమయంలో పరుగులు తీస్తూ ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోంది. ఇప్పుడు జరిగిన నష్టం అపారం. చేయాల్సిన సాయం అంతా పారదర్శకంగా, వేగంగా జరుగుతోంది. గత ప్రభుత్వాల కంటే కచ్చితంగా ఎక్కువే జరుగుతుందని గుర్తుంచుకోవాలి. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్థనరెడ్డి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, కరణం బలరాం, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం -
Live తుఫాను బాధితులకు నేరుగా సీఎం వైఎస్ జగన్ పరామర్శ
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! -
నేడు, రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన
-
అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి రావ లసి ఉండగా.. ఆ కార్యక్రమాలన్నీ ఒకరోజు వాయిదా పడ్డాయి. ఈనెల 18న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 18వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో జరిగే బహిరంగ సభల్లో షా పాల్గొంటారు. -
విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
నేడు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
13 నుంచి కేసీఆర్ మలివిడత ప్రజా ఆశీర్వాద సభలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మలివిడత ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ ఖరారైంది. తొలి విడతలో అక్టోబర్ 15 నుంచి ఈనెల 3 వరకు 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే సభలను నిర్వహించారు. 5వ తేదీ నుంచి 8 వరకు మరో 11 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇవి పూర్తికాగానే 5 రోజుల విశ్రాంతి అనంతరం 13 నుంచి 28వ తేదీ వరకు 16 రోజుల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన కొనసాగేలా మలి విడత షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో సీఎం పాల్గొంటారు. ఈనెల 25న హైదరాబాద్లో భారీ సభను నిర్వహించనున్నారు. రెండో విడత పర్యటనలో ఒక్కో రోజు 3–4 నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 28న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తయ్యేలా షెడ్యూల్ను పార్టీ రూపొందించింది. -
రెండో రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
-
రాహుల్ పర్యటనలో మార్పు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ఈనెల 1, 2 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్నా ఒకరోజు ముందుగానే వచ్చారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో జరిగిన పాలమూరు ప్రజాభేరి సభకు ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హాజరుకావాల్సి ఉంది. రాహుల్ ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి హాజరై బుధవారం మధ్యాహ్నానికి రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ, ప్రియాంకకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రాహుల్ సీఈసీ సమావేశాన్ని రద్దు చేసుకుని కొల్లాపూర్ బహిరంగ సభకు హాజరయ్యారు. అనంతరం రాత్రికి హైదరాబాద్లో బస చేశారు. బుధవారం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ పట్టణాల్లో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. తొలుత కల్వకుర్తి సభలో పాల్గొని, ఆ తర్వాత జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్కు హాజరవుతారు. అక్కడి నుంచి షాద్నగర్లో పాదయాత్ర చేసి అక్కడ జరిగే కార్నర్ మీటింగ్కు హాజరవుతారు. తర్వాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. కాగా, రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన 2వ తేదీ షెడ్యూల్ను రాహుల్ వాయిదా వేసుకున్నారు. మూడో తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ముగిశాక మరోమారు రాహుల్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. -
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
-
నేడు తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పర్యటన
-
నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడుచోట్ల సీఎం సభలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కె.చంద్రశేఖర్రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కాగా, ఈ నెల 31వ తేదీన సీఎం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
బీజేపీకి బీసీ బూస్ట్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఓవైపు.. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన చేసిన ప్రకటన మరోవైపు ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. బీసీలకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని కొంతకాలం నుంచి చెప్తున్న బీజేపీ అధిష్టానం.. అధికారికంగా బీసీ ఎజెండాను ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఆ వర్గాలు ఎంతమేర ప్రభావితం అవుతాయి, ఏ మేర ఓట్లుగా మారుతాయని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందే బీసీని సీఎం చేస్తామని ఇలా ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమేనని నేతలు అంటున్నారు. అంతేకాదు ఆ బీసీ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. బీజేపీ చిత్తశుద్ధిని చాటేలా.. 2014లోనే ఓబీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధాని చేయడం, 2019లోనూ ఆయననే కొనసాగించడం, మోదీ కేబినెట్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా 27 మంది బీసీ, ఓబీసీ మంత్రులు, ఎస్సీ,ఎస్టీలకూ సముచిత సంఖ్యలో మంత్రి పదవులను బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన పార్టీ చిత్తశుద్ధిని చాటేలా ఉందని అంటున్నాయి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్షా పలువురు ముఖ్యనేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి అమిత్షాతో కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ వేర్వేరుగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో అమిత్షాను కలసి ‘ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్ట్’ప్రతిని అందజేశారు. దానిని జాతీయ నాయకత్వం పరిశీలించి ఖరారు చేయనుంది. -
తెలంగాణలో అమిత్ షా పర్యటన
-
క్షిపణి దాడుల మధ్య వార్ జోన్కు బైడెన్ ఎలా చేరారు? సెక్యూరిటీ విధానమేమిటి?
ఇజ్రాయెల్కు, ఉగ్ర సంస్థ హమాస్కు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ మరణాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇప్పటి వరకు 3500 మందికి పైగా జనం మరణించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ సందర్శించారు. ఒకపక్క క్షిపణుల వర్షం కురుస్తున్నా... జోబైడెన్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకున్నారు. ఎలా? ఆయన భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సురక్షితంగా టెల్ అవీవ్ ఎలా చేరుకున్నారు? యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధంలో దెబ్బతిన్న దేశాన్ని సందర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. రష్యా- ఉక్రెయిన్ల మధ్య గత ఏడాది యుద్ధం మొదలైన తరువాత కూడా ఆయన ఉక్రెయిన్ లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకుని, రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా జో బైడెన్.. ఇజ్రాయెల్లోని వార్ జోన్ను సందర్శించారు. ఆ దేశ అధినేత బెంజమిన్ నెతన్యాహు స్వయంగా బైడెన్కు స్వాగతం పలికారు. అయితే ఒకపక్క క్షిపణులు ప్రమాదకరంగా ఎగురుతున్న తరుణంలోనే జో బైడెన్ వార్జోన్కు ఎలా చేరుకున్నాడనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం అమెరికా అధ్యక్షుని పర్యటన వివరాలు చాలా గోప్యం అనే చెప్పాలి. అతికొద్ది మందికి మాత్రమే ఆయన ఇజ్రాయెల్ పర్యటన వివరాలు తెలుసు. ఈ పర్యటన షెడ్యూల్ లీక్ కాకుండా సీక్రెట్ సర్వీస్ పలు జాగ్రత్తలు తీసుకుంది. ఉక్రెయిన్ పర్యటనలో సమయంలోనూ బైడెన్ రహస్యంగానే వెళ్లారు. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. ప్రత్యేక రైల్లో ఆయన ఉక్రెయిన్కు చేరుకున్నారు. ఈ సమయంలో అతని భద్రతా విభాగంలో పలువురు అధికారులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. అదేరీతిలో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంలోనూ భద్రత కల్పించారు. అయితే బైడెన్ విమాన మార్గం ద్వారా సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ చేరుకున్నారా? లేక రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వెళ్లారా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అమెరికా అధ్యక్షుని కాన్వాయ్లో ఏ క్షిపణి ప్రభావానికి గురికాని బీస్ట్ వంటి కార్లు ఉన్నాయి. అంతేకాకుండా బైడెన్ విమానంలో ప్రయాణించిన పక్షంలో దానికి భద్రతగా ముందు వెనకల యుద్ధ విమానాలను కూగా మోహరిస్తారు. ఈ యుద్ధ విమానాలు ఎటువంటి దాడులనైనా తిప్పికొడతాయి. ఇది కూడా చదవండి: హమాస్లో ‘మ్యాన్ ఆఫ్ డెత్’ ఎవరు? టాప్ కమాండర్ల పనేమిటి? -
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మాకేం చెప్పాల్సిన పనిలేదు
-
నేడు తెలంగాణలో రాహుల్, ప్రియాంక పర్యటన
-
రేపు ఎమ్మిగనూరులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
-
Infy New Campus: సీఎం జగన్ తోడ్పాటు హర్షణీయం: ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలంజన్ రాయ్
ఆంధ్రప్రదేశ్లో సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తున్న సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ అన్నారు. సీఎం జగన్ వైజాగ్లోని రుషికొండలో సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలంజన్ రాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందిస్తున్న మద్దతుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంస్థ భవనాన్ని 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1,000 మంది ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ కోసం అన్ని వసతులు కల్పించేలా దీన్ని రూపొందించామన్నారు. -
విశాఖలో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
18న ములుగులో సభ.. 19న భూపాలపల్లిలో పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈనెల 18న కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభించేందుకు రానున్న ఆయన మూడు రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. ముందుగా కొండగట్టు నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావించినా, రాహుల్ షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. దీని ప్రకారం రామప్ప ఆలయం వద్ద రాహుల్ కాంగ్రెస్ బస్సుయాత్రను ప్రారంభిస్తారు. ఏఐసీసీ వర్గాలు వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం 18, 19, 20 తేదీల్లో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాదయాత్రలు చేయనున్న ఆయన పలువురు కారి్మకులు, ఇతర వర్గాలతో సమావేశం కానున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ములుగు, పెద్దపల్లి, ఆర్మూర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మూడు దశల్లో బస్సు యాత్ర ప్రతి రోజు మూడు నియోజకవర్గాల చొప్పున 12 రోజులపాటు రాష్ట్రంలోని 36 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడతలో రాహుల్ మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. మూడు రోజుల పర్యటనతో తొలి విడత యాత్ర ముగియనుండగా, దసరా తర్వాత రెండో విడత ప్రారంభించనున్నారు. ఆ సమయంలో ప్రియాంకా గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఇక, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిశాక మూడో విడత నిర్వహించాలని, ఈ యాత్రకు సోనియాతో సహా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యేలా టీపీసీసీ ప్రణాళిక రూపొందిస్తోంది. -
ఈనెల 18న తెలంగాణకు రాహుల్, ప్రియాంక
-
16న సీఎం జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16న (సోమవారం) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుని మధురవాడ ఐటీ హిల్ నంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హెలిప్యాడ్ వద్ద జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ మిషన్లు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో యుజియా స్టెరైల్ ప్రెవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవంలోను, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోను పాల్గొంటారు. తరువాత అచ్యుతాపురం ఏపీసెజ్కు చేరుకుని లారస్ ల్యాబ్స్ యూనిట్ 2 ఫార్ములేషన్ బ్లాక్ ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
రేపు కాకినాడ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
మా తరానికి విద్యా ప్రదాత సీఎం జగన్
సాక్షి, అమరావతి, నెట్వర్క్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మా మాటలను ప్రపంచమంతా ఆసక్తిగా ఆలకించిందంటే మన విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల పుణ్యమే! చెట్ల కింద సాగే వానాకాలం చదువులను సంస్కరణల బాట పట్టించిన సీఎం జగన్ సర్దే ఆ గొప్పతనమంతా! చదువులతోటే పేదరికాన్ని ఎదిరిద్దామన్న ఆయన పిలుపు అక్షర సత్యం! విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చో దేశానికే మార్గ నిర్దేశం చేశారు. ప్రతిభతో రాణిస్తున్న పేదింటి బిడ్డలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఐరాస, వరల్డ్ బ్యాంక్ వేదికగా అంతర్జాతీయ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించడం.. ఎన్నడూ రాష్ట్రం దాటని మేం ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో కాలు మోపడం.. కాణీ ఖర్చు లేకుండా విదేశాలకు వెళ్లి రావడం.. ఇదంతా ఇంకా నమ్మశక్యంగా లేదు!.. ఇదీ నిరుపేద కుటుంబాల్లో జన్మించి అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకట్టుకున్న 10 మంది విద్యార్థుల మనోగతం. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 45 లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించి వివిధ వేదికలపై తమ గళాన్ని సగర్వంగా వినిపించారు. ప్రభుత్వ బడి నుంచి ఐఎంఎఫ్కు.. ఎకరం పొలంతో పాటు కేబుల్ ఆపరేటింగ్ పనులు చేసుకునే రైతు బిడ్డనైన నాకు 190 దేశాలకు సభ్యత్వమున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా అదృష్టమే. అది సీఎం జగన్ సర్ తెచ్చిన విద్యా సంస్కరణల ఫలితమే. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానాన్ని అగ్రరాజ్యం ప్రతినిధులకు వివరించడం చాలా సంతోషంగా ఉంది. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, షూలు, నాణ్యమైన పోషకాహారం, ట్యాబ్లు, కార్పొరేట్ స్థాయిలో పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని తెలియచేశా. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రమణ్యన్ మాలో ఎంతో స్ఫూర్తి నింపారు. ఏ స్థాయికి ఎదిగినా మన మూలాలను మరువకూడదని, రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ఖండాతరాలకు విస్తరింపజేయాలని నిర్ణయించుకున్నా. పేద పిల్లలకు జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంది. – వంజివాకం యోగీశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరసింగాపురం, తిరుపతి జిల్లా ఎన్నడూ చూడని సదుపాయాలు.. మా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాం. గతంలో ఎన్నడూ చూడని సదుపాయాలను సీఎం జగన్ ప్రభుత్వం కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – నాగరాజు, విజయ (యోగీశ్వర్ తల్లిదండ్రులు, అక్క) నిజంగా.. నేనేనా! ఐరాస, వరల్డ్ బ్యాంకుల్లో ప్రసంగించింది నేనేనా అని ఆశ్చర్యంగా ఉంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించడాన్ని కూడా నమ్మలేకున్నా. సోషల్ పుస్తకంలో ఫొటో మాత్రమే చూసిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఒక రోజంతా ఉన్నాం. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఎకో అంబాసిడర్ కార్యక్రమంలో పాల్గొని ఇతర దేశాల విద్యార్థులతో ముచ్చటించి వారి సంస్కృతిని తెలుసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, పథకాలను వివరించాం. ప్రభుత్వ పాఠశాలల్లో మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాదీవెన, గోరుముద్ద తదితర పథకాల అమలు తీరుతోపాటు బడుల్లో తాగునీరు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, ల్యాబ్స్తో పాటు జగనన్న కానుక కింద స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు, షూలు ప్రతి విద్యార్థికీ ఉచితంగా ఇవ్వడంపై వరల్డ్ బ్యాంక్, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారులతో మాట్లాడాం. నయాగరా వాటర్ ఫాల్స్ చూశాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, 2001లో కూలిపోయిన ట్విన్ టవర్స్ చరిత్ర తెలుసుకున్నా. – అల్లం రిషితారెడ్డి, కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల, విజయనగరం ఇంత గుర్తింపు ప్రభుత్వ చలవే.. గతంలో మా ఇద్దరు అమ్మాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాం. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాం. ఇద్దరికీ నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదివించి ఉంటే ఇంత గుర్తింపు లభించేది కాదు. – ఉదయలక్ష్మి, రామకృష్ణారెడ్డి (రిషితారెడ్డి తల్లిదండ్రులు) విద్యా సంస్కరణల అమలుతో.. మా అమ్మ ఫాతిమా వ్యవసాయ కూలీ. మాలాంటి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసగించే అవకాశాన్ని సీఎం జగన్ సర్ కల్పించారు. అమెరికాలో 15 రోజుల పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. విద్యాపరంగా ఎలాంటి సంస్కరణలు అమలుపరిస్తే దేశం అభివృద్ధి చెందుతుందో ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాడు–నేడు, విద్యాకానుక, డిజిటల్ బోధన, గోరుముద్ద, అమ్మఒడి లాంటి పథకాలను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా స్వేచ్ఛ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతోంది. – షేక్ అమ్మాజాన్, ఏపీ ఆర్ఎస్, వేంపల్లి, శ్రీసత్యసాయి జిల్లా పేద కుటుంబాలకు విద్యా ప్రదాత ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న సీఎం జగన్ మా తరంలో పేద కుటుంబాలకు విద్యా ప్రదాతగా నిలిచిపోతారు. మన రాష్ట్రంలో తెచ్చిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఐరాస వేదికగా వీటిని చాటిచెప్పాం. ఈ పర్యటనను కలలో కూడా ఊహించలేదు. మాలాంటి పేద విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం వల్లే ఈ అవకాశం లభించింది. రెండు వారాల పాటు ఎందరో ప్రముఖులతో చర్చించడం గర్వంగా ఉంది. – మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ, ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా ధీమాగా చదువులు.. కేజీబీవీలో చదువుకున్న నా బిడ్డకు ఈ అవకాశాన్ని కల్పిం చిన సీఎం జగన్కు రుణపడి ఉంటాం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలాంటి తండ్రులకు పిల్లల చదువులపై బెంగ పోయింది. డబ్బున్న వారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపడం విద్యా సంస్కరణల పుణ్యమే. – రామారావు, ఆటో డ్రైవర్ (చంద్రలేఖ తండ్రి) ప్రపంచానికి చాటి చెప్పా.. మా నాన్న దస్తగిరి లారీ డ్రైవర్. అమ్మ రామలక్ష్మి రజక వృత్తిలో ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు అమెరికా వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే అవకాశాన్ని సీఎం జగన్ కల్పిం చారు. ఈ పర్యటన జీవితాంతం గుర్తుంటుంది. న్యూయార్క్లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రపంచానికి తెలియచేశా. నాడు– నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించా. ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. టాయిలెట్ల శుభ్రతతో పాటు బాలికలకు ప్రత్యేకంగా న్యాప్కిన్ల వాడకంపై అవగాహన కల్పించడం, అమ్మఒడి పథకంతో స్కూళ్లలో డ్రాప్అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ అంశాలను ఐరాస ప్రతినిధులకు వివరించా. మన దేశ ఆర్థి క వ్యవస్థలో యువత భాగస్వామ్యంపై ప్రసంగించా. ఐఐటీ గ్రాడ్యుయేట్స్లో చాలా మంది స్టార్టప్లు ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పా. – చాకలి రాజేశ్వరి, ఏపీ మోడల్ స్కూల్, నంద్యాల పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే మాకు.. కాకినాడ జిల్లా తీరప్రాంత గ్రామమైన రమణక్కపేటలో నిరుపేద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కుటుంబంలో జన్మించిన నాకు అంతర్జాతీయ వేదికపై ప్రసంగించేలా సీఎం జగన్ సార్ గొప్ప అవకాశాన్ని కల్పించారు. నాన్న సింహాచలం సెక్యూరిటీ గార్డు కాగా అమ్మ శాంతి గృహిణి. నేను, చెల్లి, తమ్ముడు.. ఇదీ మా కుటుంబం. నాన్న కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తూ మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. పక్క ఊరు వెళ్లాలన్నా చార్జీల గురించి ఆలోచించే కుటుంబం నుంచి వచ్చిన నేను అమెరికా వెళ్లానంటే అది జగన్ సార్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల పుణ్యమే. విద్యతోనే అన్నీ సాధ్యమవుతాయని సీఎం సార్ చెబుతుంటారు. అది నిజమే. అందుకు నేనే నిదర్శనం. సాధారణ విద్యార్థులను ప్రభుత్వ ప్రతినిధులుగా అమెరికా పంపించి సీఎం జగన్ సర్ చరిత్ర సృష్టించారు. భవిష్యత్లో ఐఏఎస్ అయ్యి సీఎం జగన్ సార్ ఆశయ సాధనకు కృషిచేస్తా. రాష్ట్రంలోని విద్యా సంస్కరణలు విదేశాల్లో సైతం గుర్తింపు పొందాయి. కొలంబియా యూనివర్సిటీలో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవప్రదమైన జీవనోపాధులపై వివరించడం ఆనందంగా ఉంది. – దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ గురుకులపాఠశాల,వెంకటాపురం, కాకినాడ జిల్లా మరపురాని అనుభూతి.. ఐరాస, కొలంబియా యూనివర్సిటీల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నా. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై మాట్లాడటం మరపురాని అనుభూతి. మా జీవితాన్ని మలుచుకునేందుకు ఈ పర్యటన ఎంతో స్ఫూర్తినిచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరువలేం. విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలను సద్వినియోగం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. – పసుపులేటి గాయత్రి, జడ్పీహెచ్ఎస్, వట్లూరు, పెదపాడు మండలం, ఏలూరు జిల్లా ఎంతో నేర్చుకున్నాం.. నాకు ఇంత అరుదైన అవకాశం జగన్ మామయ్య పాలనలో దక్కడం, అందుకు ప్రభుత్వ పాఠశాలలు వేదిక కావడం ఎన్నటికీ మర్చిపోలేను. సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు జరిగిన విదేశీ విజ్ఞాన యాత్రలో ఐరాస జనరల్ అసెంబ్లీ హాల్ని సందర్శించాం. కొలంబియా యూనివర్సిటీలో ఎకో ఎంబాసిడర్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ట్విన్ టవర్స్ కూలిన చోటు, నయాగరా జలపాతం ఇలా వివిధ ప్రాంతాలను సందర్శించి అక్కడి సంస్కృతిపై అవగాహన పెంచుకున్నాం. విదేశీ విద్యార్థులతో ముచ్చటించడం కొత్త అనుభూతిని కలిగించింది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆర్థి క విషయాలు, అంతర్జాతీయ ఆర్థి క అవసరాలు, ఆర్థిక పరిపుష్టికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తదితర అంశాలను నేర్చుకున్నాం. అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ను సందర్శించే అవకాశం రావడం మరపురాని అనుభూతి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో 12 శాతం విద్యపై ఖర్చు చేయటాన్ని బట్టి చదువులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. – జి.గణేష్ అంజన సాయి, వల్లూరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా గిరిజన బిడ్డకు గర్వకారణం.. మాది కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామం. కుటుంబ కారణాలతో తల్లిదండ్రులు విడిపోయారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ఏసీ బస్సు అంటే ఏమిటో కూడా తెలియదు. గతంలో ఓసారి విశాఖపట్నం, మరోసారి సైన్స్ ఎగ్జిబిషన్ కోసం విజయవాడ వెళ్లా. అలాంటిది మన రాష్ట్ర ప్రతినిధిగా విమానం ఎక్కి ఏకంగా అమెరికా వెళ్లి రావడం కలగానే ఉంది. మన విద్యా సంస్కరణలు, సంక్షేమ పథకాలను ఐరాస, యూఎస్ స్టేట్ అధికారులకు వివరించా. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు కలుగుతున్న ప్రయోజనాలను కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో తెలియచేశా. వివిధ దేశాల విద్యార్థులతో మాట్లాడి భిన్న సంస్కృతులను తెలుసుకునే అవకాశాన్ని కల్పిం చిన ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు. – సామల మనస్విని, కేజీబీవీ, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా ప్రభుత్వ స్కూళ్ల విశిష్టతను చాటిచెప్పాం.. నాన్న సోమనాథ్, అమ్మ గంగమ్మ వ్యవసాయ కూలీలు. పేద కుటుంబాల నుంచి వచ్చిన మేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిం చిన సదుపాయాలు, విశిష్టతను ప్రపంచానికి తెలియచేశాం. విద్యారంగంలో మన రాష్ట్రం ఏ స్థాయిలో రాణిస్తోందో చాటాం. ఈ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. యూఎన్వో హెడ్ క్వార్టర్స్, ఐఎంఎఫ్ సమావేశంలో ప్రసంగించడం మరచిపోలేని అనుభూతి. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, నయగారా ఫాల్స్, మ్యూజియం, వైట్హౌస్ లాంటి ప్రదేశాలను సందర్శించడం మాలాంటి వారికి అసాధ్యం. సీఎం జగన్ సర్ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు. ప్రతిభ చాటిన మాకు మరువలేని అవకాశాన్ని కల్పిం చారు. చదువుల్లో రాణించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ సదస్సులకు ఎంపిక చేయడం దేశంలో ఇదే ప్రథమం. – మాల శివలింగమ్మ, కేజీబీవీ, ఆదోని, కర్నూలు జిల్లా -
ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్...కీలక మీటింగ్
-
నేడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతివైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూడు రోజుల్లో రెండో సారి..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్నగర్లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యటనలో బీఆర్ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామాబాద్లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పాలమూరులో శంఖారావంతో.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలమూరు ప్రజాగర్జన సభలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. ప్రధాని మోదీ ఈ సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న సాయాన్ని వివరించారు. రూ.13,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలోని అధికార పార్టీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంగళవారం నిజామాబాద్ సభలోనూ అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రాజకీయ విమర్శలతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు గెలుచుకు న్న బీజేపీ ఈసారి మరింత పట్టుపెంచుకునే దిశ గా నిజామాబాద్లో సభ, ప్రధానితో వరాల ప్రక టన చేపట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్పైనా విమర్శల దాడి: పాలమూరు సభలో అధికార బీఆర్ఎస్పై, కేసీఆర్ సర్కార్ తీరుపై, బీఆర్ఎస్, ఎంఐఎం కుటుంబ రాజకీయాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఏడాది చివరలో తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, అందులో రాజస్తాన్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావడం, తెలంగాణలోనూ ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండటంతో..ఈసారి కాంగ్రెస్ పార్టీపైనా మోదీ విరుచుకుపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో.. నిజామాబాద్ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు ప్రకటించారు. దీనికి నిజామాబా ద్, జగిత్యాల, నిర్మల్ జిల్లా ల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. నిజామాబాద్ పర్యటనలో మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో ప్రాజెక్టులు, పథకాలు ఇవీ.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లో 800 మెగావాట్ల తొలి యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు. రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్ రైల్వేలైన్ను.. సిద్దిపేట–సికింద్రాబాద్ వరకు తొలి రైలు సర్వీసును ప్రారంభిస్తారు. ‘ధర్మాబాద్ మహారాష్ట్ర)–మనోహరాబాద్– మహబూ బ్నగర్–కర్నూల్ (ఏపీ)’ రైల్వే లైన్లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేస్తారు. ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్ మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ–17 సైనిక హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకుంటారు. æ 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్లో తొలి వేదిక వద్దకు చేరుకుంటారు 3.35 గంటలదాకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 3.45 గంటలకు పక్కనే ఉన్న బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు 4.45 గంటల దాకా సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో తిరుగుప్రయాణం అవుతారు. -
సింగపూర్, మలేషియాలకు ఐఆర్సీటీసీ బడ్జెట్ ప్యాకేజీ
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) తాజాగా సింగపూర్, మలేషియా టూర్ను ప్రకటించింది. భారతదేశంలోని వారే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న పర్యాటకులు మలేషియా, సింగపూర్లను సందర్శించాలని అనుకుంటారు. అయితే బడ్జెట్ కారణంగా ముందడుగు వేయలేకపోతారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఐఆర్సీటీసీ సింపుల్ బడ్జెట్ ప్యాకేజీలో సింగపూర్, మలేషియాలలో పర్యటించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్యాకేజీలో ఆహారం పానీయాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇదొక్కటే కాదు ఆయా ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఇంగ్లీష్ గైడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో పర్యాటకులను ముందుగా భారతదేశం నుండి విమానంలో సింగపూర్కు తీసుకువెళతారు. తరువాత అక్కడ టాక్సీ ఏర్పాటు చేస్తారు. విలాసవంతమైన హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీకి ఎన్చాంటింగ్ సింగపూర్ అండ్ మలేషియా అని పేరు పెట్టింది. ఇది ఫ్లైట్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ 2023 నవంబర్ 20న, అలాగే 2023, డిసెంబర్ 4న ప్రయాణించేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో 7 పగళ్లు, 6 రాత్రులు ఉంటాయి. ప్యాకేజీలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వంటి సౌకర్యాలు లభిస్తాయి. భద్రతా ఏర్పాట్ల బాధ్యతను ఐఆర్సీటీసీ పర్యవేక్షిస్తుంది. ఈ ప్యాకేజీలో పర్యాటకులు కౌలాలంపూర్లోని బటు గుహలు, పుత్రజయ సిటీ టూర్, కౌలాలంపూర్ సిటీ తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సింగపూర్లో మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్, సెంటోసా ఐలాండ్ వంటి పలు ప్రదేశాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ బీమా కూడా ఉంది. ఇక టిక్కెట్ ఛార్జీల విషయానికొస్తే ఒక్కొక్కరు రూ.1,63,700 చెల్లించాలి. ఇద్దరు వ్యక్తుల ప్యాకేజీని బుక్ చేస్తే రూ. 1,34,950 చెల్లించాలి. రూ. 1,18,950తో ముగ్గురు వ్యక్తులు ఈ టూర్ని ఎంజాయ్ చేయవచ్చు. ఇది కూడా చదవండి: మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! -
నేడు మహబూబ్ నగర్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ
-
2 రోజులు.. రూ. 21,566 కోట్ల ప్రాజెక్టులు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.21,566 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. వచ్చే నెల 1న మహబూబ్నగర్ జిల్లాలో, 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఆయా రోజుల్లో అధికారిక కార్యక్రమాల అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 9 ఏళ్లలో 9 లక్షల కోట్లకుపైగా ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో రూ.9 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసిందని కిషన్రెడ్డి చెప్పారు. ‘‘మేం అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. రూ.26 వేల కోట్లతో రీజనల్ రింగు రోడ్డు నిర్మించేందుకు ముందుకొస్తే.. కేసీఆర్ సర్కారు ఇంతవరకు గజం భూమి కూడా సేకరించి ఇవ్వలేదు. ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తుంటే వాటికి హాజరుకాని కేసీఆర్కు ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదమని.. తొలి ఐదేళ్లు ఒక్క మహిళా మంత్రి లేకుండా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నాయని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే చర్చకు రావాలి.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎన్నడూ చెప్పలేదని కిషన్రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం పథకం ప్రకారం కుట్రలు పన్నుతోందని, తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఉండవని స్పష్టంగా చెప్పినా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్కు దమ్ముంటే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు రావాలి. గత 9 ఏళ్లలో తెలంగాణకోసం కేంద్రం ఏం చేసిందో నేను చెబుతా.. రాష్ట్రం ఏ చేసిందో ఆయన్ను చెప్పమనండి..’’ అని కిషన్రెడ్డి సవాల్ చేశారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనే కార్యక్రమాలు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.1.10 లక్షల కోట్ల ఖర్చు దేశంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధాని మోదీ ‘హీరా’ మోడల్ (హెచ్– హైవేస్, ఐ– ఇన్ఫోవేస్, ఆర్– రైల్వేస్, ఏ– ఎయిర్వేస్ అభివృద్ధి)తో ముందుకెళ్తున్నారని కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన జాతీయ రహదారులను ఇప్పటికే కేటాయించామని చెప్పారు. ఎయిర్పోర్టుల నిర్మాణం విషయంలోనూ కేంద్రం చిత్తశుద్ధితో ఉందని.. దేశవ్యాప్తంగా 2014కు ముందు వినియోగంలో ఉన్న 75 విమానాశ్రయాల సంఖ్యను ఈ తొమ్మిదేళ్లలో 150కి పెంచిందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో రాష్ట్రంలో మాత్రం ఒక్కటి నిర్మాణం కాలేదన్నారు. ఎన్నికలు వస్తుండటంతో వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏదో కంటితుడుపు ప్రకటన చేసిందని విమర్శించారు. ఎంఐఎం తాటాకు చప్పుళ్లకు భయపడం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నివాసంపై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయ డం సరికాదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, దాని మిత్రులు కలసి చేస్తున్న ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటనకు భారీగా భద్రత: సీఎస్ వచ్చే నెల 1న ప్రధాని మోదీ పర్యటన ముందే ఖరారుకాగా, 3న పర్యటన మాత్రం శుక్రవారమే ఖరారైంది. ప్రధాని ఆరోజున మధ్యాహ్నం 2.55 గంటలకు సైనిక హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకుంటారు. 3.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సైనిక హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సర్వం సిద్ధం ప్రధాని మోదీ పాలమూరు జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇక్కడి భూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్లో సిద్ధం చేస్తున్న సభా ప్రాంగణంలోనే అధికారిక కార్యక్రమాలతోపాటు బీజేపీ సభ జరగనున్నాయి. ఇందులో రెండు స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక స్టేజీ మీద నుంచి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదిక వద్దకు రానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓపెన్ టాప్ జీపును గుజరాత్ నుంచి తెప్పిస్తున్నారు. మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వందలాది మంది మహిళలతో ప్రధానికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్రెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి రెండు లక్షల మందికిపైగా జన సమీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పాలమూరు సభ నుంచే శంఖారావం పూరించనుందని నేతలు చెప్తున్నారు. ప్రధాని హోదాలో మోదీ రెండోసారి పాలమూరుకు వస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన ఇక్కడ నిర్వహించిన సభకు హాజరయ్యారు. 3న నిజామాబాద్ జిల్లా పర్యటనలో.. ►ప్రధాని మోదీ ఈ నెల 3న మధ్యాహ్నం 2.55 గంటలకు నిజామాబాద్కు చేరుకుని.. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ►రామగుండంలో ఎన్టీపీసీ రూ.6వేల కోట్లతో చేపట్టిన థర్మల్ ప్లాంట్లో 800 మెగావాట్ల తొలి యూనిట్ను ప్రారంభిస్తారు. ►ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం–ఏబీహెచ్ఐఎం)లో భాగంగా రాష్ట్రంలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో రూ.516.5 కోట్లతో చేపట్టే 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన చేస్తారు. ►రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన ‘ధర్మాబాద్ (మహారాష్ట్ర)–మనోహరాబాద్, మహబూబ్నగర్– కర్నూల్’ రైల్వే లైన్ల విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ►రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన మనోహరాబాద్–సిద్దిపేట రైల్వేలైన్ను ప్రారంభిస్తారు. పాలమూరు పర్యటన ఇలా.. ►ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ మహబూబ్నగర్కు చేరుకుని, సుమారు రూ.13,545 కోట్ల విలువచేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ►మునీరాబాద్–మహబూబ్నగర్ ప్రాజెక్టులో భాగంగా రూ.505 కోట్లతో నిర్మించిన ‘జక్లేర్–కృష్ణ’ కొత్త రైల్వే లైన్ను జాతికి అంకితం చేస్తారు. దీనిద్వారా హైదరాబాద్–గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇక కృష్ణ స్టేషన్ నుంచి ‘కాచిగూడ –రాయచూర్– కాచిగూడ’ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైల్వే సర్వీసెస్ను ప్రారంభిస్తారు. ► జాతీయ రహదారులకు సంబంధించి రూ.6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్హెచ్ 365 బీబీలో భాగంగా రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట–ఖమ్మం 4 లేన్ల రహదారిని ప్రారంభిస్తారు. ► రూ.2,661 కోట్ల విలువైన హసన్ (కర్ణాటక)– చర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్లైన్ను జాతికి అంకితం చేస్తారు. రూ.1,932 కోట్లతో చేపడుతున్న కృష్ణపట్నం (ఏపీ)– హైదరాబాద్ ‘మల్టి ప్రొడక్ట్ పైప్లైన్ (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్)’కు శంకుస్థాపన చేస్తారు. ►హెచ్సీయూలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ భవనాలను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ? -
29న సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం జగన్ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడు దల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు. బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: ‘రింగ్’ అంతా లోకేశ్దే -
నేడు విజయనగరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
పాపికొండల విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్
దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే -
10 రోజుల లండన్ పర్యటనకు ఏపీ సీఎం వై.ఎస్.జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తూ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు, ఫౌండర్ అంజి మారంతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ సెల్ కో-ఆర్టినేటర్ మహేశ్ బిగాల సైతం కంపెనీ ప్రతినిధులను కలిశారు. నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్దత వ్యక్తం చేశారని మహేశ్ బిగాల తెలిపారు.నిజామాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో క్రిటికల్ రివర్ కంపెనీ ఓ బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్తో జరిగిన భేటీలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ TSTPC విష్ణు వర్ధన్ రెడ్డి, క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజి మారం, తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు మిత్రులు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేసింది. ‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్. -
తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించవద్దన్న ముఖ్యమంత్రి కేసీఆర్..ఇంకా ఇతర అప్డేట్స్
-
కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను నమ్మొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట.. జిల్లా కావడం ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తలసారి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. అభివృద్ధిలో ఇప్పటికే అత్యుత్తమ దశకు చేరుకున్నామన్నారు. ‘‘తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ముందుంది. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభారతి నిర్మిస్తాం. జిల్లాలోని ప్రతి మున్సిపాల్టికి రూ.50 కోట్లు మంజూరు చేస్తాం. ఆర్అండ్బి గెస్ట్హౌస్ కూడా నిర్మిస్తాం. సూర్యాపేటపేట జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తాం. కాంగ్రెస్, బీజేపీలకు 50 ఏళ్లు అవకాశం ఇచ్చారు.. ఈ 50 ఏళ్లలో ఆ పార్టీలు ఏం అభివృద్ధి చేశాయి. రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించిందా?’’ అని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ తప్పకుండా పెంచుతాం.. తర్వలోనే ప్రకటిస్తాం. ఇచ్చిన ఏ మాటా తప్పలేదు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేశాం. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా సాగునీళ్లు ఉన్నాయి. రైతులకు 3 గంటలే కరెంటు చాలని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటకలో కరెంటు కష్టాలు ఇప్పటికే మొదలయ్యాయి. ధరణి వ్యవస్థ తెచ్చాం.. వీఆర్వోలను తొలగించాం. వీఆర్వో వ్యవస్థతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భూముల రిజిస్ట్రేషన్లో అక్రమాలు తొలగిపోయాయి. ధరణితో రిజిస్ట్రేషన్ కష్టాలు తీరిపోయాయి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ధరణి వ్యవస్థను తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. రైతు భూమిని మార్చాలంటే సీఎంకు కూడా అధికారం లేదు. పైరవీకారులకు మళ్లీ అధికారం రాకూడదు. కాంగ్రెస్ వాళ్ల ఆపద మొక్కులను ప్రజలు నమ్మొద్దు. మోసపోతే ఘోష పడతాం. ఎవరు ఎన్ని కథలు చెప్పిన విజయం బీఆర్ఎస్దే’’ అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్బ్యాక్కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
కమలదళం.. కదన వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కదనరంగానికి కమలదళం సమాయత్తమైంది. ఒకవైపు పార్టీ సంస్థాగత పటిష్టత, పార్టీ గెలుపుకోసం అంకితభావంతో పనిచేసే నేతల ఎంపిక, వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నియామకం.. మరోవైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ.. ఇంకోవైపు నెలాఖరులో విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర బీజేపీలో గత సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 30–35 మంది అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో నియోజకవర్గాల వారీగా పార్టీకి ఉన్న బలాబలాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి.. బలహీనంగా ఉన్న సీ, డీ స్థానాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా క్షేత్రస్థాయి నుంచి పట్టుపెంచుకోవడానికి, గెలిచే అవకాశాలు ఎక్కువగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీనేతలు చెప్తున్నారు. అదే తరహా వ్యూహాన్ని ఇక్కడా అమలు చేసే యోచన ఉన్నట్టు వివరిస్తున్నారు. నేడు రాష్ట్రానికి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీకున్న 1,200 మంది ఎమ్మెల్యేల్లో 560 మందిని ఎంపికచేశారు. వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది వారంపాటు తెలంగాణలో ఒక్కో నియోజకవర్గంలో ఒకరు చొప్పున పర్యటించి పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తారు. వారి పర్యటన ముగియగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోరు యాత్రలను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. అలంపూర్ జోగులాంబ ఆలయం, భద్రాచలంలోని సీతారామ ఆలయం, బాసరలోని సరస్వతి ఆలయం నుంచి వీటిని ప్రారంభించే అవకాశముంది. ఓవైపు ఈ యాత్రలను కొనసాగిస్తూనే.. పార్టీపరంగా ఎన్నికల వ్యూహాలను, కార్యాచరణను సిద్ధం చేయడం, అమలు కోసం మేనిఫెస్టో, ప్రచార, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కీలకంగా అమిత్షా పర్యటన ఈ నెల 27న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఖమ్మం పర్యటనను పార్టీ నాయకత్వం సవాల్గా తీసుకుంది. ఈ పర్యటన సందర్భంగా కోర్కమిటీ, ముఖ్య నేతలతో అమిత్షా భేటీ అయి ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణకు తుదిరూపు ఇస్తారని.. రాష్ట్ర పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్షా రాష్ట్ర పర్యటన తర్వాత పార్టీపరంగా కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అంటున్నాయి. 23 నుంచి మళ్లీ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టిన బీజేపీ.. తిరిగి ఈ నెల 23, 24, 25 తేదీల్లో తదుపరి దశ పోరాటాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించనున్నారు. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఈ ఉద్యమాన్ని చేపడతారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. తొలిదశలో ఆందోళనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై చర్చించారు. 20న మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. -
Live: సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
-
నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 18న (శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. హయత్ ప్లేస్ హోటల్ను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ను ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో అమిత్ షా టూర్
-
కోనసీమ జిల్లాలోని వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
-
రైతులేమైనా బిక్షగాళ్లా..?
శంకరపట్నం (మానకొండూర్)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు. అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు. ‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్ ప్రశ్నించారు. నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్ విమర్శించారు. -
నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్కు సీఎం చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
తెలంగాణలో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన..
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థులకు అందని విధంగా తమదైన రీతిలో ప్రజల వద్దకు వెళ్లడానికి నాయకులు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నియోజక వర్గాల స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ధీటుగా బదులు చెప్పగల సరైన ప్రత్యామ్నయం తామే అని చెప్పుతున్న బీజేపీ.. ఈ సారి ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించనుంది. ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచి పర్యటనలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 119 నియోజక వర్గాలకు 119 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు పర్యటన చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే తమకు కేటాయించిన నియోజక వర్గంలో వారం రోజుల పాటు పర్యటించి, స్థానిక నాయకులను కలవనున్నారు. బూత్ స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక అంశాలపై రిపోర్టును తీసుకుని అధిష్ఠానానికి సమర్పించనున్నారని సమాచారం. ఇదీ చదవండి: మోదీని కలవనున్న బండి సంజయ్.. ఏ రాష్ట్రం ఇస్తారో? -
ఈయనేనా మాజీ సీఎం.. చంద్రబాబును పట్టించుకోని జనం
సాక్షి, పగిడ్యాల(నంద్యాల జిల్లా): ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన మొక్కుబడిగా సాగింది. ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణంలో పర్యటన సాగగా, స్వాగతం పలికేందుకు నాయకులు కరువయ్యారు. ఎప్పటిలాగే బూటక మాటలు చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారు. నందికొట్కూరులో రోడ్షోను ముగించుకుని ప్రత్యేక కాన్వాయ్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ముచ్చుమర్రికి చేరుకున్నారు. అయితే చంద్ర బాబుకు జనసంచారం లేని నిర్మానుష్యమైన దారులు మాత్రమే స్వాగతం పలికాయి. సుమారు కిలోమీటరు దూరం ఊరిలో ఓపెన్ టాపు వాహనంలో చంద్రబాబు కనిపించినా స్థానికులు ఎవరూ ఆయనను పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానిక నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో బాబు ప్రాజెక్టు సందర్శన కేవలం 25 నిముషాల్లోనే ముగిసింది. ఇలా వచ్చి, అలా వెళ్లడం చూసి ఈయనేనా మాజీ ముఖ్యమంత్రి అనే చర్చ కొనసాగింది. చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు? -
సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
-
రేపు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
టాటూ కనిపించేలా, ముక్కెర హైలైట్ అయ్యేలా అనసూయ పోజులు (ఫొటోలు)
-
తెలుగు వారు ఎంతో ప్రేమను చూపించారు: రెబ్బా మోనికాజాన్
‘‘సామజవర గమన’ సినిమా సక్సెస్ టూర్కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వెళ్లాం. నాకు తెలుగు భాష రాకపోయినా అక్కడి ప్రజలు నా పట్ల ఎంతో ప్రేమ,ఆప్యాయతను చూపించారు.అలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను’’ అని రెబ్బా మోనికాజాన్ అన్నారు. శ్రీవిష్ణు, రెబ్బా మోనికాజాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ జూన్ 29న విడుదలైంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్కి పరిచయమైన రెబ్బా మోనికాజాన్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. చదువు పూర్తయ్యాక కొన్ని యాడ్స్ చేశాను. మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. దక్షిణాదిలో నేను ఇతర చిత్రాల్లో నటించినా ‘సామజవరగమన’ నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. నా తర్వాతి సినిమాకి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతాను’’ అన్నారు. -
కోనసీమలో సీఎం వైఎస్ జగన్ తొలిసారి పర్యటన...
-
లోన్ పట్టు..టూర్కు జైకొట్టు
సాక్షి, హైదరాబాద్: గతంలో మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల ఉన్నత విద్య వంటి వాటికి పర్సనల్ లోన్లు తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపేవారు. అందుకు భిన్నంగా ఇప్పుడు తమ ఇళ్లను ఆధునీకరించుకోవడం, ఇతర రెనోవేషన్ పనుల కోసమే కాకుండా హాలిడే టూర్కు వెళ్లేందుకు సైతం ఈ రుణాలు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాలకు మించి నాన్ మెట్రో నగరాల నుంచి ఇలాంటి డిమాండ్ పెరుగుతోంది. వ్యక్తిగత రుణాలు పొందే ప్రతీ ఐదుగురిలో ఒకరు హాలిడే టూర్ కోసమే తీసుకుంటున్నట్టు ఆన్లైన్ప్లాట్ఫామ్ ‘పైసా బజార్’ తాజా సర్వేలో వెల్లడైంది. 2023 జనవరి–జూన్ మధ్య పైసాబజార్ నుంచి హాలిడే లోన్స్ తీసుకున్న వారిలో.. దేశంలోని 97 నాన్ మెట్రో నగరాలకు చెందిన వారు 68 శాతం మంది ఉండటం విశేషం. జోథ్పూర్, పట్నా, కాన్పూర్, ఆగ్రా, సూరత్, పాటియాలా తదితర మెట్రోయేతర నగరాల వారే ఈ రుణాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే మెట్రో నగరాల విషయానికొస్తే... ముంబైలో 25 శాతం, బెంగళూరులో 22 శాతం, ఢిల్లీలో 20 శాతం మంది జాలీ ట్రిప్పుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. అభిరుచులు మారుతున్నాయి. సెలవులను ఎంజాయ్ చేసేందుకో లేదా కొత్త కొత్త ప్రాంతాలను చూసేందుకో వెళ్లాలనుకునే వారు పెరుగుతున్నారు. దేశంలోగానీ లేదా విదేశాలకు గానీ వెకేషన్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో వీటి కోసం చాలామంది డబ్బు పొదుపు చేసుకుని దాంతో టూర్లకు వెళ్లేవారు. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటుండటం ట్రెండ్గా మారింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ.. గత ఆరు నెలల్లో హాలిడే టూర్ కోసం పర్సనల్ లోన్లు తీసుకున్న వారిలో 73 శాతం దేశంలోని పర్యాటక ప్రదేశాలకు, 27 శాతం విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. విదేశాల్లో హాలిడే టూర్కు వెళ్లాలనుకుంటే ఎక్కువగా దుబాయ్ (28 శాతం)ని ఎంచుకోగా ఆ తర్వాత థాయ్లాండ్ (15 శాతం),యూరప్ (10 శాతం)ను ఎంచుకుంటున్నారు. దేశంలో అయితే గోవా (23 శాతం), హిమాచల్ ప్రదేశ్ 10శాతం), ఉత్తరాఖండ్ (9 శాతం), జమ్మూకశ్మీర్ (9 శాతం)లో హాలిడే ట్రిప్లకు మొగ్గుచూపుతున్నారు. 2023 జనవరి–జూన్ మధ్య కనీసం 21 శాతం మంది పర్యటనల నిమిత్తం పర్సనల్ లోన్లు తీసుకున్నారు. ఇది జనవరి–మార్చి మధ్య 16 శాతం ఉండగా, ఏప్రిల్–జూన్ కాలంలో 27 శాతంగా ఉంది. హాలిడే టూర్ లోన్లు తీసుకున్న వారిలో ఉద్యోగులు 74 శాతం ఉండగా, వివిధ రంగాల నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు (డాక్టర్లు, లాయర్లు, సీఏలు, వ్యాపారులు) 26 శాతం. ఖర్చు ఎక్కువైనా వెనుకాడట్లేదు.. హాలిడే టూర్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో పోల్చితే హాలిడేపై వెళ్లేటప్పుడు రవాణా, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాల్లో మరింత నాణ్యతను కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం పర్సనల్ లోన్లు వంటి వాటిని ఎంచుకుంటున్నారు. –అజయ్ రామిడి, ఎండీ, లార్వెన్ టూర్స్, ట్రావెల్స్ -
స్కూలుకు లేదు డుమ్మా.. 50 దేశాలు చుట్టొచ్చిందమ్మా..!
10 ఏళ్ల చిన్నారి అదితి త్రిఫాఠి చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో పాటు 50 దేశాలు చుట్టివచ్చింది. ఈ నేపధ్యంలో అదితి ఒక్క రోజు కూడా స్కూలు మానకపోవడం విశేషం. యాహూ లైఫ్ యూకే తెలిపిన వివరాల ప్రకారం అదితి తన తండ్రి దీపక్, తల్లి అవిలాషలతో పాటు దక్షిణ లండన్లో ఉంటుంది. వారు యూకే అంతా చుట్టివచ్చారు. ఇప్పటివరకూ అదితి తన తల్లిదండ్రులతో పాటు నేపాల్, సింగపూర్,థాయ్లాండ్ తదితర ప్రాంతాలను కూడా సందర్శించింది. ప్రత్యేక ప్రణాళిక ప్రకారం.. అవుట్లెట్ తెలిపిన వివరాల ప్రకారం అదితి తల్లిదండ్రులు తమ కుమర్తెతో పాటు ప్రపంచం చుట్టిరావాలని నిశ్చయించుకున్నారు. తమ కుమార్తె చదువుకు ఆటంకం కలగకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలను చూపిస్తూ, విభిన్న సంస్కృతులు ఆహారరుచులపై అవగాహన కల్పిస్తూ, వివిధ ప్రాంతాల ప్రజలను అర్థం చేసుకునే అవకాశం కల్పించాలని అతిధి తల్లిదండ్రులు భావించారు. ఇందుకోసం వారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదితి స్కూలుకు సెలవులు ఇచ్చిన రోజుల్లో వీరు పర్యటనలు కొనసాగించారు. ఇందుకోసం వారు 20 వేల పౌండ్లు(రూ.21 లక్షలకు పైగా..)ఖర్చు చేశారు. విమానాశ్రయం నుంచి నేరుగా స్కూలుకు.. ‘యాహూ’తో త్రిపాఠి మాట్లాడుతూ ‘తాము నేపాల్, భారత్, థాయ్ల్యాండ్లలోని విభిన్ని సంస్కృతులకు ఎంతో ప్రభావితమయ్యామన్నారు. అదితికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే తాము ప్రపంచయాత్ర ప్రారంభించామన్నారు. అదితికి ప్రతీవారంలో రెండు రోజులు స్కూలుకు సెలవు ఉంటుందన్నారు. తాము ప్రతీ శుక్రవారం అదితిని స్కూలు నుంచే నేరుగా పర్యటనలకు తీసుకువెళతామన్నారు. తిరిగి ఆదివారం రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వస్తామన్నారు. ఒక్కోసారి తాము సోమవారం ఉదయం పర్యటనల నుంచి తిరిగివస్తుంటామన్నారు. అటువంటి సందర్బాల్లో తమ కుమార్తె విమానాశ్రయం నుంచి నేరుగా స్కూలుకు వెళుతుందన్నారు. పర్యటనల కోసం పొదుపు మెట్రో తెలిపిన వివరాల ప్రకారం అదితి తల్లిదండ్రులు అంకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. ఈ పర్యటల కోసం వారు తమ ఆదాయంలో నుంచి కొంతమొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. ఇందుకోసం వారు బయటి ఆహారాన్ని తినరు. పబ్లిక్ ట్రాన్స్పోర్టులోనే ప్రయాణిస్తుంటారు. వారు కారు కూడా కొనుగోలు చేయలేదు. కాగా అదితి ఇప్పటికే యూరప్లోని దాదాపు ప్రతీదేశాన్ని సందర్శించింది. ఇది కూడా చదవండి: ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్, రూ.2.6 కోట్ల ఆఫర్! -
రేపు వెంకటగిరిలో పర్యటించనున్న సీఎం వై ఎస్ జగన్
-
యూఏఈ పర్యటనలో మోదీ.. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష..
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శక్తి వనరులు, ఆహార భద్రత, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై కూడా ఇరుదేశాల అధికారులు చర్చలు జరపనున్నారు. ఇండియా-యూఏఈ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరంగా వృద్ధి చెందుతుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పర్యటన ఆ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది. శక్తి వనరులు, విద్యా, ఆరోగ్య రంగం, ఆహార భద్రత, సంస్కృతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య మరిన్ని ఒప్పందాలు ఏర్పడనున్నట్లు వెల్లడించింది. #WATCH | PM Narendra Modi has arrived in Abu Dhabi on an official visit to UAE pic.twitter.com/387DtRaqeV — ANI (@ANI) July 15, 2023 ప్రపంచ సమస్యలపై ఇరుదేశాల నాయకులు చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యూఏఈ అధ్యక్షతన జరగనున్న కాప్-28 సమావేశం, ఇండియా అధ్యక్షతన జరుగుతున్న జీ-20 పై కూడా మాట్లాడనున్నట్లు వెల్లడించింది. మోదీ ఫ్రాన్స్ పర్యటన అనంతరం యూఏఈకి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్తో ప్రత్యేకంగా సమావేశంలో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక పలు ఒప్పందాలు కుదిరాయి. ఇదీ చదవండి: ఫ్రాన్స్లో మోదీకి రెడ్కార్పెట్ -
PM Modi Warangal Tour : వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన (ఫొటోలు)
-
CM Jagan Kalyandurgam Tour : కళ్యాణదుర్గంలో సీఎం జగన్కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ డేంజర్: ప్రధాని మోదీ
వరంగల్: వరంగల్ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రకాళీ మహత్యం, సమ్మక్క సారక్క , రాణి రుద్రమ పౌరషం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేయాలని అన్నారు. కుటుంబాన్నిపెంచి పోషించుకోవడమే ఇరుపార్టీల పని అని ఆరోపించారు. కుటుంబ శ్రేయస్సు కోసమే కేసీఆర్ పరితపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. 'అవినీతే వారి ధ్యేయం..' కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రధాని మోదీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆరోపించిన ప్రధాని.. ప్రాజెక్టుల్లో ప్రతీది అవినీతి మయమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవినీతి దేశమంతా.. కేసీఆర్ అవినీతి రాష్ట్రమంతా తెలుసని అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరమని అన్నారు. అవినీతి లేని ప్రాజెక్టు ఏదైనా ఉందా? అని బీఆర్ఎస్ను ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని ప్రధాని మోదీ అన్నారు. అవినీతిపై దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని చెప్పారు. 'అది ట్రైలర్ మాత్రమే..' మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ మాత్రమే చూపించిందని చెప్పిన ప్రధాని మోదీ.. సభకు హాజరైన జనాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కాషాయ విజయం ఖాయమనిపిస్తోందని అన్నారు. కేంద్రాన్ని తిట్టడమే బీఆర్ఎస్కు తెలిసిన పని అని అన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది నాలుగే పనులని ఎద్దేవా చేశారు. 'నిరుద్యోగులకు మోసం..' ఉద్యోగాలిస్తామని యువతను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మోదీ అన్నారు. టీఎస్పీఎస్సీ స్కాంలతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని చెప్పారు. రాష్ట్రంలో 12 యూనివర్శిటీల్లో విద్యార్థుల భవిష్యత్లో ఆందోళన నెలకొందని అన్నారు. వేలాది ఉద్యోగ ఖాలీలను నింపకుండా కేసీఆర్ తమాషా చూస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ బృతి ఇవ్వలేదని అన్నారు. నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన.. వరంగల్లో నేడు నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ. తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్కు మోదీ శంకుస్థాపన చేశారు. ఇదీ చదవండి: రూ.6 వేల కోట్లతో నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన -
రూ.6 వేల కోట్లతో నూతన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
► ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. కాగా.. 3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారిని నిర్మించనున్నారు. రూ. 2,147 కోట్ల వ్యయాన్ని జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారికి కేటాయించనున్నారు.రూ. 521 కోట్లను కాజీపేట రైల్వే వ్యాగన్కు వినియోగించనున్నారు. కొత్త రహదారులతో పర్యటకానికి ప్రోత్సాహం చేకూరుతుందని ప్రధాని మోదీ చెప్పారు. 9 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కిలోమీటర్ల జాతీయ రహదాలును విస్తరించగా.. 5 వేల కిలోమీటర్ల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ► తెలంగాణ ఆర్థిక కేంద్రంగా మారబోతోందని ప్రధాని మోదీ అన్నారు. కాజీపేట రైల్యే వ్యాగన్ యూనిట్కు మోదీ శంకుస్థాపన చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాగ్పూర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్తో తెలంగాణ ప్రజలకు ఉపయోగం కలుగుతుందని స్పష్టం చేశారు. ► విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. 6 వేల కోట్లతో కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 176 కిలోమీటర్ల జాతీయ రహదారులకు పునాది రాయి వేశారు మోదీ. ► వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సై, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేదికపై కూర్చున్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. ► వరంగల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం ద్వారా భద్రకాళీ ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకోనున్నారు. ► ఓరుగల్లు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వరంగల్కు చేరుకున్నారు. మామునూరు ఎయిర్పోర్టులో దిగారు. కాసేపట్లో భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకోనున్నారు. ► వరంగల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట విమానశ్రయంలో దిగారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో వరంగల్ చేరుకోనున్నారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. 3,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచే వరంగల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి వరంగల్కు బయలుదేరినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. రూ.6100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. Leaving for Warangal to attend a programme where we will inaugurate or lay the foundation stone for development works worth over Rs. 6100 crores. These works cover different sectors ranging from highways to railways. They will benefit the people of Telangana. — Narendra Modi (@narendramodi) July 8, 2023 ఇదీ చదవండి: పొలిటికల్ ట్రాక్పైనే.. పోరుగల్లు వ్యాగన్స్! అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ పర్యటన వివరాలిలా ఉన్నాయి.. ♦ శనివారం ఉదయం 7–35 గంటలకు వారణాసి ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరుతారు. ♦ 9–25 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ♦ 9–30 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్లో హకీంపేట్ ఎయిర్పోర్టు నుంచి వరంగల్కు బయలుదేరతారు. ♦10–15 గంటలకు మామ్నూర్లోని హెలిపాడ్కు చేరుకుని, రోడ్డుమార్గాన భద్రకాళి ఆలయానికి బయలుదేరతారు. ♦ 10–30 గంటల నుంచి 10–50 గంటల వరకు ఆలయంలో పూజల అనంతరం హనుమకొండలోనిఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్కు బయలుదేరతారు. ♦ 11–00 గంటలకు అక్కడికి చేరుకుని 11–35 గంటల వరకు వివిధ అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ♦ 11–40 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లోని బహిరంగ సభ వేదికకు బయలుదేరి 11–45 గంటలకు అక్కడికి చేరుకుంటారు. ♦ 11–45 నుంచి 12–20 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ♦ 12–20 నుంచి 12–30 గంటల వరకు విశ్రాంతి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 12–50 గంటలకు హెలిపాడ్కు చేరుకుంటారు. ♦ 12–55 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1–40 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ♦ 1–45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజస్థాన్లోని బికనీర్కు వెళతారు. ఇదీ చదవండి: వరంగల్ పర్యటన: మోదీ సభా వేదికపై ఎనిమిది మందే.. ఎవరెవరంటే? -
Anchor Udaya Bhanu : అమెరికాలో వెకేషన్లో ఉదయభాను.. ఇద్దరు కవల పిల్లలతో కలిసి! (ఫొటోలు)
-
నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్
-
తెలంగాణలో ప్రధాని మోదీ టూర్
-
సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన, షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 4వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయా డెయిరీ వద్ద అమూల్ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ) ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తునకు కోర్టు అనుమతి -
నేడు ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన