బీఆర్‌ఎస్‌ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు | Brs Mla Mlcs Kaleshwaram Project Tour On July 25 | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు

Published Wed, Jul 24 2024 4:06 PM | Last Updated on Wed, Jul 24 2024 4:24 PM

Brs Mla Mlcs Kaleshwaram Project Tour On July 25

సాక్షి,హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం(జులై 25) బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. 

పర్యటనలో భాగంగా మొదట ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ సందర్శించనున్న బీఆర్‌ఎస్‌ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్‌ తిరిగిరానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement