Kaleshwaram project
-
కాళేశ్వరంతో నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు మాత్రం నిండాయి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేసే మేడిగడ్డ కూలిపోయింది.. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయంటూ బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జలసౌధలో మాట్లాడుతూ.. కాళేశ్వరం కూలిపోయింది.. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.‘‘కృష్ణా వాటర్లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్కు వివరించా.. పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారు. పదేండ్ల పాటు తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు.కాళేశ్వరం కూలితే.. స్వయంగా ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని స్పష్టం చేసింది. నీళ్లు నింపవద్దని స్వయంగా ఎన్డీఎస్ఏ లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించాం.’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి వివరించారు. -
ఇచ్చిన మాట ప్రకారం నీరివ్వండి!
ప్రణాళికా సంఘం నివేదిక ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా. స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా ఈ జిల్లా పరిస్థితి దాదాపు ఏమీ మారలేదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లా నలుదిక్కులా అనేక నదులు ఉపనదులూ ప్రవహి స్తున్నా వ్యవసాయం ఇప్పటికీ వర్షాధారంగానో లేదా భూగర్భ జలాలపైనో ఆధారపడి సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున సాగునీటిని అందించడానికి ‘ప్రాణహిత– తుమ్మిడి హెట్టి’ ప్రాజె క్టుకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2008లో శంకు స్థాపన చేసింది. దానికి ‘బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. ప్రాణహిత నుండి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. కాలువ నిర్మాణానికి జిల్లాలో 1700 కోట్లు ఖర్చు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 38 వేల కోట్లు అయ్యే మొత్తం ప్రాజెక్టుకు, ఆనాడే 9 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో బీ(టీ)ఆర్ఎస్ అధి కారంలోకి వచ్చింది. నీరు లేదనే కుంటి సాకు చూపి, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ పేరిట (కాళేశ్వరం) మేడి గడ్డకు ప్రాజెక్టును మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్ను లక్ష యాభైవేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో ముగ్గురు మంత్రులు ముచ్చటగా ప్రారంభించారు. నాలుగేళ్ల లోపే ఏడవ బ్లాకులోని అనేక గేట్లు, ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా భారీ లీకేజీలు, సీపేజీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ‘డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం పరిశీలించింది. నీరు నిలువ ఉంచడం ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలోని నీటిని బయటికి పంపాలని నాటి ప్రభుత్వాన్ని కోరింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ఘోరమైన తప్పులు చేసిందని నిర్ధారించింది. ఈ నివేదికప్రకారం: పునాదికి సంబంధించిన భూగర్భ పరీక్షలు ఏమాత్రం చేయలేదు. బలహీనమైన పునాదులపై బ్యారేజీలు నిర్మించింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారే జీలలో, ప్రాజెక్టుల వలె భారీ ఎత్తున నీటిని నిలువ చేశారు. బ్యారేజీలను డ్యాముల వలె నిర్వహించారు. ఆ భారీనీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు భారీగా దెబ్బతిన్నాయి. కేవలం నాలుగు మీటర్ల పునాది క్రింద ఉన్న అడుగు పొరల్లోని ఇసుకంతా భారీ ఎత్తున కొట్టుకుపోయింది. స్పిల్వే నిట్టనిలువుగా పునాది నుండి మూడు ఫీట్ల వెడల్పుతో చీలిపోయి, రెండు చెక్కలయ్యింది. భూమిలో కుంగిపోయింది. మేడిగడ్డ వలెనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఎప్పుడైనా భూమిలో కుంగిపోవచ్చు. నాడు భూమిలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు నిశితంగా పరిశీలించి దీని నిర్మాణ ంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ కమిషన్ వేసి సొమ్ము రికవరీ చేసి శిక్షిస్తామని ప్రకటించారు. ప్రత్యా మ్నాయంగా ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ అంతటికీ సాగునీరు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా, ప్రాజెక్టును ప్రస్తావించడం లేదు. యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ‘పినాకీ చంద్రఘోష్ కమిషన్’ విచారణ జరుపుతోంది. నేటి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వారివారి నియోజకవర్గాల్లో, కొత్త ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వెచ్చించి శరవేగంతో నిర్మిస్తున్నారు. ఎన్ని కల ప్రణాళికలో పేర్కొన్న ప్రాణహిత – తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన కడెం ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కుప్టి ప్రాజె క్టు’కు నిధుల కేటాయింపు కానీ, దాని కనీస ప్రస్తావన కానీ లేదు. కుంటాల జలపాతం ఎగువన ఉన్న, కుప్టి ప్రాజెక్టుతో కడెం ఆయకట్టు చివరి వరకు గూడెం ఎత్తిపోతలు లేకుండానే పూర్తిగా రెండు పంటలకు సాగునీరు ఇవ్వవచ్చు. కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. చెన్నూరు– ప్రాణహిత వరకు, మంచి ర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని బీడు భూము లకు సంపూర్ణ గ్రావిటీతో సాగునీరు అందుతుంది. ‘నెహ్రూ ఉత్తర కాలువ’ లేదా ‘మందాకిని ఎన్టీఆర్ కాలువ’ సాగునీటి కలలు పూర్తిగా నిజం అవుతాయి. ఎల్లంపల్లికి వచ్చే ప్రాణహిత కాలువ, కడెం (నెహ్రూ ఉత్తర లేదా మందాకిని) కాలువ ఎక్స్ (గీ) ఆకారంలో క్రాస్ అవుతూ వెళ్తాయి. బెల్లంపల్లి, చెన్నూర్ నియో జకవర్గాల బీడు భూములకు అవసరమయ్యే నీటిని ప్రాణహిత ద్వారా, కడెం కాలువకు అనుసంధానించ డానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఉత్తర కాలువకు... శ్రీరాంసాగర్ నీటినీ, సదర్మాట్ నీటినీ, ఎల్లంపల్లి నీటినీ పూర్తి గ్రావిటీతో అనుసంధానం చేయవచ్చు. కుప్టి ప్రాజెక్టు సముద్రమట్టానికి 1450 అడుగుల ఎత్తులో ఉంటుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం ఎత్తు 700 అడుగులు. అంటే కడెం కంటే 750 అడుగుల ఎత్తులో కుప్టి ప్రాజెక్టు బెడ్ లెవెల్ ఉంటుంది. కడెంకు కుప్టికి మధ్య ఉన్న దూరం కేవలం 30 కి. మీ. మాత్రమే. 750 అడుగుల ఈ వ్యత్యాసపు ఎత్తు అనేది, నీటిపారుదల పరిభాషలో భారీ ఎత్తు గానే పరిగణిస్తారు. కాలుష్యం లేని జల విద్యుత్తుకు, ఎత్తి పోతలు అసలే లేని గ్రావిటీ సాగుకు అత్యద్భు తమైన అరుదైన ప్రాకృతిక అనుకూలత! జల విద్యుత్తు భారీ ఎత్తున ఉత్పత్తి అవుతుంది. కుప్టితో కుంటాల జలపాతం సంవత్సరం అంతా నీరు ఎత్తిపోస్తూ, తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా భారీ ఆదాయంతో కళకళలాడుతుంది. నేరేడిగొండ, ఇచ్చోడ ప్రాంతపు బీడు భూములకు ఎత్తిపోతలతో సాగునీరు ఇవ్వవచ్చు. -నైనాల గోవర్ధన్ (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799) -
నేను కొడితే.. వట్టిగ ఉండదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు కదా. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్(congress party) అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ను ఎండబెడుతున్నరు. ఈ అన్యాయాలపై ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూడాలి. పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి తెలంగాణ శక్తిని మరోమారు చాటాలి. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి’ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(Kcr) పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మన పార్టీకి కులం, మతం, జాతి అనే భేదభావం లేదు. తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న వారందరికీ న్యాయం జరిగి బాగుపడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సింది బీఆర్ఎస్ అనే విషయంలో రెండో మాటే లేదు. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలి. అవసరమైన సందర్భంలో నేను, జిల్లా నాయకులు ఇచ్చే పిలుపునకు స్పందించి ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎదురు తిరిగి కొట్లాడాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన గులాబీ జెండా తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది. కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు.. ఇన్నాళ్లూ కోటి రూపాయలు పలికిన భూమిని ఇప్పుడు రూ.50లక్షలకు కొనే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్చి వరకు రూ.15వేల కోట్ల ఆదాయం తగ్గుతోందని కాగ్ రిపోర్టు చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆదాయంలో రూ.15 వేల కోట్ల వృద్ధిని సాధించింది. ఇప్పుడు మరో నాలుగైదు నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమనే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు.మనం ప్రాజెక్టులు, చెరువుల కింద నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పించాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి ఓట్లేసి బావిలో పడ్డారు. మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందన్నట్టు పరిస్థితి తయారైంది. తులం బంగారం ఇస్తామంటే నమ్మి ఓటేస్తే ఏమవుతుందో తెలంగాణలో మంచి గుణపాఠం అయింది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నరు.. రైతుబంధుతో వ్యవసాయం మెరుగై అప్పులు తీర్చుకుని, చిట్టీలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడా సంతోషం మంటగలిసింది. వాళ్లు ఎన్నికల సమయంలో ఇస్తరో ఎప్పుడు ఇస్తరో దేవుడికే ఎరుక. కరోనా సమయంలో మేం రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు వేయించుకుని వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కాన్వెంట్ విద్య అందిస్తే.. ఇప్పుడు పిల్లలు విషాహారం, పురుగుల అన్నం, కడుపునొప్పితో ఇంటి బాట పడుతున్నరు. కాంగ్రెస్ పాలన లోపాలను ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లకు పట్టిస్తున్నారు. ఏడాది పాలనతోనే కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతం అన్నట్లుగా జనం ఉన్నరు. ఫామ్హౌజ్కు వస్తే పార పట్టొచ్చు వాళ్ల పార్టీ నిన్న ఒక పోలింగ్ పెట్టింది. అందులో 70శాతం మనకు, 30శాతం వాళ్లకు వచ్చింది. ఫామ్ హౌజ్ అంటే ఇక్కడ వరి, మక్కలు, అల్లం తప్ప ఏముంటది. కాంగ్రెస్ వాళ్లు వస్తే తలాకొంత సేపు పారపట్టి పనిచేయచ్చు. ఫామ్హౌజ్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనకు విసిగి మళ్లీ మనమే రావాలని ప్రజలు వందశాతం కోరుకుంటున్నరు. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను సమీకరించి ఉద్యమం జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్రావుకు కేసీఆర్ సూచించారు.పాదయాత్రగా ఎర్రవల్లికి వచ్చిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నేతలు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు కేసీఆర్ను సత్కరించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్.. నీళ్ల మీద నీచ రాజకీయాలు ఎందుకు?: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచనలు చేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘నీళ్లు-నిజాలు’పై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నీటి రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..‘నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తోంది. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి. రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఆంధ్ర కేడర్లో పనిచేసిన ఆదిత్యా నాథ్ దాస్ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణ ట్రిబ్యునల్లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం. తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే.. 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం పండింది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదీ. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు. -
ఓఅండ్ఎం ఒప్పందం చేసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్ నిర్మాణం 2021లో పూర్తయిందని, ఆ వెంటనే బరాజ్ పర్యవేక్షణ, నిర్వహణ (ఓ అండ్ ఎం) కోసం నీటిపారుదల శాఖ తమతో ప్రత్యేక ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా చేసుకోలేదని బరాజ్ నిర్మాణ సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ చెప్పారు. బరాజ్ వద్ద తమ కంపెనీ సిబ్బందితో పాటు నీటిపారుదల శాఖ సిబ్బంది ఉన్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు ఆరోపణలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రమేశ్కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. బరాజ్ నిర్వహణ, పర్యవేక్షణలో నిర్మాణ సంస్థ బాధ్యతల గురించి ప్రశ్నించింది. నీటిపారుదల శాఖ రూపొందించిన డిజైన్లతో పోల్చితే సుందిళ్ల బరాజ్ వాస్తవ షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉండడంతోనే బరాజ్ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయి బుంగలు ఏర్పడ్డాయని గతంలో సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ పేర్కొనడాన్ని గుర్తు చేసింది. రెండు పర్యాయాలు బరాజ్కు బుంగలు ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. చివరి బిల్లు చెల్లించడం లేదుతొలిసారి బుంగలు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ ద్వారా పూడ్చివేశామని రమేశ్ బదులిచ్చారు. 2022 వరదల్లో బరాజ్కి తీవ్ర నష్టం జరగగా, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి పునరుద్ధరించామన్నారు. వర్క్ కంప్లిషన్ సర్టిఫికెట్ను శాఖ నుంచి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. సుందిళ్ల బరాజ్లో లోపాలను గుర్తించడానికి పలు రకాల పరీక్షలను నిర్వహించాలన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలతో.. నీటిపారుదల శాఖ అధికారుల సంతృప్తి మేరకు ఆ పరీక్షలన్నీ పూర్తి చేశామని వివరించారు. కాగా బరాజ్ నిర్మాణానికి సంబంధించిన చివరి బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని కమిషన్కు రమేశ్ ఫిర్యాదు చేశారు.అనుబంధ ఒప్పందంతో కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదుసుందిళ్ల నిర్మాణం 2021 డిసెంబర్లో పూర్తికాగా, 2023లో అదనపు పనులు చేసేందుకు నీటిపారుదల శాఖతో అనుబంధ ఒప్పందం చేసుకున్నామని నవయుగ ప్రాజెక్టు ఇన్చార్జి కె.ఈశ్వర్రావు తెలిపారు. అనుబంధ ఒప్పందంతో పాత కాంట్రాక్టు పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. సుందిళ్ల బరాజ్ దిగువన కొట్టుకుపోయిన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నవయుగ కంపెనీ మరో ప్రాజెక్టు ఇన్చార్జి చింతా మాధవ్ సైతం విచారణకు హాజరు కాగా, ఆయనకు కేవలం మెటీరియల్ కొనుగోళ్లతో మాత్రమే సంబంధం ఉండడంతో కమిషన్ ఆయన్ను ప్రశ్నించలేదు.కాపీ పేస్ట్లా అఫిడవిట్లునవయువ కంపెనీ డైరెక్టర్తో పాటు ఇద్దరు ప్రాజెక్టు ఇన్చార్జిలు దాఖలు చేసిన అఫిడవిట్లు కాపీ.. పేస్ట్ తరహాలో ఉన్నాయని కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. డైరెక్టర్ అఫిడవిట్కు కార్బన్ కాపీలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
కాళేశ్వరం రుణాల లెక్కలెందుకు దాచారు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంలో అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా మంగళవారం కమిషన్ ఆయనను ప్రశ్నించింది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు రామకృష్ణారావు తడబడటంతో ‘మీ మీదేమీ వేసుకోవద్దు’అని అసహనం వ్యక్తంచేసింది. 2015లో జారీ చేసిన ఓ జీవో ప్రకారం కోర్ కమిటీ తరచుగా మీతో సమావేశమై ప్రాజెక్టు పురోగతిని వివరించిందా? అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించగా, కమిటీలోని ఇంజనీర్లు తనను కలిసి ప్రాజెక్టు పురోగతిని వివరించి బిల్లులకు నిధులు కోరేవారని రామకృష్ణారావు బదులిచ్చారు. ఆ సమావేశాల మినిట్స్ ఏమయ్యాయి? అని కమిషన్ అడగటంతో సమాధానమివ్వలేక ఆయన తడబడ్డారు. దీంతో మీ మీదేమీ వేసుకోవద్దు అని కమిషన్ సూచించింది. బడ్జెట్లో కాళేశ్వరం రుణాలెందుకు చూపలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 2021–22లో తీసుకున్న రూ.35,257 కోట్ల బడ్జెటేతర రుణాలను రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపగా, 2022–23లో రూ.9,596 కోట్లు, 2023–24లో రూ.2,545 కోట్ల బడ్జెటేతర రుణాలను ఎందుకు చూపలేదని కమిషన్ ప్రశ్నించింది. ఆ రుణాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపితే రాష్ట్ర రుణపరిమితికి కేంద్రం కోతలు విధించే అవకాశం ఉండడంతో వాటిని బడ్జెట్లో చూపలేదని రామకృష్ణారావు వివరించారు. దీంతో ఇది తెలంగాణ ఫిస్కల్ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి విరుద్ధమని కమిషన్ మండిపడింది.ప్రభుత్వమే రుణాలు తిరిగి చెల్లిస్తుంది.. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాల విషయంలో ఆర్థిక శాఖ బాధ్యత ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, వాటికి ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినందున ఆర్థిక శాఖ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుందని రామకృష్ణా రావు బదులిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.6,519 కోట్లు, అసలు రూ.7,382 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రుణాలను 9 నుంచి 10.5 శాతం వడ్డీలతో తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణకే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీఎల్) ఏర్పాటైందని చెప్పారు. కేఐపీసీఎల్కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? అని ప్రశ్నించగా, పరిశ్రమలకు నీళ్లను విక్రయించడం ద్వారా రూ.7 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రుణాల సమీకరణ బాధ్యత కేఐపీసీఎల్దేనని చెప్పారు. బరాజ్ల నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు బరాజ్లను టర్న్కీ పద్ధతిలో కట్టాలని జీవో 145 పేర్కొంటుండగా, ప్రభుత్వం తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని కమిషన్ తప్పుబట్టింది. జీవోలో అలా ఉందని, ప్రాజెక్టును మాత్రం పీస్ రేటు విధానంలో నిర్మించారని రామకృష్ణారావు తెలిపారు. బరాజ్లకు అనుమతిచ్చే విషయంలో ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం తీసుకుంటారా? అని కమిషన్ ప్రశ్నించగా, అది తప్పనిసరి అని వివరించారు. బరాజ్ల పాలసీలను శాసనసభ ముందు ప్రభుత్వం ఉంచిందా? అని ప్రశ్నించగా, తనకు తెలియదని సమాధానమిచ్చారు. నేటి నుంచి వరుసగా...జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్ను ప్రశ్నించనుంది. గురు, శుక్ర, శనివారాల్లో వరుసగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్ల నిర్మాణ సంస్థలైన నవయుగ, అఫ్కాన్స్, ఎల్ అండ్ టీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. -
ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం
-
‘కాళేశ్వరం’పై ప్రాథమిక నివేదిక రెడీ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచా రణ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో కమిషన్ గుర్తించిన అంశాలు, అవకతవకలు, ఇతర అంశాలపై సుమారు 204 పేజీలతో ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. నివేది కలో దాదాపుగా 12 అధ్యయనాల వివరాలున్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వేల సంఖ్యలోని ఫైళ్లను అధ్యయనం చేయడంతోపాటు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్లో సేకరించిన వివరాలను నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.బరాజ్ల నిర్మా ణంతోపాటు ఇతర పనుల్లో అవకతవకలు జరిగినట్టుగా కమిషన్ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించడానికి బరాజ్ల అంచనాలను ఏటేటా పెంచడంతోపాటు జరగని పనులకు కూడా రూ.కోట్లలో బిల్లులు జారీ చేసినట్టుగా ఆధారాలను సేకరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బరాజ్లకు సంబంధించిన విధానపర నిర్ణయాలు, సాంకేతిక, ఆర్థికపర అంశాలపై విచారణ దాదాపు పూర్తయిందని.. మరికొందరు సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే విచారణ ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నాయి. ఇక జనవరి, ఫిబ్రవరిలో రెండు పర్యాయాలు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి.. మిగతా వారిని ప్రశ్నించేందుకు కమిషన్ సన్నద్ధమైనట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే తుది నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం శాసనసభలో నివేదికను ప్రవేశపెట్టి చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రామకృష్ణారావుకు క్రాస్ ఎగ్జామినేషన్.. ఇప్పటికే పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి 80 మందికిపైగా ఇంజనీర్లు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్.. మంగళవారం నుంచి మరో దఫా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. తొలిరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ప్రశ్నించనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కు లేని ఆదాయాన్ని కాగితాలపై చూపి రుణాలను సమీకరించినట్టు వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఆయనను విచారించనుంది. బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్, బరాజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులనూ ఇదే విడతలో ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వచ్చే నెలలో కేసీఆర్, హరీశ్, ఈటలకు పిలుపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల, ఆర్థిక మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు కమిషన్ వచ్చే నెలలో క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. వారికి సమన్లు జారీ చేయడానికి ముందే బలమైన ఆధారాలను సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. చివరగా కేసీఆర్ను ప్రశ్నించడం ద్వారా కమిషన్ విచారణను ముగించి, ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే యోచనతో ఉన్నట్టు తెలిసింది. -
కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ చివరి అంకానికి చేరింది. ఆదివారం హైదరాబాద్కు చేరుకున్న జస్టిస్ చంద్రఘోష్ మంగళవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించగా, ఇదే తుది విడత క్రాస్ ఎగ్జామినేషన్ కావొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. గత క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరుకాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ఈ దఫాలో కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో అధికారుల వంతు పూర్తికానుంది. బరాజ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించిన కాగ్ అధికారులను సైతం కమిషన్ ఇదే దఫాలో ప్రశ్నించనుంది. అనంతరం చివర్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు, నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కమిషన్ పిలిచే అవకాశం ఉంది.సోమవారం వీరికి కమిషన్ కార్యాలయం నుంచి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఇప్పటికే కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ లొకేషన్ను మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో కేసీఆర్, హరీశ్రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. వీరందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా కేసీఆర్, హరీశ్రావును కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ గడువు ఫిబవ్రరితో పూర్తికానుండగా, ఆలోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. -
‘మేడిగడ్డ’ లోపాలు..ఇంజినీర్లకు విజిలెన్స్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -
మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్దే!
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ బరాజ్ నిర్మించాలన్న ఆలోచన నాటి సీఎం కేసీఆర్దేనని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లేఖ ఇవ్వడం, మహారాష్ట్రతో ముంపుపై వివా దం ఏర్పడడంతోనే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఎన్నో లేఖలు రాసిందని, సంప్రదింపులతో మహారాష్ట్రతో ముంపు సమస్యను పరిష్కారానికి అవకాశం ఉండేదన్నారు. రాజకీయ, ‘ఇతర’కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్కు వెదిరె శ్రీరామ్ హాజరై సమాధానాలిచ్చారు. వ్యక్తిగత హోదాలోనే సాక్ష్యం... వ్యక్తిగత హోదాలోనే కమిషన్ ముందు సాక్షిగా హాజరైనట్టు వెదిరే శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు అనుమతుల కోరుతూ సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ రాసిన లేఖను సాక్ష్యంగా ఆయన గతంలో కమిషన్కు సమరి్పంచగా, ఆ లేఖలో వ్యత్యాసాలున్నట్టు కమిషన్ ఎత్తిచూపింది. ఈ లేఖను తాను సీడబ్ల్యూసీ నుంచే స్వీకరించానని, సీడీఓ సీఈ లేఖను మార్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారికంగా తీసుకోనందున వాటిని సాక్ష్యంగా పరిగణించబోమని కమిషన్ తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల కుంగిపోవచ్చు.. మేడిగడ్డ బరాజ్ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్లూ కుంగిపోవచ్చని వెదిరె శ్రీరామ్ అన్నారు. బరాజ్ల వైఫల్యానికి కారణాలేమిటని కమిషన్ ప్రశ్నించగా, సరైన ఇన్వెస్టిగేషన్లు జరపకుండానే డిజైన్ల రూపకల్పన, డిజైన్లు, మాడల్ స్టడీస్కు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ జరగడమేనన్నారు. ప్లాన్ తయారీకి ముందే పనులు ప్రారంభించారా అని కమిషన్ అడగ్గా, అవునని బదులిచ్చారు. 2016 ఏప్రిల్/మేలో బరాజ్లు నిర్మించాలని నిర్ణయించి 2019లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అత్యాశే అన్నారు.డీపీఆర్ తయారీకి ఏడాది అవసరం కాగా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని వ్యాప్కోస్ను కోరారన్నారు. డీపీఆర్కు ఆమోదం లభించకముందే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, నాటికి ఇంకా డిజైన్లు సైతం సిద్ధం కాలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్ల స్థలాలను మార్చడంతో అప్పటికే నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లు వృథా అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిందా అని కమిషన్ అడగగా, లేదని బదులిచ్చారు. తొందరపాటుతో క్షేత్రస్థాయిలోని ఈఈ నుంచి ఈఎన్సీ వరకు అందరూ తప్పిదాలు చేశారన్నారు. నిర్వహణ విభాగం ఈఎన్సీ జాప్యం చేశారు బరాజ్లలో సీపేజీతో నీరు లీకైనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సలహా కోరడంలో నిర్వహణ విభాగం ఈఎన్సీ(నాగేంద్రరావు) జాప్యం చేయడంతో నష్టం తీవ్రత పెరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా, అవునని వెదిరె బదులిచ్చారు. బరాజ్ కుంగే వరకు ఎన్డీఎస్ఏకు సమాచారం లేదని, కుంగిన 5 రోజులకు ఎన్డీఎస్ఏ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ 20 రకాల సమాచారం కోరితే సకాలంలో ఆ ఈఎన్సీ ఇవ్వలేదని, దీంతో బరాజ్ల వైఫల్యానికి కారణాలను గుర్తించడం ఎన్డీఎస్ఏకి క్లిష్టంగా మారిందన్నారు. మళ్లీ గడువు పొడిగించలేం ..కోదండరామ్కు కమిషన్ స్పష్టీకరణ మీరు సమరి్పంచిన పత్రాలకు ఆధారాలు ఏమిటని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్ను కమిషన్ ప్రశ్నించగా, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించి మీకు అవకాశం ఇచ్చామని, మళ్లీ పొడిగించడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. అఫిడవిట్పై చేసిన సంతకం మీదేనా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని కోదండరామ్ ధ్రువీకరించారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వికాస్రాజ్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిలేదని తెలపడంతో ఆయనకు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. -
3 ప్రాజెక్టుల డీపీఆర్లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
మీరేం డిబేట్కు రాలేదు.. సోమేష్ కుమార్పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్తో పాటు సోమేష్ కుమార్ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్కు రాలేదు.. స్ట్రయిట్గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ను కమిషన్ ఇవాళ విచారణ జరిపింది.హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ చంద్రఘోష్, స్మితా సబర్వాల్తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?స్మితా సబర్వాల్: అది నా దృష్టిలో లేదుకమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?స్మితా సబర్వాల్: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు.. అవగాహన కూడా లేదుకమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? స్మితా సబర్వాల్: నాకు తెలీదుకమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలిస్మితా సబర్వాల్: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశాసీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?స్మితా సబర్వాల్: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదుఇదిలా ఉంటే.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్ను కమిషన్ విచారించింది.ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే! -
కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన పాల్గొన్నారు.సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు బరాజ్ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు. ‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే.. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్లు వేర్వేరుగా బదులిచ్చారు. అప్పట్లో బరాజ్లలో లోపాలు కనబడలేదు: రజత్కుమార్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. -
‘మేడిగడ్డ’ ఎప్పుడు దెబ్బతింది?
సాక్షి, హైదరాబాద్: ‘వరదనీటి మళ్లింపు కోసం ని ర్మించే బరాజ్లను నీటినిల్వ డ్యామ్లుగా ఏ ప్రాతి పదికన పరిగణించారు? 2019లో బరాజ్లు పూర్త యితే 2021లో వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద 2023 జూలైలో కాళేశ్వరం బరాజ్లను డ్యామ్ లుగా గుర్తించడం వెనక అంతర్యం ఏమిటి?’ అని రాష్ట్ర డ్యామ్ల భద్రత సంస్థ (ఎస్డీఎస్ఓ) మాజీ ఎస్ఈ మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది.కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం అమెరికాలో ఉన్న మురళీకృష్ణను వర్చువల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.చట్టంలో ఉన్నందునే పరిగణించాం..‘డ్యామ్ల రక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మీరు అఫిడవిట్లో పేర్కొన్నదంతా వాస్తవమే నా? మీ బాధ్యతలేంటి?’ అని కమిషన్ మురళీకృష్ణ ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ 2021 డిసెంబర్ 30న నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ను నోటిఫై చేశారని పేర్కొన్నారు. 15 మీటర్ల ఎత్తు కలిగి, నీటిని నిల్వ చేసే జలాశయాలతోపాటు 10 మీటర్లకు మించి ఎత్తున్న చెక్ డ్యామ్లను కూడా డ్యామ్లుగా పరిగణించాలని చట్టంలో ఉందని మురళీకృష్ణ తెలియజేశారు. దీనిపై కమిషన్ స్పంది స్తూ ‘నీటిని మళ్లించడానికే బరాజ్లు కడతారు.. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను డ్యామ్లుగా ఎలా పరిగణించారు? అని మళ్లీ ప్రశ్నించింది. చట్ట ప్రకారం స్పెసిఫైడ్ డ్యామ్లుగా బరాజ్లను నోటి ఫై చేశారని మురళీకృష్ణ వివరించారు. డ్యామ్ల రక్ష ణ చట్టం అమలు కోసం క్షేత్రస్థాయిలో అధికారుల తో చర్చించామని.. ఆయా డ్యామ్లను సమగ్రంగా పరిశీలించి నోటిఫై చేయించామని తెలిపారు.బరా జ్లు ఎప్పుడు పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించ గా 2023లో స్పెసిఫైడ్ డ్యామ్లుగా నోటిపై చేశామ న్నారు. 2021లో చట్టం వస్తే 2019లోనే బరాజ్ పూ ర్తవడం వాస్తవమా? కాదా? అని కమిషన్ అడగ్గా వాస్తవమేనని చెప్పారు. పదేపదే విజ్ఞప్తుల అనంత రం స్పెసిఫైడ్ డ్యామ్ల జాబితాలో బరాజ్లను చేర్చారని బదులిచ్చారు. 2019లో మేడిగడ్డలో వర దలు వచ్చాయని, తొలుత సుందిళ్ల, అన్నారంలో బుంగలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత మేడిగడ్డ దెబ్బ తిందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయి తే బరాజ్ల అధికారులు ఈ విషయాన్ని నివేదించలేదని మురళీకృష్ణ వెల్లడించారు.రెండో వారంలో మళ్లీ విచారణనాలుగో విడత క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసిన జస్టిస్ చంద్రఘోష్.. మంగళవారం సాయంత్రం కోల్కతా తిరిగి వెళ్లనున్నారు. అనంతరం రెండో వారంలో తిరిగి హైదరాబాద్ వచ్చి ఐదో దఫా విచా రణలో ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలను ప్రశ్నించ నున్నారు. ఆ తర్వాత ఐఏఎస్లను విచారించే అవకాశాలున్నాయి. -
కాళేశ్వరం సేప్టీ అధికారులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, భద్రత వంటి అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న బహిరంగ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ బహిరంగ విచారణలో ఆన్లైన్లో డ్యామ్ స్టేఫీ అధికారి మురళీకృష్ణపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఫైరయ్యిందిఆన్లైన్లో డ్యామ్ సేప్టీ అధికారి మురళీకృష్ణను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా మూడు బ్యారేజీల సేఫ్టీపై ఆరా తీసింది. డ్యామ్ సేప్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని గుర్తించింది. దీంతో సేప్టీ అధికారులపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు నెరవేర్చి తీరుతాం: భట్టి
మహబూబ్నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో పారుతున్న కృష్ణానదిని పట్టించుకోలేదని.. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని కుదువపెట్టారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క ఆరోపించారు. రైతు పండుగ సభలో ఆయన మాట్లాడా రు. కృష్ణా నీళ్లను పాల మూరుతో పాటు పక్కనున్న రంగారెడ్డి, నల్ల గొండ జిల్లాలకు ఇవ్వాలని ఆలో చన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలేదు. అప్పుడే బీఆర్ఎస్ నాయకు లు ప్రజల వద్దకు వెళ్తాం. ఉద్యమాలు చేస్తాం, నిల దీస్తామని చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. పకడ్బందీగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంటే.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఒకాయన అంటాడు.ఇంకో ఆయన వచ్చి ఉద్యమం చేస్తానని చెప్తాడు. ఇది సిగ్గు చేటు. ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల కోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు అమలు చేసి తీరుతాం’’ అని భట్టి పేర్కొన్నారు. తాము రు ణమాఫీ చేయడం మాత్రమే కా కుండా... పంట నష్టపోయిన రైతు లకు పరిహారం కింద రూ. 100 కోట్లు విడుదల చేశామని తెలిపా రు. పంటల బీమా కింద ప్రభు త్వమే రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 1,433 కోట్ల ప్రీమియం చెల్లించిందని భట్టి తెలిపారు. బడ్జెట్లో రూ.73 వేల కోట్లు కేటాయించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.రూ.2,747 కోట్లు రుణమాఫీ సొమ్ము విడుదలరైతు పండుగ ముగింపు సందర్భంగా నాలుగో విడత రుణమాఫీ కింద రూ.2,747 కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అదేవిధంగా 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. సమావేశంలో మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్రెడ్డి, జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.రైతు సంక్షేమం మొదలైంది వైఎస్సార్ హయాం నుంచే..రైతు పండుగ సభలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకు న్నారు. మొదట రైతులకు రుణమాఫీ చేసినది, ఉచిత కరెంట్ ఇచ్చినది వైఎస్సార్ హయాంలోనేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టులు రూపొందించారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మొదటిసారిగా రైతు రుణమాఫీ చేసినది వైఎస్ అని మంత్రి దామోదర రాజనర్సింహ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని, వైఎస్సార్ హయాం నుంచీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. -
కమిషన్ ముందు కథలు చెప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఇంజనీరేనా? ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? కమిషన్ ముందు కథలు చెబుతున్నారా? బాధ్యతలను కేంద్రంపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? పక్కదోవ పట్టించడానికి యత్నించినా వాస్తవాలన్నీ వెలుగులోకి తెస్తాం..’అని కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) శంకర్ నాయక్పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బరాజ్ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా బుధవారం 15 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్ ఫ్లడ్స్ అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, పరీవాహక ప్రాంతంలో వచ్చే వరద ఆధారంగా డిజైన్లు తయారు చేయడమేనని నాయక్ బదులిచ్చారు. దీంతో మీరు ఇంజనీరేనా? డిజైన్ ఫ్లడ్ అంటే కూడా తెలియదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను జేఎనీ్టయూలో చదువుకున్నానని, నదిలో వచ్చే వరద ఆధారంగా చేసేదే డిజైన్ ఫ్లడ్ అని ఆయన బదులిచ్చారు. ‘ఏం దాస్తున్నారు? రిటైరయ్యాక కూడా దాచేది ఏముంది? విచారణను పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తారా? అని కమిషన్ ఆయనపై మండిపడగా, లేదని శంకర్నాయక్ వివరణ ఇచ్చారు. 2016 జనవరి 17న నాటి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను వ్యాప్కోస్ సంస్థ సమరి్పంచిందా? ఆ సమావేశం మినిట్స్ను పరిశీలించారా? అన్న ప్రశ్నకు మినిట్స్ను చూడలేదని నాయక్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. నీటి లభ్యతను తొలుత ఇక్కడి ఇంజనీర్లే నిర్ధారించాల్సి ఉంటుందని కమిషన్ తప్పుబట్టింది. కేంద్రంపై తోసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఎంత ప్రయత్ని0చినా వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అని ఆగ్రహం వ్యక్తంచేసింది.క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లు పంపే నీటి లభ్యత లెక్కలను పరిశీలించి సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించడమే తమ బాధ్యత అని శంకర్నాయక్ తెలిపారు. బరాజ్ల నిర్మాణ స్థలాలను మార్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. నీటి లభ్యత అధ్యయనాలు జరపకముందే జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్ తయారు చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా, లేదని నాయక్ బదులిచ్చారు. వరద తీవ్రత ఆధారంగా ఎన్ని గేట్లు పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా, బరాజ్ సీసీ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయి? బ్లాకులు కొట్టుకుపోతే పైఅధికారులకు ఎందుకు లేఖలు రాయలేదు? మౌఖికంగానే సమాచారం ఇస్తారా? అని అన్నారం బరాజ్ ఏఈఈ ఆర్మూరి రామచందర్పై కమిషన్ మండిపడింది. పినాకిని అంటే అర్థం తెలుసా? మీ పదవీకాలంలో బరాజ్లను ఎన్నిసార్లు సందర్శించారు? నివేదికలు ఏమైనా ఇచ్చారా? అని ఓ అండ్ ఎం విభాగం మాజీ సీఈ జి.రమేశ్ను కమిషన్ ప్రశ్నించింది. 2021 జూలైలో ఒక్కసారి పరిశీలించి నివేదిక ఇచ్చానని రమేశ్ బదులిచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరుకి బదులు అఫిడవిట్లో పినాకిని చంద్రఘోష్ అని రాయడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. పినాకిని అంటే అర్థం తెలుసా?, అఫిడవిట్ ప్రారంభంలోనే తప్పులు ఉంటే ఎలా? సంతకం చేయడానికి ముందు అఫిడవిట్ చదువుకోరా? అని నిలదీసింది. అర్జీల్లో అచ్చు తప్పులున్నా న్యాయస్థానాలు కేసులను కొట్టివేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సరైన పరిశోధనలు చేయకుండానే బరాజ్ల నిర్మాణంపై నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఇంజనీర్ ఐ.వికల్రార్ కమిషన్కు తెలిపారు. బరాజ్ల వైఫల్యానికి హైపవర్ కమిటీ ప్రధాన కారణమని ఆరోపించారు. 2–3 టీఎంసీల సామర్థ్యంతోనే బరాజ్లను నిర్మిస్తారని, 16 టీఎంసీల సామర్థ్యంతో కట్టడంతోనే సమస్యలొచ్చాయన్నారు. గత మూడు రోజుల్లో మొత్తం 49 మంది ఇంజనీర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించడంతో ఇంజనీర్ల వంతు ముగిసింది. మళ్లీ సోమవారం నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్లతోపాటు కాంట్రాక్టర్లను ప్రశ్నించనుంది. -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
-
మేడిగడ్డ ఏఈఈ, డీఈఈపై జస్టిస్ ఘోష్ అసహనం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కమిషన్ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్ చంద్రఘోష్ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారాయన. ఆపై.. నిర్మాణం, పనుల వివరాలు ఆరా తీశారు.కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారీగా చేశారా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని అని ప్రశ్నించారు. మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు.ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్ ముందు చెప్పారు.కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది. AEE - DEE - EE - CE CDO.. ఇలా మొత్తం 18 మంది ఇంజనీర్స్థాయి అధికారులను స్వయంగా విచారించారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. రేపు (మంగళవారం) మరో 15 మందిని విచారిస్తారని సమాచారం. -
మరోసారి కాళేశ్వరంపై విచారణ
-
‘మేడిగడ్డ’లో భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా భారీ కుట్రకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినందుకు ఆ అధికారులు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచిన మధ్యంతర నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. విజిలెన్స్ ఆ నివేదికలో పేర్కొన్న కీలక అంశాలివీ.. ఈఈ, ఎస్ఈలపై క్రిమినల్ చర్యలు! మేడిగడ్డ బరాజ్లో మిగులు పనుల పూర్తికి ఎలాంటి హామీ తీసుకోకుండానే.. పనులు దాదాపుగా పూర్తయినట్టుగా ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’కి మహదేవ్పూర్ డివిజన్–1 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఈ బీవీ రమణారెడ్డి సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయంలో అధికారులిద్దరూ నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’తో కుమ్మక్కై అనుచిత లబ్ధి కల్పించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ.. ఒప్పందంలోని 42వ క్లాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే పనులు పూర్తయినట్టు తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తిని సరిగ్గా పరిశీలించలేదు. ఏ పని పూర్తయిందో స్పష్టంగా పేర్కొనలేదు. ప్రభుత్వ ఖజానాకు రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఎస్ఈ, ఈఈతోపాటు నిర్మాణ సంస్థ కూడా సంబంధిత చట్టాల కింద క్రిమినల్ ప్రాసిక్యూషన్కు అర్హులే. తప్పుడు వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్.. మేడిగడ్డ బరాజ్ మిగులు పనులు పూర్తిచేయాలని... దెబ్బతిన్న సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్కు మరమ్మతులు చేయాలని 2021 ఫిబ్రవరి 17న కాంట్రాక్టర్కు జారీచేసిన నోటీసులను విస్మరిస్తూ, 2021 మార్చి 15న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బరాజ్లో లోపాలు సరిదిద్దాలంటూ 2020 మే 18న స్వయంగా తానే జారీ చేసిన నోటీసులను విస్మరిస్తూ.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్పై ఎస్ఈ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేసి ఒప్పందంలోని 52.2(సీ) క్లాజును ఉల్లంఘించారు. మిగులు పనుల పూర్తి, మరమ్మతుల నిర్వహణలో ఎల్ అండ్ టీ విఫలమైంది. మెజర్మెంట్ బుక్ నం.56/2000 పేరుతో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ అసలు అలాంటి సర్టిఫికెటే లేదని తేలింది. అంటే పనులు పూర్తయ్యాయా లేదా అన్నది పరిశీలించలేదని అర్థమవుతోంది. ఉద్దేశపూర్వకంగానే నిర్మాణ సంస్థకు అనుచిత లబ్ధి కలిగించారు. బరాజ్ దెబ్బతిన్నా నిర్మాణ సంస్థను బాధ్యులుగా చేయలేని పరిస్థితి కల్పించి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితిలో పడేశారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలనూ తిరిగి ఇచ్చేయడం కూడా.. నిర్మాణ సంస్థతో మరమ్మతులు చేయించే అవకాశానికి గండికొట్టింది. నిర్వహణలో నేరపూరిత నిర్లక్ష్యం బరాజ్ ప్రారంభించిన నాటి నుంచే డ్యామేజీలు, లీకేజీలు బయటపడినా.. అధికారులు, నిర్మాణ సంస్థ మరమ్మతులు చేపట్టలేదు. డ్యామ్ అధికారులు నిర్వహణను గాలికి వదిలేసి, నిర్మాణ సంస్థకు లేఖలు రాయడంతో సరిపెట్టారు. డ్యామ్ అధికారుల నేరపూరిత నిర్లక్ష్యంతోనే బరాజ్ కుంగిపోయి ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. అధికారులు, కాంట్రాక్టర్ను ప్రాసిక్యూట్ చేయాలి. కొంపముంచిన కాఫర్ డ్యామ్! బరాజ్ నిర్మాణానికి ముందు వరదను మళ్లించడానికి ఏర్పాటు చేసిన కాఫర్ డ్యామ్, దానికి సంబంధించిన షీట్పైల్స్ను నిర్మాణం పూర్తయిన తర్వాత సంపూర్ణంగా తొలగించలేదు. అవి నదిలో సహజ వరద ప్రవాహానికి అడ్డంకిగా మారి బరాజ్కు ముప్పు కలిగించాయి. కాఫర్ డ్యామ్ తొలగించడం పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యతే. బరాజ్ను ప్రారంభించాక కాంట్రాక్టర్కు అధిక చెల్లింపులు చేసి.. ఉద్దేశపూర్వకంగా నిధుల దురి్వనియోగానికి పాల్పడేందుకు కాఫర్ డ్యామ్ అంచనాలను రూ.61.21 కోట్లకు పెంచారు. ఈ అంశంలో అధికారులు, కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – డీవాటరింగ్ పనుల్లో అధికారులు కాంట్రాక్టర్కు రూ.39.43 కోట్ల అనుచిత లబ్ధి కలిగించారు. పని విలువలో డీవాటరింగ్ వ్యయం 3శాతంలోపే ఉండాలి. కానీ 2017 డిసెంబర్ 9న నాటి సీఎం నిర్వహించిన సమీక్షలో 5 శాతానికి మించిన వ్యయంతో సవరణ అంచనాలను ఆమోదించారు. నాణ్యత పరీక్షలు లేకుండానే చెల్లింపులు బరాజ్లకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించారు. నాణ్యత పరీక్షలు నిర్వహించకుండా క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు భారీ తప్పిదం చేశారు..’’ అని విజిలెన్స్ మధ్యంతర నివేదికలో పేర్కొంది. -
12 నుంచి ఐఏఎస్ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్కుమార్, వికాస్రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్ఇన్చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లు నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమిషషన్ ఎదుట డాక్యుమెంట్ల దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినేట్స్ డాక్యుమెంట్స్ దాఖలు చేశారు. దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్స్, జియోటెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు వచ్చాయి.మూడు బ్యారేజీల వివరాలను వెంకటేశ్వర్లు కమిషన్కు అందించారు. కమిషన్ బహిరంగ విచారణలో మేడిగడ్డ బ్లాక్ సెవెన్ ఘటన ప్రస్తావనకు రాగా.. ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా అని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డతో పాటు మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. అయితే నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డామేజ్ అయిందని, మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆదేశించారని వెంకటేశ్వర్లు తెలిపారు.బ్యారేజీలకు ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో మేడిగడ్డ రూ, 2591 కోట్లు, అన్నారం 1785 కోట్లు, సుందిళ్ల 1437 కోట్లు అని చెప్పారు. మూడు బ్యారేజీలు పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిళ్ల 2200 కోట్లకు పెరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు. కాగా వెంకటేశ్వర్లను అక్టోబర్ 24న కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. బ్యారేజీల డీపీఆర్, నీటి నిల్వ గురించి ప్రశ్నించింది.ప్రభుత్వానికి చేరిన మెడిగడ్డ పై విచారణ విజిలెన్స్ రిపోర్ట్రిపోర్ట్ను పరిశీలిస్తున్న ప్రభుత్వంరెండు మూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వనున్న సర్కార్.అధికారుల తప్పిదాలు ఉన్నట్లు ఇప్పటికే తాత్కాలిక రిపోర్ట్విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలన తరువాత ఐఎఎస్ అధికారులను పిలువనున్న కమిషన్ -
కాళేశ్వరం కమిషన్ విచారణ.. మూడుసార్లు హరీష్ రావు పేరు ప్రస్తావన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి శనివారం హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెండర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఆయన్ను విచారించింది. విచారణలో భాగంగా మాజీ జలవనరులశాఖ మంత్రి హరీష్ రావు పేరును సుధాకర్ రెడ్డి మూడుసార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం చేసిన టెస్టుల రిపోర్టులను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వనని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. ఆ సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని, ఆయనే ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టింది అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలోనేనని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 40 వేల కోట్ల నుంచి 127 వేల కోట్లకు పెంచారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేవలం అదనంగా రెండు లక్షల ఎకరాల కోసమా?: కమిషన్డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్కు డబ్బులు ఇచ్చాం-సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల ప్రాసెస్ జరిగిందా? కమిషన్టెండరింగ్ ప్రాసెస్ జరగలేదు. నామినేషన్ ప్రాసెస్ ద్వారా వ్యాప్కొస్ సంస్థకు కాంట్రాక్టు అప్పగించారు- సుధాకర్ రెడ్డికాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ ప్రాసెస్ ఎందుకు చేయలేదు చెయ్యొద్దు అని ఎవరు ఆదేశించారు?- కమిషన్బ్యారేజీ పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఏ సమయంలో ఇస్తారు?- కమిషన్దాదాపు 90 శాతం పనులు పూర్తయితే సబ్ స్టాన్షల్ సర్టిఫికేట్ విడుదల చేస్తారు?- సుధాకర్ రెడ్డిపనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చేముందు ఫీల్డ్ విజిట్ లేదా డాక్యుమెంట్స్ చెక్ చేశారా?- కమిషన్ఫీల్డ్ విసిట్, డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా పనులు పూర్తయినట్లు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు?- కమిషన్42.2b క్లాజ్ ఉపయోగించి సర్టిఫికెట్ను రిజెక్ట్ చేసే అర్హత ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదు?- కమిషన్సర్టిఫికెట్ ఇచ్చేముందు అసలు నిజాలు చూడకుండా ఎలా గుడ్డిగా సంతకాలు పెడుతారు?- కమిషన్కాపర్ డ్యాం నిర్మాణం తొలగింపు కోసం అదనంగా ఖర్చు చేసే నిధులు ప్రభుత్వానికి నష్టమే కదా?- కమిషన్మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఆలస్యం ఎందుకు అయ్యాయి? - కమిషన్అన్నారం సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయి,.మేడిగడ్డ బ్యారేజీ ఫైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు.- సుధాకర్ రెడ్డిబిల్లుల చెల్లింపుల అంశంలో కాళేశ్వరం కార్పొరేషన్ ప్రస్తావన..కాళేశ్వరం కార్పొరేషన్ ఎవరు పెట్టారు? పెట్టమని ఎవరు ఆదేశించారు;- కమిషన్కాళేశ్వరం కార్పొరేషన్ ప్రభుత్వం పెట్టింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగింది. సుధాకర్ రెడ్డిమేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు గనుల ఆనవాళ్లు ఉన్నట్లు జోధాపూర్ యూనివర్సిటీ సర్దార్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. సుధాకర్ రెడ్డిబ్యారేజీలలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా చేస్తే ఎంత చేయొచ్చు?- కమిషన్మేడిగడ్డ బ్యారేజీలో 100 మీటర్ల లెవెల్ వరకు స్టోర్ చేయొచ్చు.- సుధాకర్ రెడ్డిచేసుకున్న అగ్రిమెంట్ కంటే ఎక్కువ నిధులు ఏజెన్సీకి పే చేస్తే అది ప్రభుత్వానికి నష్టమే కదా- కమిషన్డిజైన్లలో లోపాల వల్ల బ్యారేజీల వద్ద డ్యామేజ్ జరిగింది నిజమేనా? - కమిషన్మేడిగడ్డ బ్యారేజీ లోని బ్లాక్ లలో లెన్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే డ్యామేజి జరిగింది- సుధాకర్ రెడ్డి వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయి-సుధాకర్ రెడ్డి. -
మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్ఇన్చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేసింది. వెంకటేశ్వర్లు శుక్రవారం(అక్టోబర్ 25) కమిషన్ ముందు వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల విచారణలో భాగంగా కమిషన్ మాజీ ఈఎన్సీని రెండు వందలకుపైగా ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈఎన్సీ జవాబులు డ్యాక్యుమెంట్ల రూపంలో అందిస్తానని కమిషన్కు తెలిపారు. దీంతో సోమవారం విచారణకు వచ్చేటపుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలపై విచారణకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: భూదాన్ భూముల భాగోతం.. ఐఏఎస్పై ఈడీ ప్రశ్నల వర్షం -
బరాజ్ల నిర్ణయం కేసీఆర్దే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావే నిర్ణయం తీసుకున్నారని నీటిపారుదల శాఖ రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. 2016 జనవరిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొన్నారు. వ్యాప్కోస్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, కేసీఆర్ స్వయంగా సంతకం చేశారని అన్నారు. ఈ డీపీఆర్ ఆధారంగా వివిధ కాంపోనెంట్ల అంచనాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారని వివరించారు. బరాజ్లను ఎక్కడ కట్టాలో ప్రభుత్వమే చెప్పగా, ఆ మేరకు డీపీఆర్ను వ్యాప్కోస్ సిద్ధం చేసిందన్నారు. నిర్మాణ దశలో అన్నారం, సుందిళ్ల బరాజ్ల స్థలాలను మార్చినట్టు చెప్పారు. గ్రావిటీ కాల్వ పొడవు తగ్గించడం, నిల్వ సామర్థ్యం పెంచడం, అటవీ భూముల సేకరణను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం ఆరు గంటల పాటు నిర్వహించిన రెండో విడత ఎగ్జామినేషన్లో వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరణ ఇచ్చారు. తొలి విడతలో ఆయనకు 71 ప్రశ్నలు వేసిన కమిషన్.. తాజాగా రెండో విడతలో ఏకంగా 128 ప్రశ్నలు సంధించింది. శుక్రవారం కూడా క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరుకావాలని ఆదేశించింది. నిర్మాణ దశలో మార్పులు ‘డీపీఆర్ను 2016 మార్చిలో కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించిన తర్వాత నిర్మాణంలో పలు మార్పులు, చేర్పులపై నిర్ణయాలు జరిగాయి. డీపీఆర్లో అన్ని కాంపోనెంట్లు లేవు. గైడ్బండ్, ఫ్లడ్ బ్యాంకులు, డైవర్షన్ చానల్స్ను తర్వాత చేర్చాం. నిర్మాణ దశలో సైట్ పరిస్థితుల ఆధారంగా మరికొన్ని మార్పులు చేశాం. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్సీ)లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పులు జరిగాయి. డీపీఆర్లో అన్నారం బరాజ్ను 120 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా, అటవీ భూముల ముంపు, సైట్ పరిస్థితుల ఆధారంగా 119 మీటర్లకు కుదించాం. ప్రాథమికంగా మూడు బరాజ్లకు వేర్వేరు డీపీఆర్లను తయారు చేయగా, తర్వాత ఉమ్మడి డీపీఆర్ను తయారు చేశాం..’అని కమిషన్కు వెంకటేశ్వర్లు తెలిపారు. సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో రూ.17,875 కోట్లతో అనుమతిచ్చి 2008లో రూ.38,500 కోట్లకు అంచనాలను పెంచి రూ.6,156 కోట్ల పనులు సైతం పూర్తి చేశాక 2 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం రీఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాల్సిన అవసరం ఏమిటి?’అని కమిషన్ నిలదీసింది. ‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్కు మహారాష్ట్ర అభ్యంతరం తెలపడంతో 148 మీటర్లకు ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఎత్తులో బరాజ్ కడితే 44 టీఎంసీల లభ్యతే ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పడంతోనే రీఇంజనీరింగ్ చేశారు’ అని వెంకటేశ్వర్లు వివరించారు.మ్యాథమెటికల్లీ తప్పుడు నిర్ణయమే ! ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా రెండుదశల్లో కలిపి 304 మెగావాట్ల పంపుల సామర్థ్యంతో నీళ్లను ఎత్తిపోయడానికి వీలుండగా రీఇంజనీరింగ్ చేసి పంపుల సామర్థ్యాన్ని 11 వేల మెగావాట్లకు పెంచడం సరైందేనా అని కమిషన్ ప్రశ్నించగా, గణితపరంగా తప్పుడు నిర్ణయమేనని మాజీ ఈఎన్సీ పేర్కొన్నారు. కోల్బెల్ట్ ఏరియాలో మేడిగడ్డ బరాజ్ నిర్మించారా? అని ప్రశ్నించగా వాస్తవం కాదని ఆయన బదులిచ్చారు. బరాజ్ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నట్టు జాదవ్పూర్ వర్సిటీ ఇచి్చన నివేదికను ప్రస్తావించగా దానితో తాను ఏకీభవించనని చెప్పారు. ప్రభుత్వ అధినేత ఆదేశాలతో బరాజ్లలో నీళ్లను నిల్వ చేశామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. బెంగాల్ సహా 4 రాష్ట్రాల్లో నిర్మించిన బరాజ్లలో సికెంట్ పైల్స్ వాడినట్టు చెప్పగా.. తన స్వరాష్ట్రం బెంగాల్ పేరును ఉటంకించడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి ?
-
‘మేడిగడ్డ’పై తుది నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదికను వెంటనే అందించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ)కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... ఎన్డీఎస్ఏ చైర్మన్ అనీల్ జైన్, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గతంలో అందించిన మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బరాజ్లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది.అయితే ప్రభుత్వం వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించి తమకు నివేదికలు సమర్పించాకే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ గతంలో స్పష్టం చేసింది. శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించే వరకు నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కోరడంతో ప్రస్తుతానికి మూడు బరాజ్లు ఉపయోగంలోకి లేవు. మరోవైపు వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కొన్ని పరీక్షలను మాత్రమే నీటిపారుదల శాఖ పూర్తి చేయగలిగింది. వాటికి సంబంధించిన నివేదికలను అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి అందజేశారు.సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ బరాజ్ కు పరీక్షలు నిర్వహించి అందించిన నివేదికను సైతం ఎన్డీఎస్ఏకు ఇటీవల అప్పగించారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను అందజేయాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగిలిన పరీక్షలను సైతం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తేనే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తుల కు ఎన్డీఎస్ఏ యంత్రాంగం స్పందించకపోవడంతో స్వయంగా ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్కుమార్, నాగేంద్రరావు, హరిరామ్లతో సమావేశమయ్యారు. మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలు.. గోదావరికి ఉపనది అయిన వార్దాపై బరాజ్తోపాటు ప్రాణహితపై తమ్మిడిహట్టికి దిగువన రబ్బర్ డ్యామ్ కట్టాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్కు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్లోకి పంపింగ్ చేయాలని యోచిస్తోంది. మేడిగడ్డ బరాజ్కు ప్రత్యామ్నాయంగా ఈ రెండు బరాజ్లు ఉపయోగపడనున్నాయి. మేడిగడ్డకు వెంటనే శాశ్వత మరమ్మతులు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలుగా వాటిని నిర్మించే అంశంపై ఎన్డీఎస్ఏతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మూసీ కాల్వలకు సత్వర అనుమతులు.. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ పనులకు పరిపాలనా అనుమతులు పొందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి, దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాల పెండింగ్ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి పరిశీలనలో ఉన్న సీతమ్మసాగర్ ప్రాజెక్టు డీపీఆర్కు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్కసాగర్ బరాజ్ నిర్మాణం విషయంలో ఛత్తీస్గఢ్తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని ఎన్ఓసీ పొందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.త్వరగా ఇంజనీర్లకు పదోన్నతులునీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతులపై మంత్రి ఉత్తమ్ అధికారులతో చర్చించారు. పదోన్నతులపై హైకోర్టులో కేసు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ఆ వెంటనే ఇంజనీర్లకు పదోన్నతులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మేడిగడ్డపై తుది నివేదిక కోసం విజిలెన్స్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి గల కారణాలపై తుది నివేదిక అందించడానికి వీలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కసరత్తును ముమ్మరం చేసింది. మేడిగడ్డ బరాజ్కి సంబంధించిన అంశాలపై లోతైన విచారణలో భాగంగా కీలక అధికారులను విచారించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు శనివారం నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో మార్పులు, చేర్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు..? సవరణ అంచనాలకు ఆమోదం తెలిపిందెవరు..? మేడిగడ్డ నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు..? వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ఈఎన్సీ (ఓ అండ్ ఎం), స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు బి.నాగేంద్రరావును, 8న సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) మాజీ చీఫ్ ఇంజనీర్ టి.శ్రీనివాస్, డైరెక్టర్ వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ వి.ఫణిభూషణ్శర్మను విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల వైఫల్యాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ప్రాథమిక, మధ్యంతర నివేదికలు అందించగా...తుది నివేదికను సత్వరం అందించాలని కాళేశ్వరం విచారణ కమిషన్ విజిలెన్స్ను ఆదేశించింది. సెప్టెంబర్ నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించగా..ఆ సంస్థ మరింత గడువును కోరినట్లు తెలిసింది. దాంతో ఈ నెలాఖరుకల్లా తుది నివేదికను సమర్పించడానికి అవసరమైన వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడానికి వీలుగా కసరత్తును చేపట్టింది. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
అనుమతి లేకుండానే బ్యాంకు గ్యారంటీల విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే మేడిగడ్డ బరాజ్కు సంబంధించిన రూ.159 కోట్ల బ్యాంకు గ్యారంటీలను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి నీటిపారుదల శాఖ మహదేవ్పూర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు. శాఖ ఉన్నతాధికారులకు కూడా ఆయన సమాచారం ఇవ్వలేదు.కాళేశ్వరం ప్రాజెక్టుల్లోని బరాజ్ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ఖాన్ ఈ విషయాన్ని తెలియజేశారు. మంగళవారం కమిషన్ నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు గ్యారంటీలు విడుదల చేసే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నా రా? అని కమిషన్ ప్రశ్నించగా, ఈ విషయంలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు. ⇒ తాను విధుల్లో చేరకముందే మేడిగడ్డ బరాజ్ పూర్తయిందని మాజీ డిప్యూటీ ఎస్ఈ ఎస్.సత్యనారాయణ కమిషన్కు తెలిపారు. ⇒2022 జూలైలో బరాజ్లకు భారీ వరదలు రావడంతో అప్రాన్, సీసీ బ్లాకులు కొట్టుకుపోయా యని ఎస్ఈగా పనిచేసిన కరుణాకర్ చెప్పారు. మరమ్మతులు చేయాలని నిర్మాణ సంస్థలకు లే ఖలు రాశామన్నారు. బరాజ్ల నిర్మాణం తర్వా త రెండేళ్ల పాటు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అమల్లో ఉంటుందని, మూడేళ్ల పాటు నిర్వహణను ఆ సంస్థలే చూడాల్సి ఉంటుందన్నారు. ⇒ బరాజ్లు డ్యామేజీకి కారణం ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, మోడల్ స్టడీస్లో బరాజ్లకు వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోయారని, ప్రతీ సెకనుకు 4.35 మీటర్ల వేగంతో వరద వ స్తుందని అంచనా వేయగా, 12–14 మీటర్ల వేగంతో వచి్చందని చెన్నూరు ఈఈ–2 బి.విష్ణుప్రసాద్ బదులిచ్చారు. బరాజ్లలో సీపేజీని గుర్తించి 2019 డిసెంబర్ 16న సెంట్రల్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు లేఖ రాయగా, 2020 డిసెంబర్ 22న ఆ సంస్థ ప్రతినిధులు అధ్యయనం కోసం అయ్యే అంచనాలను అందించారని బదులిచ్చారు. -
భగీరథ, కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి పొంగులేటి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్త గూడెం/నేలకొండపల్లి: గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళే శ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మార్కెట్ క మిటీ నూతన పాలక వర్గ ప్ర మాణస్వీకారం సోమ వారం సాయంత్రం జరగగా, ఆయ న పాల్గొని మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఎంఐయూడీలో అమృత్ స్కీంలో అవినీతికి పాల్పడ్డారని, సృజన్రెడ్డికి పనులు ఇచ్చారని కేటీఆర్ చెబుతుండగా.. ఈ విషయమై చర్చకు ఎక్కడైనా వస్తానని, ఆరోప ణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెబితే సమాధానం ఇవ్వలేదన్నారు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే కేటీఆర్ ఎవరో చెప్పిన విమర్శలు చేసే ముందుకు ఆలో చించాలని సూచించారు. పాలేరులో తనపై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్రెడ్డి అల్లుడే సృజన్రెడ్డి అని.. ఆయనకు బీఆర్ఎస్ హయాంలో సబ్ కాంట్రాక్టర్లు ఇప్పించారని తెలిపారు. ఇప్పుడు సృజన్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి బావమరిదిగా చిత్రీకరించే పనిచేస్తు న్నారని చెప్పారు. సీఎంను దించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేస్తు న్నారని చెబుతు న్నారని.. కానీ కేటీఆర్ – హరీశ్ రావు మధ్యే అంతర్గత వివాదాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలిపేదవారి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. సర్కారు ఆలోచన లకు అనుగుణంగా అధి కా రులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అలా కాకుండా సొంత ఆలోచనలను పాలనలో జొప్పించాలని చూస్తే ఏ స్థాయి అధికారుల పైనైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కనకయ్య, కలెక్టర్ పాటిల్, ఎస్పీ సునీల్దత్, ఐటీడీఏ పీఓ రాహుల్ సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో ధరణిని అడ్డుపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. -
కాళేశ్వరం వృథా కాదు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచా రం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అదే ప్రాజెక్టు వ్యవస్థను ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్లో కుంగిన మూడు పిల్లర్లను చూపుతూ మొత్తం ప్రాజెక్టు మీద రూ.లక్ష కోట్లు వృథా అయినట్లు ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. ఇప్పుడు మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నీటిని నింపుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా’అని వారు సృష్టించిన సిద్ధాంతాన్ని వారే అబద్ధమని నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం పంపింగ్ వ్యవస్థ ద్వారానే ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోశారనే నిజాన్ని మంత్రి పొన్నం అంగీకరించాలన్నారు.ఎల్లంపల్లిని వినియోగంలోకి తెచ్చాం కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై పెండింగులో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని హరీశ్రావు వెల్లడించారు. భూసేకరణ, పునరావాస కాలనీలు, కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హైలెవెల్ వంతెన.. తదితర పనులు పూర్తి చేసి ఎల్లంపల్లిని తమ హయాంలోనే నింపామన్నారు. గతంలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం కేవలం 14 టీఎంసీలు కాగా, రీ ఇంజనీరింగ్తో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 141 టీఎంసీలకు పెంచామన్నారు. ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసినా కూడా వినియోగించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అయిన వసతుల వల్లే సాధ్యమైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు–1 పునరుద్ధరణపై దృష్టిపెట్టి, 2025 వానాకాలం పంటలకు నీరు ఇచ్చేలా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషిచేయాలని హరీశ్రావు హితవు పలికారు.సీఎల్పీ భేటీకి అరికెపూడి ఎలా వెళతారు? శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరు కావడంపై మంత్రి శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యలు.. నవి్వపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ‘సిద్దిపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వస్తే కలుస్తాను. కానీ ఎల్పీ మీటింగ్కు వస్తే కలవను, ఏ ఎమ్మెల్యే కలవకూడదు కూడా. పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగినట్టుంది శ్రీధర్ బాబు వైఖరి’అని హరీర్రావు వ్యాఖ్యానించారు. -
‘పొన్నం’కు అవగాహన లేదు: హరీశ్రావు
సాక్షి,సిద్దిపేటజిల్లా: తనను విమర్శించే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహనారాహిత్యం బయటపడిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాజెక్టుపై పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందని హరీశ్రావు పునరుద్ఘాటించారు. కాగా, శనివారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ హరీశ్రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. దీనికి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి.. హరీశ్హార్డ్వర్కర్.. మాకు సలహాలివ్వొచ్చు: పొన్నం ప్రభాకర్ -
గుర్తు లేదు..మరిచిపోయిన!
సాక్షి, హైదరాబాద్: ‘నాకు తెలియదు.. గుర్తు లేదు..మర్చిపోయిన..’కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేసిన ప్రశ్నలకు కొందరు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెప్పిన వింత సమాధానాలు ఇవి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లే»ొరేటరీ(టీఎస్ఈఆర్ఎల్) చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించిన శ్రీదేవిని కమిషన్ ఏ ప్రశ్న అడిగినా ‘తెలీదు..గుర్తు లేదు’అని సమాధానాలివ్వగా, కమిషన్ ఆమెపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్టడీస్ విషయంలో కీలకపాత్ర పోషించిన ఆమెపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించగా, సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. బరాజ్లను నిర్మించడానికి ముందే మోడల్ స్టడీస్ చేశామని తొలుత చెప్పిన ఆమె, ఆ వెంటనే మాట మార్చారు. దీంతో మీరు ఇచ్చిన అఫిడవిట్లోని సమాచారానికి సైతం కట్టుబడి ఉండకపోతే ఎలా? అని ఆమెపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో పలువురు ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ⇒ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ) సీఈగా సైతం శ్రీదేవి వ్యవహరించగా, ఆ పోస్టులో ఉండి బరాజ్ల పరిరక్షణకు ఐఎస్ కోడ్ను అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, మౌనంగా ఉండిపోయారు. ⇒ బరాజ్లకు వరదలు ఎప్పుడొచ్చాయన్న ప్రశ్నకు సైతం తెలియదు అని బదులిచ్చారు. ⇒ బరాజ్లకు 2020లో త్రిడీ మోడల్ స్టడీస్ నిర్వహించినట్టు ఆమె చెప్పగా, 2023లో జరిగినట్టు టీఎస్ఈఆర్ఎల్ నివేదిక ఇచి్చందని కమిషన్ ఆమెకు తెలియజేసింది. అయితే ఆ విషయం తనకు గుర్తు లేదని ఆమె బదులివ్వడంతో కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. బరాజ్లకు తనిఖీలు చేయలేదు బరాజ్ల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని ఎస్డీఎస్ఓ సీఈ ప్రమీళను కమిషన్ ప్రశించగా, ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ఆమె బదులిచ్చారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అమల్లోకి వచి్చనా బరాజ్ల భద్రత వాటి చీఫ్ ఇంజనీర్దేనని స్పష్టం చేశారు. గేట్ల నిర్వహణలో మ్యానువల్స్, బరాజ్ల నిర్వహణ ప్రొటోకాల్స్ అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, ఆమె సమాధానమివ్వడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో పేర్లు చెప్పకుండా వివరాలు తెలపాలని కమిషన్ ఆమెను కోరింది. చట్టం ప్రకారం వర్షకాలానికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వలేదని ఆమె వివరించారు. – ఎస్స్డీఎస్ఓ ఈఈ విజయలక్ష్మి సైతం ఇదే విషయాన్ని కమిషన్కు తెలిపారు. అధ్యయనాలు, నిర్వహణ లేకపోవడమే కారణం బరాజ్ల వైఫల్యానికి కేవలం నిర్వహణ, పర్యవేక్షణ లోపాలే కాకుండా వాటికి ఎగువ, దిగువన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కూడా కారణమేనని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఈఈ రఘునాథ శర్మ తెలిపారు. 2019 లోనే వరదల తర్వాత బరాజ్లలో లోపాలు బయటపడగా, 2023 అక్టోబర్లో మేడిగడ్డ బరాజ్ కుంగే వరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. వైఫల్యానికి కారకులు ఎవరు? నాటి ప్రభుత్వ అధినేతనా? అని కమిషన్ అడగ్గా, 3డీ మోడల్ అధ్యయనాలు జరపకపోవడం, నిర్వహణ ప్రొటోకాల్స్ పాటించకపోవడం కారణమని ఆయన బదులిచ్చారు. ⇒ మోడల్ స్టడీస్ పూర్తికాక ముందే బరాజ్ల నిర్మాణం ప్రారంభించడంతోనే విఫలమయ్యాయని పలువురు టీఎస్ఈఆర్ఎల్ ల్యాబ్ ఇంజనీర్లు కమిషన్కు తెలిపారు. బరాజ్లను నీటి మళ్లింపుకోసం నిర్మిస్తారని, నిల్వ చేయడంతోనే కుంగిపోవడం, సీపేజీలు ఏర్పడడం జరిగిందన్నారు. వరదల సమయంలో కూడా గేట్లు మూసి ఉంచడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. -
కాళేశ్వరం తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్
దుబ్బాక: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలమని, మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలయ్యాయని చిల్లర రాజకీయా లు చేసిన కాంగ్రెస్..ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలని మాజీమంత్రి టి.హరీశ్రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు చేరడంతో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి శుక్రవారం హరీశ్రావు సందర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయి ఉంటే ఈ రోజు మల్లన్నసాగర్లోకి ఇంత నీరు ఎక్కడి నుంచి వచి్చందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీబరాజ్, అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్నసాగర్.. ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాక గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండటం వల్లనే సాధ్యమైందని చెప్పారు. మల్లన్నసాగర్ వద్ద ఉద్రిక్తత మల్లన్నసాగర్ను సందర్శనకు హరీశ్రావు తదితరులు వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నాయకుల ను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు పంపించారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్, వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులతో హరీశ్రావు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లన్నసాగర్ పరిసరాలు అంతా పోలీస్ నిఘా నీడలోనే కనిపించాయి. -
కాళేశ్వరం కమిషన్ విచారణ రేపటి నుంచి ప్రారంభం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపటి(శుక్రవారం) నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది. రేపటి నుంచి 25 మందికి పైగా కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్, కమిషన్కు కావాల్సిన సమాచారం ఇస్తానని ఆయా టీమ్స్ చెప్పాయి. కమిషన్ అడిగిన లాయర్ను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతీ ఒక్కరినీ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది.ఇక.. ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్ర ఘోష్ చేరుకున్నారు. ఘోష్తో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ భేటీ అయ్యారు.రేపటి నుంచి ఎవరిని విచారణ చేయాలి అనే అంశం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులపై చర్చించారు. ఇప్పటికే మొదలైన ఓపెన్ కోర్టు విచారణ. గత 20 నుంచి ఐదు రోజుల పాటు ఇరిగేషన్ అండ్ సీఈఓ అధికారులను జస్టిస్ గోష్ విచారించారు. -
ఎన్డీఎస్ఏ తుది నివేదిక త్వరగా తెప్పించండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి త్వరగా తుది నివేదిక తెప్పించుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో బరాజ్లకు నిర్వహించాల్సిన పరీక్షలు పూర్తి చేసి, వాటికి సంబంధించిన నివేదికలను నిపుణుల కమిటీకి అందజేయాలన్నారు. నీటిపారుదల శాఖపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్షించారు. సమ్మక్క బరాజ్ నిర్మాణంతో ఛత్తీస్గఢ్లో ఏర్పడనున్న ముంపు విషయంలో ఆ రాష్ట్రం నుంచి ఎన్ఓసీని సత్వరంగా రాబట్టుకోవాలని ఆదేశించారు. ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి పరిహారం చెల్లింపు విషయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చర్చ లు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు. సమ్మ క్క బరాజ్ డీపీఆర్కు అనుమతుల విషయంలో Üడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. భూసేకరణను 2025 మార్చిలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఆనకట్టు, కాల్వల భద్రతను పర్యవేక్షించేందుకు 1,800 మంది లష్కర్ల నియామకాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. దీనిపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పందిస్తూ ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుతో అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడి అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు పంపించిన విజ్ఞాపనలను సత్వరంగా పరిష్కరించి, జవాబు పంపించాలన్నారు. ఆనకట్టు, కాల్వల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్దాస్, ఈఎన్సీ(జనరల్) అనిల్కుమార్ పాల్గొన్నారు. -
బరాజ్లు ఎందుకు ఫెయిలయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల వైఫల్యానికి కారణాలేమిటి? డిజైన్లకు సాంకేతిక అనుమతులిచ్చాక మళ్లీ అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చారు? మారిన ప్రదేశాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు చేశారా?’అని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, రిటైరైన ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భా గంగా కమిషన్ మంగళవారం పలువురు ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అన్నారం బరాజ్ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఈఈ కె. నరేందర్ను ప్రశ్నించగా డిజైన్లను ఏఈఈలు తయారు చేస్తే.. వాటికి డీఈఈ, ఆపై ఈఈ అనుమతిస్తారని ఆయన తెలిపారు. భూభౌగోళిక, సైట్ సర్వే ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్లను సిద్ధం చేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్కు ఎదురు ప్రశ్నలు వేయగా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజైన్లలో లోపాల్లేవు: బస్వరాజ్, ఎస్ఈ, కాళేశ్వరం మేడిగడ్డ బరాజ్ డిజైన్లలో లోపాల్లేవని.. ఐఎస్ కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) నిబంధనలకు లోబడి ఎల్ అండ్ టీ ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా తయా రు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ హెచ్.బస్వరాజ్ తెలిపారు. డిజైన్లు ప్రమాణాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించాకే ఆమోదించామన్నారు. బరాజ్ నిర్మిత స్థలాన్ని పరిశీలించలేదని.. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు బస్వరాజ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బరాజ్ కుంగిందని సీడీవో ఎస్ఈ ఎం. సత్యనారాయణరెడ్డి వివరించారు. బరాజ్లను నీటి మళ్లింపు కోసం కట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిల్వ చేయడంతోనే విఫలమైనట్లు సీడీఓ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దయాకర్రెడ్డి ఇంతకుముందు కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్లో కమిషన్ దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామగుండం ఈఎన్సీ ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు చేశామని సీడీవో మాజీ ఎస్ఈ రాజశేఖర్ అన్నారు. అన్యాయాన్ని సరిచేయడానికే రీ ఇంజనీరింగ్పీసీ ఘోష్ కమిషన్కు తెలిపిన వి.ప్రకాశ్సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ ను పునర్నిర్మించేందుకు.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ను నాటి సీఎం కేసీఆర్ చేపట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్ తెలిపా రు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు మంగళవారం అఫిడవిట్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతుల ఆత్మహత్యలు సహా వివిధ ఘటనల్లో 50 వేల మంది చనిపోయా రని కమిషన్కు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలుకాగా రీ ఇంజనీరింగ్ ద్వారా 37 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి కేంద్ర జలసంఘం రాసిన లేఖల్లోని వాస్తవాలను కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, విద్యుత్రంగ నిపుణుడు కె.రఘు వక్రీకరించారని ఆధారాలతో సహా వివరించినట్లు ప్రకాశ్ చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ సాధ్యం కాదన్నారు. -
కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ
-
సైట్ చూడకుండానే డిజైన్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత నిర్మిత స్థలాన్ని(సైట్) సందర్శించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బరాజ్ డిజైన్లు, డ్రాయింగ్స్ను నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో) ఇంజినీర్లు రూపొందించా రని ఆ విభాగం రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజ నీర్ మహ్మద్ అబ్దుల్ఫజల్ వెల్లడించారు. కాళే శ్వరం ప్రాజెక్టు నాటి రామగుండం సీఈ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సైట్కు సంబంధించిన సాంకేతిక సమాచారం(క్రాస్ సెక్షన్ల) ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్స్ను రూపొందించినట్టు తెలి పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్కు ఆయన హాజరై వాంగ్మూ లం ఇచ్చారు.నాటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన సాంకేతిక అనుమతులు, హైపవర్ కమిటీ సిఫారసుల ప్రకారం సుందిళ్ల బరాజ్ నిర్మాణం విషయంలో నిర్ణయాలు జరిగాయని తెలిపారు. వరంగల్ ఎన్ఐటీ నిపుణులు అందించిన జియో టెక్నికల్ స్టడీస్ నివేదిక ఆధారంగా షీట్ పైల్స్కు బదులుగా సికెంట్ పైల్స్తో సుందిళ్ల బరాజ్ నిర్మించడానికి వీలు కల్పిస్తూ డిజై న్లలో మార్పులు చేశామన్నారు.బరాజ్కు అద నపు గేట్లు పెట్టాలని ఎవరు నిర్ణయం తీసుకు న్నారని కమిషన్ ప్రశ్నించగా, 58 గేట్లు, మరో 10 స్లూయిస్ల(పూడిక తొలగింపు గేట్లు)తో బరాజ్ నిర్మించడానికి మాత్రమే డ్రాయింగ్స్, డిజైన్లు ఇచ్చామని బదులిచ్చారు. అదనపు గేట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనగానీ, దానికి డిజైన్లు సిద్ధం చేయాలని కోరుతూ ఫైల్ గానీ తన వద్దకు రాలేదన్నారు. అదనపు గేట్ల ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. 2డీ మోడల్ స్టడీస్ ఆధారంగానే సుందిళ్ల బరాజ్ డిజైన్లు రూపొందించామన్నారు. తమకు బరాజ్ నిర్మాణంతో సంబంధం లేదని చెప్పారు. హరిరామ్ ఇచ్చిన లేఖను అందజేసిన నరేందర్రెడ్డి ⇒ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ పనులకు తానే బాధ్యుడిని అని ధ్రువీకరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నాటి సీఈ హరిరామ్(ప్రస్తుతం గజ్వేల్ ఈఎన్సీ) ఇచ్చిన లేఖను సీడీవో రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్రెడ్డి శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు అందజేశారు. బరాజ్ల డిజైన్లు, డ్రాయింగ్స్ను కేంద్ర జలసంఘానికి పంపడానికి ముందు చెక్ లిస్ట్పై సంతకం చేయడానికి తాను నిరాకరించగా, హరిరామ్ ఈ మేరకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చారని ఆయన గురువారం కమిషన్కు నివేదించిన విషయం తెలిసిందే. శుక్రవారం మళ్లీ కమిషన్ ఎదుట ఆయన హాజరై ఈ పత్రాన్ని ఆధారంగా అందజేశారు.గురువారం జరిగిన విచారణ సందర్భంగా కమిషన్కు ఇవ్వలేకపోయిన సమాచారాన్ని శుక్రవారం ఆయన అందజేశారు. రేడియల్ గేట్లను ఒకే ప్రయత్నంలో 2 మీటర్లకు మించి పైకి ఎత్తడం సాధ్యం కాదని, వాటిని ఎందుకు డిజైన్లలో ప్రతిపాదించారని కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. ఈ వాదన సరైనది కాదని తెలిపే పత్రాలను ఆయన కమిషన్కు అందజేశారు. కమిషన్ తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 27న నిర్వహించనుంది. -
‘కాళేశ్వరం’ నిర్ణయాలు ఎవరివి?
సాక్షి, హైదరాబాద్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే నిర్ణయం ఎవరిది? కాళేశ్వరం డీపీఆర్ను కేంద్ర జలసంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేశారు?’’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. నిర్ణయాలు ప్రభుత్వం స్థాయిలో జరిగాయని మురళీధర్ బదులివ్వగా.. ‘ప్రభుత్వం అంటే ఎవరు?’అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. ‘హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ (ప్రభుత్వ అధినేత)’అని మురళీధర్ బదులివ్వగా.. ప్రభుత్వఅధినేత అంటే ఎవరని కమిషన్ వివరణ కోరింది. దీంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి అని మురళీధర్ బదులిచ్చినట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్లపై విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని తమ కార్యాలయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. తొలిరోజున రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ను ప్రశ్నించింది. నీటి లభ్యతపై వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రాణహిత ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్టు మురళీధర్ తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్ల ప్రతిపాదనల ప్రకారమే డీపీఆర్లో మార్పులు చేసినట్టు వెల్లడించారు. పలు అంశాల్లో కిందిస్థాయి ఇంజనీర్లు తప్పు చేశారని పేర్కొన్న మురళీధర్.. గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల పాత్రపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కమిషన్ విచారణ తీరిది.. » బరాజ్ల నిర్మాణం పూర్తికాక ముందే కాంట్రాక్టర్లకు సబ్ స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఎలా జారీ చేశారని కమిషన్ ప్రశ్నించగా.. జారీ చేసిన ఇంజనీర్లది వ్యక్తిగత స్థాయిలో తప్పేనని మురళీధర్ పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే సూపరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కూడా సంతకాలు చేశారని కమిషన్ ఎత్తిచూపగా.. వారు తప్పుచేశారని బదులిచ్చారు. » బరాజ్ల నిర్మాణంలో పర్యవేక్షక ఇంజనీర్లతోపాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు బాధ్యతల నిర్వహణలో విఫలమయ్యారని కమిషన్ పేర్కొంది. 2016–20 మధ్య బరాజ్ల నిర్మాణం జరిగితే.. వరంగల్లోని క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు ఒక్కసారి మాత్రమే తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. దీనితో సంబంధిత ఇంజనీర్లది తప్పేనని, పక్షం రోజులకోసారి పనుల్లో నాణ్యత పరీక్షించాల్సి ఉంటుందని మురళీధర్ బదులిచ్చారు. బరాజ్ల వైఫల్యానికి ఇది ప్రధాన కారణంగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ తెలపగా.. ఒక కారణం కావచ్చని మురళీధర్ అన్నారు. » బరాజ్ల కాంక్రీట్ పనులకు నాణ్యత పరీక్షలు నిర్వహించకుండానే రూ.1,342.72 కోట్ల బిల్లులను ఏ విధంగా చెల్లించారు? బిల్లుల రికార్డుల్లో పాత తేదీలతో ఎంట్రీ ఎందుకు చేశారని కమిషన్ ప్రశ్నించగా.. సంబంధిత ఇంజనీర్లది తప్పేనని సమాధానమిచ్చారు. »డిజైన్ల ప్రకారం బరాజ్ల పునాదుల కింద షీట్పైల్స్ నిర్మించాల్సి ఉండగా.. సెకెంట్ పైల్స్కు ఎందుకు మారారు? నిర్మాణం ప్రారంభించాక డిజైన్లను మార్చవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. భూగర్భంలో ఇసుకతోపాటు భారీ రాళ్లు ఉండటంతో మార్చాల్సి వచ్చి0దని మురళీధర్ వివరించారు. నిర్మాణ దశలో డిజైన్లలో మార్పులు జరగడం సాధారణమేనని బదులిచ్చారు. » బరాజ్ల నిర్మాణం పూర్తయ్యాక లోపాలు బయటపడితే ఏం చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు మురళీధర్ వివరించారు. » కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం భవి ష్యత్తులో అంచనా వ్యయం పెంచుకోవడానికి వీలు కల్పిం చే రీతిలో డిజైన్లను రూ పొందించారా? అని కమిషన్ ప్రశ్నించగా.. లేదని మురళీధర్ బదులిచ్చారు. కాళేశ్వ రం డీపీఆర్ను సీడబ్ల్యూసీకి పంపకముందే పనులు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించగా.. ప్యాకేజీ–4 పనులు ప్రారంభించినట్టు మురళీధర్ అంగీకరించారు. -
కాళేశ్వరంపై ఓపెన్ కోర్టు విచారణ
-
కాళేశ్వరం విచారణలో దూకుడు పెంచిన కమిషన్..
-
త్వరలో మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విచారణ చివరి అంకానికి చేరడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ ప్రజాప్రతినిధులకు త్వరలో నోటీసులు జారీ చేయనుంది. ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారుల నుంచి వాంగ్మూలంతో పాటు అఫిడవిట్లను స్వీకరించి పరిశీలించింది. ఈ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది. గడువులోగా అఫిడవిట్ దాఖలు చేయకుండా కమిషన్ ఆదేశాలను ధిక్కరించిన ఓ మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి విచారణకు తాజాగా సమన్లు జారీ చేయాలని కూడా నిర్ణయించింది. కాగా మాజీ ముఖ్యనేత ఒకరు అనారోగ్యంతో ఉన్నారని, విచారణకు హాజరుకాలేరని బీఆర్ఎస్ నేత ఒకరు కమిషన్కు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. అయితే ఒకవేళ సమన్లు జారీ చేసినా, విచారణకు రానిపక్షంలో కమిషన్ స్వయంగా ఆ నేత నివాసానికి వెళ్లి విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇలావుండగా సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను వచ్చే వారం నుంచి కమిషన్ ప్రారంభించనుంది. 57 మంది సాక్షులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియలో కమిషన్కు సహకరించేందుకు తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్తో సంబంధం లేని న్యాయవాదిని నియమించాలని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్థిక అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. -
కాళేశ్వరం కొట్టుకుని పోతే నీళ్లెలా వచ్చాయి?
సిద్దిపేటజోన్: కాళేశ్వరం కొట్టుకు పోయిందని రాద్దాంతం చేశారని, ఇప్పుడు నీళ్లు ఎలా వచ్చాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 229 మందికి సీఎం సహా యనిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ బద్నాం చేసిందని, మరి ఇప్పుడు రంగనాయక సాగ ర్లోకి కాళేశ్వరం గోదారి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నేడు రంగనాయక సాగర్ నిండుకుండలా ఉందన్నారు. రెండు పంటలకు సరిపడేలా నీళ్లు ఉన్నా యని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు మూసివే స్తామని చెప్పి నేడు గల్లీ గల్లీలో పెట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని, గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు. -
డెడ్ స్టోరేజీతో బోసిపోతున్న మానేర్ రిజర్వాయర్
-
నెమ్మదించిన గోదారి
సాక్షి, హైదరాబాద్: గోదావరి పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు తెలంగాణలో వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్కి శనివారం సాయంత్రం 6 గంటలకు 5,39,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా ఆదివారం అదే సమయానికి 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. సమ్మక్క బరాజ్ (తుపాలకుగూడెం)కి వరద 9,75,910 క్యూసెక్కుల నుంచి 8,45,560 క్యూసెక్కులకు తగ్గింది. సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) బరాజ్కి సైతం వరద 13,95,637 క్యూసెక్కుల నుంచి 11,65,362 క్యూసెక్కులకు పడిపోయింది. ఈ మూడు బరాజ్లకు వచి్చన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద ఉదయం నుంచి తగ్గుముఖంశనివారం అర్ధరాత్రి భద్రాచలం వద్ద 53.60 అడుగులతో మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన వరద, ఆదివారం ఉదయం 6 – 7 గంటల మధ్య 53 అడుగుల దిగువకు రాత్రి 11గంటల కల్లా 47.20 అడుగులకు తగ్గింది. దీంతో తొలుత అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఆ తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ప్రవాహం సైతం 14,36,573 క్యూసెక్కుల నుంచి 11,08,154 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు ఏపీలోని చింతూరు, కూనవరం వద్ద శబరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులోకి 13,35,413 క్యూసెక్కు లు చేరుతుండగా స్పిల్ వే 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. వరద కాల్వకు జలకళ బోయినపల్లి (చొప్పదండి): మెట్టప్రాంత రైతుల వరప్రదాయని వరద కాల్వ ఆరు నెలల తర్వాత జలకళను సంతరించుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు కరీంనగర్ జిల్లా రామడుగు లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ నుంచి వరదకాల్వ మీదుగా రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మ«ధ్య మానేరుకు చేరుకుంటున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వరద కాల్వలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి.భద్రాచలంలో ఇళ్లల్లోకి నీళ్లుభద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే పట్టణంలోని ఏఎంసీ కాలనీకి ఎగువ భాగాన ఉన్న కరకట్ట స్లూయిజ్ నుంచి ఆదివారం సైతం వరద నీరు లీక్ కావడంతో అశోక్నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు గ్రామాల నడుమ ఇంకా రాకపోకలు సాగడం లేదు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి కూడా వరద నీరు తగ్గింది. -
కేటీఆర్.. గోబెల్స్గా పేరు మార్చుకో!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు దారుణమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఓటమిని తట్టుకోలేక కేటీఆర్కు మతిభ్రమించి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాల్లో గోబెల్స్ను కేటీఆర్ మించిపోయారని.. ఆయన పేరును జోసెఫ్ గోబెల్స్రావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఆరోపణలు, అబద్ధాలు కాదు.. ఆధారాలుంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు అందించాలని సవాల్ చేశారు. ఆదివారం జలసౌధ నుంచి నీటి పారుదల శాఖ క్షేత్రస్థాయి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మేడిగడ్డ కుంగుబాటు ఘటన వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని, రాష్ట్రంలో ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు.. బరాజ్ను వారు ఏమైనా చేయగలరని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించడంతోనే బరాజ్ కుంగిపోయింది. గత ఏడాది అక్టోబర్ 21న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బరాజ్ కుంగిపోగా.. తర్వాత 45 రోజులు వారే అధికారం ఉన్నారు. ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణ లోపాలతోనే కాళేశ్వరం బరాజ్లు ఫెయిల్ అయ్యాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) బీఆర్ఎస్ హయాంలోనే నివేదిక ఇచి్చంది. 2019లోనే లోపాలు బయటపడినా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను 2019లో ప్రారంభించిన నాటి నుంచే లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులపై 2019 నుంచీ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీతో నీటిపారుదల శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిందని విజిలెన్స్ విచారణలో తేలింది కూడా. లోపాలను పట్టించుకోకపోవడం వల్లే క్రమంగా నష్టం పెరిగింది. అసలు మేడిగడ్డ వద్ద బరాజ్ వద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీటి సమస్య తలెత్తితే దానికి కేసీఆర్, కేటీఆర్లే కారణం. ఐదేళ్లలో 30లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ.10,820 కోట్లు కేటాయించాం. ఆయా ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని క్షేత్రస్థాయి ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశాం. ఈ ఏడాది నుంచే ఏటా 6లక్షల ఎకరాల చొప్పున.. వచ్చే ఐదేళ్లలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి 15 రోజులకోసారి పురోగతిపై సమీక్ష నిర్వహిస్తా. బీఆర్ఎస్ వాళ్లు చెప్తే కాదు.. రైతుల కోసం.. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసింది. అంటే సగటున ఏటా 13 టీఎంసీలే తరలించింది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో.. రైతుల కోసం మేం పంపింగ్ ప్రారంభించాం. బీఆర్ఎస్ వాళ్లు చెబితేనే చేశామనడం సరికాదు. ఒకవేళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లు నిల్వ చేస్తే.. అవి తెగిపోయి దిగువన భదాచలం పట్టణం, సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బరాజ్లు, 44 గ్రామాలు నీటిమునిగి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. వాటి నుంచి నీటిని పంపింగ్ చేసే పరిస్థితి లేకున్నా.. ఎల్లంపల్లి నుంచి లిఫ్టింగ్ చేపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా జలాశయాలను నింపి రైతులకు నీళ్లను అందిస్తాం’’అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
మేడిగడ్డ నింపితే భద్రాద్రి రామునికి ముప్పు: మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు తప్ప మిగిలిన అన్ని బ్యారేజీలు నింపుతామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం(జులై 28) జలసౌధలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ‘కాళేశ్వరం లో మూడు బ్యారేజీలు తప్ప మిగతా అన్ని రిజర్వాయర్లను వాడుకుంటాం. కాళేశ్వరం నీళ్లు రాక ఉత్తర తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడితే దానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మూడు బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి. కేటీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.కేటీఆర్ జోసఫ్ గోబెల్స్ కి మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీళ్లు ఆపితే జరిగే ప్రమాదానికి ఎవరు భాధ్యత వహిస్తారు. ప్రమాదం జరిగితే భద్రాచలం రాముడి గుడి కూడా మునుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా మూడు, నాలుగు టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన బ్యారేజీలు లేవు. ప్రచారం కోసం, కమిషన్ల కోసం పెద్ద బ్యారేజీలు కట్టి కుంగగొట్టారు. లక్ష కోట్ల కుంభకోణంలో కేసీఆర్ అండ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇక నుంచి ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాం’అని చెప్పారు. మంత్రి ప్రెస్మీట్లో మూడుసార్లు పవర్కట్..మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం జలసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా మూడుసార్లు కరెంటు పోయింది. గంట వ్యవధిలో మూడు సార్లు కరెంటు పోయింది. కరెంటు వెంటనే రాకపోవడంతో జనరేటర్తో మంత్రి ప్రెస్మీట్ నిర్వహించారు. పవర్ కట్ సమయంలో జలసౌధ భవనంలో పలువురు లిఫ్టులో ఇరుక్కుపోయారు. -
పంపింగ్ ప్రారంభం.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/రామగుండం/ధర్మారం: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్హౌస్ల ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీళ్లను నంది, గాయత్రి పంప్హౌస్ల ద్వారా నందిమేడారం, మిడ్మానేరు జలాశయాల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్హౌస్లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పంపింగ్ ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీటి నిల్వలు చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని, దీంతో ఈ మూడు జలాశయాల నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించడం సాధ్యం కాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి బదులిచి్చన విషయం తెలిసిందే. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటన మేరకు నీటిపారుదల శాఖ శనివారం నుంచే పంపింగ్ ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా భారీ వర్షాలతో వస్తువన్న వరదలతో శనివారం 17.34 టీఎంసీలకు నిల్వలు చేరాయి. 14,358 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. నంది, గాయత్రి పంపుహౌస్ల ద్వారా శనివారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీ కాలువ ద్వారా తరలివస్తున్న నీటిని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. మొత్తం 7 పంపులు ఉండగా, 4 పంప్లను ఆపరేట్ చేస్తూ 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒక మోటారును ఆన్చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల వరకు మరో మూడు విద్యుత్ మోటార్లు రన్ చేశారు. నందిమేడారం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్హౌస్లోకి అంతే స్థాయిలో 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. గాయత్రి పంప్హౌస్లోని నాలుగు బాహుబలి పంపుల ద్వారా నీళ్లను గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ఆ నీళ్లు మిడ్మానేరుకు తరలిపోతున్నాయి. నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో మడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నామని, దీనిని రైతులు సది్వనియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. -
Congress Vs BRS: కాళేశ్వరం రగడ..
-
ఆగస్టు 2 డెడ్లైన్.. రైతులతో కలిసి పంపులు ఆన్ చేస్తాం: కేటీఆర్
సాక్షి, కాళేశ్వరం: కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా మొదటగా వీరు కన్నెపల్లి పంప్హౌజ్ వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్హౌజ్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ హయాంలో ప్రతీ రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి ప్రాజెక్ట్లపై రాజకీయం చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లను నింపడం లేదు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ను కట్టాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతులకు కల్పతరువు. తెలంగాణలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరితగతిన ప్రాజెక్ట్ను నిర్మించలేదు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నీటి సమస్య లేదు.గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్పై విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు రెండో తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ప్రభుత్వం స్పందిచకపోతే 50వేల మంది రైతులతో మేము పంపులు ఆన్ చేస్తాం. బీడు భూములకు నీళ్లు అందిస్తాం. రాజకీయపరమైన నిర్ణయం వల్లనే నీటిని ఎత్తిపోయడం లేదు. ఈ ప్రభుత్వం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు కేవలం 25 టీఎంసీలే ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా కాళేశ్వరం నీటి కోసం చూస్తున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు.ఒక్క బటన్ నొక్కితే పైన ఉన్న ఎల్ఎండీ, మిడ్ మానేరు సహ ఎస్ఆర్ఎస్పీ కూడా నింపొచ్చు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పేరుతో ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. పోలవరం కొట్టుకుపోతే ఏళ్లు గడిచినా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ, కాళేశ్వరం విషయంలో రోజుల్లోనే రిపోర్టులు ఇచ్చింది. కేవలం కేసీఆర్పై రాజకీయ కక్షతోనే ఇదంతా జరుగుతోంది. ఎలాగూ మీరంతా అనుకున్నట్టుగానే కేసీఆర్ను ఓడించారు. ఇంకా రైతులపై ఎందుకింత పగ. రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందిపెట్టకండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. -
బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన
-
కాళేశ్వరం బయలుదేరిన బీఆర్ఎస్ బృందం..
సాక్షి, రామగుండం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం రామగుండం నుంచి కన్నెపల్లి పంప్ హౌస్కు బీఆర్ఎస్ టీమ్ పయనమైంది. ఈ తర్వాత వీరంతా మేడిగడ్డ ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు.అయితే, కాళేశ్వరం పర్యటనకు బీఆర్ఎస్ నేతలు గురువారం సాయంత్రం బయలుదేరారు. ఈ క్రమంలో నిన్న రాత్రి రామగుండంలో వారంతా బస చేశారు. బీఆర్ఎస్ టీమ్ ముందుగా ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలిస్తారు. అనంతరం 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. కాగా, కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద బీఆర్ఎస్ బృందం మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. ఇక, కేటీఆర్ నేతృత్వంలో టీమ్ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది.మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం. pic.twitter.com/WfoThtZssp— KTR News (@KTR_News) July 26, 2024 మరోవైపు.. రామగుండంలో సింగరేణి క్వార్టర్స్ కోల్పోతున్న బాధితులు శుక్రవారం ఉదయం కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్స్ ప్రదర్శనలతో తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ వేదికగా తమ గోడును వినిపించాలని కోరారు. ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల పరిస్థితిని ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాం.ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రచారాలు బంద్ పెట్టి.. నీటి పంపింగ్… pic.twitter.com/0B2kaeCEUS— BRS Party (@BRSparty) July 25, 2024 రేవంతూ.. నీ అసమర్థ పాలనతో తెలంగాణను ఎడారిగా మారుస్తున్నావు.బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలతో కళకళలాడిన లోయర్ మానేరు డ్యాం..చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నీళ్లు లేక వెలవెలబోతున్నది. pic.twitter.com/X2jBcH4l28— BRS Party (@BRSparty) July 25, 2024 -
పంట పొలాలు ఎండబెట్టారు
తిమ్మాపూర్(మానకొండూర్): ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన లోయర్ మానేరు (ఎల్ఎండీ) జలాశయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జలాశయం వద్ద విలేకరులతో మాట్లాడారు. 8 నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంలో ఏర్పడిన చిన్న లోపాన్ని సాకుగా చూపి, ఒక విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేశారన్నారు. కాళేశ్వరం నుంచి రోజూ లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతున్నా లిఫ్టు చేయడం లేదన్నారు. ఈ ఏడాది కేవలం 45 శాతం వర్షపాతం మాత్రమే నమోదయిందని అధికారులు చెబుతున్నారని, అందుకే లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు సహా ఎండిపోయిన ప్రాజెక్టులను పరిశీలించేందుకే తాము పర్యటిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవిగా నిలబడి ఉందని వివరించారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను రేవంత్రెడ్డి పణంగా పెట్టి, పంట పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఎల్ఎండీ, అన్నపూర్ణ రిజర్వాయర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే రైతుల్లో భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు. నీరు ఉన్నప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపకుండా, రేపు వర్షం పడలేదనే సాకు చూపెడతారని అన్నారు. 40 వేల క్యూసెక్కుల ప్రవాహం దాటితే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళుతోందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు రాకపోవడం వల్లే నీరు లిఫ్ట్ చేయడం లేదని అధికారులు చెబుతున్నారని, కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేస్తే రిజర్వాయర్లు అన్నీ నిండుతాయని అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపితే రైతుల అవసరాలతో పాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీరుతాయని వెల్లడించారు. కేసీఆర్ను బద్నాం చేయాలని ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ చేసిన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. మేడిగడ్డపై తప్పుడు ప్రచారం మేడిగడ్డ మేడిపండు అని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఎండుతున్న ప్రాజెక్టులు, రైతుల బాధలను శాసనసభలో ప్రస్తావిస్తామన్నా రు. కేసీఆర్ ఆదేశాలతో, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచనతో ప్రాజెక్టుల సందర్శనకు వచ్చామన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. మల్లారెడ్డిపై సెటైర్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సరదాగా సెటైర్లు వేశారు. ఎల్ఎండీ గేట్ల సమీపంలోని గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా సోషల్ మీడియా స్టార్ ఉండగా తాము మాట్లాడలేమంటూ కేటీఆర్ చమత్కరించారు. మాజీ మంత్రులు సబిత, నిరంజన్రెడ్డి సైతం తామందరికన్నా మల్లారెడ్డి స్టేట్ ఫిగర్ అంటూ సెటైర్లు వేశారు.రామగుండంలో బీఆర్ఎస్ బృందం బసగోదావరిఖని: మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం రామగుండంలోని ఎన్టీపీసీ చేరుకోగా, స్థానిక బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాత్రి రామగుండంలోనే బస చేశారు. ఉదయం 8 గంటలకు ఎనీ్టపీసీ నుంచి నేరుగా కన్నెపల్లి పంపు హౌజ్ను సందర్శించి, అక్కడి నుంచి బయల్దేరి మేడిగడ్డను సందర్శించనున్నారు. అనంతరం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో మీడియా సమావేశంలో మాట్లాడతారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ వెళ్తారు. -
పంట పొలాలు ఎండబెట్టారు
తిమ్మాపూర్(మానకొండూర్): ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన లోయర్ మానేరు (ఎల్ఎండీ) జలాశయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జలాశయం వద్ద విలేకరులతో మాట్లాడారు. 8 నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంలో ఏర్పడిన చిన్న లోపాన్ని సాకుగా చూపి, ఒక విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేశారన్నారు.కాళేశ్వరం నుంచి రోజూ లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతున్నా లిఫ్టు చేయడం లేదన్నారు. ఈ ఏడాది కేవలం 45 శాతం వర్షపాతం మాత్రమే నమోదయిందని అధికారులు చెబుతున్నారని, అందుకే లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు సహా ఎండిపోయిన ప్రాజెక్టులను పరిశీలించేందుకే తాము పర్యటిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవిగా నిలబడి ఉందని వివరించారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను రేవంత్రెడ్డి పణంగా పెట్టి, పంట పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు.ఎల్ఎండీ, అన్నపూర్ణ రిజర్వాయర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే రైతుల్లో భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు. నీరు ఉన్నప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపకుండా, రేపు వర్షం పడలేదనే సాకు చూపెడతారని అన్నారు. 40 వేల క్యూసెక్కుల ప్రవాహం దాటితే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళుతోందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపాలని సూచించారు.ప్రభుత్వ ఆదేశాలు రాకపోవడం వల్లే నీరు లిఫ్ట్ చేయడం లేదని అధికారులు చెబుతున్నారని, కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేస్తే రిజర్వాయర్లు అన్నీ నిండుతాయని అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపితే రైతుల అవసరాలతో పాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీరుతాయని వెల్లడించారు. కేసీఆర్ను బద్నాం చేయాలని ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ చేసిన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. మేడిగడ్డపై తప్పుడు ప్రచారం మేడిగడ్డ మేడిపండు అని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఎండుతున్న ప్రాజెక్టులు, రైతుల బాధలను శాసనసభలో ప్రస్తావిస్తామని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలతో, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచనతో ప్రాజెక్టుల సందర్శనకు వచ్చామని వివరించారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. కాగా, కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాత్రి రామగుండంలోనే బస చేశారు. శుక్రవారం కన్నెపల్లి, మేడిగడ్డను సందర్శిస్తామని తెలిపారు. మల్లారెడ్డిపై సెటైర్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సరదాగా సెటైర్లు వేశారు. ఎల్ఎండీ గేట్ల సమీపంలోని గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా సోషల్ మీడియా స్టార్ ఉండగా తాము మాట్లాడలేమంటూ కేటీఆర్ చమత్కరించారు. మాజీ మంత్రులు సబిత, నిరంజన్రెడ్డి సైతం తామందరికన్నా మల్లారెడ్డి స్టేట్ ఫిగర్ అంటూ సెటైర్లు వేశారు. -
కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. గురువారం సాయంత్రం కరీంనగర్లోని మానేరు డ్యాం పరిశీలించారు. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. డ్యాం పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. బీడు భూములు సాగులోకి తెచ్చారని.. దేశాన్ని తలదన్నే రీతిలో ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. వరిసాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.‘‘45 శాతం తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. అధికారులు పదే పదే చెప్తున్నారు అన్ని డ్యామ్లను పంపింగ్ చేసి నింపాలని. కాళేశ్వరం నీటిని పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా బృందం బయల్దేరాం. లక్షల కోట్లు వృధా అయ్యాయని.. మా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ మేడిపండు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉంది. ఎన్నికలు అయిపోయాయి.. సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యామ్లకు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. రేపు మేడిగడ్డ, కన్నెపల్లి సందర్శిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
నేడు బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పర్యటన
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ టూర్కు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే నేడు పర్యటనకు వెళ్లనున్నారు.కాగా, ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి నేతలు నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో మొదటగా కరీంనగర్లోని ఎల్ఎండీ రిజర్వాయర్ను సందర్శిస్తారు. ఈరోజు రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ నేతల బృందం బస చేయనున్నారు. ఇక, రేపు(శుక్రవారం) బీఆర్ఎస్ నేతలు అందరూ కన్నెపల్లి పంపు హౌజ్ను సందర్శించి అనంతరం మేడిగడ్డకు బయలుదేరుతారు. కాళేశ్వరం పర్యటన ముగిసిన తర్వాత వారంతా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.ఇదిలా ఉండగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం ఎక్కువైంది. ఈ క్రమంలో వరదలను సైతం తట్టుకుని మేడిగడ్డ నిలబడిదంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. -
బీఆర్ఎస్ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం(జులై 25) బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్ తిరిగిరానుంది. -
గోదావరి తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద వరద తగ్గినప్పటికీ, ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని, వాగులు, వంకల్లో వరద కొనసాగుతోంది. దీంతో భద్రాచలంతో పాటు దాని దిగువ ప్రాంతాల్లో గోదావరి ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తోంది. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా, ఎగువ గోదావరిలో 25వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి నిల్వలు 23.31 టీఎంసీలకు చేరాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, మేడిగడ్డ, సమ్మక్క బరాజ్లకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వలు 12.13 టీఎంసీలకు పెరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్లోకి సోమవారం సాయంత్రం 9,54,130 క్యూసెక్కుల వరద రాగా, శనివారం సాయంత్రానికి 7,71,580 క్యూసెక్కులకు తగ్గింది. మేడిగడ్డలోకి చేరుతున్న వరదను చేరుతున్నట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్లోకి సోమవారం సాయంత్రం 10,15,170 క్యూసెక్కులు రాగా, శనివారం సాయంత్రం 9,36,570 క్యూసెక్కులకు తగ్గాయి. మేడిగడ్డ, సమ్మక్క బరాజ్లకు వచి్చన వరదను వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శాంతిస్తున్న గోదావరి దిగువ గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్లోకి సోమవారం సాయంత్రం 11,86,801 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సాయంత్రానికి 12,88,481 క్యూసెక్కులకు పెరిగింది. అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారం రాత్రి 7 గంటలకు 12,17,861 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మంగళవారానికి స్వల్పంగా పెరిగి 12,58,826 క్యూసెక్కులకు చేరింది. మంగళవారం ఉదయం 51.06 అడుగులుగా ఉన్న నీటిమట్టం కొంతసేపు నిలకడగా ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. సాయంత్రం 6 గంటలకు 50.04 అడుగులకు చేరింది. మంగళవారం రాత్రి 12 గంటల సమయానికి 49.03 అడుగులకు నీటి మట్టం చేరింది. కాగా, రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా 48 అడుగుల కంటే తగ్గితే రెండవ, 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తారు. బుధవారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా తగ్గనుందని సీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గకపోవడంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భద్రాచలం నుంచి రాకపోకల్ని ఇంకా పునరుద్ధరించలేదు.శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి» 1,51,481 క్యూసెక్కుల నీటి రాకతో 842.42 అడుగులకు చేరిన నీటిమట్టం» ఎగువన కృష్ణా ప్రధానపాయలో కొనసాగుతున్న వరద » ఆల్మట్టి నుంచి 1.50, నారాయణపూర్ నుంచి 1.43 లక్షలు, జూరాల నుంచి 1,51,790 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల » శ్రీశైలంలోకి గంటగంటకూ పెరుగుతున్న కృష్ణా ప్రవాహం సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టుకు 1.09లక్షల క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సరిగ్గా ఇదే సమయానికి 1,51,481 క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 832.5 అడుగుల నుంచి 842.42 అడుగులకు, నీటినిల్వ సామర్థ్యం 52.14 నుంచి 63.81 టీఎంసీలకు పెరిగింది. కృష్ణా పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధానపాయతో పాటు ఉపనదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి వచ్చిన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా 1.65లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపీ పెరుగుతోంది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మంగళవారం తగ్గుముఖం పట్టింది. తుంగభద్ర డ్యామ్లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,04,972 క్యూసెక్కుల వరద రాగా, మంగళవారం సాయంత్రానికి 85,148 క్యూసెక్కులకు తగ్గింది. డ్యామ్ నీటి నిల్వ 93.46 టీఎంసీలకు చేరుకోగా, 9149 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసే జలాలు సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఇటు జూరాల నుంచి కృష్ణా.. అటు సుంకేశుల నుంచి తుంగభద్ర జలాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరగనుంది. -
పోటెత్తిన గోదావరి.. విస్తారంగా వర్షాలు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: గోదావరి పోటెత్తుతోంది. క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలతోపాటు రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని, శబరి, కడెం ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఆ నీరంతా చేరుతూ గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవాహాలు పెరుగుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. గత ఏడాది వరదలతో ప్రాజెక్టు దెబ్బతిన్న నేపథ్యంలో.. ఈసారి ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు పూర్తిగా నిండకముందే గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కడెం నుంచి వస్తున్న ఈ ప్రవాహాలు, ఇతర వాగులు గోదావరికి తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 42వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. మేడిగడ్డ దిగువ నుంచి ఉప్పొంగుతూ.. గోదావరి నదికి ప్రాణహిత తోడవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్ నుంచి భారీ వరద కొనసాగుతోంది. గేట్లన్నీ ఎత్తి ఉండటంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు దిగువకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రవాహానికి ఇంద్రావతి వరద కలసి.. తుపాకులగూడెం(సమ్మక్క) బరాజ్లోకి 8,23,450 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటికి దిగువకు వదిలేస్తున్నారు. మధ్యలో వాగులు, వంకల ప్రవాహం తోడై.. దుమ్మగూడెం (సీతమ్మ సాగర్) బరాజ్లోకి 9,01,989 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఆ తర్వాత తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని ప్రవాహాలు కలుస్తూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస శిబిరాలను సిద్ధం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు. రాత్రి 11 గంటలకల్లా నీటిమట్టం 44.8 అడుగులకు చేరింది. ఇది 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఏపీలో శబరి దూకుడు.. ఛత్తీస్గఢ్, ఒడిశాలలో భారీ వర్షాలతో ఏపీలోని శబరి ఉప నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటిమట్టం 36.74 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టులోకి 8,57,707 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వే ఎగువన నీటిమట్టం 32 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు 48 గేట్లను ఎత్తి.. వచ్చిన నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బరాజ్లోకి 7,74,171 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 1,800 క్యూసెక్కులను వదులుతూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే 149 టీఎంసీలు సముద్రం పాలు.. ప్రస్తుత నీటి సంవత్సరంలో.. అంటే ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ధవళేశ్వరం బరాజ్ నుంచి 149.03 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి ధవళేశ్వరం బరాజ్ నుంచి 77.79 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పరీవాహక ప్రాంతాల్లో ఆదివారం కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ అలా... అన్నారం ఇలా.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వానలతో ప్రాణహిత పోటెత్తి మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. అక్కడ గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరిలో దానికి ఎగువన ఉన్న అన్నారం (సరస్వతి) బరాజ్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఎగువ నుంచి ప్రధాన నదిలో ఇన్ఫ్లో ఏమీ లేకపోగా.. మానేరు, ఇతర వాగుల నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తోంది. ఈ నీరంతా కిందికి వదిలేస్తున్నా.. గోదావరి చిన్న పాయలా ప్రవహిస్తోంది. -
కాళేశ్వరంపై సొంత నిర్ణయాలు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా ఇతర బరాజ్లను వినియోగంలోకి తెచ్చే విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీశారు. శనివారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో జరిపిన చర్చల సారాంశాన్ని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఢిల్లీలోనే ఉన్న ఆ శాఖ కార్యదర్శులు, రాహుల్ బొజ్జా, ప్రశాంత్ పాటిల్లను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఆదివారం ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి, తన అధికారిక నివాసంలో వీరితో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు చర్చించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక వచ్చేంతవరకు బరాజ్లో నీటిని నిల్వ చేయరాదని, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిన విషయాన్ని వారు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. కాళేశ్వరం బరాజ్ల విషయంలో సొంత నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దని, నిపుణుల కమిటీ సూచనల మేరకే ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి, అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కాగా, సోమవారం ఎన్డీఎస్ఏతో మరోమారు భేటీ ఉన్న దృష్ట్యా, నిపుణుల సూచనలకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు, ఇతర పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై రేవంత్రెడ్డి మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది. అధిష్టానం పెద్దలతో భేటీ కానున్న సీఎంఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. ఎన్నికల వేళ రాష్ట్ర రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రుణమాఫీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్లో ‘కృతజ్ఞత సభ’పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని రాహుల్ గాం«దీని ఆహా్వనించనున్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ షెడ్యూల్ను బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించే అవకాశముందని సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైనా సీఎం చర్చించనున్నారు. కేంద్ర మంత్రులతోనూ భేటీ? పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను రేవంత్రెడ్డి కలుస్తారని తెలిసింది. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశముందని చెపుతున్నారు. కాగా, సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్లు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు సహా తెలంగాణలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వారు కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. -
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
అన్ని గేట్లు ఎత్తి పెట్టాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ సహా మిగతా రెండు బరాజ్ల గేట్లను పూర్తిగా ఎత్తి పెట్టాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్ర ప్రభుత్వానికి తేలి్చచెప్పింది. ప్రస్తుతం బరాజ్ల్లోకి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేయాలని సూచించింది. సోమవారం మరోమారు ఇంజనీర్ల స్థాయిలో చర్చించి, తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని తెలిపింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ సహా ఇతర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన ఉత్తమ్కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో సమావేశమయ్యారు.మంత్రితో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శులు రాహుల్ బొజ్జ, ప్రశాంత్ జీవన్ పాటిల్, ఓఅండ్ఎం ఈఎన్సీ నాగేంద్రరావు, కాళేశ్వరం సీఈ సుధాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల మరమ్మతులు, నీటి తరలింపు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ సహా ఇతర బరాజ్ల్లో మరమ్మతులు, పునరుద్ధరణలో భాగంగా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు చేపట్టిన పనుల వివరాలను ఇంజనీర్లకు వివరించారు.సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎమ్మార్ఎస్కు సంబంధించిన నివేదికలు పూర్తి స్థాయిలో అందనందున బరాజ్ల్లో నీటి నిల్వలపై ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయలేమని, ఈ దృష్ట్యా అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడమే ఉత్తమమని ఎన్డీఎస్ఏ చైర్మన్ స్పష్టం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భేటీ వివరాలను మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ముందుకు: ఉత్తమ్ కాళేశ్వరం బరాజ్ల విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ముందుకు వెళతామని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ‘బరాజ్లో నీటి నిల్వలు, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చే అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించాం. ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల మేరకు ఇప్పటికే చేపట్టిన పనులను, పరీక్షలను వివరించాం. ఇంకా కొన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పాం. దీనిపై వారు ఇప్పటికైతే అన్ని గేట్లు ఎత్తిపెట్టి నీళ్లు కిందకి వదిలేయండని చెప్పారు. దానికి అనుగుణంగానే అన్ని గేట్లు ఎత్తినీటిని వదిలేస్తాం.దీనిపై కేబినెట్లోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం’అని వివరించారు. మేడిగడ్డలో మాత్రం ఒక గేటు పనిచేయడం లేదని, దానిని పూర్తిగా కట్ చేసి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మేడిగడ్డతో పాటు అన్నారంలో సీపేజీలను, సుందిళ్లలో కొన్ని లోపాలను కేంద్ర సంస్థ గుర్తించిందని, ప్రజా జీవితాలకు సంబంధించిన విషయమైనందున నిపుణుల సూచన మేరకే ముందుకెళ్తామన్నారు. ఎల్లంపల్లి ఎగువన నీటిని వినియోగించుకొని, ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. కుంగిందెప్పుడు..ఆర్కిటెక్ట్ ఎవరు..? ఈ సందర్భంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ని వినియోగించుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘కేవలం కమిషన్ల కోసం తుమ్మడిహెట్టి డిజైన్ను మేడిగడ్డకు మార్చారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యేదాన్ని రూ.1.50లక్షల కోట్లకు పెంచారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని తప్పుడు లెక్కలు చెప్పారు.తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చని అంచనా వేస్తే, ఇప్పుడు కాళేశ్వరంతో ఏటా ఖర్చు రూ.10వేల కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులపై వడ్డీలకే ఏటా రూ.15వేల కోట్లవుతున్నాయి. ఇంతా చేసి ఏడాది 13 టీఎంసీల చొప్పున ఐదేళ్లలో 65 టీఎంసీలు ఎత్తిపోశారు. దీనికి కర్త, ఆర్కిటెక్ట్, బిల్డర్ అన్నీ కేసీఆర్ అన్ని గొప్పలు చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగితే మాత్రం ఒక్క మాట మాట్లాడలే. ప్రాజెక్టు నాశనం చేసిన వాళ్లే ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు. అబధా్ధలు చెప్పడానికైనా కేటీఆర్కు హద్దుండాలి’అని ఉత్తమ్ విరుచుకుపడ్డారు. మా హయాంలోనే తుమ్మిడిహెట్టి పూర్తి.. ఇక తమ హయాంలోనే తుమ్మిడిహెట్టి బరాజ్ని పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్ర స్తుత వరద దృష్ట్యా ఏ ప్రాజెక్టులోనూ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఇంజనీర్లను అప్రమత్తం చేశామన్నారు. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజె క్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు అని, 90 శాతం ఆయకట్టు ఏపీలో ఉందని, ఐదు అడుగుల మేర వరద రావడంతో అక్కడ కొన్ని ఇక్కట్లు ఎదురయ్యాయని ఉత్తమ్ వెల్లడించారు. -
కమీషన్ కోసమే ప్రాణహితను కాళేశ్వరంగా మార్పు: మంత్రి ఉత్తమ్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ కమీషన్ కోసమే రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్ను కాళేశ్వరం ప్రాజెక్ట్గా మార్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రజల లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని కామెంట్స్ చేశారు.కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ శనివారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులు, తదితర అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిపై కూడా చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తులు తదితర అంశాలపై చర్చించారు. ఇక, ఈ చర్చ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ అధికారులతో రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో మరోసారి సమావేశం జరుగుతుంది. ఎక్కువ కమీషన్ కోసం రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్ను కాళేశ్వరం ప్రాజెక్ట్గా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజక్టు మార్చడం తప్పు.కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఏడాదికి తొమ్మిది వేల కోట్లు తెలంగాణ ప్రజల డబ్బును వడ్డీ రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం కింద అరకొరగా సాగు మాత్రమే అవుతోంది. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం ఆరు అడుగుల లోతుకు ప్రాజెక్ట్ కుంగిపోయింది.మేడిగడ్డ పునాది బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని కిందకి వదలాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన చేసింది. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు చేస్తున్నాం. మా ప్రభుత్వంలో ఈ నిర్మాణం పూర్తి చేస్తాం. పెద్దవాగు ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు. దాని ఆయకట్టంతా ఏపీలోనే ఉంది. దానికి మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గత ప్రభుత్వ పెద్దలు కేవలం జేబులు నింపుకొనేందుకే ప్రాజెక్టులు కట్టారని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ పెద్దలు ప్రాజెక్టులకు రూ.94 వేల కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరివ్వలేదని, స్థిరీకరణ కూడా సరిగా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక బ్లండర్ అని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల ఆధారంగా ముందుకు వెళ్తామని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం ఉమ్మడి జిల్లా పర్యటనకు వచి్చన మంత్రులు..స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాళేశ్వరం స్ట్రక్చరల్ బ్లండర్: ఉత్తమ్ ‘కాళేశ్వరంతో ఐదేళ్ల కాలంలో మొత్తం ఎత్తిపోసింది కేవలం 65 టీఎంసీలే. పైగా ఏటా రూ.10 వేల కోట్ల కరెంటు బిల్లులు వస్తున్నాయి. అదే తమ్మిడిహెట్టి వద్ద కట్టి ఉంటే రూ.34 వేల కోట్లలో ప్రాజెక్టు పూర్తయ్యి ఏటా రూ.వెయ్యి కోట్ల బిల్లు మాత్రమే వచ్చేది. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లోనూ అవినీతే. ఇటీవల జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హాజరైన కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు కాళేశ్వరంపై అఫిడవిట్ సమర్పించారు.ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ తన మధ్యంతర నివేదికలో తెలిపింది. కాళేశ్వర్యం స్ట్రక్చరల్ బ్లండర్. ఇదే విషయంపై శనివారం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ అధికారులతో నేను, నీటిపారుదల ముఖ్య కార్యదర్శి భేటీ అవుతాం. వారిచ్చే సలహాల ఆధారంగానే కాళేశ్వరంపై ముందుకెళ్తాం..’అని ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరుకు ఆదిలాబాద్లో సదర్మాట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని, గౌరవెల్లి ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో చేపడతామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్కు ప్రత్యేక కార్డులు ‘ఆరోగ్యశ్రీ, రేషన్కు ప్రత్యేక కార్డులిస్తాం, దరఖాస్తులు కూడా వేర్వేరుగా ఉంటాయి. కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు సముచిత స్థానం ఇస్తుందని ఆశిస్తున్నాం. బీఆర్ఎస్ త్వరలో నామమాత్రంగా ఉండిపోతుంది. మరింతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరతారు..’అని ఉత్తమ్ చెప్పారు. అప్పుల భారం ఉన్నా రుణమాఫీ: పొంగులేటి గత ప్రభుత్వం మాదిరి గొప్పలకు పోయి బడ్జెట్ను ప్రవేశపెట్టమని, వాస్తవాలను ప్రతిబింబించేలా మాత్రమే ఉంటుందని మంత్రి పొంగులేటి అన్నారు. ‘గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మాపై మోపింది. అయినా మేం రైతు రుణమాఫీ కింద రూ.31 వేల కోట్ల రుణాలు రద్దు చేస్తున్నాం. మాది రైతు పక్షపాత, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతుబంధు పేరిట గుట్టలకు కొండలకు ని«ధులిచ్చి ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది. అందుకే, మేం రైతు భరోసా విషయంలో అభిప్రాయాలు అడిగేందుకు వచ్చాం..’అని చెప్పారు. మధ్యంతర నివేదికను అమలు చేశారా! ⇒ సమగ్ర నివేదికతో సమావేశానికి హాజరుకండి ⇒కాళేశ్వరం బరాజ్లపై భేటీకి రావాలని ఎన్డీఎస్ఏ పిలుపు ⇒నేటి సమావేశానికి మంత్రి ఎన్.ఉత్తమ్, అధికారులుసాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోని లోపాలను గుర్తించేందుకు జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాలంటూ మధ్యంతర నివేదికలో తాము చేసిన సిఫారసులను అమలు చేశా రా? అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా బరాజ్లకు వర్షాకాలంలో మరింత నష్టం జరగకుండా మధ్యంతర నివేదికలో సూచించిన అత్యవసర చర్యలు తీసుకున్నారా? అని నిలదీసింది.నివేదిక అమలుకు తీసుకున్న చర్యలతో శనివారం డిల్లీలో జరిగే సమావేశానికి రావాలని రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలపై వానాకాలానికి ముందు జియో ఫిజికల్, జియో టెక్నికల్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని అప్పట్లో ఎన్డీఎస్ఏ కోరింది.ఈ పరీక్షలన్నీ కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసేర్స్ స్టేషన్(సీఎస్ఎంఆర్ఎస్), జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ(ఎన్ జీఆర్)తో చేయించాలని గత మే 1న మధ్యంతర నివేదికను ఇచి్చన విషయం విదితమే. నివేదిక అమలులో పురోగతిని తెలపాలని కోరుతూ గత మే 18న, జూన్ 25న, మళ్లీ ఈనెల 11న తెలంగాణకు ఎనీ్టఎస్ఏ వరుస లేఖలు రాసింది. నేటి భేటీలో వాటిపైనే చర్చ అన్నారం, సుందిళ్లలో పరీక్షల కోసం బోర్ హోల్స్ వేస్తుండగా... ఇసుక, నీరు ఇయటికి వస్తున్నాయని, ఈ కారణంగా పరీక్షలు నిలుపుదల చేసి, జియో టెక్నికల్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయాలు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీన లేఖ రాసింది. అయితే అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లో ఇప్పటిదాకా ఎన్ని బోరోల్స్/ డ్రిల్లింగ్స్ చేశారు? బ్యారేజీల ఎగువ, దిగువ భాగంలో ఇప్పటిదాకా ఎన్ని డ్రిల్లింగ్ చేశారు..? వంటి అంశాలపై సమగ్ర వివరాలు అందించాలని ఎన్డీఎన్ఏ కోరింది.కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్ఎస్) ఇచి్చన నివేదిక ఏమిటి. బ్యారేజీల పై అధ్యయనాలు, పరిశోధనలపై ఫొటోలతో సహా సమగ్ర నివేదికను అందించాలని ఎనీ్టఎస్ఏ నిర్దేశించింది. ఈ అంశాల ఆధారంగా శనివారం జరిగే సమావేశంలో చర్చించనున్నారు. -
ప్రాణహిత–చేవెళ్లను పక్కనపెట్టడం పెద్ద తప్పిదం!
సాక్షి, హైదరాబాద్: కొందరి నిర్దిష్ట ప్రయోజనాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ స్థలం ఎంపిక పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. చిన్న కారణాలు చూపి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని పక్కనపెట్టి.. దాని స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను ఆమోదించినది కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) అని, దీనికి కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంగళవారం వెదిరె శ్రీరామ్ కాళేశ్వరం బరాజ్ల నిర్మాణం, లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ఫిర్యాదుకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం వెదిరె శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఎన్నో తప్పులు ఉన్నాయని ఆరోపించారు.సీడబ్ల్యూసీ నీటి లభ్యత ఉందనే చెప్పింది!గత ప్రభుత్వం తుమ్మిడిహెట్టిని నాలుగు కారణా లతో పక్కనపెట్టిందని.. అక్కడ నీటి లభ్యత లేదన డం అందులో ఒకటని వెదిరె శ్రీరామ్ చెప్పారు. కానీ 75 శాతం లభ్యత (డిపెండబిలిటీ/నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లు వచ్చే వరద) ఆధారంగా 165 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని సీడబ్ల్యూసీ పేర్కొందని తెలిపారు. ఇక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రిజర్వాయర్ల సంఖ్యను పెంచాల ని సీడబ్ల్యూసీ సిఫార్సు చేసిందని గత ప్రభుత్వం మరో కారణంగా చూపిందని.. కానీ ప్రాణహిత– చేవెళ్ల పథకం కింద కూడా అలా కట్టేందుకు అవకా శం ఉండేదని వివరించారు. దీనికితోడు తుమ్మిడి హెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 3,600 ఎక రాల ముంపు ఉంటుందని, ఆ రాష్ట్రం ఒప్పుకోదని మూడో కారణంగా చూపారన్నారు. అయితే ఎప్పుడైనా భారీ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య ఉంటుందని.. సేకరించాలనే తపన ఉంటే మహా రాష్ట్రలో 3 వేల ఎకరాలు సేకరించడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు కోసం 2015 సంవత్సరం నాటికి రూ.11,917 కోట్లు ఖర్చ య్యాయని.. ఆ దశలో ప్రాజెక్టును పక్కనపెట్టడం సహేతుకం కాదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి ఉంటే గ్రావిటీతో నీరు అందేదని.. అదే మేడిగడ్డ వద్ద కట్టడంతో ఏటా నీటి పంపింగ్కే రూ.11 వేల కోట్ల అనవసర వ్యయం అవుతుందని వివరించారు.బ్యారేజీల వద్ద పరీక్షల వివరాలు రావాలి..కాళేశ్వరం బరాజ్ వైఫల్యాలపై గత ఏడాది నవంబర్లో ఒక నివేదిక, తర్వాత మేలో మరో నివేదికను ఎన్డీఎస్ఏ ఇచ్చిందని వెదిరె శ్రీరామ్ చెప్పారు. బరాజ్ల వద్ద జియో టెక్నికల్, జియో ఫిజికల్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరీక్షలు పూర్తి చేసి, వివరాలను ఎన్డీఎస్ఏకు నివేదిస్తే.. ఎన్డీఎస్ఏ బరాజ్ల పరిస్థితి, భవిష్యత్తు చర్యలపై తుది నివేదికను అందించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.డీపీఆర్ ఆమోదానికి ముందే నిర్మాణంకాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదానికి ముందే బరాజ్ల నిర్మాణం సగానికిపైగా పూర్తయిందని వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. బరాజ్ల నిర్మాణంలో పలు లోపాలు ఉన్నట్టు ఎన్డీఎస్ఏ గుర్తించిందన్నా రు. గేట్ల నిర్వహణలోనూ వైఫల్యాలు ఉన్నాయన్నా రు. 2019లోనే బరాజ్లలో సమస్యలు వచ్చినా పరిష్కరించలేదన్నారు. డిజైన్ ఒక విధంగా ఉంటే, నిర్మాణం మరో విధంగా జరిగిందని పేర్కొన్నారు. నీటిని నిల్వ చేయడమే ముఖ్యమైతే.. రిజర్వాయర్లు కట్టి ఉండాల్సిందని.. బరాజ్లు కట్టి, రిజర్వాయ ర్లుగా వాడుకోవడం తప్పేనని స్పష్టం చేశారు.వైఫల్యానికి కారణాలు అనేకంకాళేశ్వరం బరాజ్ల వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, బ్యారేజీలు కట్టడానికి ముందు తగిన సాంకేతిక పరీక్షలు చేయకపోవడమే కారణమని వెదిరె శ్రీరామ్ ఆరోపించారు. డీపీఆర్ తయారీలో సాంకేతిక అంశాలు పట్టించుకోలేదని.. బరాజ్ల ఎంపిక ప్రదేశా ల్లో లోపాలున్నాయని పేర్కొన్నారు. డిజైన్ల తయారీ కోసం నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు తగి నంత సమయం ఇవ్వలేదని.. ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేసి, డిజైన్లకు ఆమోదం తీసుకున్నారని చెప్పారు. తాను నివేదించిన అంశాలతో వారంలో అఫిడవిట్ దాఖలు చే యాలని కమిషన్ ఆదేశించిందని, అఫిడవిట్ అందిస్తానని తెలిపారు. -
‘కాళేశ్వరం’పై ఐఏఎస్ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్లపై చేపట్టిన విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సోమవారం బీఆర్కేఆర్ భవన్లోని తమ కార్యాలయంలో పలువురు సీనియర్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లను ప్రశ్నించనుంది. సోమవారం విచారణకు రావాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి రిటైరైన సోమేశ్కుమార్, ఎస్కే జోషీ, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, ఆ శాఖ ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి రజత్కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్లకు సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు నిర్మాణ, సాంకేతిక అంశాలపై వివరాలు సేకరించిన చేసిన కమిషన్.. ఇప్పుడు ఆర్థికపరమైన అంశాలపై దృష్టిపెట్టిందని, ఈ క్రమంలోనే అనుమతుల జారీ, అంచనా వ్యయాల పెంపు, నిధుల విడుదలలో పాత్ర ఉన్న ఐఏఎస్లను విచారించనుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నిర్మాణ సమయంలో ఉన్నవారిని.. తెలంగాణ ఏర్పాటయ్యాక సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్కే జోషి పనిచేశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనా నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగారు. ఆయన హయాంలోనే కాళేశ్వరంప్రాజెక్టుకు సంబంధించిన చాలా నిర్ణయాలు తీసుకున్న నేపత్యంలో.. కమిషన్ ఆయనను విచారణకు పిలిచింది. ఎస్కే జోషి రిటైరైన తర్వాత కొన్ని నెలల పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతల్లో సోమేశ్కుమార్ వ్యవహరించడంతో ఆయనను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. ఇక మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా స్మిత సబర్వాల్ దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యదర్శి హోదాలో కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించిన నేపథ్యంలో.. ఆమెను కమిషన్ విచారించనుంది. ప్రస్తుతం ఆమె రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రుణాల సమీకరణ, బడ్జెట్ కేటాయింపులు, బిల్లుల చెల్లింపులో పాత్ర నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ వి.నాగిరెడ్డి, ప్రస్తుత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కమిషన్ విచారణకు రమ్మని కోరింది. నేడు కమిషన్కు కె.రఘు ప్రజెంటేషన్ ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ల విచారణ సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. తర్వాత కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు మధ్యాహ్నం 2.30 గంటలకు కమిషన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బరాజ్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు, అవకతవకతలపై సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను కమిషన్ విచారణకు పిలిచింది. -
కాళేశ్వరం విచారణలో స్పీడ్ పెంచిన కమిషన్
-
‘కాళేశ్వరం’లో 50 మందికిపైగా సబ్ కాంట్రాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్కాంట్రాక్టర్లు పాలుపంచుకున్నారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గుర్తించింది. బరాజ్ల నిర్మాణంలో సాంకేతి క లోపాలపై విచారణ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది. బ రాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్ పినా కి చంద్రఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బరాజ్ల పనులు దక్కించుకున్న నిర్మా ణ సంస్థలు చాలా పనులను నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు కమిషన్ నిర్థారణకు వచ్చింది. గత ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత సమీప బంధువులకు చెందిన కంపెనీలు సైతం సబ్ కాంట్రాక్టులు పొందాయని గుర్తించినట్టు తెలిసింది. తొలుత జారీచేసిన పరిపాలనాపర అను మతుల ప్రకారం బరాజ్ల నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత ఎన్నిసార్లు పెంచారు? ఎంత పెంచారు? గడువులోగానే పనులు పూర్తి చేసినప్పుడు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు ఏ పనులు కట్టబెట్టారు? వారికి ఎంత చెల్లించారు? ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైన జరిగాయా? వంటి అంశాలపై ఆరా తీస్తోంది. బరాజ్ల ఆర్థిక వ్యవహారాలపై మరింత లోతుగా విచారణ నిర్వహించడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ను కమిషన్ కార్యాలయంలో నియమించాలని ప్రభుత్వా న్ని కోరింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్లో కమిషన్కు సహకరించడానికి తెలంగాణ(కాళేశ్వరం ప్రాజెక్టు), పశ్చిమబెంగాల్(జస్టిస్ ఘోష్ సొంత రాష్ట్రం)తో సంబంధం లేని సీనియర్ న్యాయవాదిని సైతం నియమించాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 పంప్హౌజ్ల పనులను నిర్వహించిన ఓ నిర్మాణ సంస్థకు సంబంధించిన వైస్ప్రెసిడెంట్తో సహా మరో ఇద్దరు ఉన్నత అధికారులను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురువారం తన కార్యాలయంలో విచారించింది.పంప్హౌజ్ల నిర్మాణ స్థలం ఎంపిక, డిజైన్లు తదితర అంశాలపై కమిషన్ వారిని ప్రశ్నించగా, ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం, అందించిన డిజైన్ల ప్రకారమే వాటిని నిర్మించినట్టు ఆ కంపె నీ ప్రతినిధులు బదులిచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల జారీతో సంబంధం ఉన్న వర్క్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మను సైతం కమిషన్ విచారించింది. విద్యుత్రంగ నిపుణుడు కె.రఘు ఈ నెల 15న, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి మాజీ సలహాదారుడు వెదిరె శ్రీరాం ఈ నెల 16న కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీరు అనుమతి కోరగా, కమిషన్ అందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు కమిషన్ ఎదుట రహస్య సాక్షి బరాజ్ల నిర్మాణంలో లోపాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగాన్ని వదులుకున్న ఓ నిర్మాణ సంస్థలోని కీలక ఉద్యోగి శుక్రవారం కమిషన్ ముందు హాజరై తన వాదనలు వినిపించనున్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్కు అందించనున్నారు. ఆయన వివరాలను కమిషన్వర్గాలు గోప్యంగా ఉంచాయి. -
వెదిరె శ్రీరామ్కు ‘కమిషన్’ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్లపై విచారణలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ నుంచి సాక్ష్యాధారాలు సేకరించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే శుక్రవారం లేదా సోమవారం కమిషన్ కార్యాలయానికి వచ్చి తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించాలని ఆయన్ను కోరింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాల్సి ఉండగా, అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) తెలపడం వల్లే బరాజ్ను మేడిగడ్డ వద్దకు మార్చినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంది. అయితే వెదిరె శ్రీరామ్ ఇటీవల విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ వాదనను తోసిపుచ్చారు. తమ్మడిహెట్టి వద్ద 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ ప్రతిసారీ చెప్పిందని పేర్కొన్నారు.తన వాదనలను బలపర్చే కీలక పత్రాలను సైతం ఆయన ప్రజెంటేషన్లో పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుమతులు, మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి సంబంధించిన పత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని సైతం సాక్ష్యాధారాలుగా సేకరించాలని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ముందుకు రఘు తెలంగాణ జేఏసీ చైర్మన్, విద్యుత్ రంగ నిపుణుడు కె.రఘు నుంచి సైతం సాక్షా్యధారాలను సేకరించాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం కమిషన్ ఎదుట హాజరై వివరాలను అందించాలని ఆయనకు లేఖ రాసినట్టు తెలిసింది. తమ్మడిహెæట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన గతంలో అఖిలపక్ష సమావేశాలు, సదస్సులు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారీ ఇంజనీరింగ్ తప్పిదమని, ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకమని పేర్కొంటూ ఆయన ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఆయన్ను సైతం పిలిచింది. రఘు గతంలో ట్రాన్స్కో సివిల్ విభాగం సీఈగా వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విభేదించారనే కారణంతోనే రఘును రెండు హోదాలు కిందికి డిమోట్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపాలను తప్పుబడుతూ తన ఉద్యోగాన్ని మానేసిన ఓ నిర్మాణ సంస్థ కీలక మాజీ ఉద్యోగి ఒకరు త్వరలో కమిషన్ ముందు హాజరై తన వద్ద ఉన్న సమాచారాన్ని సాక్ష్యాధారాలుగా సమర్పించనున్నట్టు తెలిసింది. త్వరలో సీడబ్ల్యూసీ ఇతర అధికారులకు కబురు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను రూపొందించిన వ్యాప్కోస్ సంస్థ అధికారులతో పాటు హైడ్రాలజీ, ఫైనాన్షియల్ అనుమతులు జారీ చేసిన సీడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను సైతం విచారణకు పిలిపించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయించింది. ఇక మూడు బరాజ్ల వైఫల్యాలపై అధ్యయనాకికి ఏర్పాటైన నిపుణుల కమిటీని సైతం త్వరలో కమిషన్ విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయాలు తీసుకున్న సమయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య/ప్రత్యేక ప్రధా న కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్లు శైలేంద్ర కుమార్ జోషి, రజత్కుమార్ను త్వరలో కమిషన్ పిలిపించి విచారించనుంది.20 మంది డీఈఈల విచారణకాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్లు, పంప్హౌస్ల నిర్మాణంలో పాల్గొన్న 20 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను మంగళవారం కమిషన్ విచారించింది. నిబంధనల మేరకే బరాజ్ల పనులు జరిగాయా? ఏమైనా పనులను విస్మరించారా? బరాజ్లు ఎందుకు విఫలమయ్యాయి? వాటి పునరుద్ధరణకు ఏం చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై వారిని ప్రశ్నించింది. నేడు ఏఈలు, ఏఈఈలను విచారించనుంది. -
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్ కమిషన్ కోరింది. రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్ల ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్ ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్హౌస్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్హౌస్లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్ ఇవ్వనుంది. -
కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రెండు నెలల పాటు గడువును పెంచుతూ ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటితో గడువు ముగియడంతో ఆగస్టు 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ గడువును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెలలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. -
మేడిగడ్డలో సిరుల మేట!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువుగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ‘మేడిగడ్డ బ్యారేజీ’ రాష్ట్ర ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిపించబోతోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన నేపథ్యంలో నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టు ఎగువ భాగాన భారీగా ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో వీటిని తవ్వి ఇసుకను విక్రయించడం ద్వారా భారీఎత్తున ఆదాయాన్ని రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మేడిగడ్డలో బయటపడిన ఇసుక నిల్వల ద్వారా ఖజానాకు రూ.800 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశమున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తొలిదశలో రూ.380 కోట్ల మేర ఆదాయం సమకూర్చుకునేలా 14 బ్లాక్లను వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ)కు అప్పగించారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్ల షెడ్యూల్ను ప్రకటించిన టీజీఎండీసీ జూలై మొదటి వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే మరిన్ని బ్లాక్ల నుంచి ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లోనూ ఇసుక లభ్యతపై ఇప్పటికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు (డీఎల్ఎస్సీ) ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇసుక వెలికితీతకు ఇతరత్రా ఎలాంటి ఆటంకాలు లేకుంటే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తుందని టీజీఎండీసీ లెక్కలు వేస్తోంది. వెలికితీతకు 18–24 నెలల గడువు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద సుమారు రూ.800 కోట్ల విలువైన సుమారు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక మేట వేసినట్లు డీఎల్ఎస్సీ గుర్తించింది. అయితే ప్రస్తుతానికి రూ.380 కోట్ల విలువైన 92.77 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికితీత సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. ఇసుక వెలికితీత, స్టాక్ యార్డుకు చేరవేసే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ‘ఇ ప్రొక్యూర్మెంట్ టెండర్’ ద్వారా టీజీఎండీసీ కాంట్రాక్టర్లను ఎంపిక చేయనుంది. ఈ నెల 25 వరకు టెండర్లు స్వీకరించి, వచ్చే నెల 3న తెరిచేలా సంస్థ ఇప్పటికే టెండర్ షెడ్యూల్ను ప్రకటించింది. మహదేవ్పూర్ మండలంలోని 14 బ్లాక్ల నుంచి ఇసుకను వెలికితీస్తారు. బెగ్లూరు, ఎలే్కశ్వరం, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ పరిధిలో ఈ బ్లాక్లు ఉన్నాయి. గోదావరి నదికి ఎగువ నుంచి వచ్చే వరద, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇసుక వెలికితీతకు 18 నుంచి 24 నెలల గడువును టీజీఎండీసీ నిర్దేశించింది. అన్నారం, సుందిళ్ల ఇసుకతో రూ.500 కోట్ల ఆదాయం! మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ ఉన్న ఇసుక మేటల పరిమాణాన్ని గుర్తించడంపై డీఎల్ఎస్సీలు దృష్టి సారించాయి. సంబంధిత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో డీఎల్ఎస్సీ సభ్యులుగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, భూగర్భ వనరుల విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే ఈ బ్యారేజీలను సందర్శించినట్లు సమాచారం. రెండు బ్యారేజీల్లోని ఇసుకతో మరో రూ.500 కోట్ల ఆదాయం లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. డీఎల్ఎస్సీల నుంచి నివేదికలు అందిన తర్వాత వీటికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి. -
ఇరకాటంలో కేసీఆర్.. భ్రమలో తెలంగాణ సర్కార్?!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై వ్యూహాత్మక దాడి చేసినట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకల అభియోగాలపై రెండు విచారణ సంఘాలు పనిచేస్తున్నాయి. ఆ రెండిటికి రిటైర్డ్ న్యాయమూర్తులు అధ్యక్షత వహిస్తున్నారు. ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం,మరొకటి కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న విచారణలు. ఏ నేతకు అయినా తొమ్మిదినర్రేళ్ల తర్వాత ఇలాంటి విచారణలు ఎదుర్కోవలసి రావడం దురదృష్టకరం. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ కాదులే అన్న నిర్లక్ష ధోరణి కావచ్చు..కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు ఎలాగైనా గత ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టాలన్న భావన కావచ్చు. ఆయా సందర్భాలలో ఇలా విచారణ కమిషన్ లను నియమిస్తుంటారు. దేశంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి విచారణలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో కమిషన్ లను నియమించి విచారణకు ఆదేశిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండుపాయింట్లలో కేసీఆర్ బుక్ అవుతారని భావించి ఉండవచ్చు. బీఆర్ఎస్ను బలహీనపరచడానికి ఇది ఒక అవకాశంగా అనుకుని ఉండవచ్చు.ఏది ఏమైనా ఆయన అధికారంలో ఉన్నారు కనుక కేసీఆర్ కు ఈ పరిణామం సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది.విశేషం ఏమిటంటే.. విద్యుత్ విషయంలోకాని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాని ఆ రోజుల్లో కేసీఆర్ కు విశేషమైన పేరు వచ్చింది. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ కొరత ఉండేది. కేసీఆర్ తగు రకాల చొరవ తీసుకుని విద్యుత్ సమస్యను తీర్చారు. దాదాపు కరెంట్ కోతలు లేకుండా చేయడం ద్వారా ప్రజల మన్ననలు పొందగలిగారు. కాకపోతే అప్పట్లోనే కేసీఆర్ అనవసరంగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉండేవి. కాని ప్రజలకు అందిన సదుపాయం రీత్యా దానిని ఎవరూ పట్టించుకోలేదు. అదే టైమ్ లో కొత్తగా భద్రాద్రి,యాద్రాద్రి పేర్లతో ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. దీనిని కూడా పలువురు అబినందించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా,వేగంగా పూర్తి చేయించిన తీరు అందరిని ఆబ్బురపరచింది. కొంతమంది సాంకేతిక నిపుణులు కాళేశ్వరం ప్రాంతం కొత్త ప్రాజెక్టుకు ఎంత అనువైనది అన్న అనుమానం వ్యక్తం చేయక పోలేదు. అయినప్పటికీ తెలంగాణలో తనదైన ముద్ర వేసుకుని, సాగు నీటి సమస్య తీర్చాలన్న కీర్తి కాంక్షతో ఆ స్కీమును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఎత్తిపోతల పధకం నిర్వహణకు బాగా వ్యయం అవుతుందని అంచనా వేసినా, రైతులకు అందే ప్రయోజనం కంటే అదేమీ ఎక్కువ కాదని వాదించేవారు. దురదృష్టవశాత్తు అక్కడ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అది కూడా సరిగ్గా శాసనసభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరగడంతో కేసీఆర్ కు చికాకు తెచ్చిపెట్టింది. దానిపై కాంగ్రెస్, బీజేపీల తీవ్రమైన విమర్శలు కురిపించేవి. ఎన్నికలలో ఓటమితో అవన్ని కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారాయి.కేసీఆర్ తిరిగి గెలిచి ఉంటే.. ఏదో కిందా,మీద పడి దానిని హాండిల్ చేసి ఉండేవారు. కాంగ్రెస్ గెలవడంతో కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి ఒక ఆయుధం దొరికినట్లయింది. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులు వేల కోట్ల వ్యయంతో కూడినవి కావడంతో ప్రజలలో ఒకరకమైన అలజడికి ఆస్కారం ఏర్పడింది.దానిని రేవంత్ ప్రభుత్వం రాజకీయంగా వాడుకోవడానికి సహజంగానే యత్నిస్తుంది. అందులో భాగంగా రెండు కమిషన్ లను నియమించింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఏర్పడిన కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆయా అంశాలను పరిశీలించిన మీదట మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలను చేశారు. వాటిని ఆసరా చేసుకుని కేసీఆర్ దాడి చేశారు. ఈ విషయంలో కేసీఆర్ వివరణను కమిషన్ కోరగా, జస్టిస్ తీరును తప్పుపడుతూ కేసీఆర్ ఏకంగా పన్నెండు పేజీల లేఖ రాశారు. కమిషన్ ముందస్తుగానే ఒక అబిప్రాయానికి వచ్చి పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం, కరెంటు కొరత తదితర అంశాలను ప్రస్తావిస్తూనే ఆయన తన అభ్యంతరాన్ని,నిరసనను తెలియచేశారు.తద్వారా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే యత్నం చేశారని చెప్పవచ్చు. బహుశా ఈ పరిణామాన్ని కమిషన్ జస్టిస్ ఊహించి ఉండకపోవచ్చు.దీని తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చే నోటీసుకు కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించాలి. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై 1977 లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం జె సి షా అనే . జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ ను వేసింది. ఎమర్జెన్సీ లో జరిగిన అకృత్యాలపై ఈ కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ అంతిమంగా ఇందిరాగాంధీని తప్పు పట్టినా, దానివల్ల ఆమెకు పెద్దగా నష్టం జరగలేదు.పైగా రాజకీయంగా బాగా వాడుకోగలిగారు. షా కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇందిరా గాంధీ, సంజయ్ గాందీ, ప్రణబ్ ముఖర్జీలు విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు కాని ప్రమాణం చేసి తమ వాదన వినిపించడానికి సిద్దపడలేదు. ఈ కమిషన్ విచారణ చేస్తున్నదా?లేక పరిశోధన చేస్తున్నదా అన్న సంశయాన్ని వ్యక్తం చేస్తూ వారు కమిషన్ కు తమ వివరణ ఇవ్వలేదు. ఇందిరాగాంధీ నాలుగుసార్లు కమిషన్ ఎదుట హాజరైనా అలాగే చేశారు. అప్పటికే జనత ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత రావడం,ఆమెను అరెస్టు చేయడం,కోర్టు వదలిపెట్టడం వంటి పరిణామాలు, మధ్యలో ఒక రోజు ఆమె ఆగ్రా పర్యటనకు వెళ్లినప్పుడు అశేష ప్రజానీకం హాజరవడం వంటి పరిణామాలు మొత్తం రాజకీయాలను మార్చివేశాయి. ఈలోగా మొరార్జీ ప్రభుత్వాన్ని చరణ్ సింగ్ పడగొట్టి ఇందిర సాయంతోనే ప్రధాని కావడం,ఆ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వచ్చి తిరిగి ఆమె ప్రభుత్వపగ్గాలు అందుకున్నారు. దాంతో షా విచారణ కమిషన్ నివేదిక వల్ల ఆమెకు వ్యక్తిగతంగా కొంత చికాకు ఏర్పడింది తప్ప ,రాజకీయంగా నష్టం జరగలేదు. పైగా లాభం చేకూరింది. ప్రజలలో ఇందిరాగాంధీని వేధిస్తున్నారన్న భావన బలపడింది. ఎమర్జెన్సీని పెట్టకపోతే దేశం విదేశీ శక్తుల హస్తగతం అయ్యేదన్న వాదనను ఆమె ప్రచారం చేశారు.ఆ రకంగా షా కమిషన్ నివేదిక చరిత్ర పుటలకే పరిమితం అయ్యిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఎపిలో కూడా కొన్ని విచారణ సంఘాలు మాజీ న్యాయమూర్తుల ఆద్వర్యంలో గతంలో కూడా పనిచేశాయి. ఉదాహరణకు జనతా ప్రభుత్వం 1978 లో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కు సంబంధించి ఒక కమిషన్ ను నియమించింది. వెంగళరావు టైమ్ లో నక్సల్స్ పై జరిగిన ఎన్ కౌంటర్లకు సంబంధించి కేంద్రం జస్టిస్ విమద్ లాల్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ను నియమించింది.కొంతకాలం విచారణ జరిగినా, ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వమే మారిపోవడంతో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ కమిషన్ వల్ల జలగం పెద్ద ఇబ్బంది పడలేదు.కొన్నిసార్లు ఆయా ప్రభుత్వాలు తమపై వచ్చే ఆరోపణల నిగ్గు తేల్చడానికి కమిషన్ లను ఏర్పాటు చేస్తుంటాయి. ఉదాహరణకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా మంజూరు చేసిన డిస్టిలరీలు, బ్రూవరీల వ్యవహారంపై టిడిపి చేసిన ఆరోపణలకు సంబందించి విచారణ సంఘాన్ని నియమించారు.దాంతో అప్పట్లో మంత్రిగా ఉన్న కనుమూరు బాపిరాజుతన పదవికి రాజీనామా చేశారు. ఆ విచారణ సంఘం కూడా పెద్దగా కనిపెట్టింది లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చలనచిత్రాభివృద్ది సంస్థలో జరిగిన అక్రమాలపై ఒక కమిషన్ ను నియమించారు.దాని విచారణకు మాజీ ముఖ్యమంత్రి కోట్ల కూడా హాజరుకావల్సి వచ్చింది.పాతబస్తీలో జరిగిన అల్లర్లపై ఒక విచారణ సంఘం పనిచేసింది. ఇది కూడా ఎవరిపైనా నిర్దిష్ట అబియోగాన్ని రుజువు చేయలేదు. కాకపోతే కొన్ని సూచనలు చేసింది. ఈ కమిషన్ వల్ల ఎవరికి ఇబ్బంది రాలేదు. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కమిషన్ లు వేశారు.ఏలేరు భూ పరిహార స్కామ్ పై ఆయన కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఆయన ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విచిత్రంగా ఆ కమిషన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీనే కోర్టులో ఒక పిటిషన్ వేసింది. విభజిత ఏపీలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటకు సంబందించి ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించారు . దాని ద్వారా ఏ ఒక్కరిపై చర్య తీసుకునే పరిస్థితి రాకపోవడం ఆసక్తికరమైన అంశం.కొన్నిసార్లు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా ఈ విచారణ సంఘాలను నియమిస్తుంటాయి. ఆ సందర్భాలలో తమకు ఇబ్బంది పెట్టనివారినే వెతికి నియమించుకుంటారన్న అభిప్రాయం ప్రజలలో ఉంది.అదే టైమ్ లో వర్తమాన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలపై విచారణలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి కాస్త సీరియస్ గానే ఉంటాయి. ఈ క్రమంలో జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఎలాంటి సిఫారస్ లు చేస్తుంది.దానిని రేవంత్ ప్రభుత్వం ఏ విధంగా ఆమోదించి తదుపరి చర్య తీసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం అవుతుంది. తాను చత్తీస్గడ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే అందులో అవినీతి ఏమిటన్నది కేసీఆర్ ప్రశ్న. అలాగే భద్రాద్రి,యాదాద్రి లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ఈఎల్ నిర్మాణ కాంట్రాక్టు అప్పగిస్తే దానిలో అక్రమాలు ఎలా ఉంటాయన్నది ఆయన ప్రశ్న.ఈ ప్రాజెక్టులు ఆలస్యం అవడంపై కమిషన్ విచారణ చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్నది చర్చనీయాంశం. మన దేశంలో 99 శాతం ప్రాజెక్టులు ఏవీ నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి కావన్నది వాస్తవం. దాని వల్ల వ్యయం పెరిగే మాట నిజం. కేంద్ర ప్రభుత్వ అనుమతులలో జాప్యం, కరోనా సంక్షోభం వంటివాటివల్ల పవర్ ప్లాంట్ లు జాప్యం అయితే తామేమీ చేయగలమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివాటిపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. గతంలో ఇందిరాగాంధీ మాదిరి కేసీఆర్ కూడా ఈ విచారణ కమిషన్ లను తనకు రాజకీయంగా ఎంత అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను కాంట్రాక్టులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలే నిర్మించాయా? లేక కాంట్రాక్టు నిబంధనలను విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాయా? అనే అంశంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. మూడు బరాజ్ల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్టు కమిషన్కు కొందరు ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నేత దగ్గరి బంధువుకి సంబంధించిన ఓ కంపెనీ సైతం బరాజ్ల పనులను సబ్ కాంట్రాక్టుగా తీసుకుని నిర్వహించినట్టు తెలిసింది. దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీల నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను నిర్మాణ సంస్థలు సమర్పించకుంటే.. గత పదేళ్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించనుంది. నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లించినట్టు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో ఉండే అవకాశముంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సైతం నిర్మాణ సంస్థలు సమర్పించని పక్షంలో కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి ఆ వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్దే..తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలనే నిర్ణయం నాటి సీఎం కేసీఆర్దేనని జస్టిస్ చంద్రఘో‹Ùకి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తెలిపింది. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్.చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోదర్ రెడ్డి, ఎం.శ్యామ్ప్రసాద్ రెడ్డితో 2015లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీని శనివారం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో విచారించింది. శ్యామ్ప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము నివేదిక సమర్పించగా.. దానిని నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తిరస్కరించారని, వాటిపై సంతకాలు సైతం చేయలేదని వివరించారు. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించినట్టు తెలిపారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150–151 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక ప్రతిని కమిషన్కు అందజేశారు. 27 తర్వాత కేసీఆర్, హరీశ్ను పిలిచే అవకాశం బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ తుది అంకానికి చేరింది. బరాజ్ల నిర్మాణంతో సంబంధం ఉన్న ఈఎన్సీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులందరినీ ఆయన పిలిపించి ప్రశ్నించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర రిటైర్డ్ ఇంజనీర్లను సైతం ప్రశ్నించారు. విచారణలో పేర్కొన్న అంశాలను ఈ నెల 27లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని వారందరినీ ఆదేశించారు. అఫిడవిట్ల పరిశీలన పూర్తైన తర్వాత తదుపరిగా ఎవరెవరెని విచారించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్రావుతో పాటు బ్యారేజీల డీపీఆర్లను ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇంజనీర్లు, ఇతర అధికారులను సైతం పిలిపించి విచారించే అవకాశముంది. తదుపరి దశలో బహిరంగ విచారణ నిర్వహించి.. అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.