tour
-
Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్కు ప్లాన్ చేసుకోవచ్చు
2024కు వీడ్కోలు పలుకుతూ కొద్దిరోజుల్లో కొత్త ఏడాది 2025ను స్వాగతించబోతున్నాం. ఈ నేపధ్యంలో 2024లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం. వాటిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు ఒకటి. ఈ ప్రాంతాలకు సామాన్యులు కూడా తక్కువ బడ్జెట్తో వెళ్లిరావచ్చు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అరబ్ దేశంలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. భారత్- యూఏఈ మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను ప్రధాని మోదీ సందర్శించారు. టూరిజంరంగంలో యుఎఈ మరింతగా విస్తరిస్తోంది. దీంతో విదేశాల్లో పర్యటించాలనుకునేవారికి యూఏఈ మొదటి ఎంపికగా మారింది. ఈ దేశంలోని దుబాయ్ నగరాన్ని దర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ప్రతి ఏటా భారత్తో పాటు పలు దేశాలకు చెందిన పర్యాటకులు యూఏఈని చూసేందుకు తరలివస్తుంటారు.భూటాన్భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఆహ్వానం మేరకు ఈ ఏడాది నరేంద్ర మోదీ భూటాన్లో పర్యటించారు. భూటాన్ భారత్కు పక్కనేవున్న పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది. తక్కువ బడ్జెట్లో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి భూటాన్ సందర్శన ఉత్తమ ఎంపిక. వీసా లేకుండా భూటాన్లో 14 రోజుల పాటు ఉండేందుకు భారతీయులకు అనుమతి ఉంది. భూటాన్ వెళ్లేవారు అక్కడి అందమైన అడవులను, దేవాలయాలను సందర్శించవచ్చు.ఇటలీ50వ జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఈ ఏడాది ఇటలీలో పర్యటించారు. ఐరోపాలోని ఇటలీ అందమైన దేశంగా పేరొందింది. సినీతారలు ఇటలీని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇటలీకి తరలివస్తుంటారు. చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇటలీని సంద్శించాలని భావిస్తుంటారు. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్, అమాల్ఫీ కోస్ట్ మొదలైనవి చూడదగిన ప్రాంతాలు. రష్యా22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాది రష్యాలో పర్యటించారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. భారీ పర్వతాలు, ఎడారులు, అందమైన బీచ్లు, వారసత్వ ప్రదేశాలు, రాజభవనాలు, మంచుతో నిండిన సరస్సులను ఈ దేశంలో చూడవచ్చు. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో రష్యా ఒకటి. ఇక్కడి మాస్కో, వ్లాడివోస్టాక్ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.సింగపూర్ఈ ఏడాది ప్రధాని మోదీ సింగపూర్లో పర్యటించారు. సింగపూర్ సంపన్న దేశంగా పేరొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు సంగపూర్ సందర్శనకు వస్తుంటారు. ఇక్కడి అందమైన మ్యూజియం, జురాంగ్ బర్డ్ పార్క్, రెప్టైల్ పార్క్, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్ సెంటోసా ఐలాండ్, పార్లమెంట్ హౌస్, హిందూ, చైనీస్, బౌద్ధ దేవాలయాలు, చైనీస్, జపనీస్ గార్డెన్లు చూడదగిన ప్రదేశాలు. విదేశాలను సందర్శించాలనుకునేవారికి సింగపూర్ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.ఇది కూడా చదవండి: ఐదేళ్లకు జాతర.. లక్షల జీవాలకు పాతర.. నేపాల్లో ఘోరం -
ఢిల్లీలో శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే భారత్ చేరుకున్నారు. ఆదివారం(డిసెంబర్15) సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు.అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్లో పర్యటిస్తున్న దిసనాయకేకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వెల్లడించారు.#WATCH | Delhi: Sri Lankan President Anura Kumara Dissanayake was received by MoS Dr L Murugan as he arrived in New Delhi.This is President Disanayaka’s first bilateral visit to India since he assumed Presidency. pic.twitter.com/7IF8zFdczK— ANI (@ANI) December 15, 2024 భారత్లో మూడు రోజుల పాటు (డిసెంబరు 15-17 వరకు) దిసనాయకే పర్యటన కొనసాగనుంది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం దిసనాయకే మనదేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే. ఈ పర్యటనలో దిసనాయకే వెంట శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్తోపాటు మరో మంత్రి అనిల్ జయంత ఫెర్నాండో కూడా ఉన్నారు.పర్యటనలో తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో దిసనాయకే భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటి అవుతారు. ప్రధానంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం,ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.కాగా శ్రీలంకలో సెప్టెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర కుమార దిసనాయకే విజయం సాధించిన విషయం తెలిసిందే.దేశ 9వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. -
నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన
-
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
రాష్ట్రపతి ముర్ము తెలంగాణ పర్యటన
-
డీకే అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి,వికారాబాద్జిల్లా:మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. -
ప్రధాని మోదీకి నైజీరియా అంతర్జాతీయ అవార్డు
అబుజా: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలలో పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా నేడు(ఆదివారం) నైజీరియా చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం నైజీరియా అత్యున్నత పురస్కారం "ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్"తో ప్రధాని మోదీని సత్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ అందుకున్న 17వ అంతర్జాతీయ అవార్డు ఇది. ప్రధాని మోదీ ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ప్రపంచంలోనే రెండవ నేతగా నిలవనున్నారు. దీనికి ముందు 1969లో నైజీరియా నుంచి ఈ గౌరవాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డును అందుకున్నారు. గతంలో ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా ప్రధాని మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించాయి.Nigeria to honour Prime Minister Narendra Modi with its award- The Grand Commander of The Order of the Niger (GCON). Queen Elizabeth is the only foreign dignitary who has been awarded GCON in 1969. This will be the 17th such international award being conferred to PM Modi by a… pic.twitter.com/nOVKGyJr0a— ANI (@ANI) November 17, 2024ఇది కూడా చదవండి: ఉక్రెయిన్పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి -
మూడు దేశాల టూర్కు బయల్దేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శనివారం(నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో జీ 20 సదస్సు జరిగే బ్రెజిల్తో పాటు భాగంగా నైజీరియా,గ్వామ్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు.ఐదు రోజులపాటు మోదీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. భారత్తో ఆయా దేశాల బంధాన్ని బలపరిచే దిశగా ప్రధాని ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలతో పాటు ఆయా దేశాల్లోని ప్రవాస భారతీయులను కలుస్తారు. ఇదీ చదవండి: రాహుల్గాంధీ బ్యాగులు తనిఖీ చేసిన ‘ఈసీ’ -
మంచి రోజులు వస్తున్నాయి...
దుబాయ్: మన మహిళల క్రికెట్కు మంచి రోజులు వస్తున్నాయి. గట్టి ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇకపై క్రమం తప్పకుండా భారత్లో పర్యటించనున్నాయి. 2025–29 సైకిల్కు సంబంధించిన మహిళల భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా భారత జట్టు కీలక ద్వైపాక్షిక సిరీస్లలో తలపడనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ టీమిండియా పర్యటించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోని ప్రతి సభ్య దేశం ఇంటా బయటా నాలుగు సిరీస్ల చొప్పున పాల్గొనేలా కొత్త ఎఫ్టీపీని రూపొందించారు. భారత్ మేటి ప్రత్యర్థులతో పాటు పొరుగు దేశం బంగ్లాదేశ్, 11వ సభ్య దేశంగా ఉన్న జింబాబ్వేతోనూ తలపడుతుంది. ఎప్పుడో అరకొరగా జరిగే టెస్టులను ఈ నాలుగేళ్ల సైకిల్లో పెంచారు. సభ్యదేశాలన్నీ మూడు ఫార్మాట్ల సిరీస్లో పాల్గొనేందుకు సమ్మతించాయని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీమ్ ఖాన్ తెలిపారు. దీంతో గత ఎఫ్టీపీతో పోల్చితే తదుపరి సైకిల్లో మహిళల మ్యాచ్లు మూడు ఫార్మాట్లలోనూ గణనీయంగా పెరగనున్నాయి. » కొత్త ఎఫ్టీపీ వచ్చే ఏడాది మేలో మొదలై 2029 ఏప్రిల్తో ముగుస్తుంది. ప్రతి దేశం పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చాయి. దీంతో 2025–29 సైకిల్లో 400 పైచిలుకు అంతర్జాతీయ మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో జరిగే 44 వన్డే సిరీస్లలో ఒక్కో సభ్యదేశం మిగతా పది జట్లతో మూడు వన్డేల చొప్పున ఆడుతుంది. అలా 132 వన్డేలు జరుగుతాయి. » మహిళల ఎఫ్టీపీని 2029లో జరిగే వన్డే ప్రపంచకప్కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడున్న 10 జట్లతో పరిమితం కాకుండా ఆ మెగా టోర్నీ 11 జట్లతో జరుగనుంది. 11వ దేశంగా జింబాబ్వే బరిలోకి దిగుతుంది. ఇటీవల జింబాబ్వే మహిళల జట్టుకు శాశ్వత సభ్యదేశం హోదా ఇచ్చారు. » 2026లో ఇంగ్లండ్లో జరగబోయే టి20 ప్రపంచకప్కు ముందు భారత్ అక్కడ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో కలిసి ముక్కోణపు టోర్నీలో ఆడుతుంది. » ఐర్లాండ్లోనూ జరిగే సన్నాహక ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్లు తలపడతాయి. అలాగే భారత ఉపఖండంలోని శ్రీలంక జట్టు వెస్టిండీస్, మరో జట్టుతో కలిసి ముక్కోణపు సిరీస్లో పాల్గొంటుంది. » ఐసీసీ మహిళల చాంపియన్íÙప్లో భాగమైన జింబాబ్వే... వచ్చే నాలుగేళ్ల పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకలతో జరిగే ద్వైపాక్షిక సిరీస్లకు ఆతిథ్యమిస్తుంది. దీంతో పాటు భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో పర్యటిస్తుంది. » అందరికంటే ఆ్రస్టేలియా గరిష్టంగా ద్వైపాక్షిక సిరీస్లలో భాగమవుతుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లాంటి గట్టి ప్రత్యర్థులతో ఇంటా బయటా సిరీస్లు ఆడుతుంది. -
వైఎస్సార్కు నివాళులర్పించిన వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం(అక్టోబర్ 29) పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో పర్యటించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను వైఎస్జగన్ కలవనున్నారు. ఇదీ చదవండి: చంద్రబాబూ..! రైతుల ఉసురు పోసుకువద్దు: వైఎస్జగన్ -
నేడు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
మంత్రి నాదెండ్ల టూర్.. కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు -
నిర్మాతతో మొరాకో టూర్లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)
-
నిన్న భారత్ పై వెటకారాలు.. నేడు కాళ్ల బేరాలు
-
చంద్రబాబు పాపం బయటకు రావాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
బ్రూనై పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం(సెప్టెంబర్3) ఉదయం బ్రూనై పర్యటనకు బయలుదేరారు. భారత ప్రధాని బ్రూనై పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. బ్రూనై పర్యటన తర్వాత అక్కడి నుంచి మోదీ సింగపూర్ వెళతారు. సింగపూర్లో ప్రధాని సెప్టెంబర్ 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. PM @narendramodi is set to visit Brunei and Singapore from Sept 03-05, 2024.🎥 Take a quick look at 🇮🇳’s engagements with the two countries. pic.twitter.com/9yJ3nEgK1I— Randhir Jaiswal (@MEAIndia) September 2, 2024ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వోంగ్తో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. బ్రూనై పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. బ్రూనై, సింగపూర్లతో భారత్ సంబంధాలు బలోపేతమవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. -
నేడు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
అమెరికాలో భారతీయ అంధుల క్రికెట్ జట్టు.. డాలస్లో మహాత్ముడికి నివాళి
డాలస్, టెక్సాస్: జూలై 25 నుంచి సెప్టెంబర్ 17 వరకు అమెరికా పర్యటనలో ఉన్న “భారతీయ అంధ క్రికెట్ జట్ట్ఙు మంగళవారం డాలస్ లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలిని మంగళవారం సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యుడు కమల్ కౌశల్, బాబీ, రవి మొదలైన వారు వీరికి ఘనస్వాగతం పలికారు.బోస్టన్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, వాషింగ్టన్ డి.సి, చికాగో, డాలస్, లాస్ ఏంజిల్స్, సియాటెల్ మరియు బే ఏరియా లలో పర్యటిస్తున్న ఈ క్రికెట్ జట్టులో సమర్తనం ఇంటర్నేషనల్ ఛైర్మన్ డా. మహన్ టెష్, టీం మేనేజర్ ధీరజ్ సెక్వేరియా ఆటగాళ్ళు దున్న వెంకటేశ్వర రావు, సునీల్ రమేశ్, షుక్రం మాజిహ్, సంజయ్ కుమార్ షా, రవి అమితి, పంకజ్ భూ, నీలేష్ యాదవ్, నరేష్ తుందా, నకుల బడానాయక్, మహారాజ, లోకేష్, గుడ్డాడప్ప, దుర్గారావు తోమ్పాకి, దినేష్ రాత్వా, దినాగర్, దేబరాజ్ బెహరా, అజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.వీరిలో కొంతమంది పూర్తిగా అంధులు, మరికొంతమంది కొద్దిగా మాత్రమే చూడగల్గుతారు. వీరి క్రికెట్ బంతి సాధారణ బంతిలా కాకుండా దానిలో శబ్దంచేసే కొన్ని మువ్వలు లాంటివి ఉంటాయి. బౌలర్ బంతి విసిరినప్పుడు, ఆ బంతి చేసే శబ్దం ఆధారంగా ఎటువైపు ఎంత వేగంతో బంతి వస్తుందో అంచనావేసి బాట్స్ మాన్ బంతిని కొడతాడు. ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని చాంపియన్స్ గా నిలిచిన ఈ భారతజట్టులో విజయవాడకు చెందిన అర్జున అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. ఈ క్రికెట్ టీం విదేశీ పర్యటన మొత్తాన్ని ‘సుబ్బు కోట ఫౌండేషన్’ వారు స్పాన్సర్ చేసి తగు ఆర్ధిక సహకారం అందించడం ముదావహం. పర్యటిస్తున్న అన్ని నగరాలలో అంధులు క్రికెట్ ఎలా ఆడతారో తెలియజేస్తూ ఎగ్జిబిషన్ మ్యాచ్స్ ఆడుతూ తమ క్రికెట్ ఆటలు సుదీర్ఘ కాలం విజయవంతంగా కొనసాగడానికి కావలసిన ఆర్ధిక పరిపుష్టికోసం విరాళాలు సేకరిస్తున్నారు. -
మేయర్ విదేశీ యాత్ర దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్కు ఇన్చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.వెలుగుచూసిందిలా..వాస్తవానికి మేయర్ సునీల్రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్రావు తనకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్చార్జి మేయర్గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు. మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్మేయర్పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.6న ఇండియాకు: మేయర్తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పోలెండ్ చేరుకున్న ప్రధాని మోదీ
వార్సా: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం(ఆగస్టు21) సాయంత్రం పోలెండ్ చేరుకున్నారు. రాజధాని వార్సాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం పలికారు. భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలెండ్లో పర్యటిస్తున్నారు. పోలెండ్ పర్యటన ముగించుకున్న అనంతరం మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. -
టీ కన్సల్ట్ చొరవతో తెలంగాణలోకి భారీ పెట్టుబడులు: రేవంత్
-
విజయవాడ కు వైఎస్ జగన్
-
బీఆర్ఎస్ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం(జులై 25) బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్ తిరిగిరానుంది. -
రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో పలు ప్రశ్నలడిగి, వారితో ఉత్సాహంగా ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు.మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, "మోదీ మోదీ" నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తన ప్రసంగంలో మోదీ ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్బర్గ్లలో భారత కాన్సులేట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.ఎన్నాళ్లనుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారని అని కళాకారులను ప్రధాని మోదీ ప్రశ్నించారు. కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇస్కాన్ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామ్ కృష్ణ మిషన్ నుండి స్వామి ఆత్మలోకానంద తదితరులు మాట్లాడారు.కాగా సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు మోదీపై పుతిన్ ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.#WATCH | Prime Minister Narendra Modi meets artists of the Russian Cultural Troupe who performed to welcome PM Modi during his address to the Indian community in Moscow, Russia(Souce: PMO) pic.twitter.com/qUWMVkVk3K— ANI (@ANI) July 9, 2024